Connect with us

General News

ఆ 18 ఏళ్ల యువతి పెళ్లి ఆగిపోయింది..! కారణం పేస్ బుక్ లో పెట్టిన ఓ పోస్ట్..! ఎలాగో తెలుసా..? ఆ పోస్ట్ ఏంటి.?

Published

on

బాల్య వివాహాలు అనేవి మ‌న వ్య‌వ‌స్థలో ఎప్ప‌టి నుంచో ఉన్న‌వే. ఇప్పటికీ కొన్ని చోట్ల కొంద‌రు బాల్య వివాహాలు జ‌రిపిస్తూనే ఉన్నారు. దీంతో చిన్న వ‌య‌స్సులోనే పెళ్లి చేసుకున్న బాలిక‌ల‌కు ఇక జీవిత‌మంతా న‌ర‌క ప్రాయం అవుతోంది. ఒక వేళ భ‌ర్త మ‌ర‌ణిస్తే ఇక ఆ బాలిక అలాగే జీవితాంతం ఉండాల్సిందే. స‌రిగ్గా ఇవే క‌ష్టాల‌ను అనుభ‌వించాల్సి వ‌స్తుంద‌ని అనుకుందో ఏమో గానీ ఆ యువ‌తి మాత్రం త‌న బాల్య వివాహాన్ని చాలా తెలివిగా కోర్టులో ర‌ద్దు చేయించుకుంది. దీంతో ఇప్పుడామె ఉన్న‌త చ‌దువులు చ‌దివి తాను అనుకున్న ల‌క్ష్యాన్ని సాధించే ప‌నిలో ప‌డింది.

ఆమె పేరు సుశీల‌. రాజ‌స్థాన్‌లోని జోధ్‌పూర్ లో ఉంటోంది. ఈమెకు త‌న 12వ ఏటే స్థానికంగా ఉన్న న‌రేష్ అనే వ్య‌క్తితో 2010వ సంవ‌త్స‌రంలో పెళ్లి చేశారు. అయితే పెళ్ల‌యిన‌ప్ప‌టి నుంచి సుశీల త‌ల్లి ద‌గ్గ‌రే ఉంటోంది. ఈ క్ర‌మంలో సుశీల‌కు 18 ఏళ్ల వ‌య‌స్సు నిండ‌గానే అత్త వారింటి ద‌గ్గ‌ర దిగ‌బెట్ట‌డానికి పుట్టింటి వారు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ అలా వెళ్ల‌డం సుశీల‌కు ఇష్టం లేదు. దీంతో త‌న మ‌న‌స్సులో ఉన్న మాట‌ను ఆమె త‌న తల్లిదండ్రుల‌కు చెప్పింది. తాను చ‌దువుకుంటాన‌ని, చ‌దువంటే ఇష్ట‌మ‌ని, అత్తింటికి పంప‌వ‌ద్ద‌ని వేడుకుంది. అయినా వారు విన‌లేదు. సుశీల‌ను అత్తింట్లో దిగ‌బెట్టేందుకే సిద్ధ‌మ‌య్యారు.

