Tanikella Bharani : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడు, దర్శకుడు, రచయిత తనికెళ్ల భరణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిన్న అద్భుతమైన పాత్రలో తెలుగు, కన్నడ, హిందీ, భాషలలో సుమారు 750 చిత్రాలకు పైగా నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. తండ్రి పాత్రలో తాత పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన తనికెళ్ల భరణి ఇంటర్వ్యూలో భాగంగా తన సినిమా కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తనికెళ్ళభరణి ఒక ఫైట్ మాస్టర్ తనని దారుణంగా అవమానించారని ఈ సందర్భంగా తెలియజేశారు. తనికెళ్ల భరణి వివాహం చేసుకొని మొట్టమొదటిసారిగా హైదరాబాద్ వచ్చినప్పుడు తను రాళ్ళపల్లి ఇంటిలో అద్దెకి ఉండేవారని చెప్పారు. అయితే ఆ ఇంటికి వచ్చిన ఫైట్ మాస్టర్ భీమరాజు అనే వ్యక్తి ఏంటయ్యా కొత్తగా పెళ్లయింది ఈ చిన్న ఇంట్లో ఎలా ఉంటున్నారు, నాకు పెద్ద ఇల్లు ఉంది గ్రౌండ్ ఫ్లోర్ అమ్మాలి అనుకుంటున్నాను కావలిస్తే చూడండి అంటూ తనకు చెప్పారనీ తనికెళ్ల భరణి తెలియజేశారు.Tanikella Bharani: అలా నటించినందుకు చంపేస్తామని బెదిరించారు…ఆవేదన వ్యక్తం చేసిన తనికెళ్లభరణి..!
అయితే గ్రౌండ్ ఫ్లోర్ ను ఏకంగా మూడు లక్షల రూపాయలకు అమ్ముతున్నట్లు ఫైట్ మాస్టర్ చెప్పగా మూడు లక్షలు అంటే ఎక్కడి నుంచి తేవాలి చాలా కష్టం అవుతుందని తనికెళ్ళభరణి చెప్పడంతో అసలు డబ్బులు ఇవ్వకుండా వచ్చి ఇంట్లో చేరిపో నీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వమని చెప్పారు.ఇదే విషయాన్ని తనికెళ్ల భరణి తన గురువుగారి దగ్గర చెప్పడంతో ఒకసారి వెళ్లి చూసి రా మంచి విషయమే కదా అని చెప్పారు.
ఈ విధంగా అప్పట్లోనే లక్ష రూపాయలు చెల్లించి ఒక సంవత్సరం పాటు ఆ ఇంట్లో ఉండగా ఒక ఆరు నెలల పాటు తనకి ఎలాంటి అమౌంట్ రాలేదని అప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఫైట్ మాస్టర్ వచ్చి తన ఇంటికి చెల్లించాల్సిన డబ్బులు మొత్తం చెల్లించాలని ఎంతో ఒత్తిడికి గురి చేశారని చెప్పారు.ఇప్పటికిప్పుడు అంత మొత్తంలో డబ్బు కంటే ఎక్కడనుంచి తీసుకురావాలి నా పరిస్థితి కూడా ఇదే అని చెప్పినప్పటికీ వినకుండా వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళమన్నారు.
అతను ఆ మాట అనేసరికి తనికెళ్ళ భరణి తన డబ్బులను తనకు తిరిగి ఇవ్వమని అడిగిన కూడా ఇవ్వకుండా తన ఇంటి నుంచి వెళ్లిపొమ్మని చెప్పారు. ఆ విధంగా అక్కడి నుంచి వేరే ఇంటికి వెళ్ళిన తనికెళ్ల భరణి తన డబ్బు కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈ విధంగా డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అతని దగ్గర నుంచి 75 వేల వరకు తిరిగి తీసుకున్నానని అప్పటికే అతనికి పక్షవాతం వచ్చి ఇబ్బందులు పడటంతో మిగిలిన పాతిక వేలు వదులుకున్నానని ఇంటర్వ్యూ సందర్భంగా తనికెళ్ళభరణి తెలియజేశారు.
Rajamouli: తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు డైరెక్టర్ రాజమౌళి. ఈయన దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇక తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన ఘనత రాజమౌళికి దక్కుతుందని చెప్పాలి. ఇలా దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
రాజమౌళి కెరియర్ లో వచ్చిన మగధీర సినిమా ఎంతో ప్రత్యేకమైనదని చెప్పాలి. మొదటిసారి ఇలాంటి సినిమా ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు అయితే ఈ సినిమా సమయంలో తాను ఎంతో కంగారు పడ్డానని అప్పటికే ఇది చాలా భారీ బడ్జెట్ కావడంతో ఒక రకమైన భయం ఉండేదని తెలిపారు.
