Connect with us

Featured

ఆ దర్శకులిద్దరి సినిమాలలో రాళ్ళపల్లికి ఓ పాత్ర ప్రాణం పోసుకోవాల్సిందే !

Published

on

కొంతమందిని చూస్తే ఇతను నటుడా.. అనే సందేహం కలగక మానదు. కానీ అతనే మొహానికి రంగేసుకున్నా.. ఒక్కసారి పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడంటే ఆ పాత్ర కామెడి, విలన్.. ఇలా ఎటివంటి పాత్ర అయినా విజృంభనే. అలాంటి గొప్ప నటులలో ఒకరు రాళ్ళపల్లి. ఆయన పోషించిన చాలా పాత్రలకి ప్రాణం పోశారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా, రాచపల్లిలో ఆగస్టు 15 1945లో పుట్టారు. బీకామ్‌ పూర్తి చేసిన రాళ్ళపల్లికి టెన్త్‌, ఇంటర్మీడియట్‌ సర్టిఫికెట్స్‌తోనే రైల్వేలో క్లాస్‌ ఫోర్‌ జాబ్‌ అంటే ప్యూన్ ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత 1970 ప్రారంభంలో ఢిల్లీలోని ‘సాంగ్‌ అండ్‌ డ్రామా డివిజన్‌’ అనే ప్రభుత్వ సంస్థలోకి మారారు.

Advertisement

అప్పట్లో దాదాపు వెండితెర మీద వెలిగిన నటులలో ఎక్కువ శాతం నాటరంగంలో గొప్ప అనుభవం సంపాదించి వచ్చిన వారే. ఆ కోవలోనే రాళ్ళపల్లి కూడా వస్తారు. ఆయన కూడా పలు నాటకాలు వేసి గుర్తింపు తెచ్చుకొని సినిమా రంగంలో అడుగుపెట్టారు. రాళ్ళపల్లికి విపరీతంగా పేరు తెచ్చిన నాటకం కన్యాశుల్కం. ఆయన చదువుకునే రోజుల్లోనే కాలేజీలో పోటీలు నిర్వహించారు. ఇందుకోసం రాళ్ళపల్లి ‘మారని సంసారం’ అనే నాటిక ఒకటి రాశారు. దీనికి రచన, నటన రెండు విభాగాలలోను అవార్డులు
దక్కాయి.

ప్రముఖ సినీనటి భానుమతి రామకృష్ణ చేతుల మీదుగా రాళ్ళపల్లి ఆ అవార్డులు అందుకున్నారు. నాటకమంటే ప్రాణమిచ్చే రాళ్ళపల్లి, అనుకున్న సమయానికి ఎట్టి పరిస్థితుల్లోనూ రిహార్సల్‌ మొదలుపెట్టేవారు. ఆయన వేసే నాటకాలు సినిమా స్థాయిలో ఉండేవంటే నమ్మి తీరాల్సిందే. అంతేకాదు నాటకాల కోసం ఖర్చంతా ఆయనే పెట్టుకునేవారు. కొన్ని సందర్భాలలో తప్పని పరిస్థితుల్లో నాటకం కోసం అప్పులు కూడా చేశారు. అప్పుల నేపథ్యంలోనే ‘ముగింపు లేని కథ’ అనే నాటకం రాసి, దాదాపు వందకు పైగా ఆ నాటకాలను ప్రదర్శించి, వేసిన ప్రతిసారీ ‘ఉత్తమ నాటకం’ అనిపించుకునేలా రూపొందించారు.