Advertisement

దీంతో సుశీల 2016, ఏప్రిల్ 27న ఇంట్లో నుంచి అర్థ‌రాత్రి బ‌య‌ట‌కు వచ్చేసింది. జోధ్‌పూర్‌లో ఉన్న చైల్డ్ వెల్ఫేర్ క‌మిటీ స‌భ్యురాలు కృతి భార‌తి స‌హాయంతో రీహాబిలిటేష‌న్ సెంట‌ర్‌లో చేరింది. అక్క‌డ ఉండే కోర్టులో కేసు వేసింది. త‌న 12వ ఏట త‌న‌కు పెళ్లి జ‌రిగింద‌ని, త‌న‌కు ఆ పెళ్లి ఇష్టం లేద‌ని, ఇప్పుడు మేజ‌ర్ అయ్యాను క‌నుక ఆ పెళ్లిని ర‌ద్దును చేయాల‌ని కోర్టులో కోరింది. అయితే కోర్టు వారికి పెళ్లి అయిన‌ట్టుగా సాక్ష్యాలు చూప‌మంది. అయితే అవి సుశీల వ‌ద్ద లేవు. దీంతో ఆమె సుమారు 15 నెల‌ల పాటు కోర్టులో పోరాడింది. ఈ క్ర‌మంలో నే భ‌ర్త‌కు చెందిన ఫేస్‌బుక్ అకౌంట్‌లో షేర్ చేసిన త‌న పెళ్లి ఫొటోలు ఆమెకు క‌నిపించాయి. వాటి స‌హాయంతో కోర్టులో మ‌రోసారి వాదించింది. దీంతో కోర్టు సుశీల పెళ్లిని ర‌ద్దు చేసింది. ఈ క్ర‌మంలో ఆమె ఇప్పుడు స్వేచ్ఛ‌గా జీవిస్తోంది. ఉన్న‌త చ‌దువులు చదువుతోంది. గొప్ప స్థానాల‌కు చేరుకోవాల‌ని ఆమె క‌ల‌, ఆశ‌యం. బాగా చ‌దివి పోలీస్ ఆఫీస‌ర్ అవ్వాల‌ని ఆమె కోరుకుంటోంది. ఆమె క‌ల‌ నెర‌వేరాల‌ని మ‌న‌మూ కోరుకుందాం. ఏది ఏమైనా ఈ విష‌యంలో సుశీల‌ను అంద‌రం అభినందించాల్సిందే..!

Advertisement

Continue Reading
Advertisement

Featured

ITR FIling : గడువు పెంచలేదు.. ఫేక్ న్యూస్ నమ్మొద్దు.. “జూలై 31వ తేదీలోపు మీ ITR ఫైల్ చేయండి”.. కీలక ప్రకటన చేసిన ఐటీ శాఖ

Published

on

ITR ఫైలింగ్ : పన్ను చెల్లింపుదారులకు ముఖ్యమైన గమనిక. మీరు FY 2023-2024 కోసం మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఇంకా ఫైల్ చేయలేదా? ఆదాయపు పన్ను శాఖ మరో కీలక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 31లోగా ఐటీ రిటర్నులు సమర్పించాలని కోరింది ఐటీ శాఖ. మరో నెల రోజులు గడువు పెంపుపై వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలింది. పన్ను చెల్లింపుదారులు ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మవద్దని సోషల్ మీడియా ఎక్స్ లో సూచించింది.

గడువు 4 రోజులు మాత్రమే. జూలై 31వ తేదీలోపు ITR ఫైల్ చేయాలి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ వీలైనంత త్వరగా రిటర్నులు సమర్పించాలని ఐటీ శాఖ సూచించింది. పన్ను పోర్టల్ లో ఎటువంటి సాంకేతిక సమస్య లేదు. మీరు గడువు సమయంలోపు ITR ఫైల్ చేయకపోతే, మీరు సెక్షన్ 234A కింద వడ్డీని మరియు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 234F కింద జరిమానా చెల్లించవలసి ఉంటుంది.

మరోవైపు ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసి వాపసు కోరుతున్న వారిని కూడా ఐటీ శాఖ హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు ఫోన్లలో మెసేజ్ లు పంపుతూ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసిందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఇలాంటి ఫేక్ మెసేజ్‌లను చూసి మోసపోకండి మరియు రీఫండ్ కోసం మీ బ్యాంక్ ఖాతా వివరాలు మరియు వన్-టైమ్ పాస్‌వర్డ్‌లను అడుగుతూ మీకు కాల్ వస్తే అప్రమత్తంగా ఉండండి. అటువంటి లింక్‌లపై క్లిక్ చేయవద్దు. ఇప్పటి వరకు 5 కోట్ల మంది పన్ను రిటర్నులు దాఖలు చేసినట్లు గుర్తించింది. వీరిలో ఇప్పటికే 1.8 మిలియన్ల రిటర్న్‌లు ప్రాసెస్ చేయబడి, రీఫండ్ ఖాతాలకు జమ అయినట్లు కూడా తెలిపింది.

Advertisement

Continue Reading

Featured

Viral News: పీత డెక్క పై నరసింహ స్వామి రూపం.. వైరల్ అవుతున్న ఫోటో?

