Connect with us

General News

కొత్తగా ఎదుగుతున్న కరోనా వైరస్.. అందుకే వేగంగా వ్యాప్తి..!

Published

on

కరోనా వైరస్ వల్ల గడిచిన 7 నెలల నుంచి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఈ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో ప్రపంచ ఆరోగ్య సంస్థ దగ్గర స్పష్టమైన ఆధారాలు లేవు. వైరస్ గురించి ఖచ్చితమైన విషయాలు తెలుసుకోవడానికి శాస్త్రవేత్తల పరిశోధనలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ప్రయత్నిస్తున్నా కట్టడి చేయలేకపోతున్నాయి.

వైద్యులు, శాస్త్రవేత్తలు గతంలో ఏ వైరస్ ఈ స్థాయిలో వ్యాప్తి చెందలేదని చెబుతున్నారు. అయితే తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో కరోనా వైరస్ ఇంత వేగంగా వ్యాప్తి చెందడానికి సరికొత్త కారణాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా వైద్య పరిశోధకులు నిన్న కొత్త పరిశోధనలకు సంబంధించిన ఫలితాలను వెల్లడించారు. కరోనా వైరస్ యొక్క 5,000 జెనిటిక్ సీక్వెన్ లపై ప్రయోగాలు చేసి ఈ విషయాలు తెలిపారు.
 
వైరస్ క్రమంగా మ్యుటేట్ అవుతూ ఉండటంతో పాటు మ్యుటేషన్ వల్ల కరోనా వైరస్ లోనే కొత్తరకం జెనిటిక్ సీక్వెన్సులు తయారవుతున్నాయని వెల్లడించారు. మనుషుల్లో కరోనా వైరస్ లోడ్ ఎక్కువగా కనిపించడానికి వైరస్ మ్యుటేషన్ లోడ్ ఎక్కువ కావడమేనని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మ్యుటేషన్ వల్ల స్పైక్ ప్రోటీన్ మారిపోయి వైరస్ ను కట్టడి చేయడం కష్టమవుతోందని చెప్పారు.
 
అయితే వైరస్ మ్యుటేషన్ చెందినా ప్రమాదకరం కాదని వెల్లడిస్తున్నారు. ప్రతి వైరస్ లోనూ చిన్నచిన్న మార్పులు సహజమేనని వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే వైరస్ ను కట్టడి చేయడం సాధ్యమవుతుందని వెల్లడిస్తున్నారు. వైరస్ కు ప్రతి రోగి మ్యుటేషన్ కు అవకాశం కల్పిస్తాడని ఎన్ని లక్షల కేసులు నమోదైతే అన్ని ఎక్కువ మ్యుటేషన్లు నమోదు కావచ్చని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Palnadu: పల్నాడులో ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం?

Published

on

Palnadu: పల్నాడు జిల్లాలో అర్థరాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.చిలకలూరిపేట – పర్చూరి జాతీయ రహదారిపై పసుమర్తి వద్ద బస్సు ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆరుగురు సజీవ దహనం అయ్యారు. తెల్లవారితే వారి గమ్య స్థానాలకు చేరుకోవాల్సిన వారు తెల్లవారుకుండానే వారి జీవితాలు అగ్ని మంటల్లో బూడిద అయ్యాయి. పసుమర్తి వద్ద ప్రయాణిస్తున్నటువంటి బస్సును ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది.

ఇలా వేగంగా ప్రయాణిస్తున్నటువంటి టిప్పర్ ఒక్కసారిగా ఢీకొట్టడంతో ఆ టిప్పర్ లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి అయితే బస్సులో కూడా మంటలు చెల్లరేగడంతో పెద్ద ఎత్తున ప్రమాదం చోటుచేసుకుంది ఈ ప్రమాదంలో భాగంగా టిప్పర్ డ్రైవర్ తో పాటు బస్సు డ్రైవర్ కూడా అగ్నికి ఆహుతి అయ్యారు.

ఇక బస్సులో ప్రయాణిస్తున్నటువంటి మరో ఆరుగురు ప్రయాణికులు కూడా సజీవ దహనం అయ్యారు.మరో 20 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చిలకలూరిపేట ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అయితే వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. ఇక బస్సులో ప్రయాణిస్తున్నటువంటి మరో ఇద్దరు ప్రయాణికుల జాడ కూడా ఇప్పటివరకు తెలియలేదు.
సజీవ దహనం..

Advertisement

ఇలా అర్ధరాత్రి కాడ నడిరోడ్డుపై ఈ విధమైనటువంటి ప్రమాదం చోటు చేసుకోవడంతో మంటలు ఆర్పడానికి భారీ స్థాయిలో ప్రయత్నించిన సాధ్యం కాని పరిస్థితిలు ఏర్పడటంతో ప్రయాణికులు మరణించారు. ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బాపట్ల జిల్లా నుంచి హైదరాబాద్ కు వెళ్తుంది. ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం హైదరాబాద్ నుంచి సొంత గ్రామానికి వచ్చి తిరిగి వెళుతున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Advertisement
Continue Reading

Featured

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Published

on

తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద విషయం. ఆ ఘనత ఎన్టీవీకి దక్కింది. తొలిసారి ఎన్టీవీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. తన మనసులోని మాటను ప్రధాని మోడీ ఎన్టీవీతో పంచుకోనున్నారు. అది ఎప్పుడో కాదు.. నేటి రాత్రి 8 గంటలకు ప్రధాని ఎన్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. పదేళ్లుగా తిరుగులేని విజయాలను సాధిస్తూ ప్రజల గుండెలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న ప్రధాని మోడీ.. ఎన్టీవీతో ఈ సార్వత్రిక ఎన్నికల ముచ్చట్ల గురించి మాట్లాడనున్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ మీడియాకు అతి తక్కువ సమయం మాత్రమే ఇవ్వగలిగేంత బిజీ షెడ్యూల్‌లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఎన్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వడం గమనార్హం. గతంలో భక్తి టీవీ నిర్వహించిన కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా ప్రధాని మోడీ హాజరయ్యారు.

