Connect with us

Movie News

ఈటీవీ సీరియల్స్ హీరోయిన్స్ ఏం చేస్తున్నారో ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా.. వీళ్ళు నిజంగా గ్రేట్..

Published

on

టైం అయ్యిందంటే చాలు ప్రపంచాన్నే మరిచిపోయి టీవీ ముందు వాలిపోతారు. ఇంట్లో ఏం జరిగినా పట్టించుకోరు. ఒకవేళ ఆ టైం లో కరెంట్ పోయిందంటే ఏం జరుగుతుందో అన్న టెన్షన్. టీవీ సీరియల్స్ కు అంతగా అతుక్కుపోతున్నారు కొందరు మహిళలు. ఎంతలా అంటే సీరియల్స్ కి ఆడవారికీ మధ్య విడదీయరాని బంధం ఉందని అనేంతగా తయారయ్యారు. సీరియల్స్ వచ్చే టైంలో ఇంట్లో వాళ్లని పట్టించుకోవడమే మానేస్తున్నారు కొందరు. ఇదీ అదీ అనే తేడా లేదు. ఏ సీరియల్ నీ వదలకుండా చూస్తున్నారు మరికొందరు. సాయంత్రమైతే చాలు 90 శాతం ఆడవాళ్ళు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకూ రెస్ట్ లేకుండా ఏదో ఒక సీరియల్స్ చూసే వాళ్ళూ ఉన్నారు. సీరియల్స్ వచ్చే పాత్రల్లో పూర్తిగా లీనమై టైంను కూడా మర్చిపోతుంటారు కొందరు. అయితే అప్పట్లో సీరియల్స్ చాలా బాగా బాగా ఉండేవి. తెలుగు ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో ఇప్పుడు ఈటీవీ గట్టి పోటీనిస్తుంది . కొంతకాలంపాటు నెంబర్ వన్ స్థానంలో నిలబడినప్పటికీ ఈ మధ్య కాలంలో కాస్త వెనకబడి ఈటీవీకి గట్టి పోటీగా తయారైన చాలా చానెల్స్ ఉన్నాయి . ఈ చానల్స్ లో ప్రసారమయ్యే సీరియల్స్ కన్నా ఈటీవీ సీరియల్స్ కే ఎక్కువగా ప్రజాదరణ పొందుతున్నాయి. ఈటీవీ లో మధుర జ్ఞాపకాలుగా మిగిన పోయిన ఆ సీరియల్స్ ఏవో ఇప్పుడు చూదాం.

లేడీ డిటెక్టివ్

Advertisement


ఈటీవీ మొదలైన కొత్తలో మొదలైంది ఈ సీరియల్. సినీ దర్శకుడు వంశీ డైరెక్షన్ లో మొదటి టివి సీరియల్..ఈ సీరియల్ ఈటీవీ లో ప్రతి మంగళ వారం రాత్రి 8 :30 నుండి 9 వరకు ప్రసారం ప్రసారమైఏది. ఈ సీరియల్ లో నటించిన హీరోయిన్ ఉత్తర చాల బాగా నటించి అందరి ప్రశంశలు అందుకుంది. ఆ తర్వాత ఉత్తర ఈ ఒక సీరియల్ తో స్టాప్ చేసి పెళ్లి చేసుకొని రియల్ లైఫ్ లో బిజీ అయిపోయింది.

స్నేహ సీరియల్

ఈటీవీ సీరియల్స్ లో ఒకానొక బెస్ట్ సీరియల్ స్నేహ. ఈ సీరియల్ కూడా బాగా ప్రేక్షాధారణ పొందింది . స్నేహ సీరియల్ లో నటించిన నటి కూడా ఈ సిరిల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత పెళ్లి చేసుకొని ఈవిడ కూడా లైఫ్ లో బిజీ అయిపోయింది.

అన్వేషిత సీరియల్

ఈ సీరియల్ థ్రిల్లర్ తో కూడిన టెలివిజన్ సీరియల్. ఇందులో అచ్యుత్ , యమునా మెయిన్ రోల్స్ చేసారు. తెలుగు భాషలో విడుదలైన ఈ సీరియల్, ఆగష్టు 27, 1997 న ETV తెలుగులో ప్రదర్శించబడింది. ఈ సీరియల్ మొత్తం 100 ఎపిసోడ్స్ , 1999 లో దాని చివరి ఎపిసోడ్ ప్రసారం చేసిన సమయానికి, తెలుగు ప్రేక్షకుల మధ్య చాలా ప్రజాదరణ పొందింది. వివిధ విభాగాలలో ఎనిమిది నంది అవార్డులు కూడా వచ్చాయి. అచ్యుత్ ఒక తెలుగు టెలివిజన్ మరియు సినీ నటుడు. ఇతను తెలుగు దూరదర్శిని మరియు సినిమాలలో అనతికాలంలో మంచి పేరు సంపాదించిన నటుడు. చిన్న ప్రాయంలోనే గుండెపోటుతో హఠాత్తుగా మృతిచెందాడు.. ఇక్క నటి యమునా ఇప్పటి కూడా ఈటీవీ సీరియల్ లో నటిస్తుంది.

అంతరంగాలు సీరియల్

అంతరంగాలు ఈటీవీ లో చాలాకాలం జనరంజకంగా కొనసాగిన తెలుగు ధారావాహిక. దీనికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, బొమ్మలు మరియు దర్శకత్వ పర్యవేక్షణ చెరుకూరి సుమన్. దీనిని రామోజీరావు నిర్మించగా అక్కినేని వినయ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సీరియల్ లో శరత్ బాబు , కల్పనా , అచ్యుత్ లీడ్ రోల్స్ పోషించారు. శరత్ బాబు ఒక విలక్షణమైన తెలుగు సినిమా నటుడు. తమిళ, తెలుగు, కన్నడ సినీ రంగాలలో 220కి పైగా సినిమాలలో నటించాడు. కథానాయకుడుగానే కాక, ప్రతినాయకుని పాత్రలు, తండ్రి పాత్రలు వంటి విలక్షణ పాత్రలు పోషించాడు. నటి కల్పనా ఈ సీరియల్ తర్వాత మరికొన్ని సీరియల్స్ , సినిమాల్లో కూడా నటించింది. పెళ్లి తర్వాత ఇటు బుల్లి తెర అటు వెండి తెర కు దూరం గా ఉంటూ పర్సనల్ లైఫ్ లో బిజీ గా ఉంటుంది.

ఎండమావులు సీరియల్

ఈ సీరియల్ ఈటీవీ లో బాగా ప్రజా ఆదరణ పొందింది. ఈ సీరియల్ లో మహర్షి, జ్యోతి రెడ్డి మెయిన్ లీడ్ రోల్స్ చేసారు. మహర్షి రాఘవ 170 కి పైగా సినిమాలలో నటించాడు. వంశీ దర్శకత్వంలో వచ్చిన మహర్షి అనే సినిమాలో కథానాయకుడిగా నటించి, ఆ సినిమా విజయవంతం కావడంతో ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా చేసుకున్నాడు.ఇప్పటికి టీవీ సీరియల్స్ లో కూడా నటిస్తున్నాడు.

ఇలా చూసుకుంటూ పోతే ఈటీవీ లో చాల సీరియల్స్ మధుర జ్ఞాపకాలుగా ప్రజల గుండెల్లో నిలిచిపోయాయి..

Advertisement
Continue Reading
Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!