విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం…”విరించినై విరచించితిని ఈ కవనం.. ప్రాగ్ధిశ వీనియా పైన దినకర మయూఖ తంత్రులపైన”… వేదాలు, ఇతిహాసాల కలయిక భరత ఖండం.. సిరివెన్నెల చిత్రం సినీజగత్తులో ఓ అద్భుతమైన కళాఖండం. ఆ చిత్రం శాస్త్రీయసంగీత సమ్మేళనం.. చరిత్ర పుటల్లో నిలిచిపోయే ఓ అమృతభాండం. అది తేనెలొలుకు ఓ తెలుగు పాట, దేశభాషలందు తెలుగు లెస్స.. అనడానికి ఈ ఒక్క పాట వింటే చాలు తెలుగుపై మమకారం, నుడికారం ఇట్టే అర్థమైపోతుంది. ఇందులోని అన్ని పాటలు చిరకాలం గుర్తుండిపోయే ఆణిముత్యాలు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
అప్పటివరకు ఉన్న సినీగేయ, గీత గమనాన్ని మార్చిన ప్రసిద్ధ గేయ రచయిత సీతారామశాస్త్రి. ఈ సినిమాకి గీతాలు రాయడం వలన ఆయనకి సిరివెన్నెల సీతారామశాస్త్రి అని పేరు వచ్చింది. సినిమాలకి పాటలు రాయడం సిరివెన్నెల సినిమాతోనే మొదలు పెట్టినప్పటికీ ఈ చిత్రంలోని గీతాలలో ఉన్న లాలిత్యం, మాధుర్యం అనన్య సంక్రామకత్వం, అజరామరం. విధాత తలపున.. అనే పాట రాయడానికి గేయ రచయిత సీతారామశాస్త్రికి సుమారుగా వారం రోజుల సమయం తీసుకుంది. భారతీయ సంగీత కళలను ప్రధాన కేంద్రబిందువుగా తీసుకుని సంగీత ప్రియులను అబ్బురపరిచేలా సిరివెన్నెల చిత్రాన్ని వెండితెర దృశ్యకావ్యంగా మలచి భారతీయ చలనచిత్ర కీర్తి పతాకాన్ని ఎగురవేసిన దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్. శాస్త్రీయ సంగీత ప్రాధాన్యమున్న చిత్రాల పరంపరలో ఆయన మేధోమదనం నుంచి జాలువారిన మరో సంగీత సాహిత్య ప్రాధాన్యమున్న “చిత్రం” సిరివెన్నెల.
1986 పూర్ణోదయ పిక్చర్స్, కె.విశ్వనాథ్ దర్శకత్వంలో సర్వదమన్ బెనర్జీ, సుహాసిని, మున్ మున్ సేన్ హీరో, హీరోయిన్లుగా సిరివెన్నెల చిత్రం విడుదల అయ్యింది. ఈ చిత్ర కథ అంధుడైన వేణు విద్వాంసుడు హరిప్రసాద్, మూగదైన చిత్రకారిణి మధ్య చుట్టూ తిరిగే కథ. బెంగాలి నటుడు సర్వదమన్ బెనర్జీని ఆదిశంకరాచార్య, శ్రీ దత్త దర్శనం అనే చిత్రాల్లో చూసిన కె విశ్వనాథ్ సిరివెన్నెల సినిమాలో హీరోగా తీసుకున్నారు. తెలుగు తెరకు కొత్తగా పరిచయం అయినప్పటికీ నటుడు సాయి కుమార్ ఆయనకు డబ్బింగ్ చెప్పడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం రాజస్థాన్లోని జైపూర్ లో జరిగింది.
జైపూర్ పర్యాటకశాఖ వారు ముందుగా ఈ సినిమా షూటింగ్ కి కేంద్ర అనుమతి కావాలని కోరగా.. అప్పుడు అజ్మీర్ జిల్లా కలెక్టర్ అంతకుముందే శంకరాభరణం సినిమా చూడడం వలన కె.విశ్వనాథ్ ను గుర్తు పట్టి… ఈ సినిమా షూటింగ్ కి తొందరగా అనుమతి ఇవ్వడం జరిగింది. అలా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలైన అనంతరం ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. కానీ నంది బహుమతులతో సినిమా తెలుగు సాహిత్య కీర్తి బావుటాను ఎగురవేసింది. నంది ఉత్తమ గేయ రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రి, నంది ఉత్తమ గాయకుడిగా ఎస్పీ బాలసుబ్రమణ్యం, నంది ఉత్తమ ఛాయాగ్రాహకుడు ఎం.వి.రఘు, నంది ఉత్తమ సహాయనటి మునుమును సేన్ లు పొందారు. ఈ సంవత్సరం నంది అవార్డులతో సిరివెన్నెల సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోయింది.
YS Jagan: ఏపీ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది మరికొన్ని గంటలలో ఎన్నికలు ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. ఇప్పటికే ప్రతి ఒక్క గ్రామంలోనూ ఎన్నికల అధికారులు చేరుకొని ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి వారందరూ కూడా సొంత ఊరికి చేరుకున్నారు.
మరికొన్ని గంటలలో ఎన్నికల ప్రక్రియ మొదలుకానున్నటువంటి తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి పులివెందుల బయలుదేరారు. తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి తన సతీమణి వైయస్ భారతి తో కలిసి నాలుగు గంటలకు పులివెందుల బయలుదేరారు ఇక రెండు రోజులపాటు జగన్మోహన్ రెడ్డి పులివెందులలో ఉంటారని తెలుస్తోంది.
పులివెందులకు సీఎం.. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున భద్రత చర్యలు చేపట్టారు ఒకవైపు పోలింగ్ ఉండటం మరోవైపు సీఎం వస్తున్నారని విషయం తెలియడంతో పులివెందులలో కట్టదిట్టమైనటువంటి చర్యలు చేపట్టారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ కూడా ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా ఉండటం కోసం ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలను చేపట్టారు.
Nagababu: సినీ నటుడు నాగబాబు ప్రస్తుతం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈయన ఈ ఎన్నికలలో కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు కూడా వచ్చాయి కానీ కూటమిలో భాగంగా ఆయనకు టికెట్ రాలేకపోయింది కానీ తన తమ్ముడికి గెలుపు కోసం తన పార్టీ విజయం కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు.
ఇకపోతే నాగబాబు సోషల్ మీడియాలో చేసే పోస్టులు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే ఆయన ఎవరినైతే టార్గెట్ చేశారో వారికి సూటిగా ఆ వ్యాఖ్యలు గుచ్చుకునేలా ఉంటాయనే సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత తన తమ్ముడిపై ఉన్నటువంటి చెమట బొట్టులను తుడుస్తూ ఉన్నటువంటి ఫోటోని ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ గురించి చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. నిన్ను నమ్మని వాళ్లకోసం ఎందుకు నిలబడతావు అని నేను అడిగితే తను మాత్రం చెట్టును చూపిస్తారు అది తనని నాటిన వారికి మాత్రమే నీడను ఇవ్వదని చెబుతారు. నీపై నిందలు వేసే వారికోసం ఎందుకు నిలబడతావు అని అడిగితే వర్షాన్ని చూపిస్తారు. తనని మొక్కనీ రైతు కంటతడపకుండా పంటనే తడుపుతుందని అప్పటినుంచి అడగటమే మానేశానని నాగబాబు తెలిపారు.
Advertisement
మార్గదర్శకు మెట్టు.. ఆకాశం లాంటి అతని ఆలోచనా విశాలతని అర్ధం చేస్కోడం మొదలెట్టాను..సేనాని మీరు చిందించిన ప్రతి చెమట బొట్టు రేపటితరం ఎక్కబోయే మార్గదర్శపు మెట్టు కాబోతుంది కూటమి రాబోతుంది. సిరా పూసిన సామన్యుడి వేలి సంతకంతో నీ గెలుపు సిద్దమైంది.. విజయీభవ..!అని నాగబాబు చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పవన్ ఫాన్స్ కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారని చెప్పాలి ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.
Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ గురించి వేణుస్వామి చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనగా మారాయి. గత కొద్ది రోజులుగా ఈయన పవన్ కళ్యాణ్ జాతకాలు గురించి చెబుతూనే ఉన్నారు. అయితే ఇటీవల కూడా పవన్ కళ్యాణ్ కు సీఎం అయ్యే అవకాశాలు ఏ మాత్రం లేవని తెలిపారు. అయితే మరోసారి పవన్ కళ్యాణ్ గురించి వేణు స్వామి చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ చాలా మొండోడు ఎవరు చెప్పినా కూడా వినరు ఆయన కేవలం త్రివిక్రమ్ లాంటి వారు చెబితేనే వింటారు చివరికి తన అన్నయ్య చిరంజీవి చెప్పిన వినే వ్యక్తిత్వం తనది కాదని వేణు స్వామి తెలిపారు. ఇక నేను కూడా పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని తాను కూడా సీఎం కావాలని నేరు కోరుకుంటాను కానీ ఆయన జాతకం చూస్తే అది జరగదని వేణు స్వామి తెలిపారు.
పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం దాదాపు ఆయన చేసిన పది సినిమాలకు నేనే ముహూర్తాలు పెట్టానని వేణు స్వామి తెలిపారు. ఇలా ఈయనతో కలిసి గంటలు గంటలు మాట్లాడాను అయితే ఆయనంటే ఉండే ఇష్టం వేరు ఆయన అభివృద్ధిలోకి రావాలనే కాంక్ష వేరని వేణు స్వామి తెలిపారు.
Advertisement
సినిమాలతోనే మంచి పేరు.. ఇక రాజకీయ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ కు రాజకీయాలలో అవగాహన ఏమాత్రం లేదు. కుటిల రాజకీయాలు ఆయనకు తెలియవు. ఆయన నిర్ణయాలు చాలా బోల్డ్ గా ఉంటాయి. ఆయనకు రాజకీయాలు కలిసి రావు ఆయన సినిమాలకే అంకితం అవుతారు. మన అంచనాలు 100 శాతం ఉంటే.. రిజల్ట్ 20 శాతమే ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమాలపై ఫోకస్ పెడితేనే సక్సెస్ అవుతారు అంటూ ఈ సందర్భంగా వేణు స్వామి పవన్ కళ్యాణ్ గురించి ఆయన జాతకం గురించి చెబుతూ కామెంట్లు చేయడంతో అభిమానులు కాస్త కలవర పడుతున్నారు.