Featured
అందరూ ఛీ కొట్టినా నేను బీజేపీలో చేరాను.. మాధవీలత షాకింగ్ పోస్ట్..!
![](https://telugudesk.net/wp-content/litespeed/avatar/48f246d9b01e880e5843b8d38f9199e4.jpg?ver=1719738859)
Published
4 years agoon
By
lakshanaతెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల 1వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో చాలామంది నాయకులు గతంలో ఉన్న పార్టీల నుంచి మెరుగైన భవిష్యత్తు కోసం మరో పార్టీలో చేరుతున్నారు. ప్రస్తుతం ఉన్న పార్టీలో సరైన ప్రాధాన్యత లేని నేతలు, పదవుల కోసం ఆశ పడుతున్న నేతలు జంపింగులు చేస్తున్నారు. ఎన్నికల్లో టికెట్ దక్కకపోతే వెంటనే కండువా మార్చేస్తున్నారు.
ఇలా పార్టీలు మారుస్తున్న నేతల గురించి నటి, బీజీపీ యువ మహిళానేత మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీలో చేరిన సమయంలో విమర్శలు చేసిన వాళ్లే ఇప్పుడు బీజేపీలో చేరడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అవసరాలకు అనుగుణంగా బీజేపీ పార్టీ కండువా కప్పుకున్నంత మాత్రాన కాషాయం మనిషి అయిపోరని మాధవీలత అన్నారు. కండువా కప్పుకుంటే దేశభక్తి, జాతీయతాభావం తన్నుకురాదని పేర్కొన్నారు.
భక్తి అనేది బ్లడ్ లో, నరనరాల్లో ఉండాలని, రక్తంలో ఉండాలని అప్పుడే కాషాయాన్ని సరిగ్గా మోయగలరని అన్నారు. అవసరానికి, పదవుల కోసం అయితే కొన్నాళ్లే ఉంటారని.. పదవులు తీసుకున్నంత మాత్రాన గొర్రె సింహం కాదని పేర్కొన్నారు. అందరూ ఛీ కొట్టినా తాను బీజేపీలో చేరానని.. నన్ను ఛీ అన్నవాళ్లు సిగ్గు లేకుండా ఇప్పుడు కాషాయ కండువా కప్పుకుంటున్నారని పేర్కొన్నారు.
వాళ్లు పార్టీలో చేరినా చేరినా తాను ఛీ ఛీ అనడం లేదని తనకు తనకు సంస్కారం ఉందని మాధవీలత పేర్కొన్నారు. నాది ఒకటి కండువా, ఒకటే మాట మీరు ఊసరవెళ్లులు, నక్కలు అని మాధవీలత అన్నారు. 88 శాతం మంది ప్రజలు కూడా అదే విధంగా ఉన్నారని యథా రాజా తథా ప్రజా అంటూ పోస్ట్ పెట్టారు.
You may like
Balakrishna: సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్న బాలయ్య.. అదే ప్రధాన కారణమా?
Madhavi Latha: బిగ్ బాస్ 7 లోకి సినీనటి మాధవి లత…. స్పందించి క్లారిటీ ఇచ్చిన నటి!
AP Politics: ఎన్నికలు ఎప్పుడు జరిగిన 160 స్థానాలు తెదేపావే: అచ్చం నాయుడు
Ravi Prakash: వారి అండతో కొత్త న్యూస్ ఛానల్ ప్రారంభించడానికి సిద్ధమైన రవి ప్రకాష్!
Raja Singh : విప్లవ పుస్తకాలు చదివి సాయిపల్లవి మైండ్ పాడైపోయింది… వెంటనే ఆమెని అరెస్ట్ చేయాలి బీజేపీ నేత రాజా సింగ్ డిమాండ్!
Manchu Vishnu: వివాదంలో మంచు విష్ణు జిన్నా మూవీ… వార్నింగ్ ఇచ్చిన బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి!
Featured
Kakli: కల్కి సినిమాకు ఫస్ట్ ఛాయిస్ ప్రభాస్ కదా.. ఆ హీరో సజెస్ట్ చేస్తేనే ప్రభాస్ వరకు వచ్చిందా?
![](https://telugudesk.net/wp-content/litespeed/avatar/48f246d9b01e880e5843b8d38f9199e4.jpg?ver=1719738859)
Published
2 hours agoon
3 July 2024By
lakshanaKakli: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి. ఈ సినిమా జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ వారు ఏకంగా 600 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
ఇక ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకోవడమే కాకుండా భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతుంది. ఇక ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ప్రభాస్ భైరవ పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే.
