భారతదేశంలోని స్త్రీ ను ఒక ఆటబొమ్మల ఒక వస్తువుగా చూడటం ఇప్పటికి కొనసాగుతుందనే చెప్పాలి.ఆడపిల్ల అంటేనే చీదరింపులు ఎదుర్కొనే పరిస్థితులు నిత్యం వార్తల్లో పేపర్ లో వస్తూనే ఉంటాయి.ఒకరకంగా స్త్రీ యొక్క వ్యక్తిత్వాన్ని దిగజార్చింది ఈ సమాజం..కేవలం పడక సుకనికే అంకితం అన్నట్లుగా భావిస్తు రోజు రోజుకి స్త్రీ లపై కీచక పర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి.
స్త్రీ గర్భాశయాన్ని అద్దెకిచ్చే దశ నుంచి, భర్తలు తమ భార్యలను పరాయి పురుషుడికి అద్దెకిచ్చే దశకి వచ్చారు.. అవును, మీరు విన్నది నిజంగా నిజమే, భార్యను- పరాయి పురుషుడికి అద్దెకి-ఇవ్వటం.
దధీచ ప్రాత అనే ఈ సంప్రదాయాన్ని మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లాలో పాటిస్తున్నారు. ఈ ఆచారం ప్రకారం స్త్రీలను అద్దెకి ఇవ్వవచ్చు. స్టాంపు పేపరుపై కేవలం ఒకే ఒక సంతకంతో, ఒక స్త్రీ యొక్క భర్త మారిపోతాడు. ఒక్కసారి ఒప్పందం కుదిరిన తర్వాత, ఆ మహిళ మరో వ్యక్తికి అమ్ముడుపోతుంది. ఈ ఒప్పందాన్ని అధికారికం చేయటానికి రూ.10 నుంచి రూ.100 వరకూ ఉన్న స్టాంపు పేపర్లపై వీళ్ళు సంతకం చేస్తారు. ఎంత ఎక్కువ ధర పలికితే, అంత ఎక్కువ కాలం ఆ బంధం నిలిచివుంటుంది. అలా ఒప్పందం సమయం అయిపోయాక, ఆ తిరిగొచ్చిన స్త్రీ మళ్ళీఅ మరొక వ్యక్తి కోసం బేరంలో నిలుచుంటుంది.