Connect with us

Featured

శృతి తప్పకుండా పాడుతున్న ఈ గానకోకికల జీవితాలు శృతి తప్పాయి

Published

on

భర్తనుంచి విడిపోయి జీవితంలో ఎదురీదుతున్న ఆ సింగర్స్ ఎవరో మీకు తెలుసా…?
వాళ్ళంతా టాలీవుడ్ లో గొప్ప సింగర్స్. ఎంతటి కష్టసాధ్యమైన పాటల్నైనా అవలీలగా పాడేసే ఆ గాయనీ మణులు .. జీవితమనే సంగీతాన్ని శృతితప్పకుండా పలికించడంలో దారుణంగా ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో ఎన్నెన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ప్రాణంగా ప్రేమించిన వాళ్లకు దూరమై, తమ పిల్లలే లోకంగా బతుకుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఒంటరి జీవితాన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని తమ పిల్లల్లోనే కొత్త జీవితాన్ని వెతుక్కుంటున్నారు.

ఆ లిస్ట్ లో మొదట చెప్పుకోతగ్గ గాయని సునీత. అందమైన చిరునవ్వు, అంతకన్నా అందమైన వ్యక్తిత్వం, టాలీవుడ్ లో గాయనీ మణుల్లో కెల్లా అందమైన గాయని గా గుర్తింపు సునీతను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టాయి. గులాబీలో ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు అనే పాటతో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న సునీత కిరణ్ అనే ఒక మీడియా వ్యక్తిని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కొన్నాళ్లు వీరి కాపురం సవ్యంగానే సాగింది. అక్కడనుంచి సునీతను తన మాటలతో వేధించడం, పిల్లల్ని పట్టించుకోకపోవడం, ఆర్ధిక పరమైన ఇబ్బందులకు గురిచేయడం లాంటివి చేస్తూ ఉండేవాడు ఆమె భర్త. అతడిలో మార్పు వస్తుందని తనని, పిల్లల్ని బాగా చూసుకుంటాడని నమ్ముతూ వచ్చింది ఆమె.అయినా సరే అతడిలో ఎలాంటి మార్పూ రాకపోవడంతో ఒకదశలో బాగా విసుగెత్తి, సునీత అతడికి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. కానీ కిరణ్ సునీతకు విడాకులివ్వడానికి నిరాకరించాడు. అందుకే సునీత తన భర్తనుంచి విడిపోయి తన పిల్లలతో ఒంటరిగా ఉంటోంది. తనపై వచ్చిన చాలా రకాల అభియోగాల్ని ఆమె తట్టుకుంటూ ఇప్పటివరుకూ నిలబడి తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంది. ఇన్నీ జరుగుతున్నా,సింగర్ గా తనకెరీర్ కు ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా తట్టుకోవడం నిజంగా గ్రేట్.

Advertisement

ఆ తర్వాత స్థానం గాయని కౌశల్యది. ఆమె సొంత ఊరు గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం. నాగార్జున సాగర్లోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో పదో తరగతి వరకు చదివింది. మిగతా చదువంతా వివిధ చోట్ల సాగింది. గుంటూరులోని మహిళా కళాశాలలో ఇంగ్లీషు సాహిత్యంతో పాటు కర్ణాటక సంగీతంలో డిగ్రీ పొందింది. ఆ తరువాత పద్మావతి విశ్వవిద్యాలయంలోశాస్త్రీయ సంగీతంలో పీజీ చేసింది. శ్రీను వైట్ల నీకోసం సినిమాతో గాయనిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. తన చిన్ననాటి స్నేహితుడు, వృత్తిరీత్యా ఇంజనీరు అయిన బాలసుబ్రహ్మణ్యంను ఇంటర్లో ప్రేమించి పెళ్లిచేసుకుంది. వాళ్లకి ఒక బాబు కూడా. సింగర్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్నా కౌసల్య వైవాహిక జీవితం ఎన్నో ఒడిదుడుకులతో సాగింది. ఆమె భర్త ఆమెను ఆరేళ్లు నరకం చూపించాడు. పాటలు పాడడం మానేయాలని, సినిమాలతో సంబంధాలు తెగతెంపులు చేసుకోవాలని ..ఇంకా రకరకాలుగా కండీషన్లు పెట్టేవాడు. సింగింగ్ ఆమె ప్రాణం కాబట్టి, వాటిని ఒదులుకోలేనని ఖరాఖండిగా చెప్పింది. అయినా సరే ఆమె భర్త వేధింపులు ఆపలేదు. ఇక తప్పని సరిపరిస్థితుల్లో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా అతడి తీరు మారలేదు. అలాంటి వ్యక్తితో జీవించడం కంటే విడిపోవడమే బెటర్ అని నిర్ణయించుని తెగదెంపులు చేసుకున్నారు.2015లో భర్తనుంచి విడాకులు తీసుకుంది. ఇప్పుడు ఆమె పాటలతో పాటు తన కొడుకే ప్రాణంగా బతుకుతోంది.

ఇక గాయని కల్పన ది కూడా అచ్చం ఇదే పరిస్థితుల్లో బతుకుతోంది. ప్రేమించి పెళ్లిచేసుకుంది . పెళ్లైన కొంత కాలం వరుకూ వాళ్లిద్దరూ బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఆమెను హింసించడం మొదలు పెట్టాడు. బలవంతంగా తన కెరీర్ ను నాశనం చేయాలని చూసాడు. చాలా మంది చెప్పేది ఏమిటి అంటే ఆయన కంటే ఈమెకు పేరు ఎక్కువగా ఉండడం తో తట్టుకోలేక ఆమెను వేధించడం మొదలు పెట్టాడని ఆయన ఒక శాడిస్ట్ అని చెప్తారు. అలాంటి భర్తను భరించడం కన్నా వదలుకోవడమే బెటరని భావించిన కల్పన భర్తనుంచి విడాకులు తీసుకుని , బిడ్డతో ఒంటరిగా బతుకుతోంది. అయినా సరే ఈమె పాటల్ని పాడడం ఒదులుకోలేదు, తన వ్యక్తిత్వాన్ని వదలుకోలేదు. రెట్టించిన ఉత్సాహంతో తన కెరీర్ ను కాపాడుకుంటూ ముందుకు సాగుతోంది. సో.. వైవాహిక జీవితమనే పోరాటంలో ఓడిపోయినా వీళ్లు ముగ్గరూ , మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతూ , తమ కెరీర్ ను బంగారంలా మలుచుకున్నారు.

Advertisement

Continue Reading
Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!