నిజానికి ఈ సినిమాలో ముందుగా ప్రభాస్ ను అనుకోలేదట డైరెక్టర్ అయితే ఒక స్టార్ హీరో ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతోనే ప్రభాస్ వరకు వచ్చిందని తెలుస్తుంది. ఈ సినిమా కథ మొత్తం సిద్ధం చేసుకున్న తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లి ఈ సినిమా కథను వివరించారట ఈ సినిమా కథ విన్న చిరంజీవి సినిమా చాలా అద్భుతంగా ఉంది కచ్చితంగా సక్సెస్ అవుతుందని తెలియజేశారట.
చిరు రిజెక్ట్ చేశారా..
ఇలా తనకు కథ చెప్పిన తర్వాత ఇందులో భైరవ పాత్రలో మీరు నటించాలని కోరుకుంటున్నాను అని చెప్పడంతో వెంటనే చిరంజీవి ఈ సినిమాలో భైరవ పాత్రలో నేను నటిస్తే ఆ పాత్రకు పూర్తిగా న్యాయం జరగదు. ఈ పాత్రకు ప్రభాస్ సరిగ్గా సరిపోతారని ఆయనే ప్రభాస్ పేరును సజెస్ట్ చేశారని తెలుస్తోంది. ఇలా చిరంజీవి కాదంటేనే కల్కి సినిమా కథ ప్రభాస్ వరకు వచ్చిందని, చిరు కారణంగానే ప్రభాస్ మరో హిట్ సినిమాని అందుకున్నారని తెలుస్తోంది.
Featured
NTR: చిరంజీవి ఇచ్చిన అవార్డును ఆ హీరో ఇంటికి పంపిన తారక్.. ఏమైందంటే?
![](https://telugudesk.net/wp-content/litespeed/avatar/48f246d9b01e880e5843b8d38f9199e4.jpg?ver=1719738859)
Published
2 hours agoon
3 July 2024By
lakshanaNTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు ఎన్టీఆర్. ఈయన బాల నటుడి గానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి చిన్న వయసులోనే హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా వరుస సినిమాలలో నటిస్తున్న తారక్ గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన యమదొంగ సినిమా ఎలాంటి సక్సెస్ అయ్యిందో మనకు తెలిసిందే .ఈ సినిమాకు గాను ఈయనకు స్టార్ మా అవార్డు అందుకున్నారు అయితే ఈ అవార్డు ప్రముఖ నటుడు చిరంజీవి నాగార్జున చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. అయితే ఈ అవార్డును తీసుకున్న తారక్ ఇంట్లో పెట్టుకోకుండా వేరే హీరోకి పంపించారని తెలుస్తోంది.
ఇలా స్టార్ హీరో చిరంజీవి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకున్నటువంటి ఈయన వేదికపై మాట్లాడుతూ తాను చిన్నప్పటినుంచి చిరంజీవి గారు నాగార్జున బాబాయ్ సినిమాలను చూస్తూ తాను పెరిగానని తెలిపారు. ఇక ఈవెంట్ జరుగుతున్న నేపథ్యంలో సీనియర్ నటుడు శోభన్ బాబు మరణించారనే వార్త తెలియడంతో తనకు వచ్చిన ఈ అవార్డు శోభన్ బాబు గారి ఇంట్లో ఉండాలని నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్ ఆ అవార్డును తన ఇంటికి పంపించారు.
శోభన్ బాబు ఇంటికి..
ఆ క్షణం ఎన్టీఆర్ తీసుకున్న ఆ నిర్ణయానికి చిరంజీవి సైతం ఫిదా అవ్వడమే కాకుండా ఎన్టీఆర్ పై ప్రశంశల వర్షం కురిపించారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే ఈయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Featured
YS Sharmila: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన షర్మిల.. కారణం అదేనా?
![](https://telugudesk.net/wp-content/litespeed/avatar/48f246d9b01e880e5843b8d38f9199e4.jpg?ver=1719738859)
Published
2 hours agoon
3 July 2024By
lakshanaYS Sharmila: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కలిశారు. ఇటీవల హైదరాబాద్ లోనే ఉంటున్న ఈమె తెలంగాణ ముఖ్యమంత్రిని కలవడమే కాకుండా తన తండ్రి జయంతి వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఆమె తనకు ఆహ్వానం అందజేశారు. జులై 8వ తేదీ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి అనే సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈసారి వైయస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. ఇన్ని రోజులపాటు జగన్మోహన్ రెడ్డి షర్మిల ఎవరికి వారు వైయస్సార్ ఘాట్ వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేసి తన తండ్రికి నివాళులు అర్పించేవారు.