నాటక రంగంలో అంత సుధీర్ఘ అనుభవం సంపాదించిన రాళ్ళపల్లి తన భార్య సహకారంతో సినిమాలలోకి వచ్చారని చెప్పాలి. ప్రముఖ నవల ఆధారంగా సినిమా తీస్తున్నట్లు పత్రికలో ఓ ప్రకటన చూసిన రాళ్ళపల్లి భార్య సినిమాలపై ఆయనకున్న ఆసక్తిని దృష్ఠిలో పెట్టుకొని దరఖాస్తు చేయమని సపోర్ట్ చేశారు. “చూడ్డానికి అందగాడిని కాకపోయినా నాకు నాటకాల్లో అనుభవం ఉంది. పనికొస్తే చూడండి” వినూత్నంగా అంటూ దరఖాస్తు పెట్టారు రాళ్ళపల్లి. అది చూసిన దర్శక, నిర్మాతలు ఆయనని ఇంటర్వ్యూకు పిలిచారు. సినిమాకు మాటల రచయిత రాచకొండ విశ్వనాథశాస్త్రి, పాటల రచయిత సినారె సమక్షంలో ఒక సీన్‌ కెమెరా ముందు నటించి చూపించి ‘ఊరుమ్మడి బతుకులు’ అనే సినిమాలో అవకాశం దక్కించుకున్నారు.

అయితే దీనికంటే ముందే రాళ్ళపల్లి 1973లో ‘స్త్రీ’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత 1977లో నటించిన ‘ఊరుమ్మడి బతుకులు’ పాపులారిటీ సాధించి కెరీర్‌లో వెనక్కి తిరిగి చూడలేదు. ముఖ్యంగా ఆయనలోని కమెడియన్ ని బయటకి తీసుకు వచ్చిన దర్శకులు, జంధ్యాల, వంశీ. వీరి దర్శకత్వంలో వచ్చిన దాదాపు అన్నీ సినిమాలలో రాళ్ళపల్లికి ఓ పాత్ర ప్రాణం పోసుకునేది. ఆయనను నమ్మి దర్శకులు సృష్ఠించిన పాత్రలకి నిజంగానే ప్రాణం పోయడానికి తన శాయశక్తులా తాపత్రయపడేవారు. మణిరత్నం ‘బొంబాయి’ సినిమాలో హిజ్రాగా నటించి సౌత్ సినిమా ఇండస్ట్రీల నుంచి ప్రశంసలు అందుకున్నారు.

ప్రతి సంవత్సరం ఆయన పుట్టిన రోజైన ఆగస్టు 15న కళాకారుల్లో ఒకరికి సన్మానం చేసి 50వేల రూపాయలు ఇచ్చేవారంటే కళల పట్ల, కళాకారుల పట్ల ఆయనకి ఉన్న గౌరవం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ఎన్నో అద్భుతమైన పాత్రలతో దాదాపు 850 కి పైగా చిత్రాలలో నటించిన రాళ్ళపల్లి చివరిగా నాని – మారుతి కాంబినేషన్‌లో వచ్చి సూపర్ హిట్ అయిన ‘భలే భలే మగాడివోయ్’ అనే చిత్రంలో నటించారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Star Heroin: స్టార్ హీరోతో ప్రేమ,పెళ్లి విడాకులు..12 మందితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్… ఎవరంటే?

Published

on

Star Heroin: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి మనీషా కొయిరాల ఒకరు. ఈమె సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ సినిమాలలో నటించి ఒకానొక సమయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపారు. ఇక ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో తన వ్యక్తిగత విషయాలలో కూడా వార్తలలో నిలిచారు.

Advertisement

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు పలువురు హీరోలతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఒక స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడినప్పటికీ ఆయనని పెళ్లి చేసుకోలేదు. ఇక ఈమె సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రెండేళ్లకే తనతో విడాకులు తీసుకొని విడిపోయి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన మనీషా కోయిరాల మందుకు అలవాటు పడ్డారు.పెళ్లికి ముందే మనీషా కోయిరాలా ఏకంగా 12 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. వివేక్ ముశ్రన్‌, నానా పటేకర్‌, DJ హుస్సేన్‌, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్‌ వంటి ప్రముఖులతో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

12 మందితో డేటింగ్..
ఇలా తరచూ డేటింగ్ ల ద్వారా కూడా ఈమె వార్తల్లో నిలిచారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడిపారు. పలువురు దర్శక నిర్మాతలు సైతం ఈమె డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఇలా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపిన ఈమె మధ్యలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: విష్ణు ప్రియకు షాక్ ఇచ్చిన నిఖిల్… కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్.. అసలు ఆట ఆరంభం!

