Connect with us

Featured

Dhanush – Aishwarya Divorce: ధనుష్, ఐశ్వర్య.. విడాకులు తీసుకోవడానికి కారణం అదేనా.. రజనీ ప్రయత్నాలు ఫలించలేదా?

Dhanush – Aishwarya Divorce: తమిళ స్టార్ హీరో ధనుష్ ఐశ్వర్య దంపతులు సోమవారం రాత్రి ఎవరూ ఊహించని విధంగా విడాకులు తీసుకున్నట్లు ప్రకటించడంతో

Published

on

Dhanush – Aishwarya Divorce: తమిళ స్టార్ హీరో ధనుష్ ఐశ్వర్య దంపతులు సోమవారం రాత్రి ఎవరూ ఊహించని విధంగా విడాకులు తీసుకున్నట్లు ప్రకటించడంతో ఎంతోమంది అభిమానులు సినీ సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.18 సంవత్సరాల వైవాహిక జీవితంలో కలహాలు లేకుండా ఎంతో సంతోషంగా గడిపిన ఈ జంట విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏమిటి అని పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.

Dhanush - Aishwarya Divorce: ధనుష్, ఐశ్వర్య.. విడాకులు తీసుకోవడానికి కారణం అదేనా.. రజనీ ప్రయత్నాలు ఫలించలేదా?
Dhanush – Aishwarya Divorce: ధనుష్, ఐశ్వర్య.. విడాకులు తీసుకోవడానికి కారణం అదేనా.. రజనీ ప్రయత్నాలు ఫలించలేదా?

ఈ క్రమంలోనే ఇద్దరు విడిపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే… ఐశ్వర్య కేవలం దర్శకురాలిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని ఈమె ఒక పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించాలని భావించగా అందుకు ధనుష్ ఒప్పుకోలేదని సమాచారం. అదేవిధంగా రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కాలా చిత్రాన్ని ధనుష్ నిర్మించారు. ఈ సినిమా భారీ నష్టాలను ఎదుర్కొంది ఈ విషయమై వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి.

Dhanush - Aishwarya Divorce: ధనుష్, ఐశ్వర్య.. విడాకులు తీసుకోవడానికి కారణం అదేనా.. రజనీ ప్రయత్నాలు ఫలించలేదా?
Dhanush – Aishwarya Divorce: ధనుష్, ఐశ్వర్య.. విడాకులు తీసుకోవడానికి కారణం అదేనా.. రజనీ ప్రయత్నాలు ఫలించలేదా?

అదేవిధంగా ఈ మధ్యకాలంలో హీరో ధనుష్ మరొక హీరోయిన్ తో చాలా చనువుగా ఉంటున్నారనే విషయం కూడా వినపడుతుంది.ఇలా వారి మధ్యలోకి మరొక హీరోయిన్ రావడంతో ఈ విషయాన్ని జీర్ణించుకోలేని ఐశ్వర్య ధనుష్ విడాకులు ఇవ్వాలని భావించినట్లు సమాచారం.

వారి నిర్ణయానికే వదిలేసిన రజిని…

ఇలా వీరిద్దరి మధ్య గొడవలు రావడంతో రజనీకాంత్ ఆ సమస్యను పరిష్కరించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా రజనీకాంత్ ప్రయత్నాలు ఫలించకపోవడంతో రజినీకాంత్ చివరికి వారి నిర్ణయాన్ని వారికే వదిలేశారు.దీంతో వీరిద్దరు కలిసి ఉండటం కన్నా విడిపోవడమే మంచిదని భావించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని పెద్దఎత్తున ఫిలింనగర్లో ఈ వార్త చక్కర్లు కొడుతోంది.మరి వీరు విడాకులకు అసలు కారణం ఇదేనా మరేదైనా ఉందా అనే విషయం స్వయంగా ధనుష్ ఐశ్వర్య ప్రకటిస్తే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

Advertisement

Featured

Kakli: కల్కి సినిమాకు ఫస్ట్ ఛాయిస్ ప్రభాస్ కదా.. ఆ హీరో సజెస్ట్ చేస్తేనే ప్రభాస్ వరకు వచ్చిందా?

Published

on

Kakli: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి. ఈ సినిమా జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ వారు ఏకంగా 600 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

ఇక ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకోవడమే కాకుండా భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతుంది. ఇక ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ప్రభాస్ భైరవ పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే.

నిజానికి ఈ సినిమాలో ముందుగా ప్రభాస్ ను అనుకోలేదట డైరెక్టర్ అయితే ఒక స్టార్ హీరో ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతోనే ప్రభాస్ వరకు వచ్చిందని తెలుస్తుంది. ఈ సినిమా కథ మొత్తం సిద్ధం చేసుకున్న తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లి ఈ సినిమా కథను వివరించారట ఈ సినిమా కథ విన్న చిరంజీవి సినిమా చాలా అద్భుతంగా ఉంది కచ్చితంగా సక్సెస్ అవుతుందని తెలియజేశారట.