ఇక తన సినిమాలలో అందరిలాగే స్టార్ హీరోయిన్లనే పెట్టుకోవాలని నేను అనుకుంటాను. కానీ నేను రాసుకున్న కథకు అనుగుణంగా ఏ హీరోయిన్ అయితే సెట్ అవుతుందో వారినే తీసుకుంటాను. ఆ హీరోయిన్ కు వరుసగా ప్లాపులు వచ్చిన ఆమె ఐరన్ లెగ్ అంటూ ట్రోల్స్ ఎదుర్కొన్న తాను వాటిని లెక్క చేయను. మగధీర..
Advertisement
ఇలా ఆ హీరోయిన్ హిస్టరీ గురించి నేను ఏమాత్రం ఆలోచించనని నా పాత్రకు సూట్ అయితే తప్పనిసరిగా వారికి అవకాశాలు ఇస్తాను అంటూ ఈ సందర్భంగా హీరోయిన్ల గురించి రాజమౌళి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈయన మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతోంది.
Venu Swamy: బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ 8 కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా వేణు స్వామి సందడి చేయబోతున్నారనే సంగతి మనకు తెలిసిందే. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కార్యక్రమం ఆగస్టులోనే ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది.
ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లకు సంబంధించిన లిస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో వేణు స్వామి కూడా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ప్రముఖ ఆస్ట్రాలజర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వేణు స్వామి బిగ్ బాస్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
ఇలా ఆస్ట్రాలజర్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలోకి రాబోతున్నారని తెలియగానే ఈ కార్యక్రమం పై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈయన కారణంగా రేటింగ్స్ కూడా భారీగా వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇకపోతే వేణు స్వామి బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొంటూ అందుకోబోయే రెమ్యూనరేషన్ గురించి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
లక్షల్లో రెమ్యునరేషన్..
Advertisement
దేశ చరిత్రలోనే ఇప్పటివరకు ఏ కంటెస్టెంట్ తీసుకొని రెమ్యూనరేషన్ ఈయన అందుకోబోతున్నారని తెలుస్తోంది. వేణు స్వామి వారానికి లక్షల్లోనే రెమ్యూనరేషన్ అందుకునే విధంగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు సమాచారం. మరి వేణు స్వామి ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని ఆయన రెమ్యూనరేషన్ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు. ఈమె హైదరాబాదులో రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ బిజినెస్ చేసుకుంటూ జీవనం గడిపేది అయితే ఈమె చాలా తక్కువ ధరకే కడుపునిండా భోజనం పెట్టడంతో ఈమె గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆమె దగ్గరికి వెళ్లి తనతో ఇంటర్వ్యూ తీసుకోవడంతో ఒక్కసారిగా ఈమె పాపులర్ అయ్యారు.
ఇలా సోషల్ మీడియా వేదికగా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె ప్రస్తుతం సెలబ్రిటీగా మారిపోయారని చెప్పాలి. ఎన్నో కార్యక్రమాలలో కూడా కుమారి ఆంటీ సందడి చేశారు. ఇక త్వరలోనే కుమారి ఆంటీ బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.
ఈ విధంగా కుమారి ఆంటీ రోజురోజుకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకోవడంతో ఎంతోమంది సెలబ్రిటీలు కూడా ఆమె వద్దకు వచ్చి ఆమె ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్దకు సినీ నటుడు సోను సూద్ వచ్చి ఒక్కసారిగా సర్ప్రైజ్ ఇచ్చారు. కుమారి ఆంటీని కలిసిన ఈయన ఆమెతో సరదాగా మాట్లాడి తన కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Advertisement
మహిళా సాధికారత.. మహిళా సాధికారత కష్టపడే తత్వానికి కుమారి ఆంటీ నిదర్శనమని సోను సూద్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా తనకు ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నానని వెంటనే నాకు తెలియజేయాలి అంటూ ఆమెకు ధైర్యం చెప్పారు. ఇక సోను సూద్ గురించి కుమారి ఆంటీ మాట్లాడుతూ.. ఎంతోమందికి సహాయం చేసిన సోను సూద్ కి ఏమిచ్చినా తక్కువే అంటూ కుమారి ఆంటీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.