Connect with us

Featured

Sri Reddy: జగనన్న పార్టీని నమ్ముకున్నా ఒరిగిందేమీ లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి!

Sri Reddy:వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయినటువంటి సంచలన తార శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన

Published

on

Sri Reddy:వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయినటువంటి సంచలన తార శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె కాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా సంచలనం సృష్టించారు. ఈ వివాదంతో అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ ఒక్కసారిగా వార్తల్లో నిలిచిన శ్రీ రెడ్డి ప్రస్తుతం సినిమాలకు దూరమై యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులను సందడి చేస్తున్నారు. ఇకపోతే ఈమె సినిమాల పరంగా రాజకీయ పరంగా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన అభిప్రాయాలను తెలియచేస్తూ ఉన్నారు.

Sri Reddy: జగనన్న పార్టీని నమ్ముకున్నా ఒరిగిందేమీ లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి!

ఇకపోతే రాజకీయంగా పవన్ కళ్యాణ్ పైతోక తొక్కిన త్రాచులా బుసలు కొట్టే శ్రీ రెడ్డి జగన్ పార్టీకి ఎప్పుడూ మద్దతుగా ఉంటూ ఆయనపై ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా తనదైన శైలిలో తిప్పికొడుతూ ఉంటుంది.ఇలా వైయస్సార్సీపి పార్టీకి మద్దతుగా నిలిచిన శ్రీ రెడ్డి తాజాగా పార్టీ వ్యవహారశైలిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే ఫేస్ బుక్ వీడియో ద్వారా ఈమె ఒక వీడియో షేర్ చేస్తూ పార్టీ వ్యవహారశైలి గురించి తెలియజేశారు.

Sri Reddy: జగనన్న పార్టీని నమ్ముకున్నా ఒరిగిందేమీ లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి!
Sri Reddy: జగనన్న పార్టీని నమ్ముకున్నా ఒరిగిందేమీ లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి!

తాను ఇన్నిరోజులు పార్టీలో ఎంతో చురుగ్గా ఉంటూ జగన్ పార్టీకి మద్దతు తెలపడంతో తన అకౌంట్లో డబ్బులు పడతాయని చాలామంది భావిస్తారు నిజానికి వైయస్ఆర్సిపి పార్టీని నమ్ముకున్నందుకు తనకు రూపాయి ఆదాయం లేదని ఈ సందర్భంగా శ్రీ రెడ్డి తెలిపారు.అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం తమ పథకాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని వచ్చే ఎన్నికలలో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తే చిక్కుల్లోపడతారని సూచించారు.

గతంలో వచ్చిన సీట్ల కన్నా పది లేదా 20 సీట్లు తక్కువ వచ్చినా కానీ ప్రజలలో అసంతృప్తి ఉందని అర్థం. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న వారిని గుర్తించకుండా అర్హత లేని వారికి పదవులు కట్టబెడుతూ ప్రభుత్వం తప్పు చేస్తోందని ఈ సందర్భంగా శ్రీ రెడ్డి వెల్లడించారు. ఇక పోతే తన సొంత ఊరిలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించడం కోసం గత కొన్ని సంవత్సరాల నుంచి తన తండ్రితో పాటు ఈమె ఎంతో కష్టపడుతోంది. గత ప్రభుత్వం హయాంలో గుడి నిర్మాణానికి రావాల్సిన నిధులు వచ్చాయని అయితే ఈ ప్రభుత్వ హయాంలో గుడికి ఒక్క రూపాయి కూడా సహాయం అందలేదని శ్రీరెడ్డి ఆరోపించారు.

Advertisement

పార్టీ వల్ల ఏ ప్రయోజనం లేదు..

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తన కల నెరవేరబోతుందని ఎంతో సంతోషపడ్డాను అయితే ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎంపీలతో మాట్లాడిన, ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగిన గుడికి రావాల్సిన నిధులు మాత్రం రాలేదని, జగనన్న పార్టీని నమ్ముకున్నందుకు తనకు రూపాయి లాభం లేకపోయినా కనీసం తన గుడి నిర్మాణానికి డబ్బులు అందుతాయని భావించాను చివరికి అది కూడా నెరవేరలేదని ఈ సందర్భంగా శ్రీ రెడ్డి వైయస్సార్ సీపీ పార్టీ గురించి కాస్త అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరి శ్రీ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ప్రభుత్వం గుడి నిర్మాణానికి కావలసిన నిధులను ఏర్పాటు చేస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

Advertisement

Featured

Vijay Devarakonda: నేను నాగీకి అదృష్టం కాదు.. తన కోసమే కల్కిలో నటించాను: విజయ్ దేవరకొండ

Published

on

Vijay Devarakonda: సినీ ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయిన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు విజయ్ దేవరకొండ. ఇటీవల వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. ఇకపోతే ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాల్లో కూడా విజయ్ దేవరకొండ కీలకపాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా విజయ్ దేవరకొండ కల్కిలో భాగం కావడంతో ఈయన గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ (నాగీ) మొదట దర్శకత్వం వహించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో విజయ్ నటించిన ఆ సినిమా సక్సెస్ అయింది అనంతరం మహానటి సినిమాలో కూడా విజయ్ నటించారు. ఈ సినిమా కూడా సక్సెస్ కావడంతో విజయ్ దేవరకొండ తన సినిమాలకు లక్కీగా మారిపోయారని అందుకే తనని కల్కి సినిమాల్లో కూడా భాగం చేశారు అంటూ వార్తలు వచ్చాయి.

ఇదే విషయం గురించి ఇటీవల రిపోర్టర్స్ విజయ్ దేవర కొండను ప్రశ్నించారు. ఇక ఈ ప్రశ్న పై విజయ్ దేవరకొండ స్పందించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..నేను నాగికి లక్కీ కాదు. ప్రభాస్ అన్న కోసం, నాగి కోసం ఈ సినిమాలో నటించా. కల్కి సినిమా చాలా అద్భుతంగా ఉంది కాబట్టి విజయం సాధించింది.

Advertisement

ఎలాంటి పోటీ లేదు..
ఇందులో మనం చేసింది ఏమీ లేదు అంటూ ఈయన రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు చాలా హుందాతనంగా సమాధానం చెప్పారు.నాగి క్రియేట్ చేసిన ఒక యూనివర్స్ లో నేను చిన్న పాత్ర చేశాను. అంతే కానీ ప్రభాస్ కర్ణుడు.. నేను అర్జునుడు లాంటి పోటీలు ఏమీ లేవని ఈయన తెలిపారు.

Advertisement
Continue Reading

Featured

Y.S Vijayamma: జగన్ ఓటమికి విజయమ్మ కూడా కారణమే.. కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Published

on

Y.S Vijayamma: ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఘోరంగా ఓటమిపాలైన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఎన్నికలలో కేవలం 11 స్థానాలకు మాత్రమే పార్టీ పరిమితం కావడంతో ఎంతోమంది నాయకులు కