Connect with us

Featured

Mulugu MLA Seethakka : నక్సలైట్ నుండి ప్రజాప్రతినిధి వరకు సీతక్క ప్రస్థానం… నేడు డిప్యూటీ సీఎం రేసులో సీతక్క…!

Published

on

Mulugu MLA Seethakka : ఆదివాసీ కోయ జాతికి చెందిన దంసారి అనసూయ అలియాస్ సీతక్క రెండు తెలుగు రాష్ట్రాలకు బాగా తెలిసిన వ్యక్తి. ఆమె జీవితం ఖచ్చితంగా ఎందరికో ఆదర్శం. విద్యార్ధి జీవితం నుండే పోరాట జీవితం మొదలు పెట్టిన అనసూయ ఆపైన దళంలో చేరి అన్నలతో కలిసి ప్రభుత్వం మీద పోరాటం చేసింది. ఇక అక్కడ మారిన సిద్ధాంతాలు పొసగక జనజీవన స్రవంతిలో కలిసిపోయి ఆపైన గిరిజన మహిళలకు ఉపాధినిచ్చే ప్రభుత్వ సంస్థలో చేరి ఉద్యోగం చేసుకుంటూనే మరోవైపు సామజిక సేవ వైపు సాగింది. ఆపైన రాజకీయాలలోకి వచ్చి ఎమ్మెల్యేగా తన ప్రాంత ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి పక్షాన నిలిచి పోరాడుతూ నిజమైన ప్రజాసేవకు మార్గం తెలుసుకున్నారు. ఇలా నక్సలైట్ జీవితం నుండి నేడు డిప్యూటీ సీఎం రేస్ లో ఉన్న ఆమె ప్రస్థానం అందరికీ ఆదర్శమే.

Advertisement

చిన్న వయసులోనే ప్రజాపోరాటంలోకి…

వరంగల్ జిల్లా ములుగు మండలం జగ్గన్నగూడెంకి చెందిన సమ్మక్క, సమ్మయ్యలకు జన్మించిన దంసారి అనసూయ అలియాస్ సీతక్క ప్రభుత్వ గిరిజన వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న సమయంలోనే అక్కడ సరిగా భోజనం పెట్టడం లేదని అలాగే బాలికలకు ప్రభుత్వం ఇస్తున్న పది రూపాయలను వసతి గృహ అధికారులు ఇవ్వడం లేదని తోటి విద్యార్థులను కూడగట్టుకుని ధర్నా చేసింది. ఆలా 13 ఏళ్ల వయసులోనే 1986లో పోరాట జీవితంలోకి అడుగుపెట్టిన సీతక్క పీపుల్స్ వార్ దళం సభ్యుల కంట్లో పడింది. తన సోదరుడు సాంబయ్య కూడా నక్సలైట్ కాగా పోలీసుల చేతిలో మరణించాడు. బావ శ్రీరాముడు దళంలో ఉండటంతో 14 ఏళ్ల వయసులో నక్సలిజంలో చేరినా సీతక్క చదువును వదలలేదు. దళ సభ్యులను పోలీసులు అరెస్టు చేసి జైలుకి పంపినప్పుడు జైలులో ఉంటూనే పదోతరగతిలో ఫెయిల్ అయిన సబ్జక్ట్స్ పాస్ అయింది. ఆపైన ప్రేమించిన తన బావ శ్రీరాముడినే పెళ్లి చేసుకున్న అనసూయ, సీతక్కగా తన పేరును మార్చుకున్నారు. కొడుకు పుట్టిన తరువాత రెండు నెలల పిల్లాడిని బయట వేరేవాళ్లకు పెంచడానికి ఇచ్చి అడవిలోకి వెళ్లిపోయిన సీతక్క దంపతుల మధ్య విబేధాలు రావడం దళంలో పొసగలేక 1996లో బయటికి వచ్చేసిన సీతక్క ఆ తరువాత ఐటిడీఏ (ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ) లో నెల జీతానికి పనిచేస్తూ చదువు కొనసాగించారు.

అలా ‘లా’ చదివిన సీతక్క ఆపైన చంద్రబాబు ప్రోత్సాహంతో టీడీపీ పార్టీ పట్ల ఆకర్షితురాలై 2004లో అందులో చేరి ములుగు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ పైన 2009లో మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థి పోడెం వీరయ్య మీద పోటీ చేసి గెలిచారు. ఆలా ఎమ్మెల్యే అయిన సీతక్క నిత్యం తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయములో టీడీపీ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఓడిపోయిన సీతక్క 2017లో కాంగ్రెస్ లోకి చేరారు. 2019 ఎన్నిక్షల్లో గెలిచినా టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తుందో తెలియని పరిస్థితి. ఇక కరోనా సమయంలో అందరూ ఇళ్ళకే పరిమితం అయితే తాను మాత్రం టిఆర్ఎస్ ప్రభుత్వ సహాయం లేకున్నా తన నియోజకవర్గంలో గ్రామాలను తిరుగుతూ ఎంతోమందికి ఆహారం, నిత్యావసర వస్తువులను అందజేసి ఎమ్మెల్యే బాధ్యతలు ఏమిటో తెలియజేసారు. ఆలా నేడు తెలంగాణ కాంగ్రెస్ మహిళా ఇంచార్జ్ గా ఉంటూనే ఎమ్మెల్యేగా మరోసారి గెలిచి నేడు డిప్యూటీ సీఎం రేస్ లో నిలిచారు. తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలోని గోత్తి కోయ గిరిజనుల జీవన స్థితిగతుల మీద పరిశోధనలకు గౌరవ డాక్టరేట్ పొందారు. అలా నక్సలైట్ జీవితం నుండి లాయర్ గా మారి ఆపైన ఎమ్మెల్యే అయిన ఆమె జీవితం ఎందరికో ఆదర్శం.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Star Heroin: స్టార్ హీరోతో ప్రేమ,పెళ్లి విడాకులు..12 మందితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్… ఎవరంటే?

Published

on

Star Heroin: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి మనీషా కొయిరాల ఒకరు. ఈమె సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ సినిమాలలో నటించి ఒకానొక సమయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపారు. ఇక ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో తన వ్యక్తిగత విషయాలలో కూడా వార్తలలో నిలిచారు.

Advertisement

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు పలువురు హీరోలతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఒక స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడినప్పటికీ ఆయనని పెళ్లి చేసుకోలేదు. ఇక ఈమె సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రెండేళ్లకే తనతో విడాకులు తీసుకొని విడిపోయి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన మనీషా కోయిరాల మందుకు అలవాటు పడ్డారు.పెళ్లికి ముందే మనీషా కోయిరాలా ఏకంగా 12 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. వివేక్ ముశ్రన్‌, నానా పటేకర్‌, DJ హుస్సేన్‌, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్‌ వంటి ప్రముఖులతో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

12 మందితో డేటింగ్..
ఇలా తరచూ డేటింగ్ ల ద్వారా కూడా ఈమె వార్తల్లో నిలిచారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడిపారు. పలువురు దర్శక నిర్మాతలు సైతం ఈమె డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఇలా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపిన ఈమె మధ్యలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: విష్ణు ప్రియకు షాక్ ఇచ్చిన నిఖిల్… కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్.. అసలు ఆట ఆరంభం!

Published

on

Bigg Boss 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రారంభం అయ్యి 5 రోజులు పూర్తయింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అయితే హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ మూడు గ్రూపులుగా విడదీశారు. అయితే ఈ గ్రూపులోకి ఎవరెవరు సభ్యులను తీసుకోవాలనేది చీఫ్ ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ విష్ణు ప్రియ కచ్చితంగా తనని నిఖిల్ తన గ్రూపులోకి తీసుకుంటారని ఆమె భావించింది. కానీ నిఖిల్ మాత్రం ఆమెకు షాక్ ఇచ్చారు. దీంతో విష్ణు ప్రియను నైనిక తన టీమ్ లోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం గురించి నిఖిల్ విష్ణుప్రియ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీరిద్దరికి ముందే మంచి పరిచయమున్న నేపథ్యంలో తప్పకుండా నిఖిల్ తన టీమ్ లోకి తీసుకుంటారని విష్ణు ప్రియ భావించింది కానీ అది జరగలేదు.

ఇలా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కారణంగా విష్ణు ప్రియ సరదాగా నిఖిల్ ను ఓ ఆట ఆడుకుంది. దీంతో నిఖిల్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఇప్పటివరకు ఎంతో సరదాగా గడిపిన కంటెస్టెంట్లను మూడు గ్రూపులుగా విడదీయడంతో అసలైన ఆట మొదలైంది.

టాస్కులపై ఫోకస్..
కంటెస్టెంట్లను టీమ్స్ గా విడదీసి బిగ్ బాస్ టాస్కులను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇచ్చిన మొదటి టాస్కోలో భాగంగా ఇప్పటివరకు హౌస్ లో సైలెంట్ గా కూర్చున్న పృథ్విరాజ్ తన ఆట తీరును కనబరుస్తూ యష్మీ టీమ్ ను గెలిపించారు. దీంతో ముందు ముందు ఏ ఏ కంటెస్టెంట్ ఎలా తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారు బ్రో…. ఆ కంటెస్టెంట్లను ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఏడు సీజన్లను పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా గత ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. మొదట 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. మిగిలిన వారిని ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

Advertisement

ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ పోట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మిగిలిన వారు మాత్రం అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నా సందేహాలు వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతో యాక్టివ్ గా వెళ్లిన కంటెస్టెంట్లు లోపల మాత్రం అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోతున్నారనే చెప్పాలి.

ముఖ్యంగా హీరో ఆదిత్య ఓం అయితే హౌస్ లో ఉన్నాడా లేదా అన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది. ఈయన ఉంటే ఒంటరిగా ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు. పెద్దగా ఫేమస్ అయిన కంటెంట్ మాత్రం ఈయన ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలువురు ట్రోలర్స్ బ్రో అసలు ఎందుకొచ్చావు బ్రో బిగ్ బాస్ హౌస్ కి అంటూ భారీగా విమర్శలు చేస్తున్నారు.

ఈయనతో పాటు బెజవాడ బేబక్క కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈమె హౌస్ లో మాత్రం ఎక్కువగా కిచెన్ లోనే ఉంటుంది. కానీ సరైన కంటెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. పృధ్విరాజ్, అభయ్ నవీన్ వంటి వారందరూ కూడా హౌస్ లో డల్ గా కనిపిస్తున్న తరుణంలో పలువురు మీరంతా హౌస్ లోకి ఎందుకు వచ్చారో ఏమో అంటూ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అలాగే మరి కొంతమందిని బాగా హైలైట్ చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఎలిమినేషన్ ఉంటుందా…
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా బెజవాడ బేబక్క, విష్ణు ప్రియ, శేఖర్ భాష, నాగ మణికంఠ సోనియా ఆకుల ప్రేరణ వంటి వారు నామినేషన్ లో ఉన్నారు. అయితే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!