Connect with us

Featured

YS Jagan & Sharmila : అన్నాచెల్లి కలుస్తారా? ఏపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్..

Published

on

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరంటారు.. కానీ ఇది రాజకీయపరమైన వైరం కాదే.. కుటుంబపరమైన వైరం. కలతలు వస్తేనే కలవడం కష్టం. అలాంటిది అన్నీ లాగేసి రోడ్డున నిలబెట్టిన అన్నను షర్మిల క్షమించగలదా? తిరిగి అన్నకు అండగా నిలవగలదా? రాజన్న బిడ్డనంటూ జనంలోకి వచ్చి మాత్రం షర్మిల సాధించిందేముంది? కనీస జనాదరణ పొందారా? కనీసం ఆమె పుట్టిన గడ్డైనా ఆమెను ఆదరించిందా? సొంత గడ్డపై పోటీ చేసి నవ్వుల పాలయ్యారు. కడప పార్లమెంటు నుంచి పోటీ చేసి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. ఇంత ఘోర పరాజయం షర్మిలను కదిలించలేకపోవచ్చు కానీ ఆమె కుటుంబ చరిత్రకు ఒక రెడ్ మార్క్ పడినట్టే కదా? పీసీసీ చీఫ్‌గా ఉండి ఏపీలో ఒక్కటంటే ఒక్క సీటును సాధించలేకపోవడం ఆమె కుటుంబ చరిత్రకే పెద్ద మచ్చ. షర్మిల పగ్గాలు చేపట్టాక జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటు శాతం 2 కంటే తక్కువకు పడిపోయింది. వైసీపీ దారుణ పరాజయంతో ఆ పార్టీలోని కొందరు నేతలకు మరింత సంకట స్థితి ఏర్పడింది. ఎన్డీఏ కూటమి వైపు కూడా ఈ నేతలెవరూ చూసే పరిస్థితి లేదు. పోనీ కాంగ్రెస్‌లోకి వెళదామా? అంటే దానికంటే రాజకీయ సన్యాసం బెటరన్న ఆలోచనలో ఉన్నారు.

Advertisement

కుటుంబ చరిత్రకే ఇది అవమానం..

కనీసం ఓట్లకు కూడా షర్మిల గండి కొట్టలేకపోయారు. షర్మిల సాధించింది ఈ ఎన్నికల్లో ఒక్కటే ఒక్కటే కొన్ని చోట్ల ముస్లిం ఓట్లకు గండి కొట్టి అన్న జగన్‌పై పగ అయితే తీర్చుకోగలిగారు. ఇప్పుడు సమస్య ఏంటంటే.. జగన్ పరిస్థితి కూడా షర్మిలకు ఏమాత్రం తీసిపోదు. గత ఎన్నికల్లో 151 స్థానాలు గెలుచుకుని గర్వంగా కాలర్ ఎగురవేసిన జగన్.. ఐదేళ్లు తిరిగే సరికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పడిపోయారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు. నిజానికి జగన్ కుటుంబ చరిత్రకే ఇది అవమానం. అన్నా చెల్లెళ్లిద్దరూ కుటుంబ చరిత్రను మంటగలిపారు. ఇద్దరూ విడిపోయి సాధించింది ఇంతకు మించి ఏమీ లేదు. అసలు ఇప్పుడు ఆస్తి కోసం చెల్లిని ఇంటి నుంచి బయటకు గెంటిన జగన్ ఇప్పుడు రిగ్రెట్ ఫీలవుతారా? చెల్లితో కలిసుంటే తల్లి విజయమ్మ కూడా ఆయనతో ఉండేవారు. ఈ కష్టకాలంలో ఆయనకు కాస్త అండ దొరికేది. జగన్, షర్మిల ఇద్దరూ ఒకే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఒకరి విలువ మరొకరు తెలుసుకునే అవకాశం ఉందా? అనేది చర్చనీయాంశంగా మారింది.

తల్లి, చెల్లి ఇద్దరూ గుర్తొస్తున్నారట..

ఇన్నాళ్లు అన్నాచెల్లెల్లిద్దరి మధ్య ఆస్తి గొడవల కారణంగా నేరుగా మాట్లాడుకోవడమే మానేశారు. ఇప్పుడు పరిస్థితి బాగోలేదు కాబట్టి షర్మిలకు ఏం కావాలో అది ఇచ్చేయాలని జగన్ అనుకుంటున్నారా? త్వరలో ఆస్తుల పంపకాలు షురూ అవుతాయా? అనే ప్రశ్నలు ఏపీలో హాట్ టాపిక్‌గా మారాయి. వాస్తవానికి అన్నాచెల్లెల్లిద్దరి మధ్య భారతీరెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి దూరం పెంచారని టాక్. భారతీ రెడ్డిని పక్కనబెడితే సజ్జలకేంటి ప్రయోజనం అంటారా? నంబర్ గేమ్.. జగన్ తర్వాత తానే నంబర్ 2గా ఉండాలనే ఆరాటం. ఆ ఆరాటంతోనే సకల శాఖలకు ఆయనే మంత్రిగా వ్యవహరించి మొత్తానికి పార్టీనే మట్టిలో కలిపేశారు. ఇప్పుడు ఏపీలో వైసీపీ పాయే… కాంగ్రెస్ పాయే.. మొదలెత్తుకుంటే కానీ ముందుకు జరగదు. ఈ తరుణంలో జగన్ మెడకు కేసుల ఉచ్చు తిరిగి బిగించుకోకా మానదు. మరి జగన్ జైలుకు వెళ్తే పార్టీ బాధ్యతలను తిరిగి తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల తీసుకుంటారా? మొత్తానికి జగన్‌కు అయితే ఇప్పుడు తల్లి, చెల్లి ఇద్దరూ గుర్తొస్తున్నారట. కష్టాలొచ్చేసరికి కన్నవాళ్లు.. తోడబుట్టినది కనిపిస్తున్నారట. మరోవైపు షర్మిలకు కూడా కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఈ తరుణంలో ఆమె కూడా అన్నే దిక్కు అనుకునే అవకాశం ఉంది. ఇక చూడాలి ఏం జరుగుతుందో..

