Analyst Damu Balaji : వైఫల్యాలే గొప్ప పాఠాలు అని మన ఇస్రో శాస్త్రవేత్తలు నిరూపించారు. 2019 లో ప్రయోగించిన చంద్రయాన్ 2 వైఫల్యం తరువాత మళ్ళీ కసిగా పనిచేసి చంద్రయాన్ 3 ను గత నెలలో ప్రయోగించారు. తాజాగా విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం లో సేఫ్ గా ల్యాండ్ అయి ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూసేలా చేసింది. ఇప్పటి వరకు అమెరికా, చైనా, రష్యా కి సాధ్యం కానీ విషయం ను సాధ్యం చేసి అది కూడ అతి తక్కువ ఖర్చుల్లో చేసి చూపింది ఇస్రో. ఆగష్టు 23 న సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు జాబిలి దక్షిణ ధ్రువం మీద అడుగుపెట్టింది విక్రమ్ ల్యాండర్. ఇక విక్రమ్ ల్యాండర్ నుండి ప్రజ్ఞ రోవర్ బయటికి వచ్చి చంద్రుడి ఫోటోలను బెంగళూరు లోని ఇస్రో కార్యాలయం కు పంపుతోంది. ప్రయోగం విజయవంతం అయింది దీంతో భవిష్యత్ లో అంతరిక్ష వ్యాపారం లో భారత్ డామినేట్ చేయబోతుంది అంటూ అక్షరాలా 80 లక్షల కోట్ల వ్యాపారం జరగనుందని కేంద్ర సైన్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి జితేందర్ చెప్పడం రాబోవు కాలంలో భారత్ శాస్త్ర శాంకేతిక రంగంలో ఎలాంటి ప్రభావం చూపనుందో చెబుతున్నాయి. అయితే చంద్రయాన్ వల్ల భవిష్యత్ లో అంతరిక్ష యుద్ధాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.
అగ్ర దేశాల నుండి తప్పని ముప్పు… భవిష్యత్ అంత అంతరిక్ష ఆధిపత్యమే….
ఇప్ప్పటికే అగ్ర రాజ్యలైన అమెరికా, చైనా లు తమ వల్ల కానీ పని ఇండియా చేసి చూపినందుకు నిషితంగా గమనిస్తూ ఉన్నాయ్. నిజానికి చంద్రయాన్ 3 వల్ల చంద్రుడిలో ఉన్న వనరులు వంటి విషయాల మీద భారత్ కి పట్టు లభిస్తుంది . ఇది ముఖ్యంగా చైనా వంటి దేశాలకు రుచించదు. దీంతో మన స్పేస్ క్రాఫ్ట్స్ ను ఢీ కొట్టడానికి ఏవైనా ప్రయత్నాలు చేయవచ్చు.
Advertisement
భవిష్యత్ లో ఏదైనా చంద్రుడి మీద ప్రయోగం చేయాలంటే ఇతర దేశాలు భారత్ సహకారం తీసుకుంటాయి. అందువల్ల భారత్ కి వ్యాపారపరంగా ఇది మంచి పరిణామం. అందుకే మనమంటే గిట్టని దేశాలు అంతరీక్షంలో యుద్ధానికీ తెర తీయవచ్చు. ఒకప్పుడు అంటరీక్షం లో ఆధిపత్యం కోసం. అమెరికా, రష్యా పోటీ పడ్డాయి. అయితే ఇపుడు ఉన్న సాంకేతిక తో ఏదైనా దేశ స్పేస్ క్రాఫ్ట్స్ ను హ్యాక్ చేయడమో లెక శత్రు స్పేస్ క్రాఫ్ట్స్ ద్వారా ధ్వంసం చేయడమో చేస్తాయి అంటూ అనలిస్ట్ బాలాజీ తెలిపారు.
Rajamouli: తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు డైరెక్టర్ రాజమౌళి. ఈయన దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇక తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన ఘనత రాజమౌళికి దక్కుతుందని చెప్పాలి. ఇలా దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
రాజమౌళి కెరియర్ లో వచ్చిన మగధీర సినిమా ఎంతో ప్రత్యేకమైనదని చెప్పాలి. మొదటిసారి ఇలాంటి సినిమా ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు అయితే ఈ సినిమా సమయంలో తాను ఎంతో కంగారు పడ్డానని అప్పటికే ఇది చాలా భారీ బడ్జెట్ కావడంతో ఒక రకమైన భయం ఉండేదని తెలిపారు.
ఇక తన సినిమాలలో అందరిలాగే స్టార్ హీరోయిన్లనే పెట్టుకోవాలని నేను అనుకుంటాను. కానీ నేను రాసుకున్న కథకు అనుగుణంగా ఏ హీరోయిన్ అయితే సెట్ అవుతుందో వారినే తీసుకుంటాను. ఆ హీరోయిన్ కు వరుసగా ప్లాపులు వచ్చిన ఆమె ఐరన్ లెగ్ అంటూ ట్రోల్స్ ఎదుర్కొన్న తాను వాటిని లెక్క చేయను. మగధీర..
Advertisement
ఇలా ఆ హీరోయిన్ హిస్టరీ గురించి నేను ఏమాత్రం ఆలోచించనని నా పాత్రకు సూట్ అయితే తప్పనిసరిగా వారికి అవకాశాలు ఇస్తాను అంటూ ఈ సందర్భంగా హీరోయిన్ల గురించి రాజమౌళి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈయన మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతోంది.
Venu Swamy: బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ 8 కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా వేణు స్వామి సందడి చేయబోతున్నారనే సంగతి మనకు తెలిసిందే. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కార్యక్రమం ఆగస్టులోనే ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది.
ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లకు సంబంధించిన లిస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో వేణు స్వామి కూడా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ప్రముఖ ఆస్ట్రాలజర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వేణు స్వామి బిగ్ బాస్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
ఇలా ఆస్ట్రాలజర్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలోకి రాబోతున్నారని తెలియగానే ఈ కార్యక్రమం పై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈయన కారణంగా రేటింగ్స్ కూడా భారీగా వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇకపోతే వేణు స్వామి బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొంటూ అందుకోబోయే రెమ్యూనరేషన్ గురించి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
లక్షల్లో రెమ్యునరేషన్..
Advertisement
దేశ చరిత్రలోనే ఇప్పటివరకు ఏ కంటెస్టెంట్ తీసుకొని రెమ్యూనరేషన్ ఈయన అందుకోబోతున్నారని తెలుస్తోంది. వేణు స్వామి వారానికి లక్షల్లోనే రెమ్యూనరేషన్ అందుకునే విధంగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు సమాచారం. మరి వేణు స్వామి ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని ఆయన రెమ్యూనరేషన్ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు. ఈమె హైదరాబాదులో రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ బిజినెస్ చేసుకుంటూ జీవనం గడిపేది అయితే ఈమె చాలా తక్కువ ధరకే కడుపునిండా భోజనం పెట్టడంతో ఈమె గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆమె దగ్గరికి వెళ్లి తనతో ఇంటర్వ్యూ తీసుకోవడంతో ఒక్కసారిగా ఈమె పాపులర్ అయ్యారు.
ఇలా సోషల్ మీడియా వేదికగా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె ప్రస్తుతం సెలబ్రిటీగా మారిపోయారని చెప్పాలి. ఎన్నో కార్యక్రమాలలో కూడా కుమారి ఆంటీ సందడి చేశారు. ఇక త్వరలోనే కుమారి ఆంటీ బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.
ఈ విధంగా కుమారి ఆంటీ రోజురోజుకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకోవడంతో ఎంతోమంది సెలబ్రిటీలు కూడా ఆమె వద్దకు వచ్చి ఆమె ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్దకు సినీ నటుడు సోను సూద్ వచ్చి ఒక్కసారిగా సర్ప్రైజ్ ఇచ్చారు. కుమారి ఆంటీని కలిసిన ఈయన ఆమెతో సరదాగా మాట్లాడి తన కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Advertisement
మహిళా సాధికారత.. మహిళా సాధికారత కష్టపడే తత్వానికి కుమారి ఆంటీ నిదర్శనమని సోను సూద్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా తనకు ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నానని వెంటనే నాకు తెలియజేయాలి అంటూ ఆమెకు ధైర్యం చెప్పారు. ఇక సోను సూద్ గురించి కుమారి ఆంటీ మాట్లాడుతూ.. ఎంతోమందికి సహాయం చేసిన సోను సూద్ కి ఏమిచ్చినా తక్కువే అంటూ కుమారి ఆంటీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.