Connect with us

Featured

వీళ్ళేమో టాప్ విలన్స్ కానీ.. వీళ్ళ భార్యలు టాప్ హీరోయిన్స్ అని మీకు తెలుసా..?

Published

on

సినిమాలలో హిరో కి సమానమైన పాత్ర ఏది అంటే విలన్. సినిమాలలో విలన్ పాత్ర ఎంత బాగుంటే హిరో అంత హైలెట్ అవుతాడు. ఏది అదే చెప్పుకోవాలి. మన టాలీవుడ్ విలన్స్ యాక్టింగ్ లో ఏ మాత్రం తీసుపోరు. సినిమాలలో పగ, ద్వేషం, చంపడం వంటి వాటితో. కృరంగా ఉండే విలన్స్ భార్య ఏలా ఉంటారో అనే సందేహం ప్రతి ఒక్కరికి వస్తుంది.

Advertisement

కాని ఇక్కడ మన విలన్స్ వైఫ్స్ ను చూస్తే మాత్రం మతి పోతుంది. అంత అందంగా ఉంటారు మరీ. ఆ విలన్స్ భార్యలు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ విలన్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది..

రఘువరణ్

Advertisement


ఇతను ఒక్కప్పటి ఫెమస్ విలన్. 1982 తమిళ సినిమా ద్వారా తెరగేట్రం చేశారు రఘువరన్.. తెలుగు సినిమాలతో పాటూ తమిళ, మళీయాల సినిమాలలో నటించి ఎన్నో ఫిలీం ఫేర్ అవార్డులు అందుకున్నారు. బాషా, శివ సినిమాలలో విలన్ గా రఘువరన్ నటనను ఎప్పటికీ గుర్తుండిపోయేది. అంతగా విలన్ పాత్రలను పండించారు.

అయితే రఘువరన్ ప్రేమించి పెళ్లి చేసకున్నారు. ఆమె ఎవరో కాదు నటి రోహిణీ చిన్ననాటి నుంచి సినిమాలలో నటించిన రోహిణి ఇప్పటి వరకు 70 పైగా చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాదు రైటర్ గా.. లిరిసిస్ట్ గా.. డైరెక్టర్ గా.. డబ్బింగ్ అర్టిస్ట్ పలు రంగాల్లో రాణిస్తుంది. ఇక హీరోయిన్లు జ్యోతిక, ఐశ్వర్య రాయ్, మనిషా కోయిరాల, అమల లకు డబ్బింగ్ చెప్పేది రోహిణి. రఘవరన్ కి ఇంత అందమైన తెలివైనా భార్య ఉందని ఇప్పటికి చాలామందికి తెలియదు.

అవినాష్

ఒక్కప్పటి ఫేమస్ విలన్. ఇతను కన్నడ నటుడు. అయిన కూడ తెలుగు లో చాలా సినిమాలలో చేశాడు. ఇతడు చేసిన విలన్ పాత్రలు అవినాష్ కు మంచి గుర్తింపును తెచ్చపెట్టాయి. అవినాష్ రెండు దశాబ్దాలుగా పరిశ్రమలో ఉన్నాడు 1600 పైగా చిత్రాలలో నటించాడు. సంక్లిష్ట పాత్రలు మరియు వైవిధ్యత పాత్రల్లో ఎక్కువగా నటించాడు. అవినాష్ భార్య మాలవిక ఒకప్పటి కన్నడ టాప్ హిరోయిన్. మాలవిక తండ్రి చిత్ర పరిశ్రమకు చెందిన వాడు కావడం. చిన్నప్పటి నుంచి నృత్యం నెర్చుకోవడం.

వీటితో మాలవిక సినిరంగ ప్రవేశం సులువుగా జరిగిపోయాయి. ఈమె తెలుగులో కూడా చాలా సినిమాలలో నటించింది. హిరోయిన్ గా తన హవాను చూపించిన మాలవిక, అవినాష్ ను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక బాబు కూడ ఉన్నాడు. మాలవిక పెళ్లి తరువాత కూడ టెలివిజన్ సిరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవలే వచ్చిన పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ లో కూడా ఆమె నటించింది.

