Connect with us

Featured

కరోనాకు చెక్ పెట్టాలంటే అది ఒక్కటే మార్గం… – డైరెక్టర్ తేజ !!

Published

on

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి భయంతో జనాలు థమ ప్రాణాలను అరచేతిలో పట్టుకుని గడగడలాడుతున్నారు. ఈ నేపధ్యంలో కరోనాని నివారించే ప్రయత్నంలో భాగంగా విదేశాలు సైతం లాక్ డౌన్‌ను అమలు చేస్తున్నాయన్న సంగతి తెలిసిందే.! ప్రస్తుతం లాక్ డౌన్‌ సందర్భంగా జనాలందరూ ఇంటి దగ్గరే ఉంటూ ఒక్కొక్కరు ఒక్కోవిధంగా తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇక సెలెబ్రిటీల విషయానికొస్తే వంటింట్లో చేరి క్రొత్త క్రొత్త వంటలపై ప్రయోగాలు చేయడం మొదలు పెట్టారు. మరికొందరైతే పెయింటింగ్, డ్రాయింగ్, జిమ్ అంటూ బిజీబిజీగా గడిపేస్తున్నారు.

ఇవన్నీ ప్రక్కన పెట్టి మన టాలీవుడ్ దర్శకుడు తేజపై ఫోకస్ పెడితే అతను మాత్రం అందరి కంటే భిన్నంగా సినిమా ఫీల్డ్‌కి ఏమాత్రం సంబంధం లేని ఓ క్రొత్త కోర్స్ ని అభ్యసిస్తున్నాడు. ఈమధ్యనే ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించిన ఓ ఆన్ లైన్ కోర్స్ లో తన పేరును నమోదు చేసుకున్నాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ కోర్స్‌ని అందిస్తుంది. కరోనా వైరస్ వ్యాధిని స్టడీ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కోర్స్‌లో జాయినైనట్టు మీడియా ప్రతినిధులకు తెలిపాడు. ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా లాంటి భయంకరమైన అంటువ్యాధులు జనాలపై దాడి చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, భవిష్యత్ లో ఇలాంటి ఊహించని పరిణామాలకు మానశికంగా ఎలా సిద్దంగా ఉండాలో ఈ కోర్స్ ద్వారా తెలుసుకోబోతున్నట్టు, ఈ ప్రయత్నంలో భాగంగా ఒకవేళ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోరితే తాను వాలంటర్‌గా పనిచేయడానికి కూడా సిద్దమేనని తెలియజేశాడు.

ఈ సందర్భంగా తేజ ఇచ్చిన ఇంటర్వ్యూలో దేశంలో ప్రస్తుతం నెలకొని వున్న కరోనా పరిణామాలపై తనదైన శైలిలో స్పందించాడు. కరోనా మహమ్మారిపై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఏదైనా వున్నదున్నట్టుగా కుండబ్రద్ధలు కొట్టినట్లుగా మాట్లాడే తేజ.. కరోనా మహమ్మారి ఇంతిలాగ విజృంభించడానికి ముఖ్యంగా మన దేశ ప్రజల నిర్లక్ష్యమేనని ఆవేదన చెందాడు. ప్రజల ఆలోచనా విధానంలోనూ, వారి ప్రవర్తనలోనూ మార్పు వచ్చి తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే కరోనాని కట్టడి చేయగలమని, అలా చేయకుండా నిర్లక్ష్యంగా వుంటే రానున్న రోజుల్లో రోజుకి లక్ష పాజిటివ్ కేసులు వచ్చినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదని తేజ తెలియజేశాడు.

