Connect with us

Featured

సినిమాలు హిట్ అవ్వగానే కమీడియన్స్ కాస్త పెళ్లాల పాలిట విలన్లుగా మారారు

Published

on

సినిమాల్లో కామెడీ చేసి, భార్యలకు ట్రాజెడీ చూపించారు
ఆ ముగ్గురూ తెలుగు తెరమీద సూపర్ కమెడియన్స్. ప్రేక్షకుల్ని తమ నటనతో్ బాగానే నవ్వించారు. తమ కామెడీతో వాళ్లు కూడా బాగానే సంపాదించారు. అయితే వాళ్లు కామెడీ చేసింది తెరమీదే. వాళ్ల వైవాహిక జీవితాల్లో మాత్రం భార్యలకు చుక్కలు చూపించారు. సినిమాల్లో బిజీ గా ఉండడంతో భార్యలతో కలిసి ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని ఆస్వాదించలేకపోయారు. ఏవేవో గొడవలతో భార్యలతో తరుచూ గొడవలు పడుతూ , తమ కాపురాల్ని రోడ్డుమీద పెట్టుకున్నారు.

Advertisement

ఈ లిస్ట్ లో ముందుగా చెప్పుకోదగ్గ కమెడియన్ వేణుమాధవ్. యస్వీకృష్ణారెడ్డి సాంప్రదాయంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన వేణుమాధవ్ కామెడియన్ గా ఒకప్పుడు బాగా బిజీగా ఉండేవాడు. వరస సినిమాలు చేస్తూ ఒకదశలో ఆయన బాగానే వెనకేసుకున్నాడు. ఇండస్ట్రీలో కూడా మంచి పేరే సంపాదించాడు. అయితే ఇంట్లో మాత్రం వేణుమాధవ్ అతడి భార్య పాలిట విలన్ అయ్యాడు. తరుచు గొడవలు పడుతూ ఉండే ఈ దంపతులిద్దరూ పరస్పరం విడాకులు కోరుతూ కోర్టు కు పిటీషన్ దాఖలు చేసారు. ఇద్దరూ అంగీకారం తెల్పడంతో రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ విడాకులు మంజూరు చేసింది. విడాకులు తీసుకున్న సందర్భంగా భరణం కింద తన భార్య భాగ్యలక్ష్మి, ఇద్దరు మైనర్ పిల్లలకు రూ. 60లక్షలు ఇచ్చేందుకు వేణుమాధవ్ అంగీకరించారు.

తర్వాత మరో కమెడియన్ చిత్రం శ్రీను కూడా ఇదే బాటలో ట్రావెల్ చేసాడు. చిత్రం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రి ఇచ్చిన శ్రీను మంచి మంచి కామెడీ పాత్రలు ధరించి జనాన్ని బాగానే నవ్వించేవాడు. శ్రీనువైట్ల లాంటి డైరెక్టర్లు చిత్రం శ్రీను ను బాగా ఎంకరేజ్ చేసారు. టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా సక్సెస్ అవుతాడని అందరూ అనుకుంటూ ఉండగానే, అతడి వైవాహిక జీవితం అట్టర్ ప్లాప్ అయింది. దాదాపు 250 సినిమాల్లో మంచి మంచి కామెడీ పాత్రలు ధరించిన శ్రీను కు ఎప్పుడో పెళ్ళైంది. మరి భార్యతో ఏం గొడవలొచ్చాయో కానీ, ఆమె ఉండగానే శ్రీను ఒక నృత్యకళాకారిణి తో సంబంధం పెట్టుకున్నాడు. మొదటి భార్యకు తెలియకుండా ఆమెను రహస్యంగా వివాహంచేసుకున్నాడు. విషయం తెలుసుకున్న మొదటి భార్య అతడి నుంచి విడాకులు తీసుకొని అతడిపై కేసు పెట్టింది. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. దీని వల్ల అతడి సినీ కెరీర్ బాగా అప్ సెట్ అయింది.

