Connect with us

Featured

మీ మూత్రం నురగ నురగ్గా ఉంటే ఈ వీడియో తప్పక చూడండి

Published

on

మూత్రం కూడా శరీర ఆరోగ్యానికి ఓ సూచిక అని ఆరోగ్య స్పృహ కలిగిన వారికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనకు అనేక వ్యాధులను మూత్ర పరీక్ష ద్వారానే గుర్తిస్తారన్న సంగతి తెలిసిందే. మూత్రం పోసినప్పుడు స్పష్టంగా ఉంటే ఓకే.. మీరు ఆరోగ్యంగా ఉన్నట్టే. కానీ మూత్రం ముదురు రంగులో, దుర్వాసనతో, బుడగలతో, నురగతో ఉంటే శరీరంలో ఏదో సమస్య ఉన్నట్టు సంకేతం.

Advertisement

బిజీలో ఉన్నప్పుడు, పని ఒత్తిడితో ఎక్కువ ఫోర్స్ తో మూత్రం పోసినపుడు బుడగలు కూడా రావొచ్చు. అలాగూ యూరినల్స్ ని కెమికల్స్ తో కడిగిన వెంటనే మూత్రానికి వెళ్లిన వారికి బుడగలు, నురగ కనిపించొచ్చు. అటువంటివి పట్టించుకోవాల్సిన పనిలేదు. కాని ఏయే సందర్భాల్లో మూత్రం నురగ రాకూడదో, వస్తే ఎటువంటి సమస్య ఉన్నట్లో కింద చూద్దాం..

మానసిక ఒత్తిడి డిప్రెషన్ లో ఉన్నవారికి మూత్రంలో నురుగ వస్తుంది. ఇలా డిహైడ్రేషన్ వల్ల కూడా రావొచ్చు. మీకు డిహైడ్రేషన్ అయితే, మీ మూత్రంలో ప్రోటీన్స్, కొన్ని రసాయనాలు అధిక స్థాయిలో పెరుగుతాయి. డీహైడ్రేషన్ నివారించుకోవడానికి ఎక్కువ నీరు తాగాలి.

Advertisement

గర్భధారణ సమయంలో నురుగుతో కూడిన మూత్రం రావడం సాధారణం. గర్భం కారణంగా ఊపిరితిత్తుల మీద పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీంతొ ప్రోటీన్ మూత్రంలోకి వెళ్ళడానికి నురగ కారణం కావొచ్చు.
ఆదుర్దాగా లేదా ఒత్తిడిగా ఉన్నపుడు మూత్రం నురగగా లేదా బుడగలుగా మారుతుంది. యూరిన్ లో ఉంటే ప్రోటీన్, ఆల్బుమిన్ కారణం కావొచ్చు.

మూత్రపిండాలు ఒత్తిడికి గురయితే, మూత్రంలో ప్రోటీన్స్ లీక్ అవుతుంది. షుగర్ వ్యాధి మూత్రపిండాలపై ప్రభావం చూపించి మూత్రం నురగగా వస్తుంది. అధిక బ్లడ్ షుగర్ స్థాయి మూత్రపిండాలకు చెడు చేస్తుంది.
మూత్రంలో ప్రోటీన్ స్థాయిలు అధికంగా ఉంటే, ఆ స్ధితిని ప్రోటీన్యూరియా అంటారు. మూత్రపిండాలు ప్రోటీన్ ని సరిగా ఫిల్టర్ చేయలేకపోతే, వైద్యుడిని సంప్రదించడం మంచిది.

Advertisement

మూత్రనాళాలు బాక్టీరియా బారిన పడినపుడు, నురగతో కూడిన మూత్రం వచ్చే అవకాశం ఉంది.
మూత్రంలో నురుగుకు గుండె సమస్యల లక్షణాలు కావొచ్చు. మూత్రంలో ప్రోటీన్ అధిక స్థాయిలో ఉన్నపుడు గుండెపోటు వంటి సమస్యలకు దారితీయవచ్చు. అందుకే మూత్రంలో నురగ కంటిన్యూగా వస్తే వైద్యుణ్ణి సంప్రదిస్తే మంచిది.

మన శరీరం రకరకాల ప్రతిస్పందనల ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన సూచనలు ఇస్తుంటుంది. అలాంటి సూచనల్లో మూత్రం రంగు కూడా ఒకటి. సాధారణంగా మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. కానీ కొన్ని అనారోగ్య పరిస్థితుల్లో మూత్రం రంగు మారుతుంది. మారిన మూత్రం రంగు ఎలాంటి అనారోగ్యానికి కారణమో అవగాహన కలిగి ఉండడం అవసరం.

