Connect with us

Featured

మీ మొబైల్ కి ఆదార్ కార్డ్ లింక్ చేస్తున్నారా ఒక్క నిమిషం ఈ వీడియో చూడండి.

Published

on

వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలోపు మీ మొబైల్ నెంబర్ ను ఆధార్ తో లింక్ చేసుకోండి. లేదు అంటే మీ మొబైల్ ఆ రోజు నుండి పనిచేయదు .ఇది ఇప్పుడు చాలా మంది మొబైల్ విన్యిగాదరులకు రోజు వస్తున్న మెసెజ్. మెసెజ్ ల వరకు అయితే ఓకే గాని మొబైల్ నెంబర్ ను ఆదార్ కు లింక్ చేయండి అంటూ కాల్స్ కూడా చేసి వేదిస్తున్నారు. ఇప్పుడు జనంలో చిన్న డౌట్ మొదలయింది. నిజంగా ఇలా లింక్ చేయలా అని చేస్తే ప్రయోజనం ఏంటి అని ఈ విషయం కొంచం పక్కకు పెడ్తే. ఇప్పుడు మేమూ చెప్పబోయే సంగటన గురించి వింటే మాత్రం ఆధర్ ని లింక్ చేయడానికి ఒక నిముషం ఆలోచిస్తారు. అవును మీరు విన్నది కరెక్టే ఇంతకీ ఆ విషయం ఏంటో తెలుసుకుందాం.

అతని పేరు ప్రమోద్ అతనికి ఒక రోజు Dm98765 నుండి మెసెజ్ వచ్చింది. అందులో ఎం ఉన్నది అంటే మీ మొబైల్ నెంబర్ బ్లాక్ అయ్యింది దాన్ని కంటిన్యూ చేయాలి అంటే ఆదార్ కి లింక్ చేసుకోవాలి. కనుక మీ సిమ్ ఫోన్ నెంబర్ సీరియల్ నెంబర్ ను 121 కి sms చేయండి అంటూ అచ్చం మన కస్టమర్ కేర్ నుండి వచ్చినట్టుగానే మెసెజ్ వచ్చింది. ఇది నిజమే అని నమ్మిన ప్రమోద్ మొబైల్ నెంబర్ ఎక్కడ బ్లాక్ అవుతుందో అని వెంటనే నెంబర్ కు మేసెజ్ చేసాడు. అంటే క్షణాల్లో అవతలి వారు ప్రమోద్ సిమ్ ను క్లోనింగ్ చేసారు అంటే అతని సిమ్ కు దుబ్లికేట్ సిమ్ ను తాయారు చేసారు అనమాట. ఇంకేం ఉంది ఆతర్వాత ఆ సిమ్ తో అతని కోటక్ సాలరీ ఎకౌంటు లో ఉన్న లక్ష రూపాయిలు దోచేసారు. డబ్బు డెబిట్ అయిపోయి నట్టు ప్రమోద్ కి మెసెజ్ వచ్చింది .ఏదో అయ్యింది అనుకోని కస్టమర్ కేర్ కు ఫోన్ చేసాడు వాల్లు మాకు సంభంధం లేదు అని తేల్చి చెప్పేసారు. ఆచార్యం ఇది ఎలా జరిగింది అనుకుంటున్నారు కదు ఈ మద్య కాలంలో డిజిటల్ పేమెంట్ మేథోడ్స్ ఎక్కువ అయ్యాయి.

Advertisement

మీకు ఈ విషయం తెలిసిందే అనేక రకాల వాళ్లేట్, యాప్ ల రూపంలో మనకు అందుబాటులోకి వచ్చాయి. అయితే వాటిలో I am PS నెట్ వంటి పేమెంట్ మెథొడ్స్ తో పాటు UPI అంటే “Unified payments interface” అనె కొత్త పేమెంట్ మేథోడ్ కూడా మనకు అందుబాటులో ఉంది. దీనికి కేవలం మొబైల్ నెంబర్ ఉంటే చాలు మన బ్యాంక్ వివరాలు ఏవి ఎంటర్ చేయాల్సిన పని ఉండదు. మొబైల్ నెంబర్ ను UPI కి అనుసందానిస్తే UPI ఇంటర్ పేస్ మన మొబైల్ నెంబర్ కు కనెక్ట్ అయ్యి మనకు ఉన్న బ్యాంకు ఎకౌంటు లను వెతుకుతుంది. ఎదో ఒకటి లింక్ ఐ ఉంటుంది కనుక కచ్చితంగా అలా లింక్ అయిన బ్యాంకు ను చూపిస్తుంది .దీంతో బ్యాంకు కాత UPIకి అనుసందానం అవుతుంది. అలా అయ్యాక ఇక అంటే బ్యాంకు వివరాలతో సంభంధం లేకుండా నేరుగా UPI ద్వారా డబ్బులు పంపుకోవచ్చు. రిసీవ్ చేసుకోవచ్చు. ఇదే నేరగాళ్లకు అవకాశంగా మారింది. ఈ క్రమంలోనే పైన చెప్పిన ప్రమోద్ నెంబర్ కూడా నేరగాళ్ల చేతిలో పడింది. వారు కూడా UPI ద్వారా అతని ఖాతాలో ఉన్న లక్ష రూపాయిలు కజేసారు. అయితే ప్రమోద్ నిజం తెలుసుకునే సరికి ఆలస్యం అయింది. అయినపట్టికి లేట్ చేయకుండా వెంటనే కస్టమర్ కేర్ కి కాల్ చేసి విషయం చెప్పాడు. అంతరం బ్యాంకు బ్రాంచ్ కు వెళ్ళాడు అక్కడ కూడా కంప్లంట్ ఇచ్చాడు కానీ ఇప్పటికీ వరకు ఫలితం లేదు. చూసారుగా ఇలాంటి మెసేజ్లు వస్తే స్పందించకండి .మీ మొబైల్ నెంబర్ ను ఆధర్ కు అనుసందానం చేసుకోవాలి అనుకుంటే కచ్చితంగా స్టోర్ కి వెళ్ళాల్సిందే. అంటే కానీ అలా అనుసందానం చేసుకునే అందుకు కంపెనీలు ఆన్లైన్ లో మొబైల్ ద్వారా ఎలాంటి సదుపాయం కలిపించలేదు. ఇక మరో విషయం ఏంటి అంటే మీ సిమ్ కార్డు పోయిన వెంటనే దాన్ని బ్లాక్ చేయండి ఎందుకంటే కేవలం మీ మొబైల్ నెంబర్ ఉంటే చాలు దాంతో బ్యాంకు లో ఉన్నా డబ్బును కాజేస్తారు. కాబట్టి ఈ విషయంలోనూ జాగ్రత్త వహించాల్సిందే.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Manoj -Charan: అర్ధరాత్రి ఫోన్ చేసి 5 లక్షలు అడిగాను.. చరణ్ మంచి మనసు పై మనోజ్ కామెంట్స్!

Published

on

Manoj -Charan: మెగా పవర్ స్టార్ రాంచరణ్ మార్చ్ 27వ తేదీ తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే . ఈ పుట్టిన రోజు సందర్భంగా ఈయన తన భార్య కూతురుతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. అనంతరం చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఓ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది సెలబ్రిటీలు, అభిమానులు హాజరై సందడి చేశారు. ఈ క్రమంలోనే మంచు మనోజ్ కూడా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంచు మనోజ్ రామ్ చరణ్ ఇద్దరు కూడా మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే అంతే కాకుండా చరణ్ అంటే మనోజ్ కి చాలా అభిమానం అని పలు సందర్భాలలో తెలియజేశారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మంచు మనోజ్ రామ్ చరణ్ మంచితనం గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చరణ్ ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయం చేసిన ఎప్పుడు చెప్పుకోలేదు కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు సహాయం పొందిన వాళ్లు ఆయన మంచితనం గురించి చెబుతూ ఉంటారు.