Published

on

Viral News: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎన్నో వింతలు విశేషాలు ప్రతి ఒక్కరికి క్షణాలలో తెలిసిపోతున్నాయి. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక అరుదైన పీత ఫోటో వైరల్ అవుతుంది. ఈ పీత డెక్క పై సాక్షాత్తు లక్ష్మీనరసింహస్వామి ప్రతిరూపం కనిపించడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

కోనసీమ జిల్లా, సకినేటి పల్లిలో పీత డెక్కపై లక్ష్మీనరసింహస్వామి ప్రతిరూపం కనిపించింది. ఈ గ్రామానికి చెందిన కాగితం కృష్ణ అనే వ్యక్తికి గోదావరి ఒడ్డున ఈత కనిపించడంతో దానిని తీసుకుని ఇంటికి వెళ్లారు. అయితే ఆపీతను కృష్ణ కుమార్తె నీళ్లలో వేయగా ఆ సమయంలో పీత డెక్కపై లక్ష్మీనరసింహస్వామి ప్రతిరూపం కనిపించింది.

నరసింహస్వామి రూపం..
ఈ విధంగా పీత డెక్కపై నరసింహస్వామి రూపం కనిపించడంతో వెంటనే ఈ విషయం తెలిసిన గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆపీతను చూడటానికి వచ్చారు అయితే ఆ పీత డెక్క పై నరసింహస్వామి రూపం కనిపించడంతో వెంటనే కృష్ణ దానిని తిరిగి గోదావరి నదిలో వదిలివేశారు. ప్రస్తుతం ఈ పీతకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

Continue Reading

General News

ఏపీలో ఆ న్యూస్ ఛానల్ ప్రసారానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Published

on

ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అతిపెద్ద బిజినెస్ లలో సెటప్ బాక్స్ బిజినెస్ కూడా ఒకటి ఏపీలో సుమారు 65 లక్షల కుటుంబాలు ఏపీ ఫైబర్ సెటప్ బాక్స్ ని ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన రాజకీయాల కారణంగా జూన్ 6వ తేదీ నుంచి కొన్ని న్యూస్ చానల్స్ ప్రసారం ఆగిపోయాయి.

జూన్ ఆరవ తేదీ నుంచి సాక్షి టీవీతో పాటు ఎన్ టీవీ, టీవీ9 వంటికి కొన్ని న్యూస్ చానల్స్ ప్రసారాలు ఆగిపోయాయి. ఇలా న్యూస్ ఛానల్ లో ప్రసారం నిలిపివేయడంతో ఇది చట్టపరంగా విరుద్ధమని తిరిగి ప్రసారాలను పునరుద్ధరించాలని 15 మంది మల్టీ సిస్టమ్ ఆపరేటర్‌లను ఢిల్లీ హైకోర్టు ఆదేశించడాన్ని న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రశంసించింది.న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రకటన విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్లో చట్ట విరుద్ధంగా కొన్ని న్యూస్ ఛానల్ లను నిలిపివేయడం జరిగింది. ఇలా నిలిపివేయటాన్ని న్యాయస్థానం పూర్తిగా ఖండించింది. కేవలం రాజకీయ న్యాయకత్వం పరంగా మార్పులు రావడంతోనే కేబుల్ ఆపరేటర్ల పై ఈ న్యూస్ ఛానల్ ను నిలిపివేయాలని ఒత్తిడి తీసుకురావడం తగదని చెప్పారు.

Advertisement

ఇలా సుమారు 62 లక్షల కుటుంబాలకు ఈ న్యూస్ ఛానల్ ప్రసారం నిలిపివేయటం చట్టపరంగా విరుద్ధమని, ఈ విధంగా ఈ న్యూస్ ఛానల్ ను నిలిపివేయటం అనేది ప్రేక్షకుల సమాచార హక్కుని నిరాకరించే ప్రయత్నం జరగటం దురదృష్టకరమైన తెలిపారు. ఈ క్రమంలోనే నిలిపివేసిన ఈ చానల్లను తిరిగి పునరుద్ధరించాలని హైకోర్టు తీర్పును వెల్లడించింది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!