General News
అతను “మొబైల్ నెంబర్” ను “ఆధార్” కు లింక్ చేయగానే..అకౌంట్ లో ఉన్న రూ.1.30 లక్షలు పోయాయి..! ఎలాగో తెలుసా.?
![](https://telugudesk.net/wp-content/litespeed/avatar/22818883f35055ea26eba80ab077e6e9.jpg?ver=1721553492)
Published
7 years agoon
By
telugudeskవచ్చే ఏడాది ఫిబ్రవరి లోపు మీ మొబైల్ నంబర్లను ఆధార్తో లింక్ చేసుకోండి. లేదంటే మీ మొబైల్ నంబర్ పనిచేయదు… ఇదీ.. ఇప్పుడు చాలా మంది మొబైల్ వినియోగదారులకు రోజూ వస్తున్న మెసేజ్. ఈ క్రమంలో పలువురు టెలికాం ఆపరేటర్లు ఈ విషయం పేరిట వినియోగదారులను రోజూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మెసేజ్ల వరకు అయితే ఓకే, కానీ మొబైల్ నంబర్ను ఆధార్కు లింక్ చేయండి.. అంటూ కాల్స్ కూడా చేసి వేధిస్తున్నారు. సరే.. వారు మారరు. కానీ నిజంగా.. ఇలా లింక్ చేస్తే ప్రయోజనం ఏంటి..? అనే మాట పక్కన పెడితే.. ఇప్పుడు మేం చెప్పబోయే సంఘటన గురించి వింటే మాత్రం మీ మొబైల్ నంబర్ను ఆధార్కు లింక్ చేయడానికి ఒక నిమిషం ఆలోచిస్తారు. అవును, మీరు విన్నది కరెక్టే. ఎందుకంటే విషయం అలాంటిది మరి..! ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…
అతని పేరు శాశ్వత్. అతనికి ఓ రోజున మెసేజ్ వచ్చింది. అందులో ఏముందంటే… మీ మొబైల్ నంబర్ బ్లాక్ అయింది. దాన్ని కంటిన్యూ చేయాలంటే ఆధార్కు లింక్ చేసుకోవాలి. కనుక మీ సిమ్ ఫోన్ నంబర్, సీరియల్ నంబర్లను 121 నంబర్కు ఎస్ఎంఎస్ చేయండి.. అంటూ అచ్చం ఎయిర్టెల్ కస్టమర్ కేర్ నుంచి వచ్చినట్టుగానే మెసేజ్ వచ్చింది. దీంతో శాశ్వత్ ఇది నిజమే అని నమ్మి సదరు నంబర్లను మెసేజ్ చేశాడు. అంతే.. క్షణాల్లో అవతలి వారు శాశ్వత్ సిమ్ను క్లోనింగ్ చేశారు. అంటే… అతని సిమ్కు డూప్లికేట్ సిమ్ను తయారు చేశారన్నమాట. అనంతరం ఆ సిమ్తో అతని ఐసీఐసీఐ శాలరీ అకౌంట్లో ఉన్న రూ.1.30 లక్షలను దోచేశారు. ఆశ్చర్యం… ఇది ఎలా జరిగింది.. అనుకుంటున్నారు కదా… అయితే వివరిస్తాం చూడండి..!
ఈ మధ్య కాలంలో డిజిటల్ పేమెంట్ మెథడ్స్ ఎక్కువయ్యాయి తెలుసు కదా. అనేక రకాల వాలెట్లు యాప్ ల రూపంలో మనకు అందుబాటులో వచ్చాయి. అయితే వాటిల్లో ఐఎంపీఎస్, నెఫ్ట్ వంటి పేమెంట్స్ మెథడ్స్తోపాటు యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) అనే కొత్త పేమెంట్ విధానం కూడా మనకు అందుబాటులో ఉంది. దీనికి కేవలం మొబైల్ నంబర్ ఉంటే చాలు. మన బ్యాంక్ వివరాలు ఏమీ ఎంటర్ చేయాల్సిన పని ఉండదు. మొబైల్ నంబర్ను యూపీఐకి అనుసంధానిస్తే యూపీఐ ఇంటర్ఫేస్ మన మొబైల్ నంబర్కు కనెక్ట్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్లను వెదుకుతుంది. ఏదో ఒకటి లింక్ అయి ఉంటుంది కనుక కచ్చితంగా అలా లింక్ అయిన బ్యాంక్ను చూపిస్తుంది. దీంతో బ్యాంక్ ఖాతా యూపీఐకి అనుసంధానం అవుతుంది. అలా అయ్యాక ఇక అంతే. బ్యాంక్ వివరాలతో సంబంధం లేకుండా నేరుగా యూపీఐ ద్వారా డబ్బును పంపుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. ఇదే నేరగాళ్లకు అవకాశంగా మారింది. ఈ క్రమంలోనే పైన చెప్పిన శాశ్వత్ నంబర్ కూడా నేరగాళ్ల చేతిలో పడింది. వారు కూడా యూపీఐ ద్వారానే అతని ఖాతాలో ఉన్న రూ.1.30 లక్షలను కాజేశారు.