అతుల్ కులకర్ణి

Advertisement

పేరుకు తగ్గట్టుగానే గొప్ప విలన్.. తెలుగు, హిందీ, కన్నడ, మరాఠి, ఇంగ్లీష్ బాషల్లో నటించాడు.. ఎన్నో అవార్డులను కూడ అందుకున్నాడు. ఆంధ్రవాలా, చంటి, రామ్ సినిమాలలో విలన్ గా చేసిన కుల్కర్ణి భార్య ఏంత అందంగా ఉంటుందో తెలుసా అంతేకాదు కూడా గోప్ప నటి. కుల్కర్ణి భార్య గీతాంజలి కుల్కర్ణి ఈమె కూడ మంచి యాక్టర్. దాదాపుగా అన్ని బాషాల్లో నటించింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం బిజినెస్ రంగంలో రాణిస్తు కుటుంబాన్ని చూసకుంటుంది. అన్నింటిలో భర్తతో సమానంగా దూసుకుపోతుంది.

ఆశీష్ విద్యార్థి

ఇతను మన టాలీవుడ్ ఫేమస్ విలన్. ఆశీష్ ‘వందేమాతరం’ సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచమయ్యాడు. విలన్ పాత్రలను పండించడంలో దిట్ట. అంతేకాదు తాను నటించిన సినిమాలకు నేషనల్ అవార్డులను కూడ అందుకున్నాడు. తెలుగులో చేసింది కోన్ని సనిమాలే అయినా మంచి పేరు సంపాధించుకున్నాడు ఆశీష్. కన్నడ, తెలుగు, హిందీ, మళీయాలం సినిమాలలో నటించిన ఈ విల అన్ వైఫ్ పేరు రాజోషి విద్యార్థి. పేరుకు తగ్గట్టుగానే ఎంతో అందంగా ఉంటుంది.

మురళీ శర్మ

Advertisement

బాలీవుడ్, టాలీవుడ్, మరియు టెలివిజన్లలో ప్రధానంగా నటించిన భారతీయ చిత్ర నటుడు. మురళీ తెరపై ఒక పోలీసు పాత్రలు పోషించి అందరిని మెప్పించాడు. మురళీ శర్మ తెలుగు లో విలన్ గా నటించిన అతిథి, గోపాల గోపాల, కృష్ణం వందే జగద్గురు వంటి తెలుగు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మురళీ వైప్ కూడ తనకు ఏ మాత్రం తీసిపోదు. మురళీ భార్య ఆశ్విని కాల్ సెకర్ ఈమె ఒక ఫేమస్ యాక్టర్. ఈమె హిందీలో అనేక సిరియల్స్ లో నటించింది. తెలుగులో కూడ కొన్ని సినిమాలు చేసింది. బద్రినాథ్ సినిమాలో మురళీ భార్య మురళీ విలన్ గా నటించింది.

బిజు మీనన్

ముందుగా మనకు గర్తోచ్చే సినిమా రణం. రణం సినిమాలో విలన్ పాత్ర ద్వారా బాగా దగ్గరయ్యాడు. అతను తమిళ, తెలుగు చిత్రాలతో పాటు 100 మలయాళం చిత్రాలలో నటించారు. అతను 1995 లో పుత్రన్ లో తొలిసారిగా చేసాడు బిజు మీన న్ భార్య పేరు సంయుక్త వర్మ. బిజు భార్య సంయుక్త వర్మ ఒకప్పటి ఫేమస్ మళీయాల హిరోయిన్. ఈమె 1999 లో హీరోయిన్ గా పరిచయమయ్యారు. తర్వాత ఆమె పలు మలయాళ చిత్రాలలో నటించింది. ఉత్తమ నటిగా రెండు కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ అందుకుంది. కొన్నాళ్ళు హిరోయిన్ గా చేసింది. బిజు మీనన్ ను వివాహం చేసుకున్న తరువాత సినిమాలలో నటించలేదు. ప్రస్తుతం కుటుంబాన్ని చూసుకుంటుంది.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Star Heroin: స్టార్ హీరోతో ప్రేమ,పెళ్లి విడాకులు..12 మందితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్… ఎవరంటే?

Published

on

Star Heroin: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి మనీషా కొయిరాల ఒకరు. ఈమె సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ సినిమాలలో నటించి ఒకానొక సమయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపారు. ఇక ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో తన వ్యక్తిగత విషయాలలో కూడా వార్తలలో నిలిచారు.