Published

on

Bigg Boss 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రారంభం అయ్యి 5 రోజులు పూర్తయింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అయితే హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ మూడు గ్రూపులుగా విడదీశారు. అయితే ఈ గ్రూపులోకి ఎవరెవరు సభ్యులను తీసుకోవాలనేది చీఫ్ ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ విష్ణు ప్రియ కచ్చితంగా తనని నిఖిల్ తన గ్రూపులోకి తీసుకుంటారని ఆమె భావించింది. కానీ నిఖిల్ మాత్రం ఆమెకు షాక్ ఇచ్చారు. దీంతో విష్ణు ప్రియను నైనిక తన టీమ్ లోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం గురించి నిఖిల్ విష్ణుప్రియ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీరిద్దరికి ముందే మంచి పరిచయమున్న నేపథ్యంలో తప్పకుండా నిఖిల్ తన టీమ్ లోకి తీసుకుంటారని విష్ణు ప్రియ భావించింది కానీ అది జరగలేదు.

ఇలా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కారణంగా విష్ణు ప్రియ సరదాగా నిఖిల్ ను ఓ ఆట ఆడుకుంది. దీంతో నిఖిల్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఇప్పటివరకు ఎంతో సరదాగా గడిపిన కంటెస్టెంట్లను మూడు గ్రూపులుగా విడదీయడంతో అసలైన ఆట మొదలైంది.

టాస్కులపై ఫోకస్..
కంటెస్టెంట్లను టీమ్స్ గా విడదీసి బిగ్ బాస్ టాస్కులను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇచ్చిన మొదటి టాస్కోలో భాగంగా ఇప్పటివరకు హౌస్ లో సైలెంట్ గా కూర్చున్న పృథ్విరాజ్ తన ఆట తీరును కనబరుస్తూ యష్మీ టీమ్ ను గెలిపించారు. దీంతో ముందు ముందు ఏ ఏ కంటెస్టెంట్ ఎలా తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారు బ్రో…. ఆ కంటెస్టెంట్లను ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఏడు సీజన్లను పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా గత ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. మొదట 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. మిగిలిన వారిని ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

Advertisement

ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ పోట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మిగిలిన వారు మాత్రం అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నా సందేహాలు వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతో యాక్టివ్ గా వెళ్లిన కంటెస్టెంట్లు లోపల మాత్రం అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోతున్నారనే చెప్పాలి.

ముఖ్యంగా హీరో ఆదిత్య ఓం అయితే హౌస్ లో ఉన్నాడా లేదా అన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది. ఈయన ఉంటే ఒంటరిగా ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు. పెద్దగా ఫేమస్ అయిన కంటెంట్ మాత్రం ఈయన ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలువురు ట్రోలర్స్ బ్రో అసలు ఎందుకొచ్చావు బ్రో బిగ్ బాస్ హౌస్ కి అంటూ భారీగా విమర్శలు చేస్తున్నారు.

ఈయనతో పాటు బెజవాడ బేబక్క కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈమె హౌస్ లో మాత్రం ఎక్కువగా కిచెన్ లోనే ఉంటుంది. కానీ సరైన కంటెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. పృధ్విరాజ్, అభయ్ నవీన్ వంటి వారందరూ కూడా హౌస్ లో డల్ గా కనిపిస్తున్న తరుణంలో పలువురు మీరంతా హౌస్ లోకి ఎందుకు వచ్చారో ఏమో అంటూ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అలాగే మరి కొంతమందిని బాగా హైలైట్ చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఎలిమినేషన్ ఉంటుందా…
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా బెజవాడ బేబక్క, విష్ణు ప్రియ, శేఖర్ భాష, నాగ మణికంఠ సోనియా ఆకుల ప్రేరణ వంటి వారు నామినేషన్ లో ఉన్నారు. అయితే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!