Connect with us

Featured

మీ మూత్రం నురగ నురగ్గా ఉంటే ఈ వీడియో తప్పక చూడండి

Published

on

మూత్రం కూడా శరీర ఆరోగ్యానికి ఓ సూచిక అని ఆరోగ్య స్పృహ కలిగిన వారికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనకు అనేక వ్యాధులను మూత్ర పరీక్ష ద్వారానే గుర్తిస్తారన్న సంగతి తెలిసిందే. మూత్రం పోసినప్పుడు స్పష్టంగా ఉంటే ఓకే.. మీరు ఆరోగ్యంగా ఉన్నట్టే. కానీ మూత్రం ముదురు రంగులో, దుర్వాసనతో, బుడగలతో, నురగతో ఉంటే శరీరంలో ఏదో సమస్య ఉన్నట్టు సంకేతం.

బిజీలో ఉన్నప్పుడు, పని ఒత్తిడితో ఎక్కువ ఫోర్స్ తో మూత్రం పోసినపుడు బుడగలు కూడా రావొచ్చు. అలాగూ యూరినల్స్ ని కెమికల్స్ తో కడిగిన వెంటనే మూత్రానికి వెళ్లిన వారికి బుడగలు, నురగ కనిపించొచ్చు. అటువంటివి పట్టించుకోవాల్సిన పనిలేదు. కాని ఏయే సందర్భాల్లో మూత్రం నురగ రాకూడదో, వస్తే ఎటువంటి సమస్య ఉన్నట్లో కింద చూద్దాం..

Advertisement

మానసిక ఒత్తిడి డిప్రెషన్ లో ఉన్నవారికి మూత్రంలో నురుగ వస్తుంది. ఇలా డిహైడ్రేషన్ వల్ల కూడా రావొచ్చు. మీకు డిహైడ్రేషన్ అయితే, మీ మూత్రంలో ప్రోటీన్స్, కొన్ని రసాయనాలు అధిక స్థాయిలో పెరుగుతాయి. డీహైడ్రేషన్ నివారించుకోవడానికి ఎక్కువ నీరు తాగాలి.

గర్భధారణ సమయంలో నురుగుతో కూడిన మూత్రం రావడం సాధారణం. గర్భం కారణంగా ఊపిరితిత్తుల మీద పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీంతొ ప్రోటీన్ మూత్రంలోకి వెళ్ళడానికి నురగ కారణం కావొచ్చు.
ఆదుర్దాగా లేదా ఒత్తిడిగా ఉన్నపుడు మూత్రం నురగగా లేదా బుడగలుగా మారుతుంది. యూరిన్ లో ఉంటే ప్రోటీన్, ఆల్బుమిన్ కారణం కావొచ్చు.

మూత్రపిండాలు ఒత్తిడికి గురయితే, మూత్రంలో ప్రోటీన్స్ లీక్ అవుతుంది. షుగర్ వ్యాధి మూత్రపిండాలపై ప్రభావం చూపించి మూత్రం నురగగా వస్తుంది. అధిక బ్లడ్ షుగర్ స్థాయి మూత్రపిండాలకు చెడు చేస్తుంది.
మూత్రంలో ప్రోటీన్ స్థాయిలు అధికంగా ఉంటే, ఆ స్ధితిని ప్రోటీన్యూరియా అంటారు. మూత్రపిండాలు ప్రోటీన్ ని సరిగా ఫిల్టర్ చేయలేకపోతే, వైద్యుడిని సంప్రదించడం మంచిది.

Advertisement

మూత్రనాళాలు బాక్టీరియా బారిన పడినపుడు, నురగతో కూడిన మూత్రం వచ్చే అవకాశం ఉంది.
మూత్రంలో నురుగుకు గుండె సమస్యల లక్షణాలు కావొచ్చు. మూత్రంలో ప్రోటీన్ అధిక స్థాయిలో ఉన్నపుడు గుండెపోటు వంటి సమస్యలకు దారితీయవచ్చు. అందుకే మూత్రంలో నురగ కంటిన్యూగా వస్తే వైద్యుణ్ణి సంప్రదిస్తే మంచిది.

