Varalakshmi : అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు వంటివి వింటూనే ఉంటాము. రోజూ ఏదో ఒక చోట ఇలాంటి సంఘటనలు ఇంకా పునరావృతం అవుతూనే ఉన్నాయి. అత్తింటి ముందు ధర్నాలు పోలీస్ కేసులు ఇవన్నీ కూడా రోజూ చూస్తున్నవే, వీటిలో ఎంతమందికి న్యాయం జరుగుతోందో కుడా తెలియదు. అమ్మాయిలు కూడా అబ్బాయిలతో పోటి పడుతున్నారు ఈ రోజుల్లో, ఇంకా ఇలా కట్నాలు కానుకల్తో పెళ్లిళ్లు చేస్తున్న అమ్మాయిల తల్లిదండ్రులను తప్పుబట్టాలో లేకపోతే కొడుకును బేరానికి పెట్టే తల్లిదండ్రులను తప్పుబాట్టాలో తెలియదు. ఇక పోతే ఇలాంటి ఒక ఘటన ఇప్పుడు హైదరాబాద్ లో ఒకటి వెలుగులోకి వచ్చింది. సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన వ్యక్తి మహిళను అదనపు కట్నం కోసం వేదిస్తూ ఉన్నారని ధర్నాకు దిగింది.
సునీత కు ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేసింది…
అరవింద్ అనే వ్యక్తి వరలక్ష్మి అనే అమ్మాయి ని పెళ్లి చేసుకుని తొమ్మిది నెలలుగా వేదిస్తున్నాడు. అదనపు కట్నం కోసం టార్చర్ చేస్తున్నాడు. ఇక అత్త, మామ ఆడ పడుచు కూడా వేదిస్తూ ఇంట్లోనే బందించారు అంటూ బాధిత మహిళ మాట్లాడారు. తన భర్త మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ సునీత, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ దగ్గర కీ బోర్డు ప్లేయర్ గా పనిచేస్తున్నాడు. ఎమ్ టెక్ చదివిన వరలక్ష్మి ని తల్లిదండ్రులు ఇండస్ట్రీకి సంబంధిచిన వ్యక్తి నెలకు ఆరు లక్షలు జీతం అని అరవింద్ కి ఇచ్చి పెళ్లి చేసారు. పెళ్లి సమయంలో యాభై తులాల బంగారం, యాభై లక్షల కట్నం ఇచ్చారు. అదంతా అత్త దగ్గరే పెట్టుకుని తనను అదనపు కట్నం కోసం వేదిస్తున్నారంటూ బాధిత మహిళ ఆరోపించింది. ఇక సింగిర్ సునీత ఫోన్ నెంబర్ తీసుకుని అరవింద్ గురించి చెప్పి న్యాయం చేయని అడిగితే ఇలా ఫోన్ చేయొద్దు, నా దాకా వస్తే చూస్తా ఇలాంటి విషయాల కోసం నాకు ఫోన్ చేయొద్దని ఫోన్ కట్ చేసింది అంటూ వరలక్ష్మి ఆరోపించింది.
Advertisement
ఇక సింగర్ సునీత ఆ రికార్డింగ్ ను అరవింద్ కి పంపినట్లు అరవింద్ అందరి దగ్గర చెప్పుకుంటున్నాడని వరలక్ష్మి ఆరోపించారు. ఇండస్ట్రీ లో పలుకుబడి ఉందని తెలిసిన రౌడీల ద్వారా తన తండ్రి, సోదరులను చంపిస్తానని బెదిరించాడని వరలక్ష్మి ఆరోపించింది. తాను పల్లెటూరు అమ్మాయిని కావడం వల్ల అందరిలో పరిచయం చేయలేనని, ఇంతవరకు తనకు పుస్తెల తాడు కూడా చేయించలేదని, పెళ్లయ్యాక ఇరవై రోజులు ఆనందంగా ఉన్నానని, ఆ తరువాత ఆడపడుచు తన భర్తతో ఉండనిచ్చేది కాదని ఇంకా కట్నం తెస్తేనే భర్త దగ్గరికి పంపుతామని తిట్టేవారు. ఇక ఒక రోజంతా బాత్ రూమ్ లోనే ఉంచి టార్చర్ చేసారని వరలక్ష్మి ఆరోపించారు.
Vijay Devarakonda: సినీ ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయిన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు విజయ్ దేవరకొండ. ఇటీవల వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. ఇకపోతే ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాల్లో కూడా విజయ్ దేవరకొండ కీలకపాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే.
ఇలా విజయ్ దేవరకొండ కల్కిలో భాగం కావడంతో ఈయన గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ (నాగీ) మొదట దర్శకత్వం వహించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో విజయ్ నటించిన ఆ సినిమా సక్సెస్ అయింది అనంతరం మహానటి సినిమాలో కూడా విజయ్ నటించారు. ఈ సినిమా కూడా సక్సెస్ కావడంతో విజయ్ దేవరకొండ తన సినిమాలకు లక్కీగా మారిపోయారని అందుకే తనని కల్కి సినిమాల్లో కూడా భాగం చేశారు అంటూ వార్తలు వచ్చాయి.
ఇదే విషయం గురించి ఇటీవల రిపోర్టర్స్ విజయ్ దేవర కొండను ప్రశ్నించారు. ఇక ఈ ప్రశ్న పై విజయ్ దేవరకొండ స్పందించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..నేను నాగికి లక్కీ కాదు. ప్రభాస్ అన్న కోసం, నాగి కోసం ఈ సినిమాలో నటించా. కల్కి సినిమా చాలా అద్భుతంగా ఉంది కాబట్టి విజయం సాధించింది.
Advertisement
ఎలాంటి పోటీ లేదు.. ఇందులో మనం చేసింది ఏమీ లేదు అంటూ ఈయన రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు చాలా హుందాతనంగా సమాధానం చెప్పారు.నాగి క్రియేట్ చేసిన ఒక యూనివర్స్ లో నేను చిన్న పాత్ర చేశాను. అంతే కానీ ప్రభాస్ కర్ణుడు.. నేను అర్జునుడు లాంటి పోటీలు ఏమీ లేవని ఈయన తెలిపారు.
Y.S Vijayamma: ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఘోరంగా ఓటమిపాలైన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఎన్నికలలో కేవలం 11 స్థానాలకు మాత్రమే పార్టీ పరిమితం కావడంతో ఎంతోమంది నాయకులు కార్యకర్తలు ఇప్పటికి ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన వైసీపీ ఓటమికి గల కారణాలు ఏంటి అనే విషయాలను వెల్లడించారు.పార్టీ ఆలోచనా విధానం, ప్రజల్ని మెప్పించలేకపోవడం, ప్రజల్లో నమ్మకాన్ని కలిగించకపోవడం వల్లే ఇలాంటి ఫలితాలు వస్తుంటాయని ఆయన అన్నారు. బాబు మాటలను ఎవరు నమ్మరని మేము భావించము జగన్ చాలా నిజాయితీగా అన్ని పథకాలను అమలు చేశారు.
చంద్రబాబు పింఛన్ ను వేగంగా అమలు చేస్తామని చెప్పడం టీడీపీకిి ప్లస్ అయిందని కేతిరెడ్డి తెలిపారు. జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ వారి నాన్న రాజశేఖర్ రెడ్డిలా భావించారని తెలిపారు. ఇక గ్రౌండ్ లెవెల్ లో మేము ఓడిపోతామని ఎక్కడా కూడా మాకు సందేహాలు రాలేదని కేతిరెడ్డి తెలిపారు.
Advertisement
షర్మిలకు సపోర్ట్ చేయటం.. చంద్రబాబు అరెస్ట్ క్యాడర్ ను పోలరైజ్ చేసిందని ఆయన తెలిపారు. కమ్మ, కాపు కమ్యూనిటీలు పోలరైజ్ అయ్యాయని కేతిరెడ్డి వెల్లడించారు. వాలంటీర్ల వల్ల ప్రజలకు పార్టీకి గ్యాప్ పెరిగిందని ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు అంతేకాకుండా వైయస్ విజయమ్మ కూడా తన కుమార్తె షర్మిలకు సపోర్ట్ చేయడం పట్ల జగన్మోహన్ రెడ్డికి ఎఫెక్ట్ అయిందని ఈ సందర్భంగా కేతిరెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ఈయన జగన్ ఓటమి పాలు కావడానికి తన తల్లి విజయమ్మ కూడా ఒక కారణమని ఈ సందర్భంగా తెలియజేశారు.
YSRCP: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం బెంగళూరులో ఉన్న సంగతి మనకు తెలిసిందే .ఈ ఎన్నికలలో ఈయన ఘోరమైన ఓటమిని చవి చూశారు. గత ఎన్నికలలో 151 స్థానాలలో విజయం సాధించిన జగన్ ఈ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఇలా ఘోరమైన ఓటమిని ఎదుర్కొన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వచ్చారు. అక్కడ రెండు రోజులపాటు అభిమానులను కార్యకర్తలను కలిసిన ఈయన తిరిగి బెంగళూరుకు వెళ్లిపోయారు.
ఇలా బెంగళూరు నుంచి ఈయన రాజకీయాలు చేస్తున్నారని తెలుస్తుంది. అక్కడ మీడియా వారి కంట కనపడకుండా ఎవరిని కలవకుండా రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారనీ వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా తిరిగి ఏపీలో అధికారంలోకి వచ్చే పరిస్థితిలో కనిపించని నేపథ్యంలో ఈయన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకుడు డికె శివకుమార్ తో భేటీ అయ్యారని సమాచారం.
ఆంధ్రప్రదేశ్లో తిరిగి తాను అధికారంలోకి రావాలి అంటే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడమే సరైన పద్ధతిని నిర్ణయించుకున్న జగన్మోహన్ రెడ్డి ఆయనతో కలిసి పార్టీని విలీనం చేయడంపై సంప్రదింపులు జరిపారని తెలుస్తుంది అంతేకాకుండా డీకే శివకుమార్ ని కలిసినట్టు ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Advertisement
అన్నీ అవాస్తవాలే..
ఇలా జగన్మోహన్ రెడ్డి తనని కలిసారని పార్టీ విలీనం గురించి మాట్లాడారంటూ వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డిని కలిసినట్టు ఫోటోలు వైరల్ అవుతున్నాయి అయితే ఇదంతా కూడా అవాస్తవమేనని తెలిపారు. నేను జగన్మోహన్ రెడ్డిని కలిసిన సందర్భాలు లేవని ఆయనను ఇప్పటివరకు ఒకసారి కూడా కలవలేదని సోషల్ మీడియాలో మా గురించి వస్తున్న వార్తలన్నీ ఆ వాస్తవం అంటూ అధికారికంగా ఈ వార్తలను ఖండిస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.