Connect with us

Featured

సినిమాలు హిట్ అవ్వగానే కమీడియన్స్ కాస్త పెళ్లాల పాలిట విలన్లుగా మారారు

Published

on

సినిమాల్లో కామెడీ చేసి, భార్యలకు ట్రాజెడీ చూపించారు
ఆ ముగ్గురూ తెలుగు తెరమీద సూపర్ కమెడియన్స్. ప్రేక్షకుల్ని తమ నటనతో్ బాగానే నవ్వించారు. తమ కామెడీతో వాళ్లు కూడా బాగానే సంపాదించారు. అయితే వాళ్లు కామెడీ చేసింది తెరమీదే. వాళ్ల వైవాహిక జీవితాల్లో మాత్రం భార్యలకు చుక్కలు చూపించారు. సినిమాల్లో బిజీ గా ఉండడంతో భార్యలతో కలిసి ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని ఆస్వాదించలేకపోయారు. ఏవేవో గొడవలతో భార్యలతో తరుచూ గొడవలు పడుతూ , తమ కాపురాల్ని రోడ్డుమీద పెట్టుకున్నారు.

ఈ లిస్ట్ లో ముందుగా చెప్పుకోదగ్గ కమెడియన్ వేణుమాధవ్. యస్వీకృష్ణారెడ్డి సాంప్రదాయంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన వేణుమాధవ్ కామెడియన్ గా ఒకప్పుడు బాగా బిజీగా ఉండేవాడు. వరస సినిమాలు చేస్తూ ఒకదశలో ఆయన బాగానే వెనకేసుకున్నాడు. ఇండస్ట్రీలో కూడా మంచి పేరే సంపాదించాడు. అయితే ఇంట్లో మాత్రం వేణుమాధవ్ అతడి భార్య పాలిట విలన్ అయ్యాడు. తరుచు గొడవలు పడుతూ ఉండే ఈ దంపతులిద్దరూ పరస్పరం విడాకులు కోరుతూ కోర్టు కు పిటీషన్ దాఖలు చేసారు. ఇద్దరూ అంగీకారం తెల్పడంతో రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ విడాకులు మంజూరు చేసింది. విడాకులు తీసుకున్న సందర్భంగా భరణం కింద తన భార్య భాగ్యలక్ష్మి, ఇద్దరు మైనర్ పిల్లలకు రూ. 60లక్షలు ఇచ్చేందుకు వేణుమాధవ్ అంగీకరించారు.

Advertisement

తర్వాత మరో కమెడియన్ చిత్రం శ్రీను కూడా ఇదే బాటలో ట్రావెల్ చేసాడు. చిత్రం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రి ఇచ్చిన శ్రీను మంచి మంచి కామెడీ పాత్రలు ధరించి జనాన్ని బాగానే నవ్వించేవాడు. శ్రీనువైట్ల లాంటి డైరెక్టర్లు చిత్రం శ్రీను ను బాగా ఎంకరేజ్ చేసారు. టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా సక్సెస్ అవుతాడని అందరూ అనుకుంటూ ఉండగానే, అతడి వైవాహిక జీవితం అట్టర్ ప్లాప్ అయింది. దాదాపు 250 సినిమాల్లో మంచి మంచి కామెడీ పాత్రలు ధరించిన శ్రీను కు ఎప్పుడో పెళ్ళైంది. మరి భార్యతో ఏం గొడవలొచ్చాయో కానీ, ఆమె ఉండగానే శ్రీను ఒక నృత్యకళాకారిణి తో సంబంధం పెట్టుకున్నాడు. మొదటి భార్యకు తెలియకుండా ఆమెను రహస్యంగా వివాహంచేసుకున్నాడు. విషయం తెలుసుకున్న మొదటి భార్య అతడి నుంచి విడాకులు తీసుకొని అతడిపై కేసు పెట్టింది. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. దీని వల్ల అతడి సినీ కెరీర్ బాగా అప్ సెట్ అయింది.

ఇక భార్యనుంచి విడాకులు తీసుకొని ఆర్థికంగా నష్టపోబోతున్న మరో కమెడియన్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వి. ఇతడి మీద అతడి భార్య విడాకులు కోరుతూ ఛీటింగ్ కేసు నమోదు చేసింది. పృధ్వి మీద 498, 420 సెక్షన్లు కింద కేసు నమోదైంది. తన బర్త సినిమాల్లో బిజి అయ్యి నన్ను పూర్థిగా వదిలేసాడని అతడి భార్య విడాకులకు అప్లై చేస్తూ తనకు తనకు పృధ్వి నెలకు 8 లక్షల రూపాయల భరణం ఇవ్వాలని కోరుతూ కోర్టు లో కేసు పెట్టింది. ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు కూడా ఇంత శాలరీ ఉండదు. అది చాలా పెద్ద మొత్తమని తన సంపాదన తో అంత పెద్ద మొత్తంఇచ్చుకోలేని కోర్టు వారికి విన్నవించుకున్నాడు. ఈ కేసు ఇంకా కోర్టులో ఉంది.

ఇక కమెడియన్ జోగినాయుడు కూడా ఈ లిస్ట్ లో ఉన్నాడు. జోగిబ్రదర్స్ లో ఒకడైన జోగినాయుడు 1995 లొ జెమినీ టివిలో పనిచేస్తుండేవాడు. అప్పుడే యాంకర్ గా కొత్తగా అడుగుపెట్టిన ఝాన్సీ ని పడగొట్టాడు. ఇద్దరూ ప్రేమించుకొని , ఇంట్లో చెప్పకుండా జెమినీ టివి ఆధ్వర్యంలో పెళ్లిచేసుకున్నారు. కొన్నాళ్లు వీరిద్దరూ బాగానే ఉన్నారు. ఆతర్వాత నుంచి ఇద్దరి మధ్యా మనస్పర్ధలొచ్చాయి. విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికీ ఒక బిడ్డ.జోగి నాయుడు ఆర్దికంగా నిలదొక్కుకోలేక పోయిన బార్య ఝాన్సీ ని మాత్రం చాల ఇబ్బందులకి గురి చేశినట్టుగా శొషల్ మీడియలో వార్తలు వెలువడ్డాయి..

Advertisement

సో.. మొత్తానికి ఈ కమెడియన్లు సినిమాల్లోనే నవ్వించి, నిజజీవితంలో కేసులతో…. నవ్వడం ఎప్పుడో మరిచిపోయారు. బార్యలను వేదిస్తు నిజ జీవితంలో విలన్లుగా మారారు .

Advertisement
Continue Reading
Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!