Advertisement

ఇక భార్యనుంచి విడాకులు తీసుకొని ఆర్థికంగా నష్టపోబోతున్న మరో కమెడియన్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వి. ఇతడి మీద అతడి భార్య విడాకులు కోరుతూ ఛీటింగ్ కేసు నమోదు చేసింది. పృధ్వి మీద 498, 420 సెక్షన్లు కింద కేసు నమోదైంది. తన బర్త సినిమాల్లో బిజి అయ్యి నన్ను పూర్థిగా వదిలేసాడని అతడి భార్య విడాకులకు అప్లై చేస్తూ తనకు తనకు పృధ్వి నెలకు 8 లక్షల రూపాయల భరణం ఇవ్వాలని కోరుతూ కోర్టు లో కేసు పెట్టింది. ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు కూడా ఇంత శాలరీ ఉండదు. అది చాలా పెద్ద మొత్తమని తన సంపాదన తో అంత పెద్ద మొత్తంఇచ్చుకోలేని కోర్టు వారికి విన్నవించుకున్నాడు. ఈ కేసు ఇంకా కోర్టులో ఉంది.

ఇక కమెడియన్ జోగినాయుడు కూడా ఈ లిస్ట్ లో ఉన్నాడు. జోగిబ్రదర్స్ లో ఒకడైన జోగినాయుడు 1995 లొ జెమినీ టివిలో పనిచేస్తుండేవాడు. అప్పుడే యాంకర్ గా కొత్తగా అడుగుపెట్టిన ఝాన్సీ ని పడగొట్టాడు. ఇద్దరూ ప్రేమించుకొని , ఇంట్లో చెప్పకుండా జెమినీ టివి ఆధ్వర్యంలో పెళ్లిచేసుకున్నారు. కొన్నాళ్లు వీరిద్దరూ బాగానే ఉన్నారు. ఆతర్వాత నుంచి ఇద్దరి మధ్యా మనస్పర్ధలొచ్చాయి. విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికీ ఒక బిడ్డ.జోగి నాయుడు ఆర్దికంగా నిలదొక్కుకోలేక పోయిన బార్య ఝాన్సీ ని మాత్రం చాల ఇబ్బందులకి గురి చేశినట్టుగా శొషల్ మీడియలో వార్తలు వెలువడ్డాయి..

Advertisement

సో.. మొత్తానికి ఈ కమెడియన్లు సినిమాల్లోనే నవ్వించి, నిజజీవితంలో కేసులతో…. నవ్వడం ఎప్పుడో మరిచిపోయారు. బార్యలను వేదిస్తు నిజ జీవితంలో విలన్లుగా మారారు .

Advertisement
Continue Reading
Advertisement

Featured

Star Heroin: స్టార్ హీరోతో ప్రేమ,పెళ్లి విడాకులు..12 మందితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్… ఎవరంటే?

Published

on

Star Heroin: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి మనీషా కొయిరాల ఒకరు. ఈమె సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ సినిమాలలో నటించి ఒకానొక సమయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపారు. ఇక ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో తన వ్యక్తిగత విషయాలలో కూడా వార్తలలో నిలిచారు.

Advertisement

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు పలువురు హీరోలతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఒక స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడినప్పటికీ ఆయనని పెళ్లి చేసుకోలేదు. ఇక ఈమె సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రెండేళ్లకే తనతో విడాకులు తీసుకొని విడిపోయి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన మనీషా కోయిరాల మందుకు అలవాటు పడ్డారు.పెళ్లికి ముందే మనీషా కోయిరాలా ఏకంగా 12 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. వివేక్ ముశ్రన్‌, నానా పటేకర్‌, DJ హుస్సేన్‌, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్‌ వంటి ప్రముఖులతో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

12 మందితో డేటింగ్..
ఇలా తరచూ డేటింగ్ ల ద్వారా కూడా ఈమె వార్తల్లో నిలిచారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడిపారు. పలువురు దర్శక నిర్మాతలు సైతం ఈమె డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఇలా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపిన ఈమె మధ్యలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: విష్ణు ప్రియకు షాక్ ఇచ్చిన నిఖిల్… కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్.. అసలు ఆట ఆరంభం!

