Connect with us

Featured

అబ్బాస్ కెరియర్ పతనమవడానికి అసలు కారణాలు ఏమిటో మీకు తెలుసా…?

Published

on

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు రావాలని కోరుకోవడంలో తప్పయితే ఏమీ లేదు. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం ఇక్కడ అవకాశం రావడం కోసమే చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది అవకాశం వచ్చి సినిమాలు చేసి సక్సెస్ ఫుల్ హీరోగా గుర్తింపు పొందిన వారు మాత్రం వాళ్ల ఇమేజ్ ని ఇంకా పెంచుకోవాలని ఆరాటపడుతుంటారు. అందులో భాగంగా ఒకప్పుడు ప్రేమదేశం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు అబ్బాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Advertisement

అబ్బాస్ ప్రేమదేశం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడంతో అబ్బాస్ కి మంచి పేరు గుర్తింపు లభించింది. ప్రేమ దేశం సినిమాలో వినీత్, అబ్బాస్ ఇద్దరు హీరోలుగా నటించారు. ఇద్దరికీ సమానమైన క్రేజ్ వచ్చినప్పటికీ అబ్బాస్ కి మాత్రం వినీత్ కంటే కొంచెం ఎక్కువగానే క్రేజ్ వచ్చిందని చెప్పాలి. ఈ సినిమా తర్వాతనే అబ్బాస్ కటింగ్ కూడా చాలా ఫేమస్ అయ్యాయి. ఒక స్టార్ హీరోకి సైతం లేనంత మంది అభిమానులు అబ్బాస్ కి ఉండేవారు. అలా రోజు ఇంటికి చాలామంది అభిమానులు అబ్బాస్ ని చూడడానికి వస్తూ ఉండేవారు. ప్రొడ్యూసర్లు దర్శకులు అయితే అబ్బాస్ తో సినిమా చేయడానికి ఇంటికి వస్తు ఉండేవారు.

ప్రేమదేశం సినిమా హిట్ అయిన తర్వాత రెండు సంవత్సరాల పాటు ఖాళీ లేకుండా అబ్బాస్ స్టోరీ కూడా వినకుండా ఎడాపెడా సినిమాలు ఒప్పుకున్నాడు. దాంతో తర్వాత వచ్చిన చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అప్పటినుంచి ఆయన క్రేజ్ అనేది నిదానంగా పడిపోతూ వచ్చింది. అలా ఇండస్ట్రీలో అబ్బాస్ ఎంత తొందరగా పైకి ఎదిగాడో ఆ తర్వాత అంతే తొందరగా కింద పడిపోవడం జరుగుతూ వచ్చింది. ఆయన చేసిన తప్పు ఏమిటి అంటే మంచి స్టోరీ లని ఉంచుకోకపోవడం అడ్వాన్స్ తీసుకుని ఏ సినిమా పడితే ఆ సినిమా చేస్తే కెరియర్ అనేది ఇలాగే అవుతుందని అబ్బాస్ ని చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రేమదేశం సినిమా సక్సెస్ అయిన తర్వాత సౌత్ లో టాప్ దర్శకుడిగా గుర్తింపు పొందిన శంకర్ దర్శకత్వంలో ‘జీన్స్’ సినిమా చేసే అవకాశం మొదటగా అబ్బాస్ కి వచ్చింది. అప్పటికీ అబ్బాస్ పలు సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల జీన్స్ సినిమా చేయలేకపోయాడు.

తన కోసం శంకర్ 2 నెలలు వెయిట్ కూడా చేశాడు. అయినప్పటికీ అబ్బాస్ కి ఇంతకుముందు కమిట్మెంట్స్ ఉండడం వలన ఆ సినిమా చేయలేకపోయాడు. ఆ అవకాశం ప్రశాంత్ కి దక్కింది జీన్స్ సినిమా మంచి విజయాన్ని అందుకుని ఇండస్ట్రీ లో మంచి హిట్ గా నిలిచింది. ఇలా ఏ సినిమా పడితే ఆ సినిమా కమిట్ అవ్వడం వల్ల మంచి సినిమాలను వదిలేసి ఫ్లాప్ సినిమాలు చేయడం జరిగింది. దాంతో ఆయన కెరియర్ ని చేతులారా ఆయనే నాశనం చేసుకున్నాడు అని చెప్పవచ్చు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినప్పటికీ అబ్బాస్ కి పెద్దగా సక్సెస్ అయితే రాలేదు. ప్రేమ దేశం అప్పుడు ఎంత క్రేజ్ ఉండేది ఆ తరువాత తగ్గుతూ వచ్చింది.

ఇప్పుడు అబ్బాస్ న్యూజిలాండ్ లో ఉంటున్నాడు. అయితే న్యూజిలాండ్ వెళ్లిన మొదట్లో కొన్ని రోజుల పాటు అక్కడే ఒక పెట్రోల్ బంకులో పని చేశాడు. ఆ తర్వాత ఒక కంపెనీలో జాబ్ చూసుకొని ప్రస్తుతం జాబ్ చేసుకుంటూ తన ఫ్యామిలీతో హ్యాపీ గా లైఫ్ ని కొనసాగిస్తున్నాడు అని చెప్పాలి. ఒకప్పుడు యూత్ మొత్తాన్ని అట్రాక్ట్ చేసిన ఒక స్టార్ హీరో అవకాశాల్లేక న్యూజిలాండ్ జాబ్ చేసుకోవడం అనేది నిజంగా అబ్బాస్ ఫ్యాన్స్ తో పాటు సినిమా ప్రేక్షకులకు కూడా ఒకరకంగా బాధను కలిగించే విషయం అనే చెప్పాలి. రజనీకాంత్ లాంటి స్టార్ హీరోతో నరసింహ అనే సినిమాలో కూడా నటించాడు అబ్బాస్…

Advertisement
Continue Reading
Advertisement

Featured

Star Heroin: స్టార్ హీరోతో ప్రేమ,పెళ్లి విడాకులు..12 మందితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్… ఎవరంటే?