Advertisement

ఆడబిడ్డకు సాయం..
ఈ క్రమంలోనే చరణ్ మంచితనం గురించి మనోజ్ మాట్లాడుతూ 2018 వ సంవత్సరంలో నేను అమెరికాలో ఉన్నాను. అర్ధరాత్రి సమయంలో దుబాయిలో ఓ ఆడబిడ్డ తన కుమార్తెతో కలిసి ఇమిగ్రేషన్ సమస్య కారణంగా అక్కడే చిక్కుకుపోయారు వెంటనే ఐదు లక్షలు కావాలి అని అడిగింది అప్పుడు నా దగ్గర అంత డబ్బు లేకపోవడంతో అర్ధరాత్రి చరణ్ కి ఫోన్ చేసి ఐదు లక్షల కావాలి అంటే ఎందుకు అని కూడా అడగకుండా ఐదు నిమిషాలలో పంపించారంటూ తన సహాయ గుణం పై మనోజ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Vijay Devarakonda: సినిమా సక్సెస్ కోసం పూజలు చేసిన ఫ్యామిలీ స్టార్… సక్సెస్ అయ్యేనా?

Published

on

Vijay Devarakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి విజయ్ దేవరకొండ త్వరలోనే ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఈయన నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. చివరిగా ఈయన ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది. ఇక త్వరలోనే పరశురాం దర్శకత్వంలో నటించినటువంటి ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ విడుదల కాబోతోంది.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో మంచి సక్సెస్ అందుకోవాలనే ఉద్దేశంలో విజయ్ దేవరకొండ ప్రత్యేక పూజలను చేశారు ఈ క్రమంలోనే దిల్ రాజు ఆఫీస్ లో దర్శక నిర్మాతలు హీరోలతో కలిసి ప్రత్యేకంగా హోమాలు పూజలను చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

సినిమా విజయం కోసమే పూజలు..
ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సినిమా సక్సెస్ కోసం విజయ్ దేవరకొండ ఇలాంటి పూజలు చేయించారని అయితే ఈ పూజలు సక్సెస్ అయ్యి తన సినిమా మంచి విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి అప్డేట్స్ ఈ సినిమా పై భారీ స్థాయిలోనే అంచనాలు పెంచాయి.

Advertisement
Continue Reading

Featured

Siddharth -Aditi: రహస్యంగా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన అదితి సిద్ధార్థ్?

Published

on

Siddharth -Aditiy: సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతూ ఉన్నటువంటి వారిలో
సిద్ధార్థ్ అదితి రావు హైదరి జంట ఒకటి. వీరిద్దరూ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. అయితే వీరిద్దరూ కలిసి అవే భూపతి దర్శకత్వంలో వచ్చిన మహాసముద్రం సినిమాలో కలిసిన నటించారు. ఇక ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు..

ఇక వీరిద్దరూ కలిసి ముంబైలో సహజీవనం చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసి జంటగా వెళ్లారు. అయితే వీరి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి కానీ వీరు మాత్రం ఎప్పుడూ కూడా తమ రిలేషన్ గురించి ఓపెన్ అవ్వలేదు. ఇలా రహస్యంగా తమ రిలేషన్ మెయింటైన్ చేస్తూ వస్తున్నటువంటి ఈ జంట ఇటీవల రహస్యంగా పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు.

ఇలా ముంబైలో సహజీవనం చేస్తున్నటువంటి ఈ జంట తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌లోని రంగనాథ స్వామి ఆలయ మండపంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులతో వీరి వివాహ వేడుక హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరిగింది. ఇలా వీరిద్దరు పెళ్లి చేసుకున్నారనే వార్త వైరల్ గా మారడంతో అందరూ షాక్ అవుతారు.

Advertisement

తెలంగాణలో వివాహం..
రిలేషన్ లో ఉన్నటువంటి ఈ జంట ఇలా రహస్యంగా పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటని ఆరా తీస్తున్నారు అయితే ఇలా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నప్పటికీ ఇద్దరికీ ఇది మొదటి వివాహం కాదని వీరిద్దరికీ ఇది రెండో వివాహమనే చెప్పాలి ఇప్పటికే వీరిద్దరూ పెళ్లిళ్లు చేసుకొని విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటూ తిరిగి రెండో పెళ్లి చేసుకున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!