Connect with us

Featured

ఈ ఐదుగురు టాప్ హీరోయిన్స్ గా వెలుగు వెలిగారు కాని ఈ రోజు సన్యాసం పుచ్చుకున్నారు

Published

on

జీవిత‌మంటే అంతే. క‌ష్టాలు, సుఖాలు, క‌న్నీళ్లు, ఆనందాలు.. ఎత్తు, ప‌ల్లాలు అన్నీ అందులో ఉంటాయి. అన్నింటినీ మనిషి అనుభ‌విస్తాడు. అవ‌సాన ద‌శ‌లో వైరాగ్యం బాట ప‌డ‌తాడు. చివ‌ర‌కు జీవిత అంకం ముగుస్తుంది. అయితే సాధారణంగా చాలా మంది జీవిత చ‌ర‌మాంకంలో వైరాగ్యం బాట ప‌ట్టి ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. కానీ ఇప్పుడు మేం చెప్ప‌బోయే కొంద‌రు సెల‌బ్రిటీలు మాత్రం జీవితం ఇంకా చాలా మిగిలి ఉన్న‌ప్ప‌టికీ ఆధ్యాత్మిక బాట ప‌ట్టారు. కొంద‌రు అందులో విజ‌య‌వంతంగా ముందుకు సాగుతుంటే కొంద‌రు మాత్రం దానికి బ్రేకులు వేసి తిరిగి య‌థాత‌థ జీవితం కొన‌సాగిస్తున్నారు. అలా ఆధ్యాత్మిక బాట ప‌ట్టిన ప‌లువురు సెల‌బ్రిటీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. మ‌నీషా కొయిరాలా
తెలుగులోనే కాదు, అనేక భాష‌ల్లోనూ మ‌నీషా కొయిరాలా న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈమెకు అండాశ‌య క్యాన్స‌ర్ సోకింది. దీంతో సినీ రంగానికి దూర‌మైంది. అయితే చికిత్స తీసుకుని కోలుకున్నాక ఈమె ఆధ్యాత్మిక బాట ప‌ట్టింది. 2016లో ఉజ్జయినిలో సాధ్విగా మారింది. అయిన‌ప్ప‌టికీ ఈమె ప‌లు బాలీవుడ్ సినిమాల్లో న‌టిస్తుండ‌డం విశేషం.
2. సోఫియా హ‌యత్
బిగ్ బాస్ సీజ‌న్ 7లో పాల్గొని అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది సోఫియా హ‌య‌త్‌. ఈమె ఓ బ్రిటిష్ మోడ‌ల్‌. సింగ‌ర్‌, యాక్ట‌ర్‌గా కూడా రాణించింది. అయితే ఈమె గ‌తంలో స‌న్యాసినిగా మారి అంద‌రినీ షాక్‌కు గురి చేసింది. కానీ ఆ జీవితానికి స్వ‌స్తి చెబుతూ మ‌ళ్లీ ఈమె పెళ్లి చేసుకుని య‌థాత‌థ జీవితాన్ని గ‌డుపుతోంది.
3. మమ‌తా కుల‌క‌ర్ణి
ఈమె ఒక‌ప్పుడు మంచి న‌టిగా గుర్తింపు పొందింది. త‌రువాత స‌న్యాసినిగా మారింది. ఈ క్ర‌మంలో త‌న గురించి ఓ ఆటోబ‌యోగ్ర‌ఫీ పుస్త‌కాన్ని రాసుకుంది. Autobiography Of An Yogini పేరిట ఆ బుక్‌ను విడుద‌ల చేసింది. అయితే ఈమె, ఈమె భ‌ర్త ఇద్దరూ. రూ.2వేల కోట్ల డ్ర‌గ్ స్కాంలో ఇరుక్కున్నారు. ఈ ఏడాది జూన్ 2017లో థానే కోర్టు వీరిని దోషులుగా ప్ర‌క‌టించింది.
4. బ‌ర్కా మ‌ద‌న్
ఈమె కూడా ప‌లు సినిమాల్లో న‌టించి న‌టిగా గుర్తింపు పొందింది. అయితే బౌద్ధ గురువు ద‌లైలామా ప్ర‌వ‌చ‌నాల ప‌ట్ల ఈమె ఆక‌ర్షితురాలైంది. దీంతో ఆమె 2012లో బుద్ధిజం తీసుకుంది. స‌న్యాసినిగా మారింది. Ven Gyalten Samten అనే పేరు పెట్టుకుంది. అప్ప‌టి నుంచి బ‌ర్కా మ‌ద‌న్ స‌న్యాసి జీవితాన్ని గ‌డుపుతోంది.
5. సుచిత్రా సేన్
ఈమె 25 ఏళ్ల పాటు న‌టిగా రాణించింది. అయితే ఇంట్లో నెల‌కొన్న అశాంతి కార‌ణంగా ఈమె దృష్టి ఆధ్యాత్మిక‌త వైపు మ‌ళ్లింది. రామ‌కృష్ణ మఠంలో చేరింది. సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంది. స్వామి వివేకానంద అడుగుజాడ‌ల్లో న‌డిచింది. 2014 జ‌న‌వ‌రి 17న ఈమె త‌న 84వ ఏట మ‌రణించింది.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!