Connect with us

Featured

దసరా నవరాత్రుల్లో ఈ పనులు చేస్తే జీవితాంతం కష్టాలేనట!!

Published

on

గతం కంటే వైభవంగా ఈ ఏడాది దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీకగా ఈ వేడుకను చూస్తున్న కేసీఆర్ ఏడాదిలో వచ్చే అన్ని పండుగల కంటే దసరాకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. బతుకమ్మ ఆటల కోసం తెలంగాణ ఆడపడుచులందరికీ ప్రభుత్వం తరపున చీరలు సైతం పెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఆంధ్రుల రాజధానిగా సరికొత్త వైభవంతో భాసిల్లుతున్న విజయవాడలో కనకదుర్గ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు సైతం అంగరంగ వైభవంగా జరిపేందుకు అక్కడి ప్రభుత్వం ఎప్పుడూలేనంతగా ఏర్పాట్లు చేసింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలూ ఆధ్యాత్మిక శోభతో ఓలలాడుతున్నాయి. వాడ వాడలా మునుపెన్నడూ లేనంతగా అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేశారు. 9 రోజుల పాటు న‌వ‌రాత్రులతో ఊరూ వాడా మార్మోగనున్నాయి. అయితే ఈ ఉత్సవాలు జ‌రిగిన‌న్ని రోజులు కొన్ని సూచ‌న‌లు పాటించాల్సి ఉంటుందని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. అవేమిటో, వాటి వ‌ల్ల ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

* హెయిర్ క‌ట్

న‌వ‌రాత్రులు జరిగినన్నిరోజులు ఎవ‌రూ హెయిర్ క‌ట్ చేయించుకోకూడ‌ద‌ట‌. అలాగే గుండు చేయించుకోవ‌డం వంటి కార్యక్రమాల‌ను కూడా పెట్టుకోకూడ‌ద‌ట‌. ఎందుకంటే అలా చేస్తే దుర్గా దేవి ఆగ్రహిస్తుంద‌ట‌. దీంతో భ‌క్తుల‌కు క‌ష్టాలు ఎదుర‌వుతాయట.

Advertisement

* క‌ల‌శం

ఇంట్లో దుర్గాదేవికి పూజ చేసేప్పుడు అమ్మవారి ఎదుట క‌ల‌శం ఉంచాలి. అలాగే దేవి ఎదుట అఖండ జ్యోతి వెలిగించాలి. అది 9 రోజుల పాటు ఆరిపోకుండా చూడాలి. ఇక ఇంట్లో 9 రోజుల పాటు ఖచ్చితంగా ఎవ‌రో ఒక‌రు ఉండాలి. అంతేకాని ఎవ‌రూ లేకుండా ఇంటికి తాళం పెట్టరాదు. అలా చేయ‌డం వ‌ల్ల దేవి అనుగ్రహం ల‌భించద‌ట.

* నిమ్మకాయ

న‌వ‌రాత్రులు జ‌రిగిన‌న్ని రోజులు ఇంట్లో నిమ్మకాయ‌ను కోయ‌రాద‌ట‌. అలా చేస్తే అరిష్టం క‌లుగుతుంద‌ట‌. కానీ మ‌రి నిమ్మర‌సం లేక‌పోతే ఎలా.. అంటే అందుకు ప‌రిష్కారం ఉంది. మార్కెట్‌లో దొరికే నిమ్మ‌ర‌సం బాటిల్స్‌ను వాడ‌ుకోవ‌చ్చునట. అయితే ఇది మరీ చాదస్తంగా భావించిన వారు కనీసం చెట్టు నుంచయినా కాయలు కోయకుండా ముందే తెచ్చుకుని ఉంచుకుని వాటిని మాత్రమే వాడుకోవాలట.

* నిద్ర

న‌వ‌రాత్రుల పాటు రోజూ ఉప‌వాసం ఉండే వారు మ‌ధ్యాహ్నం పూట అస్సలు నిద్రపోరాదట. పోతే పూజ‌లు చేసినా తగిన ఫ‌లితం లభించదట. రాత్రి వేళ మాత్రం పనులు, ఆధ్యాత్మిక కార్యకలాపాలన్నీ త్వరగా ముగించుకుని ప్రశాంతంగా నిద్రపోవాలట.

Advertisement

* ఉప‌వాసం

న‌వ‌రాత్రుల్లో రోజూ ఉప‌వాసం చేసే వారు కొద్ది మొత్తంలో పండ్లను ఆక‌లి అనిపించిన‌ప్పుడు తిన‌వ‌చ్చునట.

* జ‌లం

న‌వ‌రాత్రి రోజుల్లో నీటిని బాగా తాగాలట. దీంతో పాజిటివ్ ఎన‌ర్జీ క‌లుగుతుందట. ఉప‌వాసం ఉన్నా ఆక‌లి అనిపించ‌దట.

* కూర‌గాయ‌లు

ఉప‌వాసం చేసేటప్పుడు ఆలుగ‌డ్డలు, కొన్ని తాజా కూరగాయలు త‌ప్ప ఇత‌ర ఏ కూర‌గాయ‌ల‌ను తిన‌రాదట. వాటిని కూడా ఉడ‌క‌బెట్టుకుని అలాగే తిన‌వ‌చ్చునట. కానీ కూర‌లా చేసి మాత్రం తిన‌రాదని పండితులు చెబుతున్నారు.

Advertisement

* ఆహారం

ఉప‌వాసం చేయ‌ని వారు పాల‌ను కూర‌గాయ‌ల‌తో క‌లిపి వండి తింటే చాలా మేలు జ‌రుగుతుందట.

* తిను బండారాలు

న‌వ‌రాత్రుల్లో ఉప‌వాసం చేయ‌ని వారు రోటీ, పూరీ, ప‌కోడీ తినాలట.

* సామ అన్నం

సామ‌లు అని పిల‌వ‌బ‌డే ఓ ర‌క‌మైన తృణ‌ధాన్యం మ‌న‌కు మార్కెట్‌లో దొరుకుతుంది. దాంతో అన్నం వండి తింటే మంచి ఆరోగ్యంతో పాటు దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందట.

Advertisement

* న‌ట్స్

ఫాక్స్ న‌ట్స్ అని పిల‌వ‌బ‌డే న‌ట్స్‌ను రోస్ట్ చేయాలి. అందులో నెయ్యి వేసుకుని తిన‌వ‌చ్చునట.

* చ‌క్కెర‌

న‌వ‌రాత్రి వంట‌కాల్లో చ‌క్కెర‌ను వాడ‌రాదు. బెల్లం లేదా తేనె వాడ‌వ‌చ్చునట. దీని ద్వారా శరీరానికి మంచి పోషకాలు అంది ఆరోగ్యం లభిస్తుంది.

Advertisement

Continue Reading
Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!