Advertisement

ఎరుపు మూత్రం ఎరుపు రంగులో ఉండడానికి కారణం మూత్రంలో రక్తం కలిసి విసర్జితమవడం. ఇది చాలా సందర్భాల్లో యూరినరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్ కారణంగా అవుతుంది. లేదా కిడ్నీ లేదా బ్లాడర్‌లో రాళ్లు ఉండడం వల్ల లేదా యూరినరీ ట్రాక్ గాయపడడం లేదా ప్రొస్టేట్ సంబంధిత సమస్యలేమైనా కావచ్చు. చాలా అరుదుగా బ్లాడర్ లేదా కిడ్నీలో క్యాన్సర్ కూడా ఇందుకు కారణం కావచ్చు. మూత్రం ద్వారా ఎక్కువ మొత్తంలో రక్తం పోకపోవచ్చు కానీ దీన్ని సమస్యకు ఒక సూచనగా భావించవచ్చు.

నీలం మూత్రం నీలం రంగులో పసి పిల్లల్లో కనిపించే సమస్య. నవజాత శిశువుల్లో రక్తంలో ఎక్కువగా కాల్షియం ఉండడం వల్ల వారి మూత్ర విసర్జన నీలం రంగులో ఉంటుంది. దీనిని బ్లూ డైపర్ సిండ్రోమ్ అంటారు. ఇది ఒక జన్యులోపం కారణంగా వచ్చే సమస్య. పెద్ద వారిలో ముఖ్యంగా వయాగ్రా వాడే పురుషుల్లో ఇలాంటి లక్షణం కనిపిస్తుంది.

Advertisement

నలుపు కొన్ని రకాల ఫంగల్ ఇన్‌ఫెక్షన్ల వల్ల మూత్రం నలుపు రంగులో ఉండేందుకు ఆస్కారం ఉంది. ఒక్కోసారి ఐరన్ లోపం సరిచేసేందుకు వాడే ఇంజక్షన్ల కారణంగా కూడా మూత్రం నలుపు రంగులో రావచ్చు.

జేగురు ఇది సాధారణంగా చర్మం లేదా గొంతులో ఇన్‌ఫెక్షన్ల ప్రభావం కిడ్నీ మీద పడినపుడు ఇలా జరుగుతుంది. ఇలాంటి స్థితి ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తుంది. యాంటీబయాటిక్స్ వాడడం ద్వారా దీన్ని నుంచి బయటపడవచ్చు. కానీ చాలా మంది డాక్టర్లు తర్వాత కాలంలో రాబోయే క్రానిక్ కిడ్నీ డిసీజ్‌కు ఇది ఒక సూచనగా భావిస్తారు.

Advertisement

ముదురు పసుపు మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. డీహైడ్రేషన్‌కు లోనైనపుడు అది ముదురు రంగులోకి మారుతుంది. ఒక్కోసారి లివర్ సమస్యలు, కామెర్ల వంటి సమస్యలున్నపుడు కూడా మూత్రం ముదురు పసుపు రంగులో రావచ్చు. కొన్ని రకాల మందులు వాడుతున్నపుడు కూడా మూత్రం పసుపు రంగులో వచ్చే ఆస్కారం ఉంటుంది.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Star Heroin: స్టార్ హీరోతో ప్రేమ,పెళ్లి విడాకులు..12 మందితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్… ఎవరంటే?

Published

on

Star Heroin: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి మనీషా కొయిరాల ఒకరు. ఈమె సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ సినిమాలలో నటించి ఒకానొక సమయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపారు. ఇక ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో తన వ్యక్తిగత విషయాలలో కూడా వార్తలలో నిలిచారు.

