Connect with us

Featured

ఈ మిశ్రమం రాస్తే నడుము నొప్పి జన్మలో రాదు ఎలానో తెలుసుకొని అందరికి తెలియజేయండి.

Published

on

నడుము నొప్పి కి చిట్కాలు

కొందరికి తరచూ వెన్ను నొప్పి బాధిస్తూ ఉంటుంది. బ్యాక్ పెయిన్ కు వివిధ రకాల కారణాలున్నాయి. బ్యాక్ పెయిన్ కు చిన్న సమస్యల నుండి పెద్ద సమస్యల వరకూ కారణాలే. కూర్చొనే భంగిమ సరిగాలేప్పుడు లేదా ఎక్కువ సమయం కూర్చొని పనిచేయడం, తీవ్రమైన వ్యాయామాలు చేయడం, యాక్సిడెంట్స్, రోజులో ఎక్కువసేపు బైక్ డ్రైవ్ చేయడం వంటివి బ్యాక్ పెయిన్ కు కారణాలవుతున్నాయి. ఏది ఏమయినా ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా నడుం నొప్పి (బ్యాక్ పెయిన్) వచ్చి తెగ ఇబ్బంది పెడుతోంది. దీనికి చక్కని సహజ సిద్ధమైన ఖర్చు లేని చిట్కాలు మీకోసం..

Advertisement

చిట్కాలు:

*కొద్దిగా అల్లం తీసుకుని పేస్ట్ లా చేసుకుని నడుం నొప్పి ఉన్న చోట రాయాలి. 20 నిమిషాలసేపు ఉంచి తర్వాత కడిగేయాలి. ఇలా తరచుగా చేస్తూ ఉంటే నడుం నొప్పి తగ్గుముఖం పడుతుంది.

*దీనికి కొన్ని అల్లం ముక్కలు, తేనె కావాలి. ముందుగా ఓ బౌల్ లో వాటర్ వేసుకుని స్టవ్ పై ఉంచి బాయిల్ చేస్తూ ఉండాలి. అందులో అల్లం ముక్కలు వేసి కాసేపు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ అల్లం రసం కొద్దిగా చల్లారిన తర్వాత కొద్దిగా తేనె వేసుకుని తాగితే నడుం నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది కూడా పరగడపున తాగాలి. రెగ్యులర్ గా చేస్తే నొప్పి తగ్గుముఖం పడుతుంది.

Advertisement

*వెల్లుల్లి పేస్ ను ఓ గ్లాస్ వాటర్ లో కరిగించుకుని తాగాలి. ఇలా తరచుగా చేస్తూ ఉంటే నడుం నొప్పి నుంచి రిలీఫ్

*పసుపు, అల్లం రసం, పాలు కావాలి. గోరువెచ్చని పాలలో కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం రసం బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఆ పాలను పరగడపున తాగితే బెస్ట్ రిజల్ట్ వస్తుంది.

*ఆవనూనె, నువ్వుల నూనె రెండూ సమాపాళ్లలో తీసుకుని నడుం నొప్పి ఉన్నచోట మర్దన చేయాలి. తరచుగా ఇలా చేస్తూ ఉంటే నొప్పి మటుమాయం.

Advertisement

*శొంటి గంథాన్ని తీసుకుని నడుం పై భాగాన పట్టీలా రాసుకోవాలి. అలా కాసేపు ఉంచితే నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది.

*నిటారుగా కూర్చుని డ్రైవింగ్ చేయాలి. వెన్నును వంచకుండా కూర్చోవడం వల్ల వెన్ను, నడుం నొప్పులు తగ్గుముఖం పడతాయి. రెండు పాదాలు కింద ఆనేలా కుర్చీలో కూర్చోవాలి.

*వెన్నుపూసకు బలాన్నిచ్చే మినపప్పు రెగ్యులర్ గా తినాలి. వారానికి రెండు సార్లయినా మినప్పప్పుతో చేసిన ఆహారం తినాలి. రోజువారీ డైట్ ఈ పప్పు ఉండేలా చూసుకుంటే వెన్నుపూసకు సరైన పోషకాలంది బలోపేతం అవుతుంది.