అయితే శాశ్వత్ నిజం తెలుసుకునేసరికి ఆలస్యం అయింది. అయినప్పటికీ లేట్ చేయకుండా వెంటనే కస్టమర్ కేర్కు కాల్ చేసి విషయం చెప్పాడు. అనంతరం ఆ బ్యాంక్ బ్రాంచ్కు వెళ్లాడు. అక్కడ కూడా కంప్లెయింట్ ఇచ్చాడు. కానీ ఇప్పటి వరకు ఫలితం లేదు. పైగా శాశ్వత్ కంప్లెయింట్ ఇచ్చాక 18 గంటల తరువాత కూడా అతని బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు మాయమయ్యాయి. అతను ఫిక్స్ చేసుకున్న ఫిక్స్ డిపాజిట్లను కూడా నేరగాళ్లు కాజేశారు. కంప్లెయింట్ ఇచ్చాక కూడా ఇలా జరిగిందంటే ఇక ఆ బ్యాంక్ ఖాతాదారులకు ఎలాంటి సెక్యూరిటీ కల్పిస్తుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అసలు కంప్లెయింట్ ఇవ్వగానే ఆ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవ్వాలి. కానీ అలా కాలేదు. అంటే అందుకు బ్యాంకే బాధ్యత వహించాలి.
చూశారుగా… మీకు కూడా ఇలాంటి మెసేజ్లు వస్తే స్పందించకండి. మీ మొబైల్ నంబర్ను ఆధార్కు అనుసంధానం చేసుకోవాలంటే కచ్చితంగా స్టోర్కు వెళ్లాల్సిందే. అంతేకానీ అలా అనుసంధానం చేసుకునేందుకు సదరు కంపెనీలు ఆన్లైన్లో, మొబైల్ ద్వారా ఎలాంటి సదుపాయం కల్పించలేదు. ఇక మరో విషయం ఏమిటంటే… మీ సిమ్ కార్డు పోయినా వెంటనే దాన్ని బ్లాక్ చేయండి. ఎందుకంటే పైన చెప్పాం కదా. కేవలం మీ మొబైల్ నంబర్ ఉంటే చాలు, దాంతో బ్యాంకులో ఉన్న డబ్బులు కాజేస్తారు. కాబట్టి ఈ విషయంలోనూ జాగ్రత్త వహించాల్సిందే..!
You may like
Featured
Viral News: పీత డెక్క పై నరసింహ స్వామి రూపం.. వైరల్ అవుతున్న ఫోటో?
![](https://telugudesk.net/wp-content/litespeed/avatar/48f246d9b01e880e5843b8d38f9199e4.jpg?ver=1721553358)
Published
3 days agoon
24 July 2024By
lakshanaViral News: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎన్నో వింతలు విశేషాలు ప్రతి ఒక్కరికి క్షణాలలో తెలిసిపోతున్నాయి. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక అరుదైన పీత ఫోటో వైరల్ అవుతుంది. ఈ పీత డెక్క పై సాక్షాత్తు లక్ష్మీనరసింహస్వామి ప్రతిరూపం కనిపించడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
కోనసీమ జిల్లా, సకినేటి పల్లిలో పీత డెక్కపై లక్ష్మీనరసింహస్వామి ప్రతిరూపం కనిపించింది. ఈ గ్రామానికి చెందిన కాగితం కృష్ణ అనే వ్యక్తికి గోదావరి ఒడ్డున ఈత కనిపించడంతో దానిని తీసుకుని ఇంటికి వెళ్లారు. అయితే ఆపీతను కృష్ణ కుమార్తె నీళ్లలో వేయగా ఆ సమయంలో పీత డెక్కపై లక్ష్మీనరసింహస్వామి ప్రతిరూపం కనిపించింది.
