Nayanathara -Vignesh Shivan: పిల్లలతో కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకున్న నయన్ దంపతులు.. అభిమానులకు స్పెషల్ విసేష్?

Nayanathara -Vignesh Shivan: ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచినటువంటి నయనతార విగ్నేష్ దంపతులు గురించి అందరికీ తెలిసిందే.పెళ్లయిన నాలుగు నెలలకే కవల పిల్లలకు జన్మనివ్వడంతో పెద్ద ఎత్తున ఈ విషయం విభాగంగా మారింది. ఈ క్రమంలోనే సరోగసికి సంబంధించిన అన్ని వివరాలను ప్రభుత్వానికి సమర్పించడంతో ఈ వివాదం కాస్త సద్దుమణిగింది.

ఇలా కవల పిల్లలకు జన్మనిచ్చిన నయనతార దంపతులు ఎన్నో వివాదాలు ఎదుర్కొన్న అనంతరం మొదటిసారిగా తన పిల్లలతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు.ఈ క్రమంలోనే నయనతార దంపతులు ఇద్దరు వారి పిల్లలను ఎత్తుకొని ఎక్కడ తన పిల్లల మొహాలు కనపడకుండా జాగ్రత్త పడుతూ సాంప్రదాయ దుస్తులలో ఈ పండుగను జరుపుకున్నట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే పిల్లలతో కలిసి వీరు అభిమానులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా విగ్నేష్ శివన్ ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక వీడియోని షేర్ చేస్తూ.. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ప్రతి సందర్భంలోనూ అందరూ సంతోషంగా ఉండాలి జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా వాటిపై పోరాడండి.

Nayanathara -Vignesh Shivan: ప్రేమలో విశ్వాసం అవసరం…

ప్రేమ జీవితంలో ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.. ప్రేమలో విశ్వాసం,మంచితనం ఎల్లప్పుడూ ఉండాలంటూ ఈ సందర్భంగా విగ్నేష్ నయనతార తన పిల్లలతో కలిసి దిగినటువంటి వీడియోనిషేర్ చేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జూన్ 9వ తేదీ వివాహం చేసుకున్న ఈ దంపతులు అక్టోబర్ 9వ తేదీ కవల పిల్లలకు జన్మనిచ్చారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.