Connect with us

Featured

పొరపాటున కూడా ఈ పదార్థాలను ఫ్రిజ్లో పెట్టకండి.. ఎందుకో తెలుసా?

Published

on

టెక్నాలజీ మారడంతో ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్ ఉంటుంది.ప్రస్తుత జనరేషన్ లో చిన్న,పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ ఉంటుంది. ఫ్రిజ్ వాడకం ఎక్కువ అయిన తర్వాత మనం తినే ఆహార పదార్థాలు, కాయగూరలు, పండ్లు, పాల పదార్థాలు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఫ్రిజ్లో నిల్వ చేస్తూ ఉన్నాము. ఇలా ఫ్రిజ్లో నిల్వ చేయడం వల్ల అవి చెడిపోకుండా ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు. అయితే అలాంటి పదార్థాలు ఫ్రిజ్లో పెట్టి పాడు చేస్తున్నామన్న విషయం మీకు తెలుసా? అవును మీరు విన్నది నిజమే.. ఫ్రిజ్ లో కొన్ని రకాల పదార్థాలను నిల్వ చేయడం వల్ల వాటిలో ఉండే రుచి పోషక విలువలూ తగ్గుతాయి. అయితే ఫ్రిజ్ లో మనం ఏయే పదార్థాలను ఉంచకూడదు. అలా ఉంచడం వల్ల వాటి వల్ల కలిగే అనర్ధాలు ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పాలు : ఫ్రిజ్ లో పాలను నిల్వ ఉంచినప్పుడు డైరీ మిల్క్, బీర్ లాగా విస్తరిస్తుంది.అందుకు గల ప్రధాన కారణం అందులో 87 శాతం నీరు ఉండడమే. పాలు ద్రవ పదార్థాల నుంచి ఘనపదార్థంలోకి మారినప్పుడు దాని ఆకృతి మారడమే కాకుండా జిగటగా కూడా మారుతుంది.

దోసకాయ : దోసకాయలను రిఫ్రిజిరేటర్‎లో ఉంచినప్పుడు, వాటి రుచి మారడంతో పాటు దోసకాయల ఆకృతి కూడా ప్రభావితం అవుతుంది.

Advertisement

గుడ్లు : ఫ్రిజ్ నిల్వ చేసిన గుడ్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు సూచిస్తున్నారు. గుడ్లను ఫ్రిజ్ లో ఎక్కువగా నిల్వ చేయడం వల్ల అది కుళ్ళిపోవడంతో పాటు, తిన్నప్పుడు పుల్లటి వాసన కూడా వస్తాయి.గుడ్లు ఫ్రిజ్ లో నిల్వ చేస్తే నీటి కంటెంట్ బయటి పొరను పగులగొట్టడానికి కారణమవుతుంది. ఇది అనేక బ్యాక్టీరియాలకు హాని కలిగిస్తుంది.

పండ్లు : చాలామంది మార్కెట్ నుంచి తెచ్చిన పండ్లను తాజాగా ఉంచడం కోసం ఆ పండ్లను ఫ్రిజ్ లో పెడుతూ ఉంటారు.వాటి వల్ల అందులో ఉన్న పోషక విలువలు కోల్పోతాయి. అంతే కాదు, ఫ్రిజ్‌లో పండ్లను ఉంచినప్పుడు అది వాటి రుచిని ప్రభావితం చేస్తుంది.

వేయించిన ఆహారాలు : వేయించిన ఆహారాన్ని ఫ్రిజ్ లో నిల్వ చేయరాదు. అలా చేయడం వల్ల వాటిలో ఉండే పోషకాలు తగ్గిపోతాయి.

Advertisement

పాస్తా : ఎక్కువ మంది మిగిలిపోయిన ఆహార పదార్థాలను ఫ్రిజ్ లో ఉంచుతారు. ఇలా ఉంచడం మంచిది కాదు.పూర్తిగా ఉడికిన ఆహార పదార్థాలు మళ్లీ వేడి చేయడం వల్ల మెత్తగా మారుతుంది.

టొమాటో సాస్ : టొమాటో సాస్‌ను రిఫ్రిజిరేటర్‎లో ఉంచినప్పుడు రుచి మారుతుంది. కాబట్టి టొమాటో సాస్‌ను ఫ్రిజ్ లో నిల్వ చేయకపోవడమే మంచిది.

బంగాళదుంపలు : బంగాళదుంపలను ఫ్రిజ్ లో ఉంచినప్పుడు మృదువైన గుజ్జు బంగాళదుంపలు తప్ప అందులో మరేమీ ఉండవు.

Advertisement

Featured

Pitapuram: ఒక్క పిఠాపురంలోని 500 కోట్ల బెట్టింగ్.. ఉత్కంఠత రేపుతున్న ఎన్నికల ఫలితాలు!