నరసింహస్వామి రూపం..
ఈ విధంగా పీత డెక్కపై నరసింహస్వామి రూపం కనిపించడంతో వెంటనే ఈ విషయం తెలిసిన గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆపీతను చూడటానికి వచ్చారు అయితే ఆ పీత డెక్క పై నరసింహస్వామి రూపం కనిపించడంతో వెంటనే కృష్ణ దానిని తిరిగి గోదావరి నదిలో వదిలివేశారు. ప్రస్తుతం ఈ పీతకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
General News
ఏపీలో ఆ న్యూస్ ఛానల్ ప్రసారానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!
![](https://telugudesk.net/wp-content/litespeed/avatar/48f246d9b01e880e5843b8d38f9199e4.jpg?ver=1721553358)
Published
1 month agoon
25 June 2024By
lakshanaఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అతిపెద్ద బిజినెస్ లలో సెటప్ బాక్స్ బిజినెస్ కూడా ఒకటి ఏపీలో సుమారు 65 లక్షల కుటుంబాలు ఏపీ ఫైబర్ సెటప్ బాక్స్ ని ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన రాజకీయాల కారణంగా జూన్ 6వ తేదీ నుంచి కొన్ని న్యూస్ చానల్స్ ప్రసారం ఆగిపోయాయి.
జూన్ ఆరవ తేదీ నుంచి సాక్షి టీవీతో పాటు ఎన్ టీవీ, టీవీ9 వంటికి కొన్ని న్యూస్ చానల్స్ ప్రసారాలు ఆగిపోయాయి. ఇలా న్యూస్ ఛానల్ లో ప్రసారం నిలిపివేయడంతో ఇది చట్టపరంగా విరుద్ధమని తిరిగి ప్రసారాలను పునరుద్ధరించాలని 15 మంది మల్టీ సిస్టమ్ ఆపరేటర్లను ఢిల్లీ హైకోర్టు ఆదేశించడాన్ని న్యూస్ బ్రాడ్కాస్టర్స్ ఫెడరేషన్ ప్రశంసించింది.న్యూస్ బ్రాడ్కాస్టర్స్ ఫెడరేషన్ ప్రకటన విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్లో చట్ట విరుద్ధంగా కొన్ని న్యూస్ ఛానల్ లను నిలిపివేయడం జరిగింది. ఇలా నిలిపివేయటాన్ని న్యాయస్థానం పూర్తిగా ఖండించింది. కేవలం రాజకీయ న్యాయకత్వం పరంగా మార్పులు రావడంతోనే కేబుల్ ఆపరేటర్ల పై ఈ న్యూస్ ఛానల్ ను నిలిపివేయాలని ఒత్తిడి తీసుకురావడం తగదని చెప్పారు.
ఇలా సుమారు 62 లక్షల కుటుంబాలకు ఈ న్యూస్ ఛానల్ ప్రసారం నిలిపివేయటం చట్టపరంగా విరుద్ధమని, ఈ విధంగా ఈ న్యూస్ ఛానల్ ను నిలిపివేయటం అనేది ప్రేక్షకుల సమాచార హక్కుని నిరాకరించే ప్రయత్నం జరగటం దురదృష్టకరమైన తెలిపారు. ఈ క్రమంలోనే నిలిపివేసిన ఈ చానల్లను తిరిగి పునరుద్ధరించాలని హైకోర్టు తీర్పును వెల్లడించింది.
Featured
Ramoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు అస్తమయం!
![](https://telugudesk.net/wp-content/litespeed/avatar/48f246d9b01e880e5843b8d38f9199e4.jpg?ver=1721553358)
Published
2 months agoon
8 June 2024By
lakshanaRamoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈయన గత రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నేడు తెల్లవారుజామున 4:50 నిమిషాలకు కన్నుమూశారు.
శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఈయనని హైదరాబాద్లోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈయన పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అయితే ఈయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.
