Connect with us

Featured

Krishnam Raju : కృష్ణంరాజుకు రెబల్ స్టార్ అనే బిరుదు ఎలా వచ్చిందో తెలుసా?

Published

on

Krishnam Raju : కృష్ణంరాజు.. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. రాజు కుటుంబం నుంచి వచ్చినా.. జమీందారు అయినా చాలా సామాన్యుడిలా ఉంటారు. అందరితోనూ కలిసిపోతారు. కానీ.. ఆయన్ను చూస్తే మాత్రం అందరూ భయపడిపోతారు. ఎందుకంటే.. ఆయన చూడటానికి గంభీరంగా ఉంటారు. ఆయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు. ఆయన ఇప్పటి వరకు వందల సినిమాల్లో నటించారు. 1966 లో కృష్ణం రాజు సినిమా రంగంలో అడుగుపెట్టారు. చిలకా గోరింక అనే సినిమాతో ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

Advertisement

ఆయనకు నంది అవార్డులు, బెస్ట్ యాక్టర్ అవార్డులు, ఫిలిం ఫేర్ అవార్డులు బోలెడు వచ్చాయి. ఆయన నటించిన ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. 1973 లో వచ్చిన జీవన తరంగాలు, 1974 లో వచ్చిన కృష్ణవేణి, 1976 లో వచ్చిన భక్త కన్నప్ప, 1977 లో వచ్చిన అమరదీపం, 1978 లో వచ్చిన సతీ సావిత్రి, 1978 లో వచ్చిన కటకటాల రుద్రయ్య, 1978 లో వచ్చిన మన ఊరి పాండవులు లాంటి సినిమాలు ఆయన కెరీర్ లో బెస్ట్ ఫిలింస్ గా నిలిచాయి. ఆయన ఇప్పటి వరకు 183 సినిమాల్లో నటించారు.

రెబల్ స్టార్ బిరుదు అలా వచ్చింది?

ఆయన సినిమాలు నచ్చి ఆయన అభిమానులు ఆయనకు ముద్దుగా రెబల్ స్టార్ అనే బిరుదును ఇచ్చారు. ఆ బిరుదే ఇప్పటికీ.. ప్రభాస్ కు కూడా వచ్చింది. తన పెదనాన్న నుంచే రెబల్ స్టార్ బిరుదను పొందరు ప్రభాస్. అయితే.. కృష్ణంరాజుకు రెబల్ స్టార్ అనే బిరుదు రావడానికి కారణం.. ఆయన సినిమాల్లో కన్నెర్ర చేయడం, రెబల్ గా మాట్లాడటమేనట. కృష్ణం రాజే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నేను సినిమాల్లో కన్నెర్ర చేయడం.. కత్తందుకో జానకీ.. అంటూ సీరియస్ గా ముఖం పెట్టడం, గంభీరమైన వాయిస్ ఉండటంతో.. నాకు నా అభిమానులు.. రెబల్ స్టార్ అనే బిరుదును ఇచ్చారు.. అంటూ కృష్ణంరాజు చెప్పుకొచ్చారు.

రాజకీయాల్లోనూ రాణించిన కృష్ణంరాజు

Advertisement

కృష్ణంరాజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించడమే కాదు.. రాజకీయాల్లోనూ ఆయన రాణించారు. ముందు ఆయన బీజేపీలో చేరారు. కాకినాడ, నర్సాపూర్ నియోజకవర్గాల నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. కేంద్ర మంత్రిగానూ ఆయన పనిచేశారు. ఆ తర్వాత 2009 లో మెగాస్టార్ చిరంజీవి స్టార్ట్ చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అయితే.. రాజమండ్రి నుంచి ఎంపీగా 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఆయన ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన కొంచెం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

ప్రజారాజ్యంలో చేరి చాలా పెద్ద తప్పు చేశా

బీజేపీ పార్టీ తర్వాత.. ప్రజారాజ్యంలో చేరి చాలా పెద్ద తప్పు చేశానని కృష్ణం రాజు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రజారాజ్యంలో నేను చేరి ఉండకూడదు. కానీ.. అప్పట్లో తొందరపడి.. ప్రజారాజ్యం పార్టీలో చేరా. నాకు నిజంగా యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావాలని ఉంది కానీ.. అది కుదరలేదు. అందుకే.. రాజకీయాలకు ప్రస్తుతం దూరంగా ఉంటున్నా.. అంటూ కృష్ణం రాజు చెప్పుకొచ్చారు.

నా సినిమా వారసుడు ప్రభాసే

Advertisement

నాకు కొడుకులు లేరు. నాకు కూతుళ్లే ఉన్నారు. అయితే.. నాకు సినిమాల్లో వారసుడు అంటే మాత్రం నా సోదరుడి కొడుకు ప్రభాస్ మాత్రమే. నాలో ఉన్న క్వాలిటీస్ చాలా ప్రభాస్ లో ఉన్నాయి. ప్రభాస్ చాలా గొప్ప హీరో అవుతాడు.. అంటూ ప్రభాస్ గురించి చెప్పుకొచ్చారు కృష్ణంరాజు.

Advertisement

Featured

Star Heroin: స్టార్ హీరోతో ప్రేమ,పెళ్లి విడాకులు..12 మందితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్… ఎవరంటే?

