Connect with us

Featured

Adavi Simhalu : ఆ సంవత్సరంలో బాక్సాఫీస్ వద్ద గాండ్రించిన అడవిసింహాలు.. సూపర్ స్టార్, రెబల్ స్టార్ ల బ్లాక్ బస్టర్.!!

Published

on

Adavi Simhalu : దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు 1977లో ఆయన దశ దిశ మారిందనే చెప్పాలి. తృటిలో తప్పి పోయే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. తనకిచ్చిన అవకాశంతో సత్యచిత్ర బ్యానర్ లో “అడవిరాముడు” చిత్రాన్ని ఎన్టీరామారావుతో తీసి విజయ దుందుభి మోగించారు. ఆ తరువాత రాఘవేంద్ర రావు, సూపర్ స్టార్ కృష్ణ తో అనేక చిత్రాలు రూపొందించారు. అదేవిధంగా రెబల్ స్టార్ తో కూడా అద్భుత విజయాలను దర్శకేంద్రుడు సొంతం చేసుకున్నారు.

Advertisement
Adavi Simhalu : ఆ సంవత్సరంలో బాక్సాఫీస్ వద్ద గాండ్రించిన అడవిసింహాలు.. సూపర్ స్టార్, రెబల్ స్టార్ ల బ్లాక్ బస్టర్.!!

ఇకపోతే 1974లో స్థాపించిన వైజయంతి మూవీస్.. “ఎదురులేనిమనిషి” చిత్రంతో సినీ గమనాన్ని ప్రారంభించింది. వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ అనతికాలంలోనే ఎన్టీఆర్ ఏఎన్నార్ కృష్ణంరాజు కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి హీరోలతో అనేక చిత్రాలను రూపొందించారు. అలా దర్శకుడు రాఘవేంద్రరావు మొదటిసారిగా ఈ సినిమాతో వైజయంతి మూవీస్ బ్యానర్ లో పనిచేయడం జరిగింది. అదే సంవత్సరంలో కృష్ణ దాదాపు నాలుగు మల్టీస్టారర్ చిత్రాల్లో నటించారు. అలా రాఘవేంద్ర రావు సూపర్ స్టార్ రెబల్ స్టార్ లతో ఒక చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికంటే ముందే 1978 మల్లికార్జునరావు దర్శకత్వంలో “మనుషులు చేసిన దొంగలు” అనే చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు కలిసి నటించారు. ఆ తర్వాత తిరిగి అడవి సింహాలు చిత్రంలో నటించారు.

Adavi Simhalu : ఆ సంవత్సరంలో బాక్సాఫీస్ వద్ద గాండ్రించిన అడవిసింహాలు.. సూపర్ స్టార్, రెబల్ స్టార్ ల బ్లాక్ బస్టర్.!!

“అడవి సింహాలు” 1983 తెలుగు యాక్షన్ చిత్రం, దీనిని వైజయంతి మూవీస్ నిర్మాణ సంస్థపై సి.అశ్వినిదత్ నిర్మించాడు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. సినీ తారలు కృష్ణ, కృష్ణంరాజు, జయప్రద, శ్రీదేవి ప్రధాన పాత్రలుగా నటించిన ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతాన్నందించాడు. ఈ చిత్రం ఏకకాలంలో హిందీలో “జానీ దోస్త్ “గా విడుదలైంది. ఈ హిందీ చిత్రంలో ధర్మేంద్ర, జీతేంద్ర, శ్రీదేవి, పర్వీన్ బాబీలు కీలక పాత్రల్లో నటించారు. రెండు సినిమాలు ఒకే బ్యానర్, ఒకే దర్శకుడిచే ఒకేసారి నిర్మించబడ్డాయి, కొన్ని సన్నివేశాలు, కళాకారులు రెండు వెర్షన్లలో ప్రతిరూపంగా నిలిచారు… అయితే ఈ సినిమాలో కృష్ణ కృష్ణంరాజు స్నేహితులుగా కొనసాగుతారు. గిరిజనుల అటవీ సంపదను దోచుకునే ముఠాను అడ్డుకునే ప్రయత్నమే ఈ సినిమా కథ.

Adavi Simhalu : ఆ సంవత్సరంలో బాక్సాఫీస్ వద్ద గాండ్రించిన అడవిసింహాలు.. సూపర్ స్టార్, రెబల్ స్టార్ ల బ్లాక్ బస్టర్.!!

కృష్ణ సరసన శ్రీదేవి నటించగా కృష్ణంరాజు సరసన జయప్రద నటించారు. ఈ సినిమా షూటింగ్ మద్రాస్, మధుమలై, విశాఖపట్నంలో కొనసాగింది. వైజాగ్ సమీపంలో గల భీమిలి ప్రాంతంలో రెండు లక్షల రూపాయలు వెచ్చించి కోయగూడెం సెట్ వేయించారు. దాదాపు 30 అడుగుల ఎత్తుతో అడవితల్లి విగ్రహం ఏర్పాటు చేశారు. ఇందులో “అడవిసింహాలు” చిత్రంలోని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. భారీ సినిమాలు నిర్మించే వైజయంతి మూవీస్ ఈ సినిమా నిర్మాణంలో ఏ మాత్రం వెనుకంజ వేయలేదు. సినిమా షూటింగ్ లో లారీ వాహన ఉపయోగం ఎక్కువగా ఉండడంతో అద్దెకు తీసుకోకుండా అశ్వినిదత్ ఒక కొత్త లారీని కొనుగోలు చేయడం జరిగింది. ఆ తర్వాత “నూల్” అనే మరో తార ఇందులో నటించారు. నూలు అంటే మరో హాలీవుడ్ హీరోయిన్ కాదు. అచ్చంగా తొమ్మిదేళ్ళ “చింపాంజీ”. దీనిని అమెరికా నుంచి అద్దెకు తెప్పించారు. ఈ చిత్రంలో “నూల్” ద్విపాత్రాభినయం పోషించడం గమనార్హం.

Adavi Simhalu : ఆ సంవత్సరంలో బాక్సాఫీస్ వద్ద గాండ్రించిన అడవిసింహాలు.. సూపర్ స్టార్, రెబల్ స్టార్ ల బ్లాక్ బస్టర్.!!

ఒకటి హీరోల దగ్గర ఉండగా మరొకటి విలన్ గ్రూపులో ఉంటుంది. అడవిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సందర్భంలో “నూల్” తప్పిపోయింది. షూటింగ్ రద్దు చేసుకొని దాదాపు ఒకరోజంతా వెతికితే “నూలు” దొరకింది. నూల్ కోసం నిర్మాత అశ్వినీదత్ దాదాపు ఆరు లక్షల రూపాయల వెచ్చించారు.

Adavi Simhalu : ఆ సంవత్సరంలో బాక్సాఫీస్ వద్ద గాండ్రించిన అడవిసింహాలు.. సూపర్ స్టార్, రెబల్ స్టార్ ల బ్లాక్ బస్టర్.!!

ఆ రోజుల్లోనే ఈ సినిమా కోసం నిర్మాత అశ్వినిదత్ దాదాపు 75 లక్షల రూపాయల బడ్జెట్ ను కేటాయించారు. ఈ సినిమా 1983 ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య విడుదల అయ్యింది. విడుదలైన మొదటి వారంలోనే 64 లక్షల రూ.ల వసూళ్లను రాబట్టింది. సూపర్ స్టార్, రెబల్ స్టార్ అభిమానులకు అనుగుణంగా దర్శకుడు రాఘవేంద్ర రావు ఈ సినిమాను రూపొందించడంతో బాక్సాఫీస్ వద్ద “అడవి సింహాలు” చిత్రం విజయవంతంగా నిలిచింది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Star Heroin: స్టార్ హీరోతో ప్రేమ,పెళ్లి విడాకులు..12 మందితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్… ఎవరంటే?

Published

on

Star Heroin: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి మనీషా కొయిరాల ఒకరు. ఈమె సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ సినిమాలలో నటించి ఒకానొక సమయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపారు. ఇక ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో తన వ్యక్తిగత విషయాలలో కూడా వార్తలలో నిలిచారు.

