Connect with us

Featured

వామ్మో అంతగా ఎలా సంపాదించాడు కేవలం 5ఏళ్లలో లో 300 శాతం పెరిగిన ఆస్తులు..!

Published

on

వామ్మో అంతగా ఎలా సంపాదించాడు కేవలం 5ఏళ్లలో లో 300 శాతం పెరిగిన ఆస్తులు..!

Advertisement

అమిత్‌షా ఆస్తులు

ఆయన దేశంలో అధికార పార్టీకి జాతీయ అధ్యక్షుడు. అవినీతి, అక్రమాలకు ఆమడ దూరంలో ఉంటానని, ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతున్నానని చెప్పుకుంటున్నారు. నరేంద్ర మోడీని నాడు గుజరాత్‌కు ముఖ్యమంత్రినీ, దేశానికి ప్రధానినీ చేశానంటున్నారు. ఆయనే అమిత్‌ షా. అవినీతి మరకలను దరి చేరనీయని నిప్పుకణికను అని దర్పాన్ని చూపే అమిత్‌షా ఆర్థికంగా బహు చిన్నవాడని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఆయన ఆస్తులను ఐదేండ్లలో 300 శాతం పెంచుకున్నారంటే ఆశ్చర్యమేయక మానదు. మరి ఇంత భారీ ఎత్తున ఆస్తులను అమిత్‌షా పెంచు కోవడం వెనుక దాగి ఉన్న చిదంబర రహస్యం అవినీతి, అక్రమాలేన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఓ మీడియా సంస్థ వార్తను ప్రచురించిన కొన్ని గంటల్లోనే తొలగించడం మరిన్ని అనుమానాలకు తావిస్తున్నది.

Advertisement

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఆస్తులు 2012-2017 మధ్య కాలంలో ఏకంగా 300 శాతం పెరిగాయి. రాజ్యసభకు బీజేపీ అభ్యర్థిగా అమిత్‌షా దాఖలు చేసిన నామినేషన్‌తో ఈ విషయం స్పష్టమైంది. అమిత్‌షా చివరిసారిగా 2012లో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తన ఆస్తులను వెల్లడించారు. గుజరాత్‌లోని మూడు రాజ్యసభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులుగా అమిత్‌షా, కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ, బల్వంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. అమిత్‌షా స్థిర, చర ఆస్తులు(భార్య ఆస్తులతో కలుపుకొని) ఐదేండ్ల కాలంలో 300 శాతం పెరిగాయి. 2012లో అమిత్‌షా స్థిర, చర ఆస్తులను రూ.8.54 కోట్లుగా చూపించారు. ప్రస్తుతం ఈ ఆస్తులను రూ.34.31 కోట్లుగా నామినేషన్‌ పత్రాల్లో పేర్కొన్నారు. అంతేకాక.. చరాస్తులు ఐదేండ్లలో రూ.1.9 కోట్లు నుంచి ఏకంగా రూ.19 కోట్లకు(10 రెట్లు) పెరిగాయి. స్థిరాస్తులు రూ.6.63 కోట్ల నుంచి రూ.15.30 కోట్లకు పెరిగాయి.

స్మృతీ డిగ్రీ పూర్తి చేయలేదట..
మరోవైపు స్మృతీ ఇరానీ శుక్రవారం దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాల్లో మూడేండ్ల డిగ్రీ కోర్సు పూర్తి చేయలేదని పేర్కొనడం చర్చాంశ నీయంగా మారింది. 2004లో ఢిల్లీలోని చాందీచౌక్‌ నుంచి లోక్‌సభకు నామినేషన్‌ దాఖలు చేసిన సమయంలో 1996లోబీఏ పూర్తి చేసినట్టు వెల్లడించారు. కాగా.. 2011 రాజ్యసభ, 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఢిల్లీ యూనివర్సిటీ నుంచి 1994లో బీకామ్‌ పూర్తి చేసినట్టు పేర్కొన్నారు. ఇప్పుడేమో అసలు డిగ్రీ పూర్తి కాలేదని నామినేషన్‌లో పేర్కొనడం గమనార్హం. పై విషయాలన్నింటిని ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ శనివారం బహిర్గత పరిచింది.
కొన్ని గంటలకే తొలగింపు

Advertisement

అమిత్‌ షా ఆస్తులు, స్మృతీ డిగ్రీ వివరాలను ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ అహ్మదాబాద్‌ ఎడిషన్‌లో శనివారం ప్రచురించింది. కానీ, ప్రచురించిన కొన్ని గంటలకే ఈ సమాచారాన్ని తమ వెబ్‌సైట్‌ నుంచి తొలగించింది. వెబ్‌సైట్‌ నుంచి కథనాన్ని తొలగించడానికి గల కారణా లను మాత్రం వివరిం చలేదు. ఈ స్టోరీని ‘డీఎన్‌ఏ’ కూడా ప్రచురించి, తర్వాత వెబ్‌సైట్‌ నుంచి తొలగిం చింది. ఈ-పేపర్‌లో మాత్రం అందుబాటులో ఉంచిం ది. అమిత్‌షా ఆస్తుల వివరాలను టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రచురించిన కొద్ది సేపటికే తొలగించిన విషయాన్ని ‘ది వైర్‌’ వెలుగులోకి తెచ్చింది. వార్తను తొలగించడానికి కారణాలను ది వైర్‌ తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ తగిన వివరణ రాలేదని కూడా వెల్లడించింది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Star Heroin: స్టార్ హీరోతో ప్రేమ,పెళ్లి విడాకులు..12 మందితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్… ఎవరంటే?

Published

on

Star Heroin: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి మనీషా కొయిరాల ఒకరు. ఈమె సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ సినిమాలలో నటించి ఒకానొక సమయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపారు. ఇక ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో తన వ్యక్తిగత విషయాలలో కూడా వార్తలలో నిలిచారు.

Advertisement

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు పలువురు హీరోలతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఒక స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడినప్పటికీ ఆయనని పెళ్లి చేసుకోలేదు. ఇక ఈమె సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రెండేళ్లకే తనతో విడాకులు తీసుకొని విడిపోయి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన మనీషా కోయిరాల మందుకు అలవాటు పడ్డారు.పెళ్లికి ముందే మనీషా కోయిరాలా ఏకంగా 12 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. వివేక్ ముశ్రన్‌, నానా పటేకర్‌, DJ హుస్సేన్‌, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్‌ వంటి ప్రముఖులతో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

12 మందితో డేటింగ్..
ఇలా తరచూ డేటింగ్ ల ద్వారా కూడా ఈమె వార్తల్లో నిలిచారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడిపారు. పలువురు దర్శక నిర్మాతలు సైతం ఈమె డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఇలా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపిన ఈమె మధ్యలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: విష్ణు ప్రియకు షాక్ ఇచ్చిన నిఖిల్… కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్.. అసలు ఆట ఆరంభం!

Published

on

Bigg Boss 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రారంభం అయ్యి 5 రోజులు పూర్తయింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అయితే హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ మూడు గ్రూపులుగా విడదీశారు. అయితే ఈ గ్రూపులోకి ఎవరెవరు సభ్యులను తీసుకోవాలనేది చీఫ్ ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ విష్ణు ప్రియ కచ్చితంగా తనని నిఖిల్ తన గ్రూపులోకి తీసుకుంటారని ఆమె భావించింది. కానీ నిఖిల్ మాత్రం ఆమెకు షాక్ ఇచ్చారు. దీంతో విష్ణు ప్రియను నైనిక తన టీమ్ లోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం గురించి నిఖిల్ విష్ణుప్రియ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీరిద్దరికి ముందే మంచి పరిచయమున్న నేపథ్యంలో తప్పకుండా నిఖిల్ తన టీమ్ లోకి తీసుకుంటారని విష్ణు ప్రియ భావించింది కానీ అది జరగలేదు.

ఇలా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కారణంగా విష్ణు ప్రియ సరదాగా నిఖిల్ ను ఓ ఆట ఆడుకుంది. దీంతో నిఖిల్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఇప్పటివరకు ఎంతో సరదాగా గడిపిన కంటెస్టెంట్లను మూడు గ్రూపులుగా విడదీయడంతో అసలైన ఆట మొదలైంది.

టాస్కులపై ఫోకస్..
కంటెస్టెంట్లను టీమ్స్ గా విడదీసి బిగ్ బాస్ టాస్కులను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇచ్చిన మొదటి టాస్కోలో భాగంగా ఇప్పటివరకు హౌస్ లో సైలెంట్ గా కూర్చున్న పృథ్విరాజ్ తన ఆట తీరును కనబరుస్తూ యష్మీ టీమ్ ను గెలిపించారు. దీంతో ముందు ముందు ఏ ఏ కంటెస్టెంట్ ఎలా తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారు బ్రో…. ఆ కంటెస్టెంట్లను ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఏడు సీజన్లను పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా గత ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. మొదట 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. మిగిలిన వారిని ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

Advertisement

ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ పోట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మిగిలిన వారు మాత్రం అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నా సందేహాలు వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతో యాక్టివ్ గా వెళ్లిన కంటెస్టెంట్లు లోపల మాత్రం అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోతున్నారనే చెప్పాలి.

ముఖ్యంగా హీరో ఆదిత్య ఓం అయితే హౌస్ లో ఉన్నాడా లేదా అన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది. ఈయన ఉంటే ఒంటరిగా ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు. పెద్దగా ఫేమస్ అయిన కంటెంట్ మాత్రం ఈయన ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలువురు ట్రోలర్స్ బ్రో అసలు ఎందుకొచ్చావు బ్రో బిగ్ బాస్ హౌస్ కి అంటూ భారీగా విమర్శలు చేస్తున్నారు.

ఈయనతో పాటు బెజవాడ బేబక్క కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈమె హౌస్ లో మాత్రం ఎక్కువగా కిచెన్ లోనే ఉంటుంది. కానీ సరైన కంటెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. పృధ్విరాజ్, అభయ్ నవీన్ వంటి వారందరూ కూడా హౌస్ లో డల్ గా కనిపిస్తున్న తరుణంలో పలువురు మీరంతా హౌస్ లోకి ఎందుకు వచ్చారో ఏమో అంటూ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అలాగే మరి కొంతమందిని బాగా హైలైట్ చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఎలిమినేషన్ ఉంటుందా…
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా బెజవాడ బేబక్క, విష్ణు ప్రియ, శేఖర్ భాష, నాగ మణికంఠ సోనియా ఆకుల ప్రేరణ వంటి వారు నామినేషన్ లో ఉన్నారు. అయితే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!