మన శరీరం రకరకాల ప్రతిస్పందనల ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన సూచనలు ఇస్తుంటుంది. అలాంటి సూచనల్లో మూత్రం రంగు కూడా ఒకటి. సాధారణంగా మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. కానీ కొన్ని అనారోగ్య పరిస్థితుల్లో మూత్రం రంగు మారుతుంది. మారిన మూత్రం రంగు ఎలాంటి అనారోగ్యానికి కారణమో అవగాహన కలిగి ఉండడం అవసరం.

ఎరుపు మూత్రం ఎరుపు రంగులో ఉండడానికి కారణం మూత్రంలో రక్తం కలిసి విసర్జితమవడం. ఇది చాలా సందర్భాల్లో యూరినరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్ కారణంగా అవుతుంది. లేదా కిడ్నీ లేదా బ్లాడర్‌లో రాళ్లు ఉండడం వల్ల లేదా యూరినరీ ట్రాక్ గాయపడడం లేదా ప్రొస్టేట్ సంబంధిత సమస్యలేమైనా కావచ్చు. చాలా అరుదుగా బ్లాడర్ లేదా కిడ్నీలో క్యాన్సర్ కూడా ఇందుకు కారణం కావచ్చు. మూత్రం ద్వారా ఎక్కువ మొత్తంలో రక్తం పోకపోవచ్చు కానీ దీన్ని సమస్యకు ఒక సూచనగా భావించవచ్చు.

Advertisement

నీలం మూత్రం నీలం రంగులో పసి పిల్లల్లో కనిపించే సమస్య. నవజాత శిశువుల్లో రక్తంలో ఎక్కువగా కాల్షియం ఉండడం వల్ల వారి మూత్ర విసర్జన నీలం రంగులో ఉంటుంది. దీనిని బ్లూ డైపర్ సిండ్రోమ్ అంటారు. ఇది ఒక జన్యులోపం కారణంగా వచ్చే సమస్య. పెద్ద వారిలో ముఖ్యంగా వయాగ్రా వాడే పురుషుల్లో ఇలాంటి లక్షణం కనిపిస్తుంది.

నలుపు కొన్ని రకాల ఫంగల్ ఇన్‌ఫెక్షన్ల వల్ల మూత్రం నలుపు రంగులో ఉండేందుకు ఆస్కారం ఉంది. ఒక్కోసారి ఐరన్ లోపం సరిచేసేందుకు వాడే ఇంజక్షన్ల కారణంగా కూడా మూత్రం నలుపు రంగులో రావచ్చు.

జేగురు ఇది సాధారణంగా చర్మం లేదా గొంతులో ఇన్‌ఫెక్షన్ల ప్రభావం కిడ్నీ మీద పడినపుడు ఇలా జరుగుతుంది. ఇలాంటి స్థితి ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తుంది. యాంటీబయాటిక్స్ వాడడం ద్వారా దీన్ని నుంచి బయటపడవచ్చు. కానీ చాలా మంది డాక్టర్లు తర్వాత కాలంలో రాబోయే క్రానిక్ కిడ్నీ డిసీజ్‌కు ఇది ఒక సూచనగా భావిస్తారు.

Advertisement

ముదురు పసుపు మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. డీహైడ్రేషన్‌కు లోనైనపుడు అది ముదురు రంగులోకి మారుతుంది. ఒక్కోసారి లివర్ సమస్యలు, కామెర్ల వంటి సమస్యలున్నపుడు కూడా మూత్రం ముదురు పసుపు రంగులో రావచ్చు. కొన్ని రకాల మందులు వాడుతున్నపుడు కూడా మూత్రం పసుపు రంగులో వచ్చే ఆస్కారం ఉంటుంది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!