Advertisement

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు పలువురు హీరోలతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఒక స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడినప్పటికీ ఆయనని పెళ్లి చేసుకోలేదు. ఇక ఈమె సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రెండేళ్లకే తనతో విడాకులు తీసుకొని విడిపోయి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన మనీషా కోయిరాల మందుకు అలవాటు పడ్డారు.పెళ్లికి ముందే మనీషా కోయిరాలా ఏకంగా 12 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. వివేక్ ముశ్రన్‌, నానా పటేకర్‌, DJ హుస్సేన్‌, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్‌ వంటి ప్రముఖులతో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

12 మందితో డేటింగ్..
ఇలా తరచూ డేటింగ్ ల ద్వారా కూడా ఈమె వార్తల్లో నిలిచారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడిపారు. పలువురు దర్శక నిర్మాతలు సైతం ఈమె డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఇలా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపిన ఈమె మధ్యలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: విష్ణు ప్రియకు షాక్ ఇచ్చిన నిఖిల్… కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్.. అసలు ఆట ఆరంభం!

Published

on

Bigg Boss 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రారంభం అయ్యి 5 రోజులు పూర్తయింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అయితే హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ మూడు గ్రూపులుగా విడదీశారు. అయితే ఈ గ్రూపులోకి ఎవరెవరు సభ్యులను తీసుకోవాలనేది చీఫ్ ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ విష్ణు ప్రియ కచ్చితంగా తనని నిఖిల్ తన గ్రూపులోకి తీసుకుంటారని ఆమె భావించింది. కానీ నిఖిల్ మాత్రం ఆమెకు షాక్ ఇచ్చారు. దీంతో విష్ణు ప్రియను నైనిక తన టీమ్ లోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం గురించి నిఖిల్ విష్ణుప్రియ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీరిద్దరికి ముందే మంచి పరిచయమున్న నేపథ్యంలో తప్పకుండా నిఖిల్ తన టీమ్ లోకి తీసుకుంటారని విష్ణు ప్రియ భావించింది కానీ అది జరగలేదు.

ఇలా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కారణంగా విష్ణు ప్రియ సరదాగా నిఖిల్ ను ఓ ఆట ఆడుకుంది. దీంతో నిఖిల్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఇప్పటివరకు ఎంతో సరదాగా గడిపిన కంటెస్టెంట్లను మూడు గ్రూపులుగా విడదీయడంతో అసలైన ఆట మొదలైంది.

టాస్కులపై ఫోకస్..
కంటెస్టెంట్లను టీమ్స్ గా విడదీసి బిగ్ బాస్ టాస్కులను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇచ్చిన మొదటి టాస్కోలో భాగంగా ఇప్పటివరకు హౌస్ లో సైలెంట్ గా కూర్చున్న పృథ్విరాజ్ తన ఆట తీరును కనబరుస్తూ యష్మీ టీమ్ ను గెలిపించారు. దీంతో ముందు ముందు ఏ ఏ కంటెస్టెంట్ ఎలా తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారు బ్రో…. ఆ కంటెస్టెంట్లను ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఏడు సీజన్లను పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా గత ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. మొదట 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. మిగిలిన వారిని ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

Advertisement

ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ పోట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మిగిలిన వారు మాత్రం అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నా సందేహాలు వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతో యాక్టివ్ గా వెళ్లిన కంటెస్టెంట్లు లోపల మాత్రం అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోతున్నారనే చెప్పాలి.

ముఖ్యంగా హీరో ఆదిత్య ఓం అయితే హౌస్ లో ఉన్నాడా లేదా అన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది. ఈయన ఉంటే ఒంటరిగా ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు. పెద్దగా ఫేమస్ అయిన కంటెంట్ మాత్రం ఈయన ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలువురు ట్రోలర్స్ బ్రో అసలు ఎందుకొచ్చావు బ్రో బిగ్ బాస్ హౌస్ కి అంటూ భారీగా విమర్శలు చేస్తున్నారు.

ఈయనతో పాటు బెజవాడ బేబక్క కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈమె హౌస్ లో మాత్రం ఎక్కువగా కిచెన్ లోనే ఉంటుంది. కానీ సరైన కంటెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. పృధ్విరాజ్, అభయ్ నవీన్ వంటి వారందరూ కూడా హౌస్ లో డల్ గా కనిపిస్తున్న తరుణంలో పలువురు మీరంతా హౌస్ లోకి ఎందుకు వచ్చారో ఏమో అంటూ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అలాగే మరి కొంతమందిని బాగా హైలైట్ చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఎలిమినేషన్ ఉంటుందా…
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా బెజవాడ బేబక్క, విష్ణు ప్రియ, శేఖర్ భాష, నాగ మణికంఠ సోనియా ఆకుల ప్రేరణ వంటి వారు నామినేషన్ లో ఉన్నారు. అయితే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!