Connect with us

General News

Tirumal Tirupati Devasthanam: తిరుమల భక్తులకు శుభవార్త..! నెరవేరబోతున్న కల..!

Tirumal Tirupati Devasthanam: ఆధ్యాత్మిక నగరం తిరుపతికి రోజురోజు భక్తుల సంఖ్య పెరుగుతోంది. దేశంలోని నలుమూలల నుంచి భక్తులు శ్రీవారిని

Published

on

Tirumal Tirupati Devasthanam: ఆధ్యాత్మిక నగరం తిరుపతికి రోజురోజు భక్తుల సంఖ్య పెరుగుతోంది. దేశంలోని నలుమూలల నుంచి భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు వస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో తిరుపతి నగరం వేగంగా విస్తరిస్తోంది.

Advertisement
Tirumal Tirupati Devasthanam: తిరుమల భక్తులకు శుభవార్త..! నెరవేరబోతున్న కల..!
Tirumal Tirupati Devasthanam: తిరుమల భక్తులకు శుభవార్త..! నెరవేరబోతున్న కల..!

దీంతో ఇటు భక్తులు, అటు నగరవాసుల పెరుగుతుండటం.. ఫలితంగా వాహనాల రాకపోకలు ఎక్కువ అవ్వడంతో తిరుపతి  నగరాన్ని ట్రాఫిక్ సమస్యలు వేధిస్తున్నాయి. అయితే తాజాగా తిరుపతి వాసులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కల నెరవేరబోతోంది.

Tirumal Tirupati Devasthanam: తిరుమల భక్తులకు శుభవార్త..! నెరవేరబోతున్న కల..!
Tirumal Tirupati Devasthanam: తిరుమల భక్తులకు శుభవార్త..! నెరవేరబోతున్న కల..!

నగరంలోని ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. దీంతో  పాటు భక్తులు కొండపైకి వెళ్లేందుకు మార్గం సుగమమైంది. టీటీడీ, తిరుపతి స్మార్ట్ సిటీ కార్పోరేషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారీ ఫ్లైఓవర్, గరుడ వారధి వారం, పది రోజుల్లో తిరుపతి వాసులకు అందుబాటులోకి రానుంది.

కరోనా కారణంగా ఆదాయం తగ్గడంతో..

ఫ్లై ఓవర్ నిర్మాణ ఖర్చులో టీటీడీ 67 శాతం భరించగా… తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ నిధుల నుంచి 33 శాతం కేటాయిస్తున్నారు. ఇదిలా ఉంటే కరోనా కారణంగా ఆదాయం తగ్గడంతో ఇప్పటి వరకు టీటీడీ రూ. 75 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫ్లైఓవర్ ప్రస్తుతం బస్టాండ్ నుంచి అలిపిరి వరకు గరుడ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. తర్వాత కడప మార్గం నుంచి తిరుపతి నగరంతో సంబంధం లేకుండా మరో కనెక్షన్ ను కూడా త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు ఆఫ్కాన్ సంస్థ ప్రయత్నిస్తోంది.

Advertisement

Featured

Ambulance: ఘోరం… ఆంబులెన్సులో మహిళకు లైంగిక వేధింపులు.. నిండు ప్రాణాన్ని బలి తీశారుగా?

Published

on

Ambulance: మనకు ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే స్పందించి సరైన సమయంలో చికిత్స అందడం కోసం అంబులెన్స్ కు ఫోన్ చేస్తాం వారు కూడా మన ప్రాణాలను నిలబెట్టడానికి వారి ప్రాణాలను కూడా లెక్కచేయరు కానీ ఓ అంబులెన్స్ డ్రైవర్ తన వృత్తిని మరిచిపోయి అంబులెన్స్ లో ఉన్నటువంటి ఓ మహిళ పట్ల లైంగిక వేధింపులకు దిగారు. దీంతో పేషంట్ గా ఉన్న ఆమె భర్త ప్రాణాలను వదిలిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది.

Advertisement

పూర్తి వివరాలలోకి వెళ్తే..ఈ ఘటన లోరి ఘజిపుర్‌లో చోటుచేసుకుంది. మహిళ భర్త అనారోగ్యంతో బాధపడుతున్న తరుణంలో చికిత్స నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. అయితే అక్కడ తగినంత డబ్బు చెల్లించలేకపోవడంతో తిరిగి తన భర్తను ఇంటికి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక ప్రైవేట్ అంబులెన్స్ ను మాట్లాడి తన భర్తను అందులో ఎక్కించి ఇంటికి తీసుకు వెళుతున్నారు.