ఇంతవరకూ ప్రపంచవ్యాప్తంగా కరోనాకి సంబంధించిన కేసుల జాబితాలో 11వ స్థానంలో ఉన్న భారత్ ఈ 2 వారాల్లోనే 4వ స్థానంలోకి వచ్చిందని.. నేటికీ ప్రజల జీవన వైఖరిలో మార్పు రాకపోతే ఆ లెక్క కోటి దాకా వెళ్లడం ఖాయమంటూ బల్లగుద్ది చెప్పాడు తేజ. కరోనాను అరికట్టాలంటే, వైరస్ నివారణలో భాగంగా ప్రజల జీవన వైఖరిలో ఖచ్చితంగా మార్పు రావాల్సిందేనని తెలియజేశాడు. ఇక తేజ వృత్తిపరంగా ప్రస్తుతం ‘అలిమేలు మంగ వెంకట రమణ’, ‘రాక్షసరాజు రావణాసురుడు’ అనే 2 సినిమాల నిర్మాణంలో తలమునకలై వున్నాడు. మరి ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న తేజ కామెంట్స్ పై నెటిజన్లు ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisement
Continue Reading
Advertisement

Featured

YS Jagan Mohan Reddy: జగన్ ని హత్య చేయడం కోసమే దాడి.. నిందితుడికి 14 రోజులు రిమాండ్!

Published

on

YS Jagan Mohan Reddy: ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఇటీవల రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. విజయవాడలో ఈయన పట్ల గుర్తు తెలియని వ్యక్తులు రాయితో దాడి చేయగా కంటి పై భాగంలో గాయం అయి కుట్లు కూడా పడ్డాయి అయితే ఈ దానికి పాల్పడిన వారిపై పోలీసులు దర్యాప్తు చేశారు.. ఈ దర్యాప్తులో భాగంగా కొంతమంది అనుమానితులను కస్టడీలోకి తీసుకొని విచారణ చేపట్టారు.

జగన్ పై రాయి విసిరినటువంటి వారిని గుర్తించినటువంటి పోలీసులు విచారణ చేపట్టారు ఈ క్రమంలోనే సతీష్ అనే యువకుడు జగన్మోహన్ రెడ్డి పై దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. అయితే సతీశ్ ఒక్కడినే అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ప్రధాన నిందితుడితో పాటు ఇతర నిందితుల స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డ్ చేసినట్లు సమాచారం.

సతీశ్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన అంశాలను పేర్కొన్నారు. సీఎం జగన్ ను హత్య చేసేందుకే పదునైన రాయితో దాడి చేశాడన్నారు. దాడి వెనుక సీఎం జగన్ ను చంపాలనే ఉద్దేశ్యం ఉందని రిమాండ్ రిపోర్టులో సతీష్ వెల్లడించారు. ఇలా పథకం ప్రకారమే ఈయన ప్లాన్ చేసి మరి జగన్ పై హత్య ప్రయత్నం చేశారని తెలుస్తుంది.

Advertisement

పదునైన కాంక్రీట్ రాయి..

అయితే ఈయన జగన్మోహన్ రెడ్డిని హత్య చేయడానికి గల కారణాలు ఏంటి అనేది తెలియడం లేదు అయితే ఈయనే ప్లాన్ ప్రకారం ఇలా దాడి చేశారా లేక ఈయన వెనక ఎవరైనా ఉండి తనని నడిపిస్తున్నారా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు.విజయవాడ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన వేముల సతీశ్ ను అరెస్ట్ చేశాం. మధ్యవర్తుల సమక్షంలో అతని సెల్‌ఫోన్, బట్టలు స్వాధీనం చేసుకున్నాం. ఏ-1 వేముల సతీష్ కుమార్ ను ఏ2 వేముల దుర్గారావు ప్రేరేపించాడు

Advertisement
Continue Reading

Featured

Pawan Kalyan: ఈనెల 23న పవన్ కళ్యాణ్ నామినేషన్.. ముహూర్తం ఫిక్స్ చేసుకున్న జనసేనాని!

Published

on

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాలలో ఎంతో బిజీగా మారిపోయారు. ఈయన వచ్చే ఎన్నికలలో ఏ విధంగా అయినా గెలవాలన్న ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి ఒంటరిగా పోరాటం చేయకుండా తెలుగుదేశం బిజెపితో కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు.