Advertisement

*కొబ్బరినూనెలో కర్పూరం బిళ్లలు వేసి బాగా కరిగిన తర్వాత నడుం నొప్పి ఉన్న చోట రాస్తే దెబ్బకు రిలీఫ్ వస్తుంది.

*పల్చటి మజ్జిగలో కొద్దిగా సున్నం తేటను కలిపి పరగడపున తాగాలి.

*కొబ్బరినూనె, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలో కొబ్బరినూనె వేసి ఉంచుకోవాలి. దంచి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లిపాయలను అందులో వేసుకోవాలి. బాగా మరిగిపోయాక పక్కన పెట్టుకోవాలి. ఈ ఆయిల్ నడుం నొప్పి ఉన్నచోట రాసుకోవాలి. అల్లంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నడుం నొప్పిని నివారిస్తాయి.

Advertisement

*తులసి ఆకులు, రాళ్ల ఉప్పు తీసుకోవాలి. ముందుగా ఒక బౌల్ లో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. అందులో తులసి ఆకులు వేసుకుని తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ నీటిని రోజూ పరగడపున తాగితే నడుం నొప్పికి చక్కటి పరిష్కారం. తులసి ఆకుల్లో ఉన్న ఆయుర్వేద గుణాలు నడుం నొప్పిని తిప్పికొడతాయి.

ఇందులో ఏ ఒక్కటి క్రమం తప్పకుండా ఆచరించినా మీ నడుం నొప్పి త్వరలోనే తగ్గుముఖం పడుతుంది. అంతేకాదు సహజసిద్ధమైన మార్గంలో నడుం నొప్పిని తగ్గించుకుంటే తిరిగి మళ్లీ రాదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Continue Reading
Advertisement

Featured

ITR FIling : గడువు పెంచలేదు.. ఫేక్ న్యూస్ నమ్మొద్దు.. “జూలై 31వ తేదీలోపు మీ ITR ఫైల్ చేయండి”.. కీలక ప్రకటన చేసిన ఐటీ శాఖ

Published

on

ITR ఫైలింగ్ : పన్ను చెల్లింపుదారులకు ముఖ్యమైన గమనిక. మీరు FY 2023-2024 కోసం మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఇంకా ఫైల్ చేయలేదా? ఆదాయపు పన్ను శాఖ మరో కీలక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 31లోగా ఐటీ రిటర్నులు సమర్పించాలని కోరింది ఐటీ శాఖ. మరో నెల రోజులు గడువు పెంపుపై వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలింది. పన్ను చెల్లింపుదారులు ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మవద్దని సోషల్ మీడియా ఎక్స్ లో సూచించింది.

గడువు 4 రోజులు మాత్రమే. జూలై 31వ తేదీలోపు ITR ఫైల్ చేయాలి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ వీలైనంత త్వరగా రిటర్నులు సమర్పించాలని ఐటీ శాఖ సూచించింది. పన్ను పోర్టల్ లో ఎటువంటి సాంకేతిక సమస్య లేదు. మీరు గడువు సమయంలోపు ITR ఫైల్ చేయకపోతే, మీరు సెక్షన్ 234A కింద వడ్డీని మరియు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 234F కింద జరిమానా చెల్లించవలసి ఉంటుంది.

మరోవైపు ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసి వాపసు కోరుతున్న వారిని కూడా ఐటీ శాఖ హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు ఫోన్లలో మెసేజ్ లు పంపుతూ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసిందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఇలాంటి ఫేక్ మెసేజ్‌లను చూసి మోసపోకండి మరియు రీఫండ్ కోసం మీ బ్యాంక్ ఖాతా వివరాలు మరియు వన్-టైమ్ పాస్‌వర్డ్‌లను అడుగుతూ మీకు కాల్ వస్తే అప్రమత్తంగా ఉండండి. అటువంటి లింక్‌లపై క్లిక్ చేయవద్దు. ఇప్పటి వరకు 5 కోట్ల మంది పన్ను రిటర్నులు దాఖలు చేసినట్లు గుర్తించింది. వీరిలో ఇప్పటికే 1.8 మిలియన్ల రిటర్న్‌లు ప్రాసెస్ చేయబడి, రీఫండ్ ఖాతాలకు జమ అయినట్లు కూడా తెలిపింది.

Advertisement

Continue Reading

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!