ఇటీవల జగన్మోహన్ రెడ్డి నుంచి షర్మిల దూరంగా వెళ్లడమే కాకుండా ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంతో ఈసారి జరగబోయే జయంతి వేడుకలను షర్మిల ఘనంగా జరిపించడమే కాకుండా కాంగ్రెస్ పెద్దలను కూడా ఆహ్వానిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి జూలై 8వ తేది విజయవాడలోని CK కన్వెన్షన్ సెంటర్ లో జరిగే రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలకు హాజరుకావాలని ఆహ్వానించారు.
ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు..
జులై 8వ తేదీ జరగబోయే ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ , లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ , జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఇతర AICC పెద్దలతో పాటు .. ఏపి, తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాల నాయకులు, ప్రముఖులు హాజరు కానున్నారు.
![](https://telugudesk.net/wp-content/uploads/2024/07/Kakli-80x80.webp)
Kakli: కల్కి సినిమాకు ఫస్ట్ ఛాయిస్ ప్రభాస్ కదా.. ఆ హీరో సజెస్ట్ చేస్తేనే ప్రభాస్ వరకు వచ్చిందా?
![](https://telugudesk.net/wp-content/uploads/2024/01/jrntr-1686392776.jpg?v=1704202423)
NTR: చిరంజీవి ఇచ్చిన అవార్డును ఆ హీరో ఇంటికి పంపిన తారక్.. ఏమైందంటే?
![](https://telugudesk.net/wp-content/uploads/2024/07/sharmila-80x80.jpg?v=1719990357)
YS Sharmila: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన షర్మిల.. కారణం అదేనా?
![](https://telugudesk.net/wp-content/uploads/2024/07/ys-jagan-80x80.webp)
YS Jagan: నెల్లూరు జైలుకు వైయస్ జగన్.. ఆ వైసీపీ నేతతో మూలఖత్?
![](https://telugudesk.net/wp-content/uploads/2024/07/Ambani-Family-80x80.webp)
Ambani Family: సామూహిక వివాహాలు చేసిన అంబానీ కుటుంబం.. కానుకల లిస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/nallari-kirankumarireddy-80x80.png?v=1717917965)
Nallari Kiran Kumar Reddy : ఏపీలో దురదృష్టవంతుడంటే ఆయనే.. అంత సునామీలోనూ ఓటమి..
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/Ramoji_Rao-80x80.jpg?v=1717817310)
Ramoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు అస్తమయం!
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/ysjagan-80x80.png?v=1717659232)
YS Jagan : పడి లేచిన కెరటమవుతారా? పత్తా లేకుండా పోతారా?
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/modi30-80x80.png?v=1717916702)
Modi 3.0 : ఏపీకి ఐదు కేంద్ర మంత్రి పదవులు.. ఎవరెవరికంటే..
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/pawan-kalyan-80x80.jpg?v=1717758472)
Pawan Kalyan: నరేంద్ర మోడీకి తన కొడుకుని పరిచయం చేసిన పవన్… సంతోషంలో ఫ్యాన్స్?
Trending
- Featured3 weeks ago
Nallari Kiran Kumar Reddy : ఏపీలో దురదృష్టవంతుడంటే ఆయనే.. అంత సునామీలోనూ ఓటమి..
- Featured4 weeks ago
Ramoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు అస్తమయం!
- Featured4 weeks ago
YS Jagan : పడి లేచిన కెరటమవుతారా? పత్తా లేకుండా పోతారా?
- Featured3 weeks ago
Modi 3.0 : ఏపీకి ఐదు కేంద్ర మంత్రి పదవులు.. ఎవరెవరికంటే..
- Featured4 weeks ago
Pawan Kalyan: నరేంద్ర మోడీకి తన కొడుకుని పరిచయం చేసిన పవన్… సంతోషంలో ఫ్యాన్స్?
- Featured5 days ago
Ali: ఇప్పుడు ఎన్నికలు పెట్టిన ఆయన సీఎం నేను హోమ్ మినిస్టర్ అవుతా: అలీ
- Featured4 weeks ago
Hema: సినీనటి హేమకు భారీ షాక్.. జ్యూడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు!
- Featured4 weeks ago
YS Jagan & Sharmila : అన్నాచెల్లి కలుస్తారా? ఏపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్..