Connect with us

Featured

గుడ్ న్యూస్: జీఎస్టీలోకి పెట్రోల్, డీజిల్.. రూ.40లకే పెట్రోల్!!

Published

on

భారత ప్రభుత్వం ఒకే దేశం ఒకే పన్ను అనే పేరిట చారిత్రాత్మకంగా ప్రతిష్టాత్మకంగా జీఎస్టీ ని అమలు చేస్తోంది. ఈ చట్టం అమలులో కి వచ్చినప్పటి నుండి అందులో ఎన్నో వాటికి మినహాయింపులు పన్ను శాతాన్ని తగ్గిస్తూ పెంచుతూ ఎన్నో మార్పులు చేస్తూ వచ్చింది.. అయితే పరోక్షంగా భారీ లాభాలను తెచ్చిపెడుతున్న పెట్రోలియం డీజిల్ వంటి వాటిని ఈ చట్టం పరిధిలోకి తీసుకు రాలేదు. ఇక ఈ నేపధ్యం లో పెట్రోల్, డీజీల్‌లను కూడ జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్రప్రధాన్ ఇటీవల కాలంలో డిమాండ్ చేస్తున్నారు.

ఈ విషయమై జిఎస్‌టి కౌన్సిల్‌ను కోరనున్నట్టు ఆయన ప్రకటించారు. పెట్రోలియం ఉత్పత్తులను జిఎస్‌టి పరిధిలోకి తీసుకువస్తే రాష్ట్రాలు భారీగా ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనకు రాష్ట్రాలు ఒప్పుకొనే అవకాశం లేకపోవచ్చనే వాదనలు కూడ విన్పిస్తున్నాయి. ఈ చమురు ధరలను తగ్గాలంటే జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి ధర్మేంధ్రప్రధాన్ అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ సాగుతోంది. పెట్రోలియం ఉత్పత్తును జిఎస్‌టి పరిధిలోకి తెచ్చే విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

Advertisement

కొందరు దీనికి అనుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పెట్రోలియం ఉత్పత్తులను జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ఆర్థికశాఖకు ఇంధనశాఖ కోరింది. వివిధ రాష్ట్రాల్లో పెట్రోలియం ఉత్పత్తులపై పలు రకాల పన్నులు ఉండడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా తగ్గినా కానీ, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు మాత్రం తగ్గలేదు. దీంతో జిఎస్‌టి పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులను తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది.

ఈ అంశాన్ని పరిశీలించాలని ఇంధనశాఖ కోరింది. అయితే ఆర్థికశాఖ ఈ విషయమై ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. జిఎస్‌టి కౌన్సిల్ తీర్మానం చేస్తే మాత్రం పెట్రోలియం ఉత్పత్తులు జిఎస్‌టి పరిధిలోకి చేర్చక తప్పని అనివార్య పరిస్థితులు నెలకొంటాయి. ఒకవైపు పెట్రోల్, డీజీల్‌పై లీటర్‌కు పలు రకాల పన్నులను వినియోగదారుడు చెల్లిస్తున్నాడు. మరోవైపు ఎక్సైజ్ పన్నును కేంద్ర ప్రభుత్వం విధిస్తోంది. వ్యాట్‌ను రాష్ట్రాలు విధిస్తున్నాయి.

ఆయా రాష్ట్రాలు డీలర్ కమీషన్‌తో కలిపి వ్యాట్‌ ఛార్జీలను వినియోగదారులపై మోపుతున్నాయి. నిజానికి లీటర్ పెట్రోల్ ధర రూ.30.70, అయితే కేంద్రం విధించే ఎక్సైజ్ డ్యూటీ రూ.21.48, రాష్ట్రాలు విధించే పన్ను రూ.27, ఇందులో వ్యాట్ రూ.14.96, డీలర్ కమీషన్ రూ.3.24 ఉంటుంది. ఈ పన్నులన్ని కలిపి లీటర్ పెట్రోల్ ధర రూ.70.38కు చేరింది. అయితే ప్రతిరోజూ పెట్రోల్, డీజీల్ ధరల్లో మార్పులు ఉంటున్నాయి.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!