మే 13వ తేదీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థులు పోటీ చేసే ప్రాంతాలలో మాత్రమే కాకుండా తెలుగుదేశం అభ్యర్థులు పోటీ చేసే స్థానాలలో కూడా పర్యటిస్తున్నారు. చంద్రబాబు నాయుడుతో కలిసి ఈయన రోడ్డు షోలలో పాల్గొంటున్నారు.

ఇక ఈనెల 18 నుంచి నామినేషన్స్ కూడా ప్రారంభమైన సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలోనే ఈనెల 23వ తేదీ పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. 23వ తేదీ పవన్ కళ్యాణ్ స్వయంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేయబోతున్నారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ నామినేషన్ కి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది.

Advertisement

ప్రారంభమైన నామినేషన్లు..
నామినేషన్ దాఖలు చేసిన రోజు సాయంత్రమే ఈయన ఉప్పాడలో భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. నామినేషన్ ప్రక్రియలు ప్రారంభం కావడంతో పలువురు నామినేషన్స్ వేశారు మొదటి రోజు అసెంబ్లీ సెగ్మెంట్లకు 197 నామినేషన్ల దాఖలు కాగా, పార్లమెంట్ సెగ్మెంట్లకు 42 నామినేషన్ల దాఖలయ్యాయి. అందులో వైసీపీ, ఎన్డీఏ కూటమి, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు.

Advertisement
Continue Reading

Featured

Ramcharan: రామ్ చరణ్ ఆ ఇంట్రడక్షన్ సీన్ నిజం కాదా… ఇంత పెద్ద మోసం చేశారా?

Published

on

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చినటువంటి చరణ్ తండ్రికి మించిన తనయుడు అనే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు.

ఇక రాంచరణ్ సినిమాలలో రంగస్థలం సినిమా కూడా ఓ మైలురాయిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఈయన నటన అద్భుతం అని చెప్పాలి సుకుమార్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక సాధారణ వ్యక్తి లాగా సైకిల్ తొక్కుతూ ఎంట్రీ ఇచ్చారు ఈ విషయం గురించి సుకుమార్ గారికి ఒక ప్రశ్న ఎదురైంది.

ఇలా ఒక స్టార్ హీరోని ఇంత సింపుల్గా చూపించడంతో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయం మీలో కలగలేదా అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ..కథకి అనుగుణంగా ఒక వ్యక్తి ఏదో వెతుక్కుంటూ వెళతాడు. ఆ రోజుల్లో వాహనం అంటే సైకిల్.. అందుకే సైకిల్ లో చూపించా.లాంగ్ షాట్ లో వంతెనపై సైకిల్ తొక్కుతూ కనిపించాలి. ఆ తర్వాత టాప్ యాంగిల్ లో చూపిస్తూ నెమ్మదిగా రాంచరణ్ ముఖం దగ్గరికి కెమెరా రావాలి. కాబట్టి ఫ్లైయింగ్ కెమెరా వాడాం.

Advertisement

నాలుగైదు టేకులు..
నాలుగైదు టేకులు చేసిన మంచిగా రాకపోవడంతో ఇక ఈ ఇంట్రడక్షన్ సీన్ సీజీ వర్క్ లో పూర్తి చేశాం అని సుకుమార్ చెప్పారు. అవునా అది సీజీ షాటా అని ఆశ్చర్యపోయారు. రాంచరణ్ సైకిల్ తొక్కుతున్నది మాత్రం రిఫరెన్స్ గా తీసుకుని ఆ సీన్ ని సీజీ వాళ్ళు పర్ఫెక్ట్ గా చేశారు. సినిమాలో ఇంకా కొన్ని సీజీ షాట్స్ ఉన్నాయి. కానీ ఎవరూ గుర్తు పట్టలేరు అని సుకుమార్ నవ్వేశారు. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!