Published

on

Star Heroin: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి మనీషా కొయిరాల ఒకరు. ఈమె సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ సినిమాలలో నటించి ఒకానొక సమయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపారు. ఇక ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో తన వ్యక్తిగత విషయాలలో కూడా వార్తలలో నిలిచారు.

Advertisement

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు పలువురు హీరోలతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఒక స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడినప్పటికీ ఆయనని పెళ్లి చేసుకోలేదు. ఇక ఈమె సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రెండేళ్లకే తనతో విడాకులు తీసుకొని విడిపోయి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన మనీషా కోయిరాల మందుకు అలవాటు పడ్డారు.పెళ్లికి ముందే మనీషా కోయిరాలా ఏకంగా 12 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. వివేక్ ముశ్రన్‌, నానా పటేకర్‌, DJ హుస్సేన్‌, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్‌ వంటి ప్రముఖులతో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

12 మందితో డేటింగ్..
ఇలా తరచూ డేటింగ్ ల ద్వారా కూడా ఈమె వార్తల్లో నిలిచారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడిపారు. పలువురు దర్శక నిర్మాతలు సైతం ఈమె డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఇలా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపిన ఈమె మధ్యలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: విష్ణు ప్రియకు షాక్ ఇచ్చిన నిఖిల్… కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్.. అసలు ఆట ఆరంభం!

Published

on

Bigg Boss 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రారంభం అయ్యి 5 రోజులు పూర్తయింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అయితే హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ మూడు గ్రూపులుగా విడదీశారు. అయితే ఈ గ్రూపులోకి ఎవరెవరు సభ్యులను తీసుకోవాలనేది చీఫ్ ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ విష్ణు ప్రియ కచ్చితంగా తనని నిఖిల్ తన గ్రూపులోకి తీసుకుంటారని ఆమె భావించింది. కానీ నిఖిల్ మాత్రం ఆమెకు షాక్ ఇచ్చారు. దీంతో విష్ణు ప్రియను నైనిక తన టీమ్ లోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం గురించి నిఖిల్ విష్ణుప్రియ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీరిద్దరికి ముందే మంచి పరిచయమున్న నేపథ్యంలో తప్పకుండా నిఖిల్ తన టీమ్ లోకి తీసుకుంటారని విష్ణు ప్రియ భావించింది కానీ అది జరగలేదు.

ఇలా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కారణంగా విష్ణు ప్రియ సరదాగా నిఖిల్ ను ఓ ఆట ఆడుకుంది. దీంతో నిఖిల్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఇప్పటివరకు ఎంతో సరదాగా గడిపిన కంటెస్టెంట్లను మూడు గ్రూపులుగా విడదీయడంతో అసలైన ఆట మొదలైంది.

టాస్కులపై ఫోకస్..
కంటెస్టెంట్లను టీమ్స్ గా విడదీసి బిగ్ బాస్ టాస్కులను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇచ్చిన మొదటి టాస్కోలో భాగంగా ఇప్పటివరకు హౌస్ లో సైలెంట్ గా కూర్చున్న పృథ్విరాజ్ తన ఆట తీరును కనబరుస్తూ యష్మీ టీమ్ ను గెలిపించారు. దీంతో ముందు ముందు ఏ ఏ కంటెస్టెంట్ ఎలా తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారు బ్రో…. ఆ కంటెస్టెంట్లను ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఏడు సీజన్లను పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా గత ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. మొదట 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. మిగిలిన వారిని ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

Advertisement

ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ పోట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మిగిలిన వారు మాత్రం అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నా సందేహాలు వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతో యాక్టివ్ గా వెళ్లిన కంటెస్టెంట్లు లోపల మాత్రం అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోతున్నారనే చెప్పాలి.

ముఖ్యంగా హీరో ఆదిత్య ఓం అయితే హౌస్ లో ఉన్నాడా లేదా అన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది. ఈయన ఉంటే ఒంటరిగా ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు. పెద్దగా ఫేమస్ అయిన కంటెంట్ మాత్రం ఈయన ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలువురు ట్రోలర్స్ బ్రో అసలు ఎందుకొచ్చావు బ్రో బిగ్ బాస్ హౌస్ కి అంటూ భారీగా విమర్శలు చేస్తున్నారు.

ఈయనతో పాటు బెజవాడ బేబక్క కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈమె హౌస్ లో మాత్రం ఎక్కువగా కిచెన్ లోనే ఉంటుంది. కానీ సరైన కంటెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. పృధ్విరాజ్, అభయ్ నవీన్ వంటి వారందరూ కూడా హౌస్ లో డల్ గా కనిపిస్తున్న తరుణంలో పలువురు మీరంతా హౌస్ లోకి ఎందుకు వచ్చారో ఏమో అంటూ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అలాగే మరి కొంతమందిని బాగా హైలైట్ చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఎలిమినేషన్ ఉంటుందా…
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా బెజవాడ బేబక్క, విష్ణు ప్రియ, శేఖర్ భాష, నాగ మణికంఠ సోనియా ఆకుల ప్రేరణ వంటి వారు నామినేషన్ లో ఉన్నారు. అయితే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!