Connect with us

Featured

చెమటతో బట్టలు తడిసిపోయేవి.. ఉదయభాను రియల్ లైఫ్ స్టొరీ తెలిస్తే హ్యాట్సఫ్ అంటారు

Published

on

డ్యాన్స్ బేబి డ్యాన్స్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఉదయభాను. బుల్లి తెరపై, వెండి తెరపై ఈమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. దాదాపు 15 సంవత్సరాలు ఈమె బుల్లి తెరను ఏలింది అంటే అతిశయోక్తి కాదు. ఏ ప్రోగ్రాం చేసినా, ఏ స్టేజ్‌ షో చేసినా ఆ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చేది.

బుల్లితెర మహారాణి.. మాటల మాంత్రికురాలు.. ఇలా ఒకటేంటి ఉదయభాను గురించి ఎన్ని చెప్పినా తక్కువే..అంటారు అభిమానులు….ఆమె దాదాపు సంవత్సరంన్నర కాలంగా బుల్లితెరకు దూరంగా ఉంటోంది.

Advertisement

బుల్లితెర శ్రీదేవిగా పేరు తెచ్చుకున్న ఆమె అంతకంటే అందమైన మనసు కూడా ఉందని ఎన్నో సందర్భాల్లో రుజువుచేసుకున్నారు. అతి చిన్న వయసులో కెరీర్‌ ప్రారంభించి ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొని స్వశక్తితో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.

ఏడాది కిందట కవల పిల్లలకు జన్మనిచ్చి మూడేండ్ల విరామం తర్వాత ‘నీతోనే డ్యాన్స్‌’ షోతో మళ్ళీ తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆమెతో మానవి చిట్‌చాట్‌…
సుమారు మూడేండ్ల తర్వాత మళ్ళీ తెరపైకి వచ్చారు.


ఈ సమాజంలో మహిళలుగా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాం. నరరూప రాక్షసుల మధ్య బతుకుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లలకు రక్షణ చాలా అవసరం. స్త్రీ శక్తిని తక్కువగా అంచనా వేస్తున్నారు. స్త్రీ తలచుకుంటే ఏమైనా చేయగలదు. ప్రతి ఆడపిల్ల ఓ శక్తిగా మారి ఈ దుష్ట సమాజంపై తిరుగుబాటు చేయాలి.

ధైర్యంగా సమస్యలను ఎదుర్కొవాలి. ఒక్కోసారి మనల్ని రక్షించాల్సిన చేతులే మన పీక పిసికే పరిస్థితి వస్తున్నది. అలాంటి వాటిని కూడా ఎదుర్కొనే ధైర్యం అమ్మాయిలకు ఉండాలి. అని అంటుంది ఉదయభాను…

Advertisement

ఉదయభాను పుట్టింది కరీంనగర్‌ దగ్గర కొహెడ. అమ్మ అరుణ, ఆయుర్వేద డాక్టర్‌. నాన్న ఎస్‌.కె పటేల్‌. నాన్న కూడా డాక్టరే. అయితే నాలుగేండ్ల వయసులోనే నాన్న చనిపోయారు. ఆయన చాలా దాన ధర్మాలు చేసేవారు. వందల ఎకరాలు దానం చేసిన గొప్ప దాత. కష్టపడేతత్వం వారి నుంచే తనకు వచ్చిందని, వారిచ్చిన ధైర్యంతోనే చిన్నతనం నుంచే మోయలేనన్ని భారాలు తనమీద ఉన్నా ముందుకు నడవగలిగానని అంటుంది ఉదయభాను.

అమ్మ డ్యాన్స్‌ నేర్పించింది. స్టేజ్‌ షోలు చేసేదాన్ని. అక్కడ నన్ను చూసి సినిమాల్లో అవకాశం ఇచ్చారు. మొదట చేసింది ఎర్రసైన్యం సినిమాలో. అప్పుడు ఎత్తు పెరిగాను గానీ చాలా చిన్నదాన్ని. డైలాగులు చెప్పడానికి వణికిపోయేదాన్ని. చెమటతో బట్టలు తడిసిపోయేవి.

అలాంటిది ‘హృదయాంజలి’ షో వందల మందిలో మైక్‌ పట్టుకున్నాను. అప్పుడు ఆ ధైర్యం ఎలా వచ్చిందో నాకే తెలియదు. బహుశా జీన్స్‌ నుంచి వచ్చిన ధైర్యమేమో. ‘నిగ్గిదీసి అడుగు’ వంటి ఛాలెంజింగ్‌ షోస్‌ కూడా అదే ధైర్యంతో చేయగలిగాను. అంటూ చెప్పుకోచింది ఉదయభాను..