ఎన్నికలు దగ్గర పడుతున్న కీలక సమయంలో ఎన్టీవీకి ప్రధాని ఇంటర్వ్యూ ఇవ్వడమనేది చాలా పెద్ద విషయం. అలా చూసుకున్నా ఎన్టీవీ దేశ టెలివిజన్‌ చరిత్రలోనే అరుదైన ఘనతను సాధిస్తోందని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో జరుగుతున్న కీలక పరిణామాలపై ప్రధాని మోడీ సమాధానమివ్వనున్నారు. ప్రజల మెదళ్లలో నానుతున్న ఎన్నో ప్రశ్నలు, ప్రచారంలో ఉన్న మరెన్నో సందేహాలపై తెలుగు ప్రజల తరపున ఎన్టీవీ ప్రశ్నించనుంది. ఒకే ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని మోడీ దగ్గర కానున్నారు.

ప్రధాని మోడీతో ఎన్టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి: https://www.youtube.com/watch?v=9sBOhC540e8

Advertisement

Continue Reading

General News

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

Published

on

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలు. దాదాపు 21 సంవత్సరాల నుంచి ఆమె సుస్వర మ్యూజిక్ అకాడమీ పేరిట ఎంతో ఘనంగా ప్రతి ఏడాది వార్షికోత్సవ సంబరాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది మే 5వ‌ తేదీ ఆదివారం నాడు డల్లాస్ నగరంలో గ్రాండ్ సెంటర్ అనే ఆడిటోరియంలో సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవ సంబరాలను అంబరాన్ని అంటేలా నిర్వ‌హించారు.

ఈ ఉత్సవానికి డల్లాస్ నగరంలోని ప్రముఖులు మరియు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు అతిధులుగా హాజర‌య్యారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక చైర్మన్ శ్రీ ప్రసాద్ తోటకూర గారు, డల్లాస్ లో ఇండో అమెరికన్ కౌన్సిల్ సభ్యులుగా ముఖ్యపాత్రను పోషిస్తున్న శ్రీ గోపాల్ పోనంగి గారు, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ కిషోర్ కంచర్ల గారు, శ్రీమతి శారద సింగిరెడ్డి గారు, శ్రీ ప్రకాష్ రావు గారు అతిధులగా వేదికను అలంకరించారు. అలాగే తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్‌ అవార్డు గ్రహీత చంద్రబోస్ గారు, ప్రముఖ సంగీత దర్శకులు ఆర్. పి. పట్నాయక్ గారు, టాలీవుడ్ డైరెక్ట‌ర్ వి. ఎన్‌. ఆదిత్య‌ గారి తో సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సంద‌డి చేశారు.

ఈ వార్షిక సంబరాల్లో మీనాక్షి అనిపిండి గారు తన శిష్య బృందంతో 7 సిగ్మెంట్లలో దాదాపు 30కి పైగా సంప్రదాయ సంగీత కీర్తనలను ప్రదర్శన ఇచ్చారు. 10 గంటల పాటు నిర్విరామంగా సాగిన ఈ సాంస్కృతిక గాన ప్రదర్శన ప్రేక్షకులందరినీ కుర్చీల్లో నుంచి కదలకుండా కట్టిపడేసింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాగే సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షిక సంబరాల వేదిక పై, చంద్రబోస్ గారికి “సుస్వర సాహిత్య కళానిధి” అనే బిరుదునిచ్చి సత్కరించారు.

చంద్ర‌బోస్ గారు త‌న స్వ‌గ్రామం చల్లగరిగెలో తల పెట్టిన ఆస్కార్ గ్రంధాల‌య నిర్మాణానికి, ఈ కార్య‌క్ర‌మం ద్వారా 15 వేల డాల‌ర్స్ కు పైగా విరాళం రావ‌డం మ‌రొక విశేషం. ఈ వార్షిక సంబరాల్లో ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు ఆర్. పి. పట్నాయక్ గారు త‌న మాట‌ల‌తో , పాట‌ల‌తో ప్రేక్ష‌కులంద‌రినీ అల‌రించారు. ఆయ‌న‌కు, “సుస్వర నాద‌నిధి” ,అనే బిరుదుతో మీనాక్షి అనిపిండి గారు సత్కారం చేయ‌డం జ‌రిగింది. ఇక సుస్వర మ్యూజిక్ అకాడమీ లోని విద్యార్థినీ, విద్యార్థులు వాలంటీర్లుగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని ఆధ్యంతం ర‌క్తిక‌ట్టించ‌డం మెచ్చుకోదగ్గ అంశం..
కుమారి సంహితఅనిపిండి, శ్రీమతి ప్రత్యూష తమ వ్యాఖ్యానంతో కార్యక్రమాన్ని రక్తి కట్టించారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!