Published

on

Pitapuram: దేశవ్యాప్తంగా ఏపీ ఎన్నికల ఫలితాలు అందరిలోనూ ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి ఎప్పుడు లేని విధంగా ఈసారి ఏకంగా 81.86% పోలింగ్ నమోదు కావడంతో ఈ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే జూన్ నాల్గవ తేదీ వెలవడే ఫలితాల కోసం అందరూ ఆసక్తి చూపుతున్నారు.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలలో భాగంగా పిఠాపురం మంగళగిరి కుప్పం ఈ మూడు నియోజకవర్గాలపైనే అందరి ఫోకస్ ఉంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ ఫలితాలపై రాజకీయ నాయకులు అటు సినీ సెలబ్రిటీలు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ దిగగా ఈయనకు ప్రత్యర్థిగా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి అదే కాపు సామాజిక వర్గానికి చెందిన వంగ గీత ఎన్నికల బరిలోకి దిగారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ లక్ష మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు జనసైనికులు. మరోవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి వంగా గీత గెలిస్తే తనుకు డిప్యూటీ సీఎం గా పదవి ఇస్తానని చెప్పారు దీంతో ఈమె గెలుపు పై కూడా ఆసక్తి నెలకొంది.

Advertisement

ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠత..
ఈ క్రమంలోనే వంగా గీత గెలుస్తారని గెలుస్తారు అంటూ రెండు పార్టీల నేతలు పెద్ద ఎత్తున బెట్టింగులు కడుతున్నారు. అయితే కేవలం పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి పై మాత్రమే కాకుండా పార్లమెంట్ అభ్యర్థిపై కూడా సుమారు 500 కోట్ల వరకు బెట్టింగ్ జరిగిందని తెలుస్తోంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున బెట్టింగులు కడుతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది.

Advertisement
Continue Reading

Featured

Laya: అమెరికాలో అడుక్కు తింటున్నా.. రోల్స్ పై ఎమోషనల్ అయిన లయ?

Published

on

Laya: సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో లయ ఒకరు. ఈమె హీరోయిన్గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు అయితే ఈమె నటించిన మొదటి సినిమాకే నంది అవార్డు రావడం విశేషం ఇలా హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి లయ తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే ఈమె పెళ్లి చేసుకొని సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఈ విధంగా లయ పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారు ఇక పెళ్లి తర్వాత ఈమె ఇండస్ట్రీకి దూరమయ్యారు. ప్రస్తుత తన కూతురితో కలసి సోషల్ మీడియాలో ఈమె చేసే హంగామా మామూలుగా లేదు అదే విధంగా తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

ప్రస్తుతం నటుడు నితిన్ హీరోగా నటిస్తున్నటువంటి తమ్ముడు సినిమాలో లయ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నటిస్తున్నటువంటి తరుణంలో లయ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

రోడ్డుపై పడ్డాను..
తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకున్నాను అయితే తాను అమెరికాలో ఉన్నాననే విషయం తెలియడంతో చాలామంది నాపై ట్రోల్స్ చేశారు. అమెరికాలో నేను ఎన్నో ఇబ్బందులు పడుతున్నానని అడుక్కు తింటూ రోడ్డుపై పడ్డానని చాలామంది విమర్శలు చేశారు . అయితే ప్రస్తుతం ఇలాంటి వాటి గురించి పట్టించుకోవడం లేదంటూ లయ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Pawan Kalyan: పార్టీ గెలిస్తే పవన్ ఎనర్జీ లెవెల్ కు ఆ పదవే కరెక్ట్ అంటున్న ఫ్యాన్స్?

Published

on

Pawan Kalyan: సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలపై చాలా ఫోకస్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగారు. అయితే ఈసారి జనసేన పార్టీ సింగిల్ గా కాకుండా తెలుగుదేశం అలాగే బిజెపితో పొత్తు పెట్టుకుని మరీ ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.

ఈ విధంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈసారి కూటమి అధికారంలోకి రాబోతుందని వెల్లడించారు. ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ విషయంలో ఓ డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుందని కూటమి అధికారంలోకి వస్తే పవన్ కి ఏ పదవి ఇస్తారనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ పవన్ కళ్యాణ్ కి ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ కు ఆయనకు తప్పనిసరిగా హోమ్ మినిస్టర్ అయితే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ హోం శాఖ మంత్రి అయితే శత్రువుల పాలిట సింహ స్వప్నంలా మారతారని ఆయనకు అదే కరెక్ట్ అంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

హోం శాఖ మంత్రి..
ఇలా పవన్ అభిమానులు చేసే ఈ కామెంట్లపై వైసీపీ ఫ్యాన్స్ స్పందిస్తూ ముందు పవన్ కళ్యాణ్ ని ఎమ్మెల్యేగా గెలవనివ్వండి తర్వాత హోంశాఖ గురించి ఆలోచిస్తారు అంటూ సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి పిఠాపురం నియోజక వర్గంపై రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొందని చెప్పాలి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!