Connect with us

Featured

వామ్మో అంతగా ఎలా సంపాదించాడు కేవలం 5ఏళ్లలో లో 300 శాతం పెరిగిన ఆస్తులు..!

Published

on

వామ్మో అంతగా ఎలా సంపాదించాడు కేవలం 5ఏళ్లలో లో 300 శాతం పెరిగిన ఆస్తులు..!

అమిత్‌షా ఆస్తులు

Advertisement

ఆయన దేశంలో అధికార పార్టీకి జాతీయ అధ్యక్షుడు. అవినీతి, అక్రమాలకు ఆమడ దూరంలో ఉంటానని, ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతున్నానని చెప్పుకుంటున్నారు. నరేంద్ర మోడీని నాడు గుజరాత్‌కు ముఖ్యమంత్రినీ, దేశానికి ప్రధానినీ చేశానంటున్నారు. ఆయనే అమిత్‌ షా. అవినీతి మరకలను దరి చేరనీయని నిప్పుకణికను అని దర్పాన్ని చూపే అమిత్‌షా ఆర్థికంగా బహు చిన్నవాడని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఆయన ఆస్తులను ఐదేండ్లలో 300 శాతం పెంచుకున్నారంటే ఆశ్చర్యమేయక మానదు. మరి ఇంత భారీ ఎత్తున ఆస్తులను అమిత్‌షా పెంచు కోవడం వెనుక దాగి ఉన్న చిదంబర రహస్యం అవినీతి, అక్రమాలేన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఓ మీడియా సంస్థ వార్తను ప్రచురించిన కొన్ని గంటల్లోనే తొలగించడం మరిన్ని అనుమానాలకు తావిస్తున్నది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఆస్తులు 2012-2017 మధ్య కాలంలో ఏకంగా 300 శాతం పెరిగాయి. రాజ్యసభకు బీజేపీ అభ్యర్థిగా అమిత్‌షా దాఖలు చేసిన నామినేషన్‌తో ఈ విషయం స్పష్టమైంది. అమిత్‌షా చివరిసారిగా 2012లో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తన ఆస్తులను వెల్లడించారు. గుజరాత్‌లోని మూడు రాజ్యసభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులుగా అమిత్‌షా, కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ, బల్వంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. అమిత్‌షా స్థిర, చర ఆస్తులు(భార్య ఆస్తులతో కలుపుకొని) ఐదేండ్ల కాలంలో 300 శాతం పెరిగాయి. 2012లో అమిత్‌షా స్థిర, చర ఆస్తులను రూ.8.54 కోట్లుగా చూపించారు. ప్రస్తుతం ఈ ఆస్తులను రూ.34.31 కోట్లుగా నామినేషన్‌ పత్రాల్లో పేర్కొన్నారు. అంతేకాక.. చరాస్తులు ఐదేండ్లలో రూ.1.9 కోట్లు నుంచి ఏకంగా రూ.19 కోట్లకు(10 రెట్లు) పెరిగాయి. స్థిరాస్తులు రూ.6.63 కోట్ల నుంచి రూ.15.30 కోట్లకు పెరిగాయి.

స్మృతీ డిగ్రీ పూర్తి చేయలేదట..
మరోవైపు స్మృతీ ఇరానీ శుక్రవారం దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాల్లో మూడేండ్ల డిగ్రీ కోర్సు పూర్తి చేయలేదని పేర్కొనడం చర్చాంశ నీయంగా మారింది. 2004లో ఢిల్లీలోని చాందీచౌక్‌ నుంచి లోక్‌సభకు నామినేషన్‌ దాఖలు చేసిన సమయంలో 1996లోబీఏ పూర్తి చేసినట్టు వెల్లడించారు. కాగా.. 2011 రాజ్యసభ, 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఢిల్లీ యూనివర్సిటీ నుంచి 1994లో బీకామ్‌ పూర్తి చేసినట్టు పేర్కొన్నారు. ఇప్పుడేమో అసలు డిగ్రీ పూర్తి కాలేదని నామినేషన్‌లో పేర్కొనడం గమనార్హం. పై విషయాలన్నింటిని ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ శనివారం బహిర్గత పరిచింది.
కొన్ని గంటలకే తొలగింపు

Advertisement

అమిత్‌ షా ఆస్తులు, స్మృతీ డిగ్రీ వివరాలను ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ అహ్మదాబాద్‌ ఎడిషన్‌లో శనివారం ప్రచురించింది. కానీ, ప్రచురించిన కొన్ని గంటలకే ఈ సమాచారాన్ని తమ వెబ్‌సైట్‌ నుంచి తొలగించింది. వెబ్‌సైట్‌ నుంచి కథనాన్ని తొలగించడానికి గల కారణా లను మాత్రం వివరిం చలేదు. ఈ స్టోరీని ‘డీఎన్‌ఏ’ కూడా ప్రచురించి, తర్వాత వెబ్‌సైట్‌ నుంచి తొలగిం చింది. ఈ-పేపర్‌లో మాత్రం అందుబాటులో ఉంచిం ది. అమిత్‌షా ఆస్తుల వివరాలను టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రచురించిన కొద్ది సేపటికే తొలగించిన విషయాన్ని ‘ది వైర్‌’ వెలుగులోకి తెచ్చింది. వార్తను తొలగించడానికి కారణాలను ది వైర్‌ తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ తగిన వివరణ రాలేదని కూడా వెల్లడించింది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!