Published

on

Bigg Boss 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రారంభం అయ్యి 5 రోజులు పూర్తయింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అయితే హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ మూడు గ్రూపులుగా విడదీశారు. అయితే ఈ గ్రూపులోకి ఎవరెవరు సభ్యులను తీసుకోవాలనేది చీఫ్ ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ విష్ణు ప్రియ కచ్చితంగా తనని నిఖిల్ తన గ్రూపులోకి తీసుకుంటారని ఆమె భావించింది. కానీ నిఖిల్ మాత్రం ఆమెకు షాక్ ఇచ్చారు. దీంతో విష్ణు ప్రియను నైనిక తన టీమ్ లోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం గురించి నిఖిల్ విష్ణుప్రియ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీరిద్దరికి ముందే మంచి పరిచయమున్న నేపథ్యంలో తప్పకుండా నిఖిల్ తన టీమ్ లోకి తీసుకుంటారని విష్ణు ప్రియ భావించింది కానీ అది జరగలేదు.

ఇలా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కారణంగా విష్ణు ప్రియ సరదాగా నిఖిల్ ను ఓ ఆట ఆడుకుంది. దీంతో నిఖిల్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఇప్పటివరకు ఎంతో సరదాగా గడిపిన కంటెస్టెంట్లను మూడు గ్రూపులుగా విడదీయడంతో అసలైన ఆట మొదలైంది.

టాస్కులపై ఫోకస్..
కంటెస్టెంట్లను టీమ్స్ గా విడదీసి బిగ్ బాస్ టాస్కులను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇచ్చిన మొదటి టాస్కోలో భాగంగా ఇప్పటివరకు హౌస్ లో సైలెంట్ గా కూర్చున్న పృథ్విరాజ్ తన ఆట తీరును కనబరుస్తూ యష్మీ టీమ్ ను గెలిపించారు. దీంతో ముందు ముందు ఏ ఏ కంటెస్టెంట్ ఎలా తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారు బ్రో…. ఆ కంటెస్టెంట్లను ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఏడు సీజన్లను పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా గత ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. మొదట 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. మిగిలిన వారిని ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

Advertisement

ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ పోట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మిగిలిన వారు మాత్రం అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నా సందేహాలు వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతో యాక్టివ్ గా వెళ్లిన కంటెస్టెంట్లు లోపల మాత్రం అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోతున్నారనే చెప్పాలి.

ముఖ్యంగా హీరో ఆదిత్య ఓం అయితే హౌస్ లో ఉన్నాడా లేదా అన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది. ఈయన ఉంటే ఒంటరిగా ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు. పెద్దగా ఫేమస్ అయిన కంటెంట్ మాత్రం ఈయన ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలువురు ట్రోలర్స్ బ్రో అసలు ఎందుకొచ్చావు బ్రో బిగ్ బాస్ హౌస్ కి అంటూ భారీగా విమర్శలు చేస్తున్నారు.

ఈయనతో పాటు బెజవాడ బేబక్క కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈమె హౌస్ లో మాత్రం ఎక్కువగా కిచెన్ లోనే ఉంటుంది. కానీ సరైన కంటెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. పృధ్విరాజ్, అభయ్ నవీన్ వంటి వారందరూ కూడా హౌస్ లో డల్ గా కనిపిస్తున్న తరుణంలో పలువురు మీరంతా హౌస్ లోకి ఎందుకు వచ్చారో ఏమో అంటూ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అలాగే మరి కొంతమందిని బాగా హైలైట్ చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఎలిమినేషన్ ఉంటుందా…
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా బెజవాడ బేబక్క, విష్ణు ప్రియ, శేఖర్ భాష, నాగ మణికంఠ సోనియా ఆకుల ప్రేరణ వంటి వారు నామినేషన్ లో ఉన్నారు. అయితే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!