మార్గమధ్యమంలో అంబులెన్స్ డ్రైవర్ తన హెల్పర్ ఆ మహిళ పట్ల లైంగిక వేధింపులకు గురి చేశారు. తనని ముందు సీట్లో కూర్చోవాలని బెదిరించారు. అంతేకాకుండా ఆమెను లైంగికంగా వేధించడంతో ఆంబులెన్స్ లో ఉన్నటువంటి తన భర్త తన సోదరుడు పెద్ద ఎత్తున అరవడంతో ఆంబులెన్స్ డ్రైవర్ ఆ మహిళ దగ్గర 10000 రూపాయలు విలువ చేసే బంగారం లాక్కొని పేషంటును మార్గమధ్యమంలోనే వదిలేసి ఆక్సిజన్ మాస్క్ కూడా తీసుకొని వెళ్ళిపోయారు.

ఆక్సిజన్ తొలగించి..
ఇలా ఆక్సిజన్ తొలగించడంతో సదరు మహిళ భర్త ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. అప్పటికే వేరే అంబులెన్స్ కు ఫోన్ చేసిన ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అంబులెన్స్ డ్రైవర్ తీరుపట్ల నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఇలాంటి వారికి కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Vijayawada Floods: విషాదం..నలుగురిని కాపాడాడు… వరదల్లో కొట్టుకుపోయాడు! భార్య 8 నెలల గర్భిణి!

Published

on

Vijayawada Floods: ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలలో కురిసిన వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్లో విజయవాడ మొత్తం నదులను తలపిస్తోంది. భారీగా కురిసిన వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లడంతో విజయవాడ మొత్తం నీటిలో మునిగిపోయింది. దీంతో ఎంతోమంది అవస్థలు పడుతున్నారు.

Advertisement

ఈ వరదల కారణంగా ఎంతో ప్రాణ నష్టం ఆస్తి నష్టం కూడా జరిగింది. సరైన సమయంలో కనీసం తాగడానికి నీళ్లు లేక ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా హృదయ విదారక ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే ఈ వరదలలో ఎంతో మంది ఇతరులను రక్షించి వారు ప్రాణాలను కోల్పోయిన సంఘటనలను మనం చూస్తున్నాము.

కృష్ణలంకకు చెందిన పలిశెట్టి చంద్రశేఖర్‌(32)కు సింగ్‌నగర్‌లో డెయిరీఫాం ఉంది. ఆయనతో పాటు ఇద్దరు సోదరులు మరో ఇద్దరు డైరీ ఫామ్ లో పనిచేసే వర్కర్లు ఈ వరదల్లో చిక్కుకున్నారు. అయితే ఆ నలుగురిని చంద్రశేఖర్ రక్షించారు. ఇక తన ఫామ్ లో 50ఆవులను తాళ్లతో కట్టేసి ఉంటే వాటన్నింటినీ కూడా విడదీసి తాను కూడా సురక్షితంగా బయటకు రావడం కోసం షెడ్ పైకి వెళ్లడానికి ప్రయత్నం చేశారు.

నలుగురికి ప్రాణదానం..
ఇలా షెడ్ పైకి ఎక్కుతున్న సమయంలో కాలుజారి కింద పడటంతో ఆయన వరదల్లో కొట్టుకుపోయి మరణించారు. అయితే తన డైరీ ఫార్మ్ దగ్గరలోనే తన మృతదేహం కనిపించడంతో తన కుటుంబ సభ్యులు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే చంద్రశేఖర్ కు రెండు సంవత్సరాల క్రితం వివాహం కాగా ప్రస్తుతం తన భార్య 8 నెలల గర్భిణీ. ఇలా తమ ప్రాణాలను రక్షించి చంద్రశేఖర్ ప్రాణాలను కోల్పోవడంతో తన సోదరులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

General News

నంద్యాలలో విషాదం.. అర్ధరాత్రి మట్టి మిద్దె కూలి కుటుంబంలో నలుగురు మృతి

Published

on

ఏపీ, నంద్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్న వంగలిలో ఈ ఘటన చోటు చేసుకుంది.. గురువారం అర్థరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికుల సమాచారం. ఈ ఘటనలో తల్లపురెడ్డి గురుశేఖర్ రెడ్డి (45), అతని భార్య దస్తగిరమ్మ (38), వారి ఇద్దరు కుమార్తెలు పవిత్ర (16), గురులక్ష్మి (10) మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి మృతదేహాలను గ్రామస్థులు వెలికి తీస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

Advertisement

సమాచారం అందుకుని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో మృతదేహాలను బయటకు తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు మట్టి మిద్దె కూలి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లను వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని గ్రామస్థులకు సూచించారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!