Advertisement

నా పిల్లల్ని ఆడపులుల్లా పెంచుతాను. ఈ సమాజంలో అమ్మాయిలు అలా ఉంటేనే బతకగలరు. మమ్మల్ని కాపాడండీ అంటూ ఆర్తనాదాలు చేయకూడదు. దాడి చేసే వారిపై తిరగబడాలి. అందుకే ఆడపిల్లలకు కేవలం డ్యాన్స్‌, సంగీతం నేర్పిస్తే సరిపోదు. సెల్ఫ్‌డిఫెన్స్‌ కూడా నేర్పించాలి.

ఎక్కడి నుంచి ఏ రాక్షసుడు వస్తాడో తెలియదు. ఎలా వేధిస్తాడో తెలియదు. వారి బారి నుంచి తమను తాము కాపాడుకునే ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఆడపిల్లలకు ఇవ్వాలి. ఏడిస్తే ఇంకా ఇంకా ఏడిపిస్తారు. అందుకే ఏడ్చి కన్నీళ్ళను వృధా చేసుకోకూడదు అంటూ చెప్పుకొచ్చింది ఉదయభాను..

ఇవన్నీ నా అనుభవాల నుంచి నేర్చుకున్నాను. మన వైపు వేలెత్తి చూపించే వాళ్ళ వేలుని విరగ్గొట్టాలి. ప్రేమ పంచడంతో పాటు తేడా వస్తే తాట తీయాలి. ఇవన్నీ నా పిల్లలకు నేర్పిస్తాను. దీని గురించే ఓ పుస్తకం కూడా రిలీజ్‌ చేయాలనుకుంటున్నాను. దానికోసం ఓ సాంగ్‌ కూడా రాశాను. అయితే నేను పెన్ను కదిలిస్తే విప్లవం వచ్చేస్తుందేమో అని ఆలోచిస్తున్నాను. కానీ పుస్తకం వివరాలు కూడా త్వరలోనే మీడియాకు చెబుతాను.

Advertisement

బలం, ధైర్యం తన భర్తేనని, ముందు మేం ఆర్థికంగా స్థిరపడాలనుకున్నామని, అన్నేండ్ల తమ ప్రేమకు సాక్షాలే తమ కవల పిల్లలని, వాళ్ళను చూస్తే తన ఒత్తిడి మొత్తం ఇట్టే ఎగిరిపోతుందని అంటోంది ఉదయభాను. తమ పెండ్లి చాలా స్ట్రగుల్‌ పడి చేసుకున్నామని, జీవితం అనుక్షణం ఓ యుద్ధం. ఆ యుద్ధంలో జయిస్తేనే బతుకు. విజరు అనే సోల్జర్‌ నా పక్కన ఉన్నన్ని రోజులు విజయం నాదే అని అంటోంది ఉదయభాను…

సమస్యలు లేకుండా జీవితమే ఉండదు. ‘భయం తలుపు తట్టింది.. ధైర్యం తలుపు తీసింది ఎదురుగా ఎవరూ లేరు’. ఇది నాకు బాగా నచ్చిన వాక్యం. ఛాలెంజెస్‌ వచ్చినప్పుడే మనలో ఉన్న శక్తి ఏమిటో మనకు తెలుస్తుంది. నా దృష్టిలో స్త్రీ ఎప్పటికీ ఒంటరి కాదు. తనలోపల ఓ శక్తి స్వరూపిణి దాగి ఉందని ఎప్పుడూ మర్చిపోకూడదు. సమస్య వచ్చినప్పుడు ప్రతి స్త్రీకీ తనని తానే ఓ సైన్యంగా మార్చుకునే సత్తా ఉంటుంది. ఎలాంటి సవాల్‌ ఎదురైనా ధైర్యంగా నిలబడగలుగుతుంది. దీనికి నేనే ఓ మంచి ఉదాహరణ.

స్ట్రాంగ్‌గా ఉండాలి. మనల్ని మనం నమ్ముకోవాలి. తొందర తొందరగా పైకి వచ్చేయాలనే ఆరాటం ఉండకూడదు. మన కష్టాన్నే నమ్ముకోవాలి. కష్టపడితే ఫలితం కచ్చితంగా ఉంటుంది. అన్నింటికంటే ముందు మనలోని ఆత్మవిశ్వాసాన్ని ఎప్పటికీ చెక్కుచెదరనీయకూడదు. చిన్న వీక్‌ పాయింట్‌ దొరికినా మనతో ఆడుకోడానికి చాలా మంది ఎదురుచూస్తుంటారు. అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. అధైర్యానికి తావు ఇవ్వకూడదు. అంటూ ఒక సక్సెస్ ఫుల్ మహిళ గా తన మనోభావాన్ని ఆవిష్కరించింది…ఉదయభాను…

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!