Connect with us

General News

Tilak Varma: ఐపీఎల్ లో వచ్చిన డబ్బులతో తిలక్ వర్మ చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా?

Tilak Varma: ఐపీఎల్ 2022 ముంబై ఇండియన్స్ ప్రదర్శించిన ఆట తీరు అందరికీ తెలిసిందే. ఈ ఐపీఎల్ లో భాగంగా ముంబై ఇండియన్స్ ఆటతీరుతో ఎంతోమంది

Published

on

Tilak Varma: ఐపీఎల్ 2022 ముంబై ఇండియన్స్ ప్రదర్శించిన ఆట తీరు అందరికీ తెలిసిందే. ఈ ఐపీఎల్ లో భాగంగా ముంబై ఇండియన్స్ ఆటతీరుతో ఎంతోమంది క్రికెట్ అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేశారు. ఐపీఎల్ లో భాగంగా ముంబై ఇండియన్స్ కేవలం 4 విజయాలు అందుకోగా 10 ఓటమి చవిచూసింది. ఆట తీరులో ముంబై ఇండియన్స్ విఫలమైన ఇందులో ఒకరిద్దరు ఆటతీరు ప్రేక్షకులకు కాస్త ఉత్సాహ పరిచిందని చెప్పాలి. అలాంటి వారిలో తిలక్ విక్రమ్ ఒకరు.

Tilak Varma: ఐపీఎల్ లో వచ్చిన డబ్బులతో తిలక్ వర్మ చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా?
Tilak Varma: ఐపీఎల్ లో వచ్చిన డబ్బులతో తిలక్ వర్మ చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా?

తిలక్ విక్రమ్ 2022 ఐపీఎల్ లో భాగంగా ముంబై ఇండియన్స్ వేలంలో ఇతనిని ఏకంగా రూ.1.70 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.ముంబై ఇండియన్ టీం లో ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నప్పటికీ వారి కన్నా ఎంతో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. తిలక్ ఏకంగా 14 మ్యాచ్లలో 397 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి.

Tilak Varma: ఐపీఎల్ లో వచ్చిన డబ్బులతో తిలక్ వర్మ చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా?
Tilak Varma: ఐపీఎల్ లో వచ్చిన డబ్బులతో తిలక్ వర్మ చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా?

ఈ విధంగా కష్టాల్లో ఉన్న జట్టును ముందుండి నడిపించిన తిలక్ వర్మ ఐపీఎల్ లో భాగంగా వచ్చిన డబ్బులతో అతను చేసిన పని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.తాను ఐపీఎల్లో గెలుచుకున్న డబ్బులు మొత్తం తన తండ్రికి ఇచ్చానని ఈ సందర్భంగా తిలక్ వెల్లడించారు. అండర్ 16 క్రికెట్ఆడుతున్న సమయంలో తాను ఎన్నో కష్టాలు పడ్డానని ఉదయం 6 గంటలకు గ్రౌండ్లోకి వెళితే సాయంత్రం ఎప్పుడు ఇంటికి వెళ్ళేవారని తెలిపారు.

క్రికెట్ కోసం తన జీవితంలో ఎన్నో ముఖ్యమైన వాటిని కూడా వదులుకున్నానని, క్రికెట్ ప్రాణంగా భావించి ప్రతి రోజూ గ్రౌండ్ కు వెళ్లి ప్రాక్టీస్ చేసేవాణ్ణి తెలిపారు. ఈ కష్టమే నేడు అతనికి మంచి ప్రతిఫలాన్ని అందించింది. ఇకపోతే ప్రతి ఒక్క మనిషి డబ్బుకు దాసోహం అవ్వడం సర్వసాధారణం.అలాంటి డబ్బుకు తాను దాసోహం కాకూడదని ఐపీఎల్లో గెలుచుకున్న డబ్బులు మొత్తం తన తండ్రి చేతిలో పెట్టి ఆ డబ్బును తనకు దూరంగా ఉంచమని చెప్పారట.

Advertisement

కష్టం విలువ తెలిసిన వ్యక్తి …

ఇలా ఒక ఎలక్ట్రీషియన్ కొడుకుగా తిలక్ క్రికెట్ రంగంలోకి అడుగుపెట్టి తన కష్టంతో కృషితో ఇంత మంచి క్రికెటర్ గా పేరు సంపాదించుకున్నారు. అదేవిధంగా చిన్నప్పటినుంచి డబ్బు విలువ తెలిసిన వ్యక్తిగా పెరగడంతో డబ్బును వృధాగా ఖర్చు చేయకుండా పొదుపుగా వాడుకుంటున్నారు.ఇక ఐపీఎల్ లో వచ్చిన డబ్బులు మొత్తం తన తండ్రి చేతిలో పెట్టారని తెలియడంతో ప్రస్తుత కాలంలో ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా అంటూ ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. కష్టం విలువ తెలిసిన వాడు తిలక్ వర్మ అంటూ పెద్దఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

General News

ఏపీలో ఆ న్యూస్ ఛానల్ ప్రసారానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Published

on

ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అతిపెద్ద బిజినెస్ లలో సెటప్ బాక్స్ బిజినెస్ కూడా ఒకటి ఏపీలో సుమారు 65 లక్షల కుటుంబాలు ఏపీ ఫైబర్ సెటప్ బాక్స్ ని ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన రాజకీయాల కారణంగా జూన్ 6వ తేదీ నుంచి కొన్ని న్యూస్ చానల్స్ ప్రసారం ఆగిపోయాయి.

జూన్ ఆరవ తేదీ నుంచి సాక్షి టీవీతో పాటు ఎన్ టీవీ, టీవీ9 వంటికి కొన్ని న్యూస్ చానల్స్ ప్రసారాలు ఆగిపోయాయి. ఇలా న్యూస్ ఛానల్ లో ప్రసారం నిలిపివేయడంతో ఇది చట్టపరంగా విరుద్ధమని తిరిగి ప్రసారాలను పునరుద్ధరించాలని 15 మంది మల్టీ సిస్టమ్ ఆపరేటర్‌లను ఢిల్లీ హైకోర్టు ఆదేశించడాన్ని న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రశంసించింది.న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రకటన విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్లో చట్ట విరుద్ధంగా కొన్ని న్యూస్ ఛానల్ లను నిలిపివేయడం జరిగింది. ఇలా నిలిపివేయటాన్ని న్యాయస్థానం పూర్తిగా ఖండించింది. కేవలం రాజకీయ న్యాయకత్వం పరంగా మార్పులు రావడంతోనే కేబుల్ ఆపరేటర్ల పై ఈ న్యూస్ ఛానల్ ను నిలిపివేయాలని ఒత్తిడి తీసుకురావడం తగదని చెప్పారు.

Advertisement

ఇలా సుమారు 62 లక్షల కుటుంబాలకు ఈ న్యూస్ ఛానల్ ప్రసారం నిలిపివేయటం చట్టపరంగా విరుద్ధమని, ఈ విధంగా ఈ న్యూస్ ఛానల్ ను నిలిపివేయటం అనేది ప్రేక్షకుల సమాచార హక్కుని నిరాకరించే ప్రయత్నం జరగటం దురదృష్టకరమైన తెలిపారు. ఈ క్రమంలోనే నిలిపివేసిన ఈ చానల్లను తిరిగి పునరుద్ధరించాలని హైకోర్టు తీర్పును వెల్లడించింది.

Advertisement
Continue Reading

Featured

Ramoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు అస్తమయం!

Published

on

Ramoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈయన గత రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నేడు తెల్లవారుజామున 4:50 నిమిషాలకు కన్నుమూశారు.

శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఈయనని హైదరాబాద్లోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈయన పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అయితే ఈయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.

ఒక రామోజీరావు మరణ వార్త తెలియడంతో సినీ పరిశ్రమ అటు మీడియా రంగం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. మీడియా రంగానికి ఎన్నో సేవలు చేసిన రామోజీరావు మరణ వార్త తెలిసి ప్రముఖ రాజకీయ నాయకులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈయన మరణ వార్త తెలియడంతో తెలుగుదేశం అధినేతలు మరణం వార్తపై సంతాపం ప్రకటిస్తున్నారు.

Advertisement

అనారోగ్యంతో కన్నుమూత..

రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య ఈయన రామోజీ గ్రూప్ సంస్థలను స్థాపించి ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇలా పత్రిక రంగానికి ఎన్నో సేవలు చేస్తున్నటువంటి ఈయన ఎన్నో అవార్డులను పురస్కారాలను కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఈయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీ లోని తన నివాసానికి తరలించారు కూడా స్పందిస్తున్నారు.

Advertisement

Continue Reading

Featured

బరితెగించిన సైబర్ నేరగాళ్లు.. ఏకంగా డీజీపీ ఫోటో వాడేశారు

Published

on

సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అదుపు లేకుండా పోతుంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. అడ్డదారుల తొక్కుతూనే ఉన్నారు. ఏకంగా తెలంగాణ డీజీపీ పేరుతో సైబర్‌ క్రైమ్‌ కు దిగారు. తెలంగాణ డీజీపీ వాట్సాప్ ఫోటోతో కొందరు కేటుగాళ్లు సైబర్ ఫ్రాడ్‌కు పాల్పడుతున్నారు. డీజీపీ ఫోటో పెట్టుకొని ఓ అగంతుకుడు ఓ వ్యాపారవేత్త కుమార్తెకు వాట్సాప్ కాల్ చేశాడు. డీపీ తెలంగాణ డీజీపీ రవి గుప్తా ఫోటో ఉండటంతో ఆమె అగంతుకుడితో మాట్లాడింది. డ్రగ్స్ కేసు ఆమెను అరెస్ట్ చేస్తున్నామని బెదిరించాడు.

కేసు నుండి తప్పించేందుకు 50 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకపోతే కేసు నుంచి ఎవరూ తప్పించలేరని బెదిరించాడు. అయితే.. ఆయన మాట్లాడిన తీరును అనుమానించి ఆ యువతి పోలీసులకు తన తండ్రికి చెప్పింది. ఆ వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. +92 కోడ్ తో వాట్సాప్ కాల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇది పాకిస్తాన్ కోడ్ అని సైబర్ పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా సైబర్ నేరగాళ్లు ఏ మాత్రం తగ్గడం లేదు. సులభంగా డబ్బు సంపాదించడం కోసం అడ్డుదారులు తొక్కుతూనే ఉన్నారు. దాని కోసం సమాజంలో పెద్ద వాళ్ల పేర్లు వాడుతున్నారు. ఒక్కోసారి పెద్దవారి సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నారు. గతంలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ కూడా హ్యాక్ చేశారు.

Advertisement

Continue Reading
Advertisement

Trending

Don`t copy text!