Advertisement

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు పలువురు హీరోలతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఒక స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడినప్పటికీ ఆయనని పెళ్లి చేసుకోలేదు. ఇక ఈమె సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రెండేళ్లకే తనతో విడాకులు తీసుకొని విడిపోయి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన మనీషా కోయిరాల మందుకు అలవాటు పడ్డారు.పెళ్లికి ముందే మనీషా కోయిరాలా ఏకంగా 12 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. వివేక్ ముశ్రన్‌, నానా పటేకర్‌, DJ హుస్సేన్‌, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్‌ వంటి ప్రముఖులతో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

12 మందితో డేటింగ్..
ఇలా తరచూ డేటింగ్ ల ద్వారా కూడా ఈమె వార్తల్లో నిలిచారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడిపారు. పలువురు దర్శక నిర్మాతలు సైతం ఈమె డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఇలా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపిన ఈమె మధ్యలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: విష్ణు ప్రియకు షాక్ ఇచ్చిన నిఖిల్… కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్.. అసలు ఆట ఆరంభం!

Published

on

Bigg Boss 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రారంభం అయ్యి 5 రోజులు పూర్తయింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అయితే హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ మూడు గ్రూపులుగా విడదీశారు. అయితే ఈ గ్రూపులోకి ఎవరెవరు సభ్యులను తీసుకోవాలనేది చీఫ్ ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ విష్ణు ప్రియ కచ్చితంగా తనని నిఖిల్ తన గ్రూపులోకి తీసుకుంటారని ఆమె భావించింది. కానీ నిఖిల్ మాత్రం ఆమెకు షాక్ ఇచ్చారు. దీంతో విష్ణు ప్రియను నైనిక తన టీమ్ లోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం గురించి నిఖిల్ విష్ణుప్రియ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీరిద్దరికి ముందే మంచి పరిచయమున్న నేపథ్యంలో తప్పకుండా నిఖిల్ తన టీమ్ లోకి తీసుకుంటారని విష్ణు ప్రియ భావించింది కానీ అది జరగలేదు.

ఇలా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కారణంగా విష్ణు ప్రియ సరదాగా నిఖిల్ ను ఓ ఆట ఆడుకుంది. దీంతో నిఖిల్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఇప్పటివరకు ఎంతో సరదాగా గడిపిన కంటెస్టెంట్లను మూడు గ్రూపులుగా విడదీయడంతో అసలైన ఆట మొదలైంది.

టాస్కులపై ఫోకస్..
కంటెస్టెంట్లను టీమ్స్ గా విడదీసి బిగ్ బాస్ టాస్కులను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇచ్చిన మొదటి టాస్కోలో భాగంగా ఇప్పటివరకు హౌస్ లో సైలెంట్ గా కూర్చున్న పృథ్విరాజ్ తన ఆట తీరును కనబరుస్తూ యష్మీ టీమ్ ను గెలిపించారు. దీంతో ముందు ముందు ఏ ఏ కంటెస్టెంట్ ఎలా తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారు బ్రో…. ఆ కంటెస్టెంట్లను ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఏడు సీజన్లను పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా గత ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. మొదట 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. మిగిలిన వారిని ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

Advertisement

ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ పోట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మిగిలిన వారు మాత్రం అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నా సందేహాలు వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతో యాక్టివ్ గా వెళ్లిన కంటెస్టెంట్లు లోపల మాత్రం అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోతున్నారనే చెప్పాలి.

ముఖ్యంగా హీరో ఆదిత్య ఓం అయితే హౌస్ లో ఉన్నాడా లేదా అన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది. ఈయన ఉంటే ఒంటరిగా ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు. పెద్దగా ఫేమస్ అయిన కంటెంట్ మాత్రం ఈయన ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలువురు ట్రోలర్స్ బ్రో అసలు ఎందుకొచ్చావు బ్రో బిగ్ బాస్ హౌస్ కి అంటూ భారీగా విమర్శలు చేస్తున్నారు.

ఈయనతో పాటు బెజవాడ బేబక్క కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈమె హౌస్ లో మాత్రం ఎక్కువగా కిచెన్ లోనే ఉంటుంది. కానీ సరైన కంటెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. పృధ్విరాజ్, అభయ్ నవీన్ వంటి వారందరూ కూడా హౌస్ లో డల్ గా కనిపిస్తున్న తరుణంలో పలువురు మీరంతా హౌస్ లోకి ఎందుకు వచ్చారో ఏమో అంటూ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అలాగే మరి కొంతమందిని బాగా హైలైట్ చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఎలిమినేషన్ ఉంటుందా…
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా బెజవాడ బేబక్క, విష్ణు ప్రియ, శేఖర్ భాష, నాగ మణికంఠ సోనియా ఆకుల ప్రేరణ వంటి వారు నామినేషన్ లో ఉన్నారు. అయితే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!