Featured
Tammareddy Bharadwaj: కృష్ణంరాజు గారు అడిగిన ఆపని చేయలేకపోయాను.. నాకు మాట్లాడటానికి కూడా సిగ్గుగా ఉంది: తమ్మారెడ్డి భరద్వాజ్
![](https://telugudesk.net/wp-content/litespeed/avatar/48f246d9b01e880e5843b8d38f9199e4.jpg?ver=1719134034)
Published
2 years agoon
By
lakshanaTammareddy Bharadwaj: తెలుగు వెండితెర రారాజుగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు కృష్ణంరాజు ఆదివారం మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఆదివారం ఈయన మరణించడంతో తెలుగు సినీ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే మంగళవారం ఈయన సంస్కరణ సభను నిర్వహించారు.
ఫిల్మినగర్ కల్చరల్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సంస్కరణ సభలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.ఈ క్రమంలోనే ఈ సంస్కరణ సభలో పాల్గొన్నటువంటి తమ్మారెడ్డి భరద్వాజ్ కృష్ణంరాజు గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇక తాను నిర్మాతగా కృష్ణంరాజు హీరోగా ఫస్ట్ సినిమా చేశానని అయితే ఈ సినిమాకు మా అన్నయ్య దర్శకుడు అంటూ తమ్మారెడ్డి తెలియచేశారు.
ఈ సినిమాలో మా అన్నయ్య ఏకంగా నాలుగు పాటలు పెడతానన్నారు అయితే నాలుగు పాటలు పెడితే ఎవరు చూస్తారు అంటూ తాను అడ్డుపడ్డానని ఇదే విషయాన్ని కృష్ణంరాజు దగ్గరికి వెళ్లి మా అన్నయ్య నాలుగు పాటలు పెడతానన్నారు అసలు ఎవరు చూస్తారు ఈ పాటలు అని అతనితో చెప్పాను. ఆ స్థానంలో కృష్ణంరాజు కాకుండా వేరే ఏ హీరో ఉన్న లాగిపెట్టి నన్ను కొట్టేవారు. ఆయన మాత్రం ఓ చిన్న నవ్వు నవ్వి నేను పనికిరానా? అంటూ మా అన్నయ్యని ఒప్పించారు. ఆయన సినిమాకు ఏం కావాలో అంతే చేస్తారని తమ్మారెడ్డి పేర్కొన్నారు.
![Tammareddy Bharadwaj: మీ ఎమ్మెల్యేలు చర్చకు సిద్ధమా..? ఎవరు ఏం దోచుకుంటున్నారో తేల్చుకుందాం రండి..!](http://telugudesk.net/wp-content/uploads/2022/01/thamma-2.jpg)
Tammareddy Bharadwaj:ఆయన ఇష్టపడిన ఫ్లాట్ ఇవ్వలేకపోయాను…
ఈ సంఘటన తర్వాత దాదాపు ఒక మూడు సంవత్సరాల పాటు ఆయన ఫోన్ ఎత్తాలన్న భయం వేసేదని తమ్మారెడ్డి పేర్కొన్నారు.ఇకపోతే మూడు సంవత్సరాల క్రితం కృష్ణంరాజు గారు తన వద్దకు వచ్చి మూవీ టవర్స్ లో తనకు ఒక ఫ్లాట్ కావాలని అడిగారు.అయితే తనకు మార్కెట్ రేట్ కావాలని చెప్పగా మార్కెట్ రేట్ ఎంత ఉంటే అంత ఇస్తానని కృష్ణంరాజు గారు చెప్పారు. అయితే ఆయనకు చెప్పినట్టుగా నేను ఆ ఫ్లాట్ ఇవ్వలేకపోయానని ఈ విషయం గురించి మాట్లాడాలన్నా చాలా సిగ్గుగా ఉందంటూ ఈ సందర్భంగా గతంలో జరిగిన విషయాన్ని తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
You may like
Mahashivaratri: మహాశివరాత్రి స్పెషల్ ఈ పాటలు తప్పకుండా వినాల్సిందే!
Kalyan Dileep: పవన్ పై సెటైర్లు వేసిన తమ్మారెడ్డి… దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన జనసేన నేత కళ్యాణ్ దిలీప్!
Tammareddy Bharadwaj: హీరోలు కథలో వేలు పెట్టడం మానేయాలి.. విశ్వక్ తీరుపై తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్!
Tammareddy Bharadwaj: బాలయ్య సినిమాలు అమెరికాలో ఆడేవి కాదు.. తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్ !
Tammareddy Bharadwaj: రాముడి గెటప్ మార్చేయడం విచిత్రంగా ఉంది.. ఆది పురుష్ టీజర్ పై తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్!
Actress Jayachitra: ఆ చిన్న పొరపాటు వల్ల బాహుబలి సినిమా అవకాశాన్ని కోల్పోయాను.. సీనియర్ నటి జయ చిత్ర కామెంట్స్ వైరల్!
Featured
Ap: పీవీకి ఎన్టీఆర్ కు లేని సంస్కరణ సభ రామోజీరావుకు ఎందుకు.. ఇది కులాభిమానమేనా?