Advertisement

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు పలువురు హీరోలతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఒక స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడినప్పటికీ ఆయనని పెళ్లి చేసుకోలేదు. ఇక ఈమె సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రెండేళ్లకే తనతో విడాకులు తీసుకొని విడిపోయి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన మనీషా కోయిరాల మందుకు అలవాటు పడ్డారు.పెళ్లికి ముందే మనీషా కోయిరాలా ఏకంగా 12 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. వివేక్ ముశ్రన్‌, నానా పటేకర్‌, DJ హుస్సేన్‌, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్‌ వంటి ప్రముఖులతో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

12 మందితో డేటింగ్..
ఇలా తరచూ డేటింగ్ ల ద్వారా కూడా ఈమె వార్తల్లో నిలిచారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడిపారు. పలువురు దర్శక నిర్మాతలు సైతం ఈమె డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఇలా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపిన ఈమె మధ్యలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: విష్ణు ప్రియకు షాక్ ఇచ్చిన నిఖిల్… కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్.. అసలు ఆట ఆరంభం!

Published

on

Bigg Boss 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రారంభం అయ్యి 5 రోజులు పూర్తయింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అయితే హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ మూడు గ్రూపులుగా విడదీశారు. అయితే ఈ గ్రూపులోకి ఎవరెవరు సభ్యులను తీసుకోవాలనేది చీఫ్ ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ విష్ణు ప్రియ కచ్చితంగా తనని నిఖిల్ తన గ్రూపులోకి తీసుకుంటారని ఆమె భావించింది. కానీ నిఖిల్ మాత్రం ఆమెకు షాక్ ఇచ్చారు. దీంతో విష్ణు ప్రియను నైనిక తన టీమ్ లోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం గురించి నిఖిల్ విష్ణుప్రియ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీరిద్దరికి ముందే మంచి పరిచయమున్న నేపథ్యంలో తప్పకుండా నిఖిల్ తన టీమ్ లోకి తీసుకుంటారని విష్ణు ప్రియ భావించింది కానీ అది జరగలేదు.

ఇలా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కారణంగా విష్ణు ప్రియ సరదాగా నిఖిల్ ను ఓ ఆట ఆడుకుంది. దీంతో నిఖిల్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఇప్పటివరకు ఎంతో సరదాగా గడిపిన కంటెస్టెంట్లను మూడు గ్రూపులుగా విడదీయడంతో అసలైన ఆట మొదలైంది.

టాస్కులపై ఫోకస్..
కంటెస్టెంట్లను టీమ్స్ గా విడదీసి బిగ్ బాస్ టాస్కులను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇచ్చిన మొదటి టాస్కోలో భాగంగా ఇప్పటివరకు హౌస్ లో సైలెంట్ గా కూర్చున్న పృథ్విరాజ్ తన ఆట తీరును కనబరుస్తూ యష్మీ టీమ్ ను గెలిపించారు. దీంతో ముందు ముందు ఏ ఏ కంటెస్టెంట్ ఎలా తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారు బ్రో…. ఆ కంటెస్టెంట్లను ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఏడు సీజన్లను పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా గత ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. మొదట 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. మిగిలిన వారిని ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

Advertisement

ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ పోట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మిగిలిన వారు మాత్రం అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నా సందేహాలు వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతో యాక్టివ్ గా వెళ్లిన కంటెస్టెంట్లు లోపల మాత్రం అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోతున్నారనే చెప్పాలి.

ముఖ్యంగా హీరో ఆదిత్య ఓం అయితే హౌస్ లో ఉన్నాడా లేదా అన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది. ఈయన ఉంటే ఒంటరిగా ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు. పెద్దగా ఫేమస్ అయిన కంటెంట్ మాత్రం ఈయన ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలువురు ట్రోలర్స్ బ్రో అసలు ఎందుకొచ్చావు బ్రో బిగ్ బాస్ హౌస్ కి అంటూ భారీగా విమర్శలు చేస్తున్నారు.

ఈయనతో పాటు బెజవాడ బేబక్క కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈమె హౌస్ లో మాత్రం ఎక్కువగా కిచెన్ లోనే ఉంటుంది. కానీ సరైన కంటెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. పృధ్విరాజ్, అభయ్ నవీన్ వంటి వారందరూ కూడా హౌస్ లో డల్ గా కనిపిస్తున్న తరుణంలో పలువురు మీరంతా హౌస్ లోకి ఎందుకు వచ్చారో ఏమో అంటూ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అలాగే మరి కొంతమందిని బాగా హైలైట్ చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఎలిమినేషన్ ఉంటుందా…
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా బెజవాడ బేబక్క, విష్ణు ప్రియ, శేఖర్ భాష, నాగ మణికంఠ సోనియా ఆకుల ప్రేరణ వంటి వారు నామినేషన్ లో ఉన్నారు. అయితే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!