Connect with us

Featured

మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ చేసిన పెద్ద పొరపాటు అదేనా..!?

Published

on

సౌత్‌లో ఇప్పుడు కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్‌గా వెలుగుతోంది. ఈమె తెలుగు, తమిళ, మలయాళ భాషలలో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ఈమె కి సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉండటంవల్ల సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి ఏమాత్రం కష్టపడల్సిన అవసరం రాలేదు. బాల నటిగానే పాపులారిటీ తెచ్చుకుంది కీర్తి సురేష్. కీర్తీ సురేష్ అమ్మ గారు మలయాళ నటి మేనక. ఈవిడి చిరంజీవి సరసన కూడా ఓ సినిమా చేశారు. కీర్తి నాన్నగారు మలయాళ సినీ నిర్మాత సురేష్ కుమార్. ఇక కీర్తీ అక్క రేవతీ సురేష్..కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. ఆమె వి.ఎఫ్.ఎక్స్ స్పెషలిస్ట్.

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నిర్మాణ సంస్థ అయిన రెడ్ చిల్లీస్ లో వి.ఎఫ్.ఎక్స్ విభాగంలో పలు హిందీ సినిమాలకి పనిచేశారు. కీర్తి నాలుగో తరగతి వరకు చెన్నైలో చదువుకున్నారు. ఆ తరువాత చదువు తిరువనంతపురంలోని కేంద్రీయ విద్యాలయలో కంటిన్యూ చేసింది. మళ్ళీ చెన్నైలో పెర్ల్ అకాడమీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది. స్కాట్లాండ్ లో నాలుగు నెలల పాటు ఒక కోర్సు చదివిన కీర్తి, లండన్ లో రెండు నెలల ఇంటర్న్షిప్ లో జాయిన్ అయింది. అంటే కీర్తి ఫ్యాషన్ డిజైనర్ అన్నమాట. ఒకవేళ సినిమాల్లోకి రాకపోయి ఉంటే, ఇప్పుడు కీర్తి డిజైనింగ్ లో ఉండేదాన్ని అని..గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.

2000 – 2002 వరకు బాల నటిగా సినిమాలు చేసింది. అవన్నీ కూడా మలయాళంలో విడుదలయ్యాయి. 2013లో హీరోయిన్‌గా మారింది. హీరోయిన్ ఎంట్రీ కూడా మలయాళంలోనే జరిగింది. గీతాంజలి అనే సినిమాతో కీర్తి హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది. ఇదు ఎన్న మాయం అనే తమిళ సినిమాతో కోలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో అడ్డాల చంటి నిర్మాతగా రెండుజెళ్ళ సీత అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. దాంతో 2016లో వచ్చిన నేను శైలజ ఆమె తెలుగు డెబ్యూ సినిమా అయింది.

నేను శైలజ సినిమాతో టాలీవుడ్ మేకర్స్ ని బాగా ఆకట్టుకున్న కీర్తి సురేష్.. నేను లోకల్, అజ్ఞాతవాసి, మహానటి సినిమాలు చేసింది. వీటిలో అజ్ఞాతవాసి భారీ డిజాస్టర్‌గా మిగిలింది. అయితే మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన మహానటి కీర్తి సురేష్ కి ఎంతో కీర్తి ప్రతిష్టలు దక్కేలా క్రేజ్ తీసుకు వచ్చింది. ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఈమె పేరు మార్మోగిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు కీర్తిని ప్రశంసించారు. ఈ సినిమా తర్వాత ఈమె క్రేజ్ సౌత్‌లో అసాధారణంగా పెరిగిపోయింది. దాంతో వరుసగా క్రేజీ ఆఫర్స్ వచ్చాయి.

ఈ క్రేజ్‌ని కీర్తి బాగానే ఉపయోగించుకుంది. కానీ కొన్ని అనవసరమైన సినిమాలను కమిటయి పొరపాటు చేసింది. మహానటితో వచ్చిన క్రేజ్ ని దృష్ఠిలో పెట్టుకొని లేడీ ఓరియెంటెడ్ సినిమాలను కమిటవడం కీర్తి చేసిన మిస్టేక్ అని ఆ సినిమా రిజల్ట్ తర్వాత అభిమానులు, ప్రేక్షకులు అభిప్రాయాపడ్డరు. పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు గత ఏడాది ఓటీటీలో రిలీజై తీవ్రంగా నిరాశపరచాయి. ఈ రెండు సినిమాలతో ఆమె క్రేజ్ చాలా వరకు తగ్గిందనే కామెంట్స్ వినిపించాయి. మిస్ ఇండియా సినిమా అయితే అసలు ఎందుకు ఒప్పుకుందో కూడా చాలా మందికి అర్థం కాలేదట. ఆ తర్వాత రంగ్ దే కూడా ఆశించిన విధంగా కీర్తికి పాపులారిటీ తీసుకు రాలేకపోయింది. ఈ క్రమంలో గుడ్ లక్ సఖీ సినిమా డిలే అయింది. మరి దీని రిజల్ట్ ఎలా ఉంటుందో గానీ ఇకపై లేడీ ఓరియెంటెడ్ సినిమాలను చేయకూడదని కీర్తి డిసైడయినట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈమె సర్కారు వారి పాట, అన్నాత్తే చేస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!