ప్రోమో చూస్తే ప్రోగ్రాం చూడాలన్న ఆసక్తి పెరగాలి..కానీ ఇటీవల వచ్చే ప్రతి ప్రోమో కూడా చాలా చీప్ ట్రిక్స్ తో ప్లే చేస్తూ అసలు ప్రోగ్రాంపై ఉన్న ఇంట్రస్ట్ కూడా పోగోడుతున్నాయి..షో రేటింగ్స్ కోసం ఈ TV చానల్స్ చేస్తున్న ప్రోమోస్ సోది అని ప్రేక్షకులకు ఈజీగా అర్దం అయిపోయేలా అనిపిస్తున్నాయి ఇలాంటి వాటికి నాంది పలికింది అప్పట్లో వచ్చిన ఆట ప్రోగ్రామ్, కొన్ని మొదట్లో ప్రేక్షకులకు సెంటిమెంటల్ గా టచ్ అయినప్పటికి ,ప్రతి ఎపిసోడ్ కి అదే విధంగా క్రియేట్ చేయడంతో ఆఖరికి వారు నిజంగా ఏడ్చినా నటనే అనుకునే స్థాయికి ప్రేక్షకులు వెళ్లిపోయారు, ఈ మధ్య కాలంలో రానా ,ఒక టీవి యాంకర్ని తిడుతున్నట్టు వచ్చిన ప్రోమో కూడా ఇలానే ఉంది, మొదట్లో ఏమైంది ఎందుకు రానా ఇలా బిహేవ్ చేశాడు అనుకున్న వాళ్లు తర్వాత ఆ ప్రోగ్రాం చూసి తిట్టుకున్నారు. అదే ప్రోగ్రాం కాదు ప్రతి ప్రోగ్రాం ప్రోమోని కూడా ఓవర్ యాక్షన్ అనే రేంజ్ కి వెళ్లిపోయారు..ఇటీవల ఈ ఓవర్ యాక్షన్ ప్రోమోస్ ని ఈటీవి అన్ని ప్రోగ్రాంస్ లో చూపిస్తుంది. పులి ని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు, ఈటీవీ ని చూసి టివి9 కూడా అదే దారిలో నడుస్తుంది, పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ జడ్జిగా, ఉదయ భాను యాంకర్ గా వస్తున్న రొమాంటిక్ డాన్స్ షో “నీతోనే డాన్స్”. 8 మంది సెలబ్రిటీ కపుల్స్ ఇందులో పార్టిసిపంట్స్. ఈ షో సరికొత్త ఎపిసోడ్ ప్రోమో లో లాస్య కంటతడి పెట్టుకుంటుంది..దానికి కారణం ఏంటో ఫుల్ ఎపిసోడ్ చుస్తే కానీ తెలియదు.
దసరా మహోత్సవం ప్రోమో:
జబర్దస్త్ షో టీం దసరా కానుకగా ఒక సర్ఫ్రెజ్ షో కి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.ఈ షో లో గొడవ చోటు చేసుకొన్నది. సుధీర్, రచ్చ రవి, గెటప్ శ్రీను, చంటి, ఆర్.పి. రాకేశ్ లు షో లో కొట్టుకొన్నారు.. అదీ మెగా బ్రదర్స్ అయిన చిరంజీవి గొప్ప అని కొందరు.. పవన్ కల్యాణ్ గొప్పని అని కొందరు స్టేజ్ పై కొట్టుకొన్నారు.. ఈ వివాదం ను సద్దుమనిగేలా చేయాలని చూసిన నాగబాబు ని సుధీర్ ఏదో అనడం తో నాగబాబు స్టేజ్ నుంచి వెళ్లిపోయాడు, అంతేకాదు రచ్చ రవి రోజా ని మీరు చెప్పండి ఆ పార్టీ ఈ పార్టీ అంటూ ఏదొక పార్టీ మారడం కాదు.. ఒకే పార్టీలో ఉండండి అన్న మాటలకు మరో జడ్జ్ రోజా కంట తడి పెట్టింది.. ఈ వివాదం చూసిన యాంకర్ అనసూయ కళ్ళు తిరిగి పడిపోయింది…
దసరా మహొత్సవం పూర్తి ఎపిసోడ్..