Advertisement

చిరు రిజెక్ట్ చేశారా..
ఇలా తనకు కథ చెప్పిన తర్వాత ఇందులో భైరవ పాత్రలో మీరు నటించాలని కోరుకుంటున్నాను అని చెప్పడంతో వెంటనే చిరంజీవి ఈ సినిమాలో భైరవ పాత్రలో నేను నటిస్తే ఆ పాత్రకు పూర్తిగా న్యాయం జరగదు. ఈ పాత్రకు ప్రభాస్ సరిగ్గా సరిపోతారని ఆయనే ప్రభాస్ పేరును సజెస్ట్ చేశారని తెలుస్తోంది. ఇలా చిరంజీవి కాదంటేనే కల్కి సినిమా కథ ప్రభాస్ వరకు వచ్చిందని, చిరు కారణంగానే ప్రభాస్ మరో హిట్ సినిమాని అందుకున్నారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

NTR: చిరంజీవి ఇచ్చిన అవార్డును ఆ హీరో ఇంటికి పంపిన తారక్.. ఏమైందంటే?

Published

on

NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు ఎన్టీఆర్. ఈయన బాల నటుడి గానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి చిన్న వయసులోనే హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా వరుస సినిమాలలో నటిస్తున్న తారక్ గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన యమదొంగ సినిమా ఎలాంటి సక్సెస్ అయ్యిందో మనకు తెలిసిందే .ఈ సినిమాకు గాను ఈయనకు స్టార్ మా అవార్డు అందుకున్నారు అయితే ఈ అవార్డు ప్రముఖ నటుడు చిరంజీవి నాగార్జున చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. అయితే ఈ అవార్డును తీసుకున్న తారక్ ఇంట్లో పెట్టుకోకుండా వేరే హీరోకి పంపించారని తెలుస్తోంది.

ఇలా స్టార్ హీరో చిరంజీవి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకున్నటువంటి ఈయన వేదికపై మాట్లాడుతూ తాను చిన్నప్పటినుంచి చిరంజీవి గారు నాగార్జున బాబాయ్ సినిమాలను చూస్తూ తాను పెరిగానని తెలిపారు. ఇక ఈవెంట్ జరుగుతున్న నేపథ్యంలో సీనియర్ నటుడు శోభన్ బాబు మరణించారనే వార్త తెలియడంతో తనకు వచ్చిన ఈ అవార్డు శోభన్ బాబు గారి ఇంట్లో ఉండాలని నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్ ఆ అవార్డును తన ఇంటికి పంపించారు.

Advertisement

శోభన్ బాబు ఇంటికి..
ఆ క్షణం ఎన్టీఆర్ తీసుకున్న ఆ నిర్ణయానికి చిరంజీవి సైతం ఫిదా అవ్వడమే కాకుండా ఎన్టీఆర్ పై ప్రశంశల వర్షం కురిపించారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే ఈయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Advertisement
Continue Reading

Featured

YS Sharmila: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన షర్మిల.. కారణం అదేనా?

Published

on

YS Sharmila: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కలిశారు. ఇటీవల హైదరాబాద్ లోనే ఉంటున్న ఈమె తెలంగాణ ముఖ్యమంత్రిని కలవడమే కాకుండా తన తండ్రి జయంతి వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఆమె తనకు ఆహ్వానం అందజేశారు. జులై 8వ తేదీ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి అనే సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈసారి వైయస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. ఇన్ని రోజులపాటు జగన్మోహన్ రెడ్డి షర్మిల ఎవరికి వారు వైయస్సార్ ఘాట్ వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేసి తన తండ్రికి నివాళులు అర్పించేవారు.

ఇటీవల జగన్మోహన్ రెడ్డి నుంచి షర్మిల దూరంగా వెళ్లడమే కాకుండా ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంతో ఈసారి జరగబోయే జయంతి వేడుకలను షర్మిల ఘనంగా జరిపించడమే కాకుండా కాంగ్రెస్ పెద్దలను కూడా ఆహ్వానిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి జూలై 8వ తేది విజయవాడలోని CK కన్వెన్షన్ సెంటర్ లో జరిగే రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలకు హాజరుకావాలని ఆహ్వానించారు.

Advertisement

ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు..

జులై 8వ తేదీ జరగబోయే ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ , లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ , జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఇతర AICC పెద్దలతో పాటు .. ఏపి, తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాల నాయకులు, ప్రముఖులు హాజరు కానున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!