ఒక రామోజీరావు మరణ వార్త తెలియడంతో సినీ పరిశ్రమ అటు మీడియా రంగం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. మీడియా రంగానికి ఎన్నో సేవలు చేసిన రామోజీరావు మరణ వార్త తెలిసి ప్రముఖ రాజకీయ నాయకులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈయన మరణ వార్త తెలియడంతో తెలుగుదేశం అధినేతలు మరణం వార్తపై సంతాపం ప్రకటిస్తున్నారు.
అనారోగ్యంతో కన్నుమూత..
రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య ఈయన రామోజీ గ్రూప్ సంస్థలను స్థాపించి ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇలా పత్రిక రంగానికి ఎన్నో సేవలు చేస్తున్నటువంటి ఈయన ఎన్నో అవార్డులను పురస్కారాలను కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఈయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీ లోని తన నివాసానికి తరలించారు కూడా స్పందిస్తున్నారు.
![](https://telugudesk.net/wp-content/uploads/2024/07/Niharika-80x80.jpg?v=1721992191)
Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!
![](https://telugudesk.net/wp-content/uploads/2024/07/Anasuya-1-80x80.webp)
Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?
![](https://telugudesk.net/wp-content/uploads/2024/07/mahesh-babu-1-80x80.jpg?v=1721991560)
Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?
![](https://telugudesk.net/wp-content/uploads/2024/07/Sai-Sreenivas-80x80.webp)
Sai Sreenivas: మంచి మనసు చాటుకున్న బెల్లంకొండ హీరో… గ్రేట్ అంటున్న నేటిజన్స్?
![](https://telugudesk.net/wp-content/uploads/2022/04/pjimage-9-2.jpg?v=1649136551)
Bigg Boss: బిగ్ బాస్ ఒక చెత్త షో… నేను వెళ్లడం ఏంటీ…బిగ్ బాస్ షో పై క్లారిటీ ఇచ్చిన వేణు స్వామి!
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/Ali-80x80.webp)
Ali: ఇప్పుడు ఎన్నికలు పెట్టిన ఆయన సీఎం నేను హోమ్ మినిస్టర్ అవుతా: అలీ
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/MixCollage-28-Jun-2024-12-20-PM-8504-80x80.jpg?v=1719557451)
Revanth Reddy: జగన్ ఓటమికి అదే ప్రధాన కారణం.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
![](https://telugudesk.net/wp-content/uploads/2024/07/2_139-80x80.jpg?v=1719905165)
Shirish: శిరీష్ మరణ వార్త మెగా కుటుంబానికి చెప్పాము..కానీ: భరద్వాజ్ తల్లి
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/anam-80x80.webp)
AP: వాలంటీర్ వ్యవస్థ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆనం..షాక్ లో వాలంటీర్లు!
![](https://telugudesk.net/wp-content/uploads/2024/07/ys-jagan-80x80.webp)
YS Jagan: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై కేసు నమోదు… జైలుకు వెళ్ళక తప్పదా?
Trending
- Featured4 weeks ago
Ali: ఇప్పుడు ఎన్నికలు పెట్టిన ఆయన సీఎం నేను హోమ్ మినిస్టర్ అవుతా: అలీ
- Featured4 weeks ago
Revanth Reddy: జగన్ ఓటమికి అదే ప్రధాన కారణం.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
- Featured4 weeks ago
AP: వాలంటీర్ వ్యవస్థ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆనం..షాక్ లో వాలంటీర్లు!
- Featured4 weeks ago
Shirish: శిరీష్ మరణ వార్త మెగా కుటుంబానికి చెప్పాము..కానీ: భరద్వాజ్ తల్లి
- Featured2 weeks ago
YS Jagan: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై కేసు నమోదు… జైలుకు వెళ్ళక తప్పదా?
- Featured2 weeks ago
KTR : స్కెచ్ గీసిన కేటీఆర్.. ఏంటిది వేళ కాని వేళలోనా?
- Featured3 weeks ago
Bigg Boss 8: బిగ్ బాస్ 8 లోకి మొగలిరేకులు నటుడు ఇంద్రనీల్… సీరియల్ బ్యాచ్ కి పెద్ద పీట!
- Featured4 weeks ago
Amani: ఆరుసార్లు అబార్షన్.. నరకం చూసాను.. ఆమని సంచలన వ్యాఖ్యలు!