![](https://telugudesk.net/wp-content/litespeed/avatar/48f246d9b01e880e5843b8d38f9199e4.jpg?ver=1719134034)
Published
19 seconds agoon
29 June 2024By
lakshanaAp: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో పత్రికా అధినేత రామోజీరావుకు సంస్కరణ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభను నిర్వహించడం కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు రామోజీరావుకు సంస్కరణ సభ ఏర్పాటు చేయడంతో వైఎస్ఆర్సిపి నేత హైకోర్టు న్యాయమూర్తి నారపరెడ్డి రాజారెడ్డి ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధానమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చనిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధమైనటువంటి సంస్కరణ సభలు నిర్వహించలేదు కానీ పత్రికా రంగం అధినేత రామోజీరావుకు ఎందుకు ప్రభుత్వం తరఫున సంస్కరణ సభ నిర్వహించారని ప్రశ్నించారు. ఈయనకు ఏ అర్హత ఉందని ప్రభుత్వం తరఫున కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఈ సభను నిర్వహించారని ఆయన ప్రశ్నించారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చనిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు అప్పుడు ఎందుకు ఎన్టీఆర్ సంస్కరణ సభ నిర్వహించలేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ను గద్దె దింపి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడానికి రామోజీరావు ఎంతగానో దోహదం చేశారు కనుక ఈ సంస్కరణ సభ నిర్వహించారా?
విచ్చలవిడిగా ప్రజాధనం ఖర్చు..
వైఎస్ జగన్పై ఈనాడు పత్రికలో అనేక అబద్ధాలు వండి వార్చి ప్రజలను ఏమార్చిన రామోజీరావు రుణం తీర్చుకునేందుకే చంద్రబాబు ప్రభుత్వం సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారా అంటూ ఈయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక చంద్రబాబు నాయుడుకు రామోజీరావు రైట్ హ్యాండ్ లాంటి వ్యక్తి అని చెప్పాలి. ఇక ఈయన మరణంతో ప్రజల సొమ్ముతో ఇలా సంస్కరణ సభలు చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Featured
Pawan Kalyan: రామోజీరావు ఆ మాట విన్న తర్వాతే మరణించారు: పవన్ కళ్యాణ్
![](https://telugudesk.net/wp-content/litespeed/avatar/48f246d9b01e880e5843b8d38f9199e4.jpg?ver=1719134034)
Published
3 mins agoon
29 June 2024By
lakshanaPawan Kalyan: రామోజీరావు పరిచయం అవసరం లేని పేరు. రామోజీ గ్రూప్ సంస్థల అధినేతగా ఎన్నో వ్యాపారాలను ప్రారంభించి ఎంతో మంచి విజయం సాధించిన ఈయన ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన సంగతి తెలిసిందే. ఈ విధంగా రామోజీరావు మరణించడంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో రామోజీరావు సంస్కరణ సభను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ అలాగే ఇతర రాజకీయ నాయకులు పలువురు సినీ ప్రముఖులతో పాటు రామోజీరావు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తాను రామోజీరావుని కలిసినప్పుడు నాకు ఆయన ఎన్నో అద్భుతమైన విషయాలను తెలియజేశారు.. ఏం చేస్తావో.. ఏం నమ్ముతావో త్రికరణ శుద్దిగా చేయి అని నాకు రామోజీరావు సూచించారని పవన్ వెల్లడించారు. జర్నలిస్టు విలువలను కాపాడిన రామోజీరావు పత్రికాధిపతిగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని, ఆయన కుటుంబ సభ్యులను బెదిరించినా.. ఎక్కడా వెనక్కి తగ్గలేదని పేర్కొన్నారు.
రామోజీ విగ్రహం ఏర్పాటు చేయాలి..
ఇలా నిలబడటానికి కూడా చాలా ధైర్యం కావాలని పవన్ తెలిపారు. ఇక ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నటువంటి తరుణంలో ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది అయితే ఈ శుభవార్తను ఆయన విన్నారా లేదా అనే విషయాన్ని నేను కనుక్కున్నాను అయితే కూటమి అధికారంలోకి వచ్చిందనే విషయం ఆయన విన్న తర్వాతనే మరణించారు అంటూ పవన్ తెలిపారు. ఇలాంటి ఓ మహోన్నతమైన వ్యక్తి విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా పవన్ కోరారు.
Featured
YS Jagan: జగన్ ప్రజలను మోసం చేయలేనని చెప్పారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత!
![](https://telugudesk.net/wp-content/litespeed/avatar/48f246d9b01e880e5843b8d38f9199e4.jpg?ver=1719134034)
Published
5 mins agoon
29 June 2024By
lakshanaYS Jagan: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈయన పోలవరం గురించి ఎన్నో విషయాలను వెల్లడిస్తున్నారు తమ హయాంలోని 72% పోలవరం పనులు పూర్తి అయ్యాయని కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో నిధులన్ని దారి మళ్ళించారంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు అయితే ఈయన వ్యాఖ్యలపై వైసీపీ ఘాటుగా స్పందించారు.
గతంలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదం మల్లె పోలవరం పూర్తి కాలేకపోయిందని చెప్పారు నాణ్యత లేకుండా డయాఫ్రమ్ నిర్మించడంతో డ్యాం పూర్తిగా డామేజ్ ఆయన నేపథ్యంలోనే పోలవరం పూర్తి కాలేకపోయిందని తెలియజేస్తున్నారు. ఇక ఇటీవల పోలవరం పై చంద్రబాబు నాయుడు శ్వేత పత్రం కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇలా పోలవరం విషయంలో నువ్వా నేనా అంటూ రెండు పార్టీలు మధ్య మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
బిజెపి నేత అలపాటి లక్ష్మీనారాయణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. జగన్ పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ..పోలవరం విషయంలో డ్యామేజ్ ని కప్పి పుచ్ఛి పనులు కొనసాగిస్తే ప్రజలు ఎప్పటికీ క్షమించరని, ప్లాన్ మార్చమని చెప్పిన జగన్ లాంటి సీఎం ఎక్కడా ఉండరని లక్ష్మీనారాయణ తెలిపారు.
ప్రజలను మోసం చేయలేను..
పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు హయామంలో జరిగిన నిర్మాణ పనులలో డ్యామేజ్ కారణంగా వాటిని కప్పి పుచ్చి ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తే అది ప్రజలకు పెద్ద ఎత్తున ప్రమాదకరమని ఈ విషయంలో ప్రజలను మోసం చేయలేనని చెప్పిన వ్యక్తి జగన్ అంటూ ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/babu-80x80.jpg?v=1719641044)
Ap: పీవీకి ఎన్టీఆర్ కు లేని సంస్కరణ సభ రామోజీరావుకు ఎందుకు.. ఇది కులాభిమానమేనా?
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/Pawan-Kalyan-2-80x80.jpg?v=1718069386)
Pawan Kalyan: రామోజీరావు ఆ మాట విన్న తర్వాతే మరణించారు: పవన్ కళ్యాణ్
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/ys-jagan-1-80x80.webp)
YS Jagan: జగన్ ప్రజలను మోసం చేయలేనని చెప్పారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత!
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/ap-3-80x80.webp)
AP: మహిళలకు గుడ్ న్యూస్…జులై నుంచి ఏపీలో ఉచిత బస్సు సౌకర్యం!
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/anantambani-radhikamarchantweddingcard-1719481515-80x80.jpg?v=1719559577)
Wedding Card: వామ్మో అనంత్ అంబానీ వెడ్డింగ్ కార్డు ధర అన్ని లక్షలా.. కార్డ్ స్పెషల్ ఏంటంటే?
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/nallari-kirankumarireddy-80x80.png?v=1717917965)
Nallari Kiran Kumar Reddy : ఏపీలో దురదృష్టవంతుడంటే ఆయనే.. అంత సునామీలోనూ ఓటమి..
![](https://telugudesk.net/wp-content/uploads/2024/05/pallavi-prashanth-80x80.jpg?v=1717061451)
Pallavi Prashanth: జల్సాలకు అలవాటు పడిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్… మాట తప్పినట్లేగా?
![](https://telugudesk.net/wp-content/uploads/2024/05/balakrishna-80x80.webp)
Balakrishna: స్టేజ్ పైన హీరోయిన్ ను తోసేసిన బాలయ్య.. ఘాటుగా స్పందించిన వైసీపీ పార్టీ?
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/Ramoji_Rao-80x80.jpg?v=1717817310)
Ramoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు అస్తమయం!
![](https://telugudesk.net/wp-content/uploads/2022/12/aadi-reddy.jpg..jpg?v=1671517810)
Aadi Reddy: బిగ్ బాస్ ఆదిరెడ్డి యూట్యూబ్ నెల సంపాదన ఎంతో తెలుసా… సాఫ్ట్ వేర్స్ కూడా వేస్టే!
Trending
- Featured3 weeks ago
Nallari Kiran Kumar Reddy : ఏపీలో దురదృష్టవంతుడంటే ఆయనే.. అంత సునామీలోనూ ఓటమి..
- Featured4 weeks ago
Pallavi Prashanth: జల్సాలకు అలవాటు పడిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్… మాట తప్పినట్లేగా?
- Featured4 weeks ago
Balakrishna: స్టేజ్ పైన హీరోయిన్ ను తోసేసిన బాలయ్య.. ఘాటుగా స్పందించిన వైసీపీ పార్టీ?
- Featured3 weeks ago
Ramoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు అస్తమయం!
- Featured4 weeks ago
Aadi Reddy: బిగ్ బాస్ ఆదిరెడ్డి యూట్యూబ్ నెల సంపాదన ఎంతో తెలుసా… సాఫ్ట్ వేర్స్ కూడా వేస్టే!
- Featured3 weeks ago
Modi 3.0 : ఏపీకి ఐదు కేంద్ర మంత్రి పదవులు.. ఎవరెవరికంటే..
- Featured4 weeks ago
AP Election Results : తొలి ఫలితం నగరి నుంచే.. మొదట తేలేది రోజా జాతకమే..!
- Featured3 weeks ago
YS Jagan : పడి లేచిన కెరటమవుతారా? పత్తా లేకుండా పోతారా?