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Star Heroin: స్టార్ హీరోతో ప్రేమ,పెళ్లి విడాకులు..12 మందితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్… ఎవరంటే?

Published

on

Star Heroin: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి మనీషా కొయిరాల ఒకరు. ఈమె సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ సినిమాలలో నటించి ఒకానొక సమయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపారు. ఇక ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో తన వ్యక్తిగత విషయాలలో కూడా వార్తలలో నిలిచారు.

Advertisement

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు పలువురు హీరోలతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఒక స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడినప్పటికీ ఆయనని పెళ్లి చేసుకోలేదు. ఇక ఈమె సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రెండేళ్లకే తనతో విడాకులు తీసుకొని విడిపోయి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన మనీషా కోయిరాల మందుకు అలవాటు పడ్డారు.పెళ్లికి ముందే మనీషా కోయిరాలా ఏకంగా 12 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. వివేక్ ముశ్రన్‌, నానా పటేకర్‌, DJ హుస్సేన్‌, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్‌ వంటి ప్రముఖులతో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

12 మందితో డేటింగ్..
ఇలా తరచూ డేటింగ్ ల ద్వారా కూడా ఈమె వార్తల్లో నిలిచారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడిపారు. పలువురు దర్శక నిర్మాతలు సైతం ఈమె డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఇలా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపిన ఈమె మధ్యలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: విష్ణు ప్రియకు షాక్ ఇచ్చిన నిఖిల్… కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్.. అసలు ఆట ఆరంభం!

Published

on

Bigg Boss 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రారంభం అయ్యి 5 రోజులు పూర్తయింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అయితే హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ మూడు గ్రూపులుగా విడదీశారు. అయితే ఈ గ్రూపులోకి ఎవరెవరు సభ్యులను తీసుకోవాలనేది చీఫ్ ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ విష్ణు ప్రియ కచ్చితంగా తనని నిఖిల్ తన గ్రూపులోకి తీసుకుంటారని ఆమె భావించింది. కానీ నిఖిల్ మాత్రం ఆమెకు షాక్ ఇచ్చారు. దీంతో విష్ణు ప్రియను నైనిక తన టీమ్ లోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం గురించి నిఖిల్ విష్ణుప్రియ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీరిద్దరికి ముందే మంచి పరిచయమున్న నేపథ్యంలో తప్పకుండా నిఖిల్ తన టీమ్ లోకి తీసుకుంటారని విష్ణు ప్రియ భావించింది కానీ అది జరగలేదు.

ఇలా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కారణంగా విష్ణు ప్రియ సరదాగా నిఖిల్ ను ఓ ఆట ఆడుకుంది. దీంతో నిఖిల్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఇప్పటివరకు ఎంతో సరదాగా గడిపిన కంటెస్టెంట్లను మూడు గ్రూపులుగా విడదీయడంతో అసలైన ఆట మొదలైంది.

టాస్కులపై ఫోకస్..
కంటెస్టెంట్లను టీమ్స్ గా విడదీసి బిగ్ బాస్ టాస్కులను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇచ్చిన మొదటి టాస్కోలో భాగంగా ఇప్పటివరకు హౌస్ లో సైలెంట్ గా కూర్చున్న పృథ్విరాజ్ తన ఆట తీరును కనబరుస్తూ యష్మీ టీమ్ ను గెలిపించారు. దీంతో ముందు ముందు ఏ ఏ కంటెస్టెంట్ ఎలా తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారు బ్రో…. ఆ కంటెస్టెంట్లను ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఏడు సీజన్లను పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా గత ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. మొదట 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. మిగిలిన వారిని ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

Advertisement

ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ పోట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మిగిలిన వారు మాత్రం అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నా సందేహాలు వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతో యాక్టివ్ గా వెళ్లిన కంటెస్టెంట్లు లోపల మాత్రం అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోతున్నారనే చెప్పాలి.

ముఖ్యంగా హీరో ఆదిత్య ఓం అయితే హౌస్ లో ఉన్నాడా లేదా అన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది. ఈయన ఉంటే ఒంటరిగా ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు. పెద్దగా ఫేమస్ అయిన కంటెంట్ మాత్రం ఈయన ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలువురు ట్రోలర్స్ బ్రో అసలు ఎందుకొచ్చావు బ్రో బిగ్ బాస్ హౌస్ కి అంటూ భారీగా విమర్శలు చేస్తున్నారు.

ఈయనతో పాటు బెజవాడ బేబక్క కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈమె హౌస్ లో మాత్రం ఎక్కువగా కిచెన్ లోనే ఉంటుంది. కానీ సరైన కంటెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. పృధ్విరాజ్, అభయ్ నవీన్ వంటి వారందరూ కూడా హౌస్ లో డల్ గా కనిపిస్తున్న తరుణంలో పలువురు మీరంతా హౌస్ లోకి ఎందుకు వచ్చారో ఏమో అంటూ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అలాగే మరి కొంతమందిని బాగా హైలైట్ చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఎలిమినేషన్ ఉంటుందా…
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా బెజవాడ బేబక్క, విష్ణు ప్రియ, శేఖర్ భాష, నాగ మణికంఠ సోనియా ఆకుల ప్రేరణ వంటి వారు నామినేషన్ లో ఉన్నారు. అయితే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!