Connect with us

Movie News

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు వీళ్ళంతా టాప్ హీరోయిన్స్..ఎలా ఉన్నారో తెలుసా.. ??

Published

on

మనం తెలుగు వాళ్ళం. సినిమాలు చాలా బాగా చూస్తాము. సినిమా మీద ప్రశ్నలు అడిగితే టక్కున సమాధానం చెప్పేయగలం మనం. అయితే ఇక్కడ మీకోసం ఒక ప్రశ్న. మనం చిన్నప్పుడు చూసిన “మనసంతా నువ్వే, జై చిరంజీవ, ఆర్య, అరుంధతి” ఈ సినిమాలు గుర్తున్నాయా! అయ్యో! అవెందుకు గుర్తులేవు…చిన్నపుడు తెగ చూశాం ఆ సినిమాలు అనుకుంటునారా? అయితే ఆ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌లు గా నటించిన చిన్న పిల్లలు కూడా గుర్తు ఉండే ఉంటారు. కాలం మారుతూ ఉంటుంది. మన వయస్సు పెరిగింది అప్పటికీ ఇప్పటికీ…మరి మనతో పాటు ఆ సినిమాల్లో నటించించిన చిన్న పిల్లల వయసు కూడా పెరిగే ఉంటది కదా? వాళ్ళు ఇప్పుడు పెద్ద వాళ్ళు అయ్యే ఉంటారు కదా? మరి ఇప్పుడు ఎలా ఉన్నారు అంటారు? అప్పటి చైల్డ్ ఆర్టిస్ట్స్ ఇప్పుడు ఎలా ఉన్నారో ఏంచేస్తున్నారో చూడండి!

సుహాని కలిత

సినిమా లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది సుహాని . తెలుగుతోపాటు హిందీ, మలయాళం, బెంగాళీ చిత్రాలలో నటించింది. సుహాని వాళ్ల స్వస్థలం ముంబై. సుహాని 1901, డిసెంబర్ 25న హైదరాబాద్ లో జన్మించింది. పాఠశాల విద్య నుండి ఉన్నత విద్య వరకు హైదరాబాద్ లోనే చదివింది. సుహానీ, 1996లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణం చిత్రంలో బాలనటిగా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తరువాత కొన్ని తెలుగు, ఒక హిందీ, ఒక బెంగాళీ సినిమాలలో బాలనటిగా నటించింది. 2008లో బి. జయ దర్శకత్వంలో వచ్చిన సవాల్ సినిమాతో హీరోయిన్ గా మారింది. బాలనటి గా 40 చిత్రాల, హీరోయిన్ గా 11 చిత్రాలలో నటించంది.

Advertisement

శ్రియ శర్మ


‘జై చిరంజీవ’ సినిమాలో చిరంజీవి మేన కోడ‌లుగా న‌టించిన పాప గుర్తిందిగా. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాష సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. శ్రియ శర్మ తన మూడేళ్ళ వయసులో బాలనటిగా తన కెరీర్ ప్రారంభించి శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన నిర్మలా కాన్వెంట్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. శ్రియా శర్మ హిమాచల్ ప్రదేశ్ లోని పాలంపూర్ లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ప్రస్తుతం శ్రియ శర్మ ముంబై విశ్వవిద్యాలయంలో చదువుతోంది. నిర్మ‌ల కాన్వెంట్‌లో చేసిన హీరోయిన్ శ్రియ శ‌ర్మ‌. ఆ సినిమాతో హీరోయిన్‌గా అవ‌కాశాలు వ‌స్తాయ‌నుకుంది. కానీ అది ఫ్లాప్ కావ‌డంతో ఎలాగైనా హీరోయిన్ అవ‌కాశాలు అందుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది. ఇందుకోసం గ్లామ‌ర్ డోస్ పెంచేందుకు కూడా సిద్ధం అయింద‌ని టాక్‌. చూద్దాం ఈ అమ్మ‌డి ఆఫ‌ర్‌ని ఏ డైరెక్ట‌రైనా ఉప‌యోగించుకుంటాడో చూడాలి మరి.

శ్రావ్య

బాలనటిగా తెలుగు సినిమారంగానికి పరిచయమైన శ్రావ్య 2014లో వచ్చిన లవ్ యు బంగారమ్ సినిమాతో హీరోయిన్ గా మారింది. శ్రావ్య హైదరాబాద్ లో జన్మించింది. విజ్ఞానజ్యోతి ఇన్సిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లో బిటెక్ పూర్తిచేసింది. చిన్నతనం నుండి నటనపై ఇష్టం ఉన్న శ్రావ్య బాలనటిగా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించి సందడే సందడి, నేను సీతామహాలక్ష్మి, ఆర్య, ఔనన్నా కాదన్నా వంటి చిత్రాలలో బాలనటిగా నటించింది. 2014లో వచ్చిన లవ్ యు బంగారమ్ సినిమాతో హీరోయిన్ గా మారి కాయ్ రాజా కాయ్, నందిని నర్సింగ్‌హోం వంటి సినిమాలలో నటించింది. వెల్లికిజామై 13ఏఏం తేతి సినిమాతో తమిళ సినిమారంగంలోకి ప్రవేశంచి పగిరి, విలైయట్టు ఆరంభం వంటి చిత్రాలలో నటించింది.

దివ్య నగేష్

అరుంధతి సినిమా రిలీజై ఇప్పటికే దశాబ్ధం పైగా అయ్యింది. ఆ సినిమా ఎప్పటికీ టాలీవుడ్ లో డిష్కసన్ పాయింట్. అందులో జేజమ్మగా స్వీటీ అనుష్క అసమాన నటన కనబరిచింది. స్వీటీతో పోటీపడుతూ .. అదే చిత్రంలో దివ్య అనే చిన్నారి అద్భుతంగా నటించి అందరిచేతా జేజేలు అందుకుంది. దివ్య బుల్లి .జేజమ్మగా అద్భుతమైన ప్రతిభను కనబరిచింది. ఆ తర్వాత దివ్య తెలుగు తమిళ్ లో కథానాయికగా ఎటెంప్ట్ చేసింది. తెలుగులో నేను నాన్న అబద్ధం అనే చిత్రంతో కథానాయికగా పరిచయమైంది. కానీ ఎందుకనో కెరీర్ లో నిలదొక్కుకోలేకపోయింది. ప్రస్తుతం ఓ కోలీవుడ్ సినిమాలో నటిస్తూ టచ్ లోకి వచ్చింది. కథానాయికగా ఇటీవలి కాలంలో గ్యాప్ రావడానికి కారణం ఎడ్యుకేషన్ లో బిజీ చేస్తుంది. ప్రస్తుతం గాయకుడు మనో కొడుకు షకీర్ కి జంటగా నటిస్తుంది. ఓ వైపు ఎంజీఆర్ యూనివర్శిటీ బీబీఎ సెంకండియర్ చదువుతూనే సినిమాల్లో నటన కొనసాగిస్తుంది దివ్య.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!