Connect with us

Featured

పుకార్లకు చెక్.. క్లారిటీ ఇచ్చేసిన ఆ జంట..!

Published

on

వెండితెరపై అయినా.. బుల్లితెరపై అయినా ఒక పెయిర్ హిట్ అయిందంటే వారిద్దరి మధ్య ఏదో ఉన్నట్లు పుకార్లు షికార్లు అవుతాయి. వారిద్దరికి సంబంధించి ఏ వార్త వచ్చినా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఇలా నెటిజన్లు కొన్ని పుకార్లను స్పష్టిస్తారు. అందులో కొన్ని నిజాలు ఉండొచ్చు.. మరికొన్ని అబద్దాలు కూడా ఉండొచ్చు. పెళ్లి కాకముందు నాగచైతన్య, సమంత మధ్య ప్రేమ నడుస్తుందని.. వారిద్దరి జంట గురించి వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి.

Advertisement

ఇలా వారు పెళ్లి చేసుకొని నెటిజన్ల పుకార్లను నిజం చేశారు. ఇలా జంటల మధ్య ఏదో ఉన్నట్లు క్రియేట్ చేయడం ప్రస్తుతం కొంతమందికి అలవాటయింది. అయితే ప్రస్తుతం మనం చెప్పుకునే జంట ఎవరంటే.. మౌనరాగం సీరియల్ లో నటించిన ప్రియాంక జైన్ మరియు శివ కుమార్. ప్రియాంక జైన్ మొదట్లో కొన్ని సినిమాల్లో నిటించినా అంతగా పేరు రాలేదు. తర్వాత మౌనరాగం సీరియల్ లో లీడ్ రోల్ పాత్ర చేసింది. మౌనరాగం సీరియల్ ఎంత పెద్ద హిట్ అయిందో.. అదే తరహాలో వీరి జంట కూడా అతి పెద్ద హిట్ అయింది.

అమ్ములుగా ఓ మూగ క్యారెక్టర్ చేసిన ప్రియాంక ప్రేక్షకులను మెప్పించింది. తన నటన, అభినయంతో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకుంది. దీంతో ఆమెకు మౌనరాగం సీరియల్ తర్వాత జానకి కలగనలేదు సీరియల్ లో అవకాశం లభించింది. ఇక మౌనరాగం సీరియల్ లో అంకిత్ క్యారెక్టర్ చేసిన శివ కుమార్ కూడా నటనలో తనకంటూ పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ సీరియల్ నుంచే వీరిద్దరు ప్రేమ ఉందని.. పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరు సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్ గా ఉంటారు. ఫొటోలను షేర్ చేస్తూ తమ అభిమానులకు టచ్ లో ఉంటున్నారు. వీరిద్దరు ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తుంటారని.. రాత్రి పబ్ లు, పార్టీలు అంటూ తిరుగుతుంటారని.. వీరిద్దరి మధ్య లైవ్ కాల్స్ కూడా నడుస్తున్నాయని సోషల్ మీడియలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

అయితే వీరి మధ్య ఎన్నో జరిగాయని వార్తలు వస్తున్న సమయంలో ఈ మధ్యన ఇద్దరు ఒకే కలర్ డ్రస్ వేసుకొని గుడిలో దర్శనమిచ్చారు. అచ్చం భార్యభర్తలులాగా ఉన్న ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాజాగా లైవ్ కి వచ్చి మాట్లాడిన వీళ్లు.. వీటికి క్లారిటీ ఇచ్చే పని చేశారు. వీళ్ల పెళ్లి గురించి నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. అందులో ఒకరు మీరు పెళ్లి చేసకుంటున్నారా.. అని అడగడంతో ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ.. నువ్వు చెప్పు అంటే నుమ్ము చెప్పు అని సరదాగా ప్రశ్నలు వేసుకున్నారు. అయితే దీనికి సమాధానం త్వరలోనే ఇస్తామని అన్నారు. మీరు అమ్ముల్ని లవ్ చేస్తున్నారా.. అని ఓ నెటిజన్ శివను అడగ్గా.. అవును అని సమాధానం ఇచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని క్లారిటీకి వచ్చేసింది. త్వరలో ఈ బుల్లితెర జంట పెళ్లిపీటలపై కూర్చుంటారని తెలుస్తోంది.

Advertisement

Advertisement

Featured

Star Heroin: స్టార్ హీరోతో ప్రేమ,పెళ్లి విడాకులు..12 మందితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్… ఎవరంటే?

Published

on

Star Heroin: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి మనీషా కొయిరాల ఒకరు. ఈమె సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ సినిమాలలో నటించి ఒకానొక సమయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపారు. ఇక ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో తన వ్యక్తిగత విషయాలలో కూడా వార్తలలో నిలిచారు.

