అడవిలో నడవడం, ప్రకృతిని ఆస్వాదిస్తూ సరదాగా సమయం గడపాలని మీకు ఉందా? అయితే వెంటనే ఇది చదివేయండి. ఇండియా లో మొట్టమొదటి ఫారెస్ట్ హీలింగ్ సెంటర్ ను ఉత్తరాఖండ్ రాణీఖేట్ లో ఈ ఆదివారం ప్రారంభించారు. దీన్ని పురాతన భారతీయ సాంప్రదాయాల నుండి ప్రేరణ పొంది రూపొందించారు ఉత్తరాఖండ్ ఫారెస్ట్ అధికారులు.

అడవిలో నడవడం, ధ్యానం చేసుకోవడం, చేతలను కౌగిలించుకోవడం, ఆకాశాన్ని తదేకంగా చూడటం, నిశబ్దమైన వాతావరణంలో పచ్చదనాన్ని ఆస్వాదిన్చోచు. సుమారు 13 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేసి పర్యాటకులను స్వచ్చమైన ప్రకృతి వాతావరణాన్ని కోరుకునే వారిని ఆహ్వానిస్తున్నట్టు ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ సంజీవ్ చతుర్వేదీ తెలిపారు.































