Connect with us

Movie News

కొడుకు కోసం ఆ ప్రముఖ నటి రోడ్డు పక్కన దోసెలు వేసి అమ్ముకుంటుంది

Published

on

బట్టలు… నగలు… పర్‌ఫ్యూమ్స్… ఓ సినీతార, టీవీ సెలబ్రిటీ సొంత వ్యాపారం అనగానే గుర్తొచ్చేవి ఇవేనా..? కానీ ఒక్కసారి మనం నేషనల్ హైవే 66… కేరళ, తమిళనాడు మధ్యలో… నెయ్యతినకర దగ్గర… అక్కడ ఓ నటి… పేరు కవితా లక్ష్మి… మళయాళ సీరియల్ స్త్రీధనంలో ఫేమస్… ఆమె ఓ అసాధారణ వృత్తిలో కనిపిస్తుంటుంది… మూడు వారాలుగా ఇదే సీన్… సాయంత్రం నుంచి అర్ధరాత్రి దాకా… హైవే పక్కన నిలబడి దోసెలు వేస్తూ కనిపిస్తుంది… ఆమ్లెట్లు, బీఫ్ కర్రీ కూడా…!

నిజమే… అబద్ధం కాదు… 43 సంవత్సరాల ఈ నటి ఏదో పాత్రలో నటించడం లేదు… ఆమె ఆ రోడ్డు పక్కన సెంటర్‌లో చెమటలు కక్కుతూ జీవిస్తుంటుంది… అయ్యో, అయ్యో, ఎందుకమ్మా ఇలా..? అనడిగాం అనుకొండి… ‘ఏం చేద్దాం సార్..? మా అబ్బాయి ఆకాష్ కృష్ణను బ్రిటన్‌లో ఓ కోర్సులో జాయిన్ చేశాను…

Advertisement

ఖర్చులకు నా సంపాదన సరిపోవడం లేదు అని నిర్మొహమాటంగా చెప్పేస్తుంది… ‘‘బ్యాంకులేమో లోన్లు ఇవ్వవు… తాకట్టు పెట్టడానికో, గ్యారంటీ ఇవ్వడానికో నాకేమో భూముల్లేవ్, సరిపడా ఆస్తుల్లేవ్, ఓ చిట్టీ కడుతున్నా… వాడేమో ముందే ఇవ్వరా అంటే వీలుకాదుపో అంటున్నాడు…’’ అని వివరిస్తుంది ఆమె…

‘ప్చ్, ఒక ఇంటిపైనో, భూమిపైనో నేను పెట్టుబడి పెట్టకపోవడంపై ఇప్పుడు అసంతృప్తి ఫీలవుతున్నా… నా సంపాదనంతా పిల్లల చదువుకే ఖర్చు… సొంతిల్లు కన్నా అదే ముఖ్యం అనుకున్నాను…’ అంటున్నది ఆమె…… పదేళ్లుగా ఆమె అదే నెయ్యతినకర దగ్గర ఓ రెంటెండ్ ఇంట్లో ఉంటుంది..

ఆమెకు కొడుకే కాదు, ఉమా పార్వతి అనే ఓ కూతురు కూడా ఉంది… పదో తరగతి… కవిత 13 ఏండ్ల క్రితమే భర్త నుంచి విడిపోయింది… ఇలాంటి ఏ విషాదాల్లోనైనా భార్యల బాధితులుగా మిగులుతారు, బాధ్యతలు పైన పడతాయి అనేది తెలుసు కదా… ఆమె సంపాదన సరిపోవడం లేదు మరి… ఏం చేయాలి..? ‘‘అందుకే ఈ మార్గం ఎంచుకున్నా… నా వ‌ృత్తి, నా గౌరవం… తప్పేం ఉంది..? నా అవసరాలు ముఖ్యం కదా’’ అంటున్నదామె….

Advertisement

‘‘మేం ఇలా రోడ్డు పక్కన సెంటర్లలో బోలెడు సార్లు తినేవాళ్లం… ఫ్రెష్… గరం… కెమికల్స్ ఉండవ్, ప్రిజర్వేటివ్స్ ఉండవ్… పెట్టుబడి తక్కువ… నా పిల్లలకు ఏం చేసి పెట్టానో అవే ఇప్పుడు అందరికీ చేసి పెడుతున్నా… అంతే… నా బిడ్డ కూడా నాకు సాయం చేస్తుంది…’’ అంటున్న ఆమె నిజానికి టీవీలో పెద్ద స్టార్… స్త్రీధనంలో శాంత అనే నెగెటివ్ రోల్‌లో బాగా పాపులర్… సాల్ట్ అండ్ పెప్పర్; అయలుమ్ జానుమ్ తమ్మిల్, మమ్ముట్టి నటించిన తప్పన వంటి సినిమాల్లోనూ నటించింది…

ఇప్పుడు అయలాటే సుందరి అనే సీరియల్‌కు వర్క్ చేస్తున్నది… టీవీ నిర్మాతలకు ఆమె ముందే చెబుతున్నది… తన స్థితి ఏమిటో, తను సాయంత్రాలు ఎక్కడ ఏం పనిచేస్తున్నదో… అందుకే డే షూటింగులో మాత్రమే నటిస్తూ సాయంత్రాలు ఇలా అదనపు సంపాదన కోసం నానా ఇక్కట్లూ పడుతున్నది… త్వరగా సెట్ నుంచి వెళ్లడానికి, కాస్త ఆలస్యంగా ఉదయం హాజరు కావటానికి టీవీ సీరియల్ దర్శకులు కూడా వోకే అంటుంటారు…

‘‘ఏం చేస్తాం సార్..? మొదట్లో మా దోసె బండ కేవలం 20 దోసెలకే సరిపోయేలా ఉండేది… ఇప్పుడు దాన్ని 40 దోసెలు వేసేలా అప్‌గ్రేడ్ చేసుకున్నాం… మా అమ్మ చెప్పేది… మాడిన మొహంతో సర్వ్ చేయొద్దు, నవ్వు మొహంతో ఫుడ్ పెడితే కస్టమర్ సంతోషమే వేరు… అన్నం వడ్డిస్తుంటే అంత తెల్లగా నీ మొహంలో నవ్వు ఉండాలి అని….’’ అంటున్నది..

Advertisement

ఆమె… అన్నట్టు చెప్పలేదు కదూ… ఆమె తన కెరీర్‌ను ఇరవయ్యేళ్ల క్రితం స్టార్ట్ చేసింది… ‘‘నాకు లగ్జరీ లైఫ్ అవసరం లేదు… నా పిల్లలు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడాలి… అప్పటివరకూ కష్టపడుతూనే ఉంటా’’ అంటున్నది ఈ తల్లి… సూపర్… కంగ్రాట్స్ తల్లీ…. మరో మాట… సరదాాగా మన తెలుగు టీవీల్లోని ప్రముఖ నటీమణుల్ని ఒక్కసారి ఊహించుకొండి… ఎంతమంది ఇలా రోడ్డు పక్కన దోసెలు వేస్తూ పిల్లల కోసం నాలుగు పైసలు సంపాదించుకోగలరు..? ఊరికే… సరదాగా…!!

Advertisement
Continue Reading
Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!