Advertisement

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు పలువురు హీరోలతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఒక స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడినప్పటికీ ఆయనని పెళ్లి చేసుకోలేదు. ఇక ఈమె సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రెండేళ్లకే తనతో విడాకులు తీసుకొని విడిపోయి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన మనీషా కోయిరాల మందుకు అలవాటు పడ్డారు.పెళ్లికి ముందే మనీషా కోయిరాలా ఏకంగా 12 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. వివేక్ ముశ్రన్‌, నానా పటేకర్‌, DJ హుస్సేన్‌, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్‌ వంటి ప్రముఖులతో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

12 మందితో డేటింగ్..
ఇలా తరచూ డేటింగ్ ల ద్వారా కూడా ఈమె వార్తల్లో నిలిచారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడిపారు. పలువురు దర్శక నిర్మాతలు సైతం ఈమె డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఇలా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపిన ఈమె మధ్యలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: విష్ణు ప్రియకు షాక్ ఇచ్చిన నిఖిల్… కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్.. అసలు ఆట ఆరంభం!

Published

on

Bigg Boss 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రారంభం అయ్యి 5 రోజులు పూర్తయింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అయితే హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ మూడు గ్రూపులుగా విడదీశారు. అయితే ఈ గ్రూపులోకి ఎవరెవరు సభ్యులను తీసుకోవాలనేది చీఫ్ ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ విష్ణు ప్రియ కచ్చితంగా తనని నిఖిల్ తన గ్రూపులోకి తీసుకుంటారని ఆమె భావించింది. కానీ నిఖిల్ మాత్రం ఆమెకు షాక్ ఇచ్చారు. దీంతో విష్ణు ప్రియను నైనిక తన టీమ్ లోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం గురించి నిఖిల్ విష్ణుప్రియ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీరిద్దరికి ముందే మంచి పరిచయమున్న నేపథ్యంలో తప్పకుండా నిఖిల్ తన టీమ్ లోకి తీసుకుంటారని విష్ణు ప్రియ భావించింది కానీ అది జరగలేదు.

ఇలా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కారణంగా విష్ణు ప్రియ సరదాగా నిఖిల్ ను ఓ ఆట ఆడుకుంది. దీంతో నిఖిల్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఇప్పటివరకు ఎంతో సరదాగా గడిపిన కంటెస్టెంట్లను మూడు గ్రూపులుగా విడదీయడంతో అసలైన ఆట మొదలైంది.

టాస్కులపై ఫోకస్..
కంటెస్టెంట్లను టీమ్స్ గా విడదీసి బిగ్ బాస్ టాస్కులను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇచ్చిన మొదటి టాస్కోలో భాగంగా ఇప్పటివరకు హౌస్ లో సైలెంట్ గా కూర్చున్న పృథ్విరాజ్ తన ఆట తీరును కనబరుస్తూ యష్మీ టీమ్ ను గెలిపించారు. దీంతో ముందు ముందు ఏ ఏ కంటెస్టెంట్ ఎలా తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారు బ్రో…. ఆ కంటెస్టెంట్లను ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఏడు సీజన్లను పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా గత ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. మొదట 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. మిగిలిన వారిని ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

Advertisement

ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ పోట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మిగిలిన వారు మాత్రం అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నా సందేహాలు వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతో యాక్టివ్ గా వెళ్లిన కంటెస్టెంట్లు లోపల మాత్రం అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోతున్నారనే చెప్పాలి.

ముఖ్యంగా హీరో ఆదిత్య ఓం అయితే హౌస్ లో ఉన్నాడా లేదా అన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది. ఈయన ఉంటే ఒంటరిగా ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు. పెద్దగా ఫేమస్ అయిన కంటెంట్ మాత్రం ఈయన ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలువురు ట్రోలర్స్ బ్రో అసలు ఎందుకొచ్చావు బ్రో బిగ్ బాస్ హౌస్ కి అంటూ భారీగా విమర్శలు చేస్తున్నారు.

ఈయనతో పాటు బెజవాడ బేబక్క కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈమె హౌస్ లో మాత్రం ఎక్కువగా కిచెన్ లోనే ఉంటుంది. కానీ సరైన కంటెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. పృధ్విరాజ్, అభయ్ నవీన్ వంటి వారందరూ కూడా హౌస్ లో డల్ గా కనిపిస్తున్న తరుణంలో పలువురు మీరంతా హౌస్ లోకి ఎందుకు వచ్చారో ఏమో అంటూ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అలాగే మరి కొంతమందిని బాగా హైలైట్ చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఎలిమినేషన్ ఉంటుందా…
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా బెజవాడ బేబక్క, విష్ణు ప్రియ, శేఖర్ భాష, నాగ మణికంఠ సోనియా ఆకుల ప్రేరణ వంటి వారు నామినేషన్ లో ఉన్నారు. అయితే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!