బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ నేడు 1106 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. గత ఎపిసోడ్ లో భాగంగా దీప మోనిత ఏసీపీ ఇంటికి వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. అక్కడ ఏసీపీ రోషిని మోనితను అంజి ఎవరు? అతనితో నీకు ఉన్న సంబంధం ఏమిటి? అంజిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నావా? అనే ప్రశ్నలు అడుగుతూ కంగారు పెట్టేస్తుంది. ఇంత రసవత్తరంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో నేటి ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో… ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందాం..
ఏసీపీ ఇంటికి వెళ్ళిన దీప,మోనితను రోషిని వివిధ రకాల ప్రశ్నలు అడుగుతూ కంగారు పెట్టేస్తుంది. ఈ క్రమంలోనే హిమ ఎవరు? హిమ నీకు తెలుసా? హిమ ఎలా చనిపోయింది అంటూ ప్రశ్నలు కురిపించారు. హిమ కు నీకు ఏమైనా పగ ఉందా? అని రోషిని ప్రశ్నించగా అందుకు..మోనిత ఏమీ లేదు అని సమాధానం చెబుతుంది. ఇంతలో దీప కలుగజేసుకొని ఆరోజు నడిరోడ్డులో నా ఫోన్, అంజి ఫోన్ ఎందుకు పగలగొట్టావ్.. మేమిద్దరం రోడ్డుపై మాట్లాడుకుంటే నువ్వెందుకు కంగారు పడ్డావు అంటూ నిలదీస్తుంది. దీప మాటలకు సమాధానం చెబుతూ.. అంజిని చూసి నేను ఎందుకు భయపడతాను. నువ్వు ఒక డాక్టర్ భార్యవి అలా డ్రైవర్ తో రోడ్డుపై మాట్లాడితే నాకు నచ్చలేదు అందుకే హెచ్చరించానని మోనిత సమాధానం చెబుతుంది.
ఈ విధంగా వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటే ఏసీపీ జోక్యం చేసుకుని ఇంతకు హిమ ఎవరు దీప అని రోషిని అడగటంతో.. హిమ మా ఆయన ప్రేమించిన వ్యక్తి. అందుకే మా పాపకు ఆ పేరే పెట్టాము. హిమ నీకు తెలుసా అని అడగడంతో మోనిత… నేను ,కార్తీక్, హిమ ముగ్గురం కలిసి చదువుకున్నాం. హిమ ఆక్సిడెంట్ లో చనిపోయింది. తనని నేనే అంజి చేత యాక్సిడెంట్ చేయించి చంపానని దీప నాపై నింద మోపుతోంది. హిమ కు యాక్సిడెంట్ చేస్తే ఆ కారులో కార్తీక్ కూడా ఉన్నాడు. కార్తీక్ ను ఎందుకు చంపించాలని అనుకుంటాను అంటూ మోనిత సమాధానం చెబుతుంది. హిమను చంపించడానికి కంటే ముందుగా నువ్వు కార్తీక్ ను ప్రేమించావా? అని అడగడంతో అవునని సమాధానం చెబుతుంది మోనిత. ఈ మాట విన్న ఏసిపి ఇక నువ్వు వెళ్ళవచ్చు అనడంతో నన్ను వెళ్ళమని చెప్పిన ఏసిపి దీపతో మాట్లాడుతోంది అని కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్తుంది.
Advertisement
ఇక మోనిత బయటకు వెళ్లగానే ఏసీపీతో దీప మాట్లాడుతూ…మోనితను పిలిపించారు అంటే అంజి ఆచూకీ దొరికిందా మేడం అని అడగడంతో ఆ మాటలు విన్న మోనిత అంటే రిజిస్టర్ ప్రసాద్ కి ఫోన్ చేసి పెళ్లికి అభ్యంతరం చెప్పింది అంజి కాదా… ఇదంతా దీప ఆడుతున్న నాటకమా.. ?ఒసేయ్ దీప ఇంత నాటకం ఆడతావా.. ?చూస్తా.. నీ అంతు చూస్తా అంటూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇక అంజి దొరకలేదన్న ఆనందంతో మోనిత ఇంటికి వెళ్లి చికెన్ బిర్యాని తింటూ పార్టీ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే దీప కార్తీక్ అక్కడికి వెళ్లి ఆమెకు షాక్ ఇస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది తరువాత ఎపిసోడ్ లో చూడాలి.
Actor Fish venkat:మంగిలంపల్లి వెంకటేశ్ అంటే గుర్తుకు రావడం కష్టమే కానీ ఫిష్ వెంకట్ అందరికీ టక్కున గుర్తుకు వస్తారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది సినిమా ద్వారా ఈయన నటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అయితే ఎన్నో సినిమాలలో కామెడీ పాత్రలలో నటించడం మరికొన్ని సినిమాలలో విలన్ పాత్రలలో కూడా నటించారు.
Advertisement
ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలు సినిమాలలో నటించే ప్రేక్షకులను మెప్పించిన ఫిష్ వెంకట్ ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వెంకట్ కేవలం ఇంటికి మాత్రమే పరిమితమయ్యారు అయితే తాజాగా ఈయన ఆరోగ్య పరిస్థితి తెలిసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
చాలా రోజుల తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తన కష్టాల గురించి తెలిపారు. కొన్ని సమస్యల క్రితం తన కాలికి చిన్న దెబ్బ తగిలిందని తెలిపారు. అయితే అప్పటికి తనకి బీపీ షుగర్ ఉండడంతో ఇన్ఫెక్షన్ ఎక్కువ కావటం వల్ల సర్జరీ చేశారని అయినప్పటికీ తన కాలిపై చర్మం మొత్తం ఊడిపోతుందని తద్వారా తనకు నడవడానికి కూడా కుదరడం లేదని తెలిపారు.
చికిత్స కోసం లక్షలు ఖర్చు.. మరోవైపు కిడ్నీ ఫెయిల్యూర్ కావడంతో డయాలసిస్ చేయించుకుంటున్నానని అయితే తనకి ఇప్పటికీ సినిమా అవకాశాలు వస్తున్న ఆరోగ్యం సహకరించకపోవడంతో తాను నటించలేదని తెలిపారు. ఇక డయాలసిస్ కోసం లక్షలు ఖర్చు చేయాల్సి ఉందని తన కొడుకులు కూతురు ఆర్థికంగా ఎంతో మంచిగా ఉన్నప్పటికీ తనకు మాత్రం సహాయం చేయడం లేదని తెలిపారు. ఎవర్ని చేయి చాచి అడగలేను అంటూ ఫిష్ వెంకట్ భావోద్వేగానికి గురయ్యారు. దీంతో సాయం కోసం ఎదురుచూస్తున్న ఫిష్ వెంకట్ ను టాలీవుడ్ ప్రముఖులు ఆదుకోవాలి అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Ambulance: మనకు ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే స్పందించి సరైన సమయంలో చికిత్స అందడం కోసం అంబులెన్స్ కు ఫోన్ చేస్తాం వారు కూడా మన ప్రాణాలను నిలబెట్టడానికి వారి ప్రాణాలను కూడా లెక్కచేయరు కానీ ఓ అంబులెన్స్ డ్రైవర్ తన వృత్తిని మరిచిపోయి అంబులెన్స్ లో ఉన్నటువంటి ఓ మహిళ పట్ల లైంగిక వేధింపులకు దిగారు. దీంతో పేషంట్ గా ఉన్న ఆమె భర్త ప్రాణాలను వదిలిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది.
Advertisement
పూర్తి వివరాలలోకి వెళ్తే..ఈ ఘటన లోరి ఘజిపుర్లో చోటుచేసుకుంది. మహిళ భర్త అనారోగ్యంతో బాధపడుతున్న తరుణంలో చికిత్స నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. అయితే అక్కడ తగినంత డబ్బు చెల్లించలేకపోవడంతో తిరిగి తన భర్తను ఇంటికి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక ప్రైవేట్ అంబులెన్స్ ను మాట్లాడి తన భర్తను అందులో ఎక్కించి ఇంటికి తీసుకు వెళుతున్నారు.
మార్గమధ్యమంలో అంబులెన్స్ డ్రైవర్ తన హెల్పర్ ఆ మహిళ పట్ల లైంగిక వేధింపులకు గురి చేశారు. తనని ముందు సీట్లో కూర్చోవాలని బెదిరించారు. అంతేకాకుండా ఆమెను లైంగికంగా వేధించడంతో ఆంబులెన్స్ లో ఉన్నటువంటి తన భర్త తన సోదరుడు పెద్ద ఎత్తున అరవడంతో ఆంబులెన్స్ డ్రైవర్ ఆ మహిళ దగ్గర 10000 రూపాయలు విలువ చేసే బంగారం లాక్కొని పేషంటును మార్గమధ్యమంలోనే వదిలేసి ఆక్సిజన్ మాస్క్ కూడా తీసుకొని వెళ్ళిపోయారు.
ఆక్సిజన్ తొలగించి.. ఇలా ఆక్సిజన్ తొలగించడంతో సదరు మహిళ భర్త ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. అప్పటికే వేరే అంబులెన్స్ కు ఫోన్ చేసిన ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అంబులెన్స్ డ్రైవర్ తీరుపట్ల నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఇలాంటి వారికి కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.
Vijayawada Floods: ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలలో కురిసిన వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్లో విజయవాడ మొత్తం నదులను తలపిస్తోంది. భారీగా కురిసిన వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లడంతో విజయవాడ మొత్తం నీటిలో మునిగిపోయింది. దీంతో ఎంతోమంది అవస్థలు పడుతున్నారు.
Advertisement
ఈ వరదల కారణంగా ఎంతో ప్రాణ నష్టం ఆస్తి నష్టం కూడా జరిగింది. సరైన సమయంలో కనీసం తాగడానికి నీళ్లు లేక ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా హృదయ విదారక ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే ఈ వరదలలో ఎంతో మంది ఇతరులను రక్షించి వారు ప్రాణాలను కోల్పోయిన సంఘటనలను మనం చూస్తున్నాము.
కృష్ణలంకకు చెందిన పలిశెట్టి చంద్రశేఖర్(32)కు సింగ్నగర్లో డెయిరీఫాం ఉంది. ఆయనతో పాటు ఇద్దరు సోదరులు మరో ఇద్దరు డైరీ ఫామ్ లో పనిచేసే వర్కర్లు ఈ వరదల్లో చిక్కుకున్నారు. అయితే ఆ నలుగురిని చంద్రశేఖర్ రక్షించారు. ఇక తన ఫామ్ లో 50ఆవులను తాళ్లతో కట్టేసి ఉంటే వాటన్నింటినీ కూడా విడదీసి తాను కూడా సురక్షితంగా బయటకు రావడం కోసం షెడ్ పైకి వెళ్లడానికి ప్రయత్నం చేశారు.
నలుగురికి ప్రాణదానం.. ఇలా షెడ్ పైకి ఎక్కుతున్న సమయంలో కాలుజారి కింద పడటంతో ఆయన వరదల్లో కొట్టుకుపోయి మరణించారు. అయితే తన డైరీ ఫార్మ్ దగ్గరలోనే తన మృతదేహం కనిపించడంతో తన కుటుంబ సభ్యులు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే చంద్రశేఖర్ కు రెండు సంవత్సరాల క్రితం వివాహం కాగా ప్రస్తుతం తన భార్య 8 నెలల గర్భిణీ. ఇలా తమ ప్రాణాలను రక్షించి చంద్రశేఖర్ ప్రాణాలను కోల్పోవడంతో తన సోదరులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.