Published

on

Star Heroin: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి మనీషా కొయిరాల ఒకరు. ఈమె సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ సినిమాలలో నటించి ఒకానొక సమయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపారు. ఇక ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో తన వ్యక్తిగత విషయాలలో కూడా వార్తలలో నిలిచారు.

Advertisement

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు పలువురు హీరోలతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఒక స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడినప్పటికీ ఆయనని పెళ్లి చేసుకోలేదు. ఇక ఈమె సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రెండేళ్లకే తనతో విడాకులు తీసుకొని విడిపోయి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన మనీషా కోయిరాల మందుకు అలవాటు పడ్డారు.పెళ్లికి ముందే మనీషా కోయిరాలా ఏకంగా 12 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. వివేక్ ముశ్రన్‌, నానా పటేకర్‌, DJ హుస్సేన్‌, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్‌ వంటి ప్రముఖులతో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

12 మందితో డేటింగ్..
ఇలా తరచూ డేటింగ్ ల ద్వారా కూడా ఈమె వార్తల్లో నిలిచారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడిపారు. పలువురు దర్శక నిర్మాతలు సైతం ఈమె డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఇలా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపిన ఈమె మధ్యలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: విష్ణు ప్రియకు షాక్ ఇచ్చిన నిఖిల్… కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్.. అసలు ఆట ఆరంభం!

Published

on

Bigg Boss 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రారంభం అయ్యి 5 రోజులు పూర్తయింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అయితే హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ మూడు గ్రూపులుగా విడదీశారు. అయితే ఈ గ్రూపులోకి ఎవరెవరు సభ్యులను తీసుకోవాలనేది చీఫ్ ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ విష్ణు ప్రియ కచ్చితంగా తనని నిఖిల్ తన గ్రూపులోకి తీసుకుంటారని ఆమె భావించింది. కానీ నిఖిల్ మాత్రం ఆమెకు షాక్ ఇచ్చారు. దీంతో విష్ణు ప్రియను నైనిక తన టీమ్ లోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం గురించి నిఖిల్ విష్ణుప్రియ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీరిద్దరికి ముందే మంచి పరిచయమున్న నేపథ్యంలో తప్పకుండా నిఖిల్ తన టీమ్ లోకి తీసుకుంటారని విష్ణు ప్రియ భావించింది కానీ అది జరగలేదు.

ఇలా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కారణంగా విష్ణు ప్రియ సరదాగా నిఖిల్ ను ఓ ఆట ఆడుకుంది. దీంతో నిఖిల్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఇప్పటివరకు ఎంతో సరదాగా గడిపిన కంటెస్టెంట్లను మూడు గ్రూపులుగా విడదీయడంతో అసలైన ఆట మొదలైంది.

టాస్కులపై ఫోకస్..
కంటెస్టెంట్లను టీమ్స్ గా విడదీసి బిగ్ బాస్ టాస్కులను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇచ్చిన మొదటి టాస్కోలో భాగంగా ఇప్పటివరకు హౌస్ లో సైలెంట్ గా కూర్చున్న పృథ్విరాజ్ తన ఆట తీరును కనబరుస్తూ యష్మీ టీమ్ ను గెలిపించారు. దీంతో ముందు ముందు ఏ ఏ కంటెస్టెంట్ ఎలా తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారు బ్రో…. ఆ కంటెస్టెంట్లను ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఏడు సీజన్లను పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా గత ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. మొదట 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. మిగిలిన వారిని ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

Advertisement

ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ పోట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మిగిలిన వారు మాత్రం అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నా సందేహాలు వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతో యాక్టివ్ గా వెళ్లిన కంటెస్టెంట్లు లోపల మాత్రం అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోతున్నారనే చెప్పాలి.

ముఖ్యంగా హీరో ఆదిత్య ఓం అయితే హౌస్ లో ఉన్నాడా లేదా అన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది. ఈయన ఉంటే ఒంటరిగా ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు. పెద్దగా ఫేమస్ అయిన కంటెంట్ మాత్రం ఈయన ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలువురు ట్రోలర్స్ బ్రో అసలు ఎందుకొచ్చావు బ్రో బిగ్ బాస్ హౌస్ కి అంటూ భారీగా విమర్శలు చేస్తున్నారు.

ఈయనతో పాటు బెజవాడ బేబక్క కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈమె హౌస్ లో మాత్రం ఎక్కువగా కిచెన్ లోనే ఉంటుంది. కానీ సరైన కంటెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. పృధ్విరాజ్, అభయ్ నవీన్ వంటి వారందరూ కూడా హౌస్ లో డల్ గా కనిపిస్తున్న తరుణంలో పలువురు మీరంతా హౌస్ లోకి ఎందుకు వచ్చారో ఏమో అంటూ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అలాగే మరి కొంతమందిని బాగా హైలైట్ చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఎలిమినేషన్ ఉంటుందా…
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా బెజవాడ బేబక్క, విష్ణు ప్రియ, శేఖర్ భాష, నాగ మణికంఠ సోనియా ఆకుల ప్రేరణ వంటి వారు నామినేషన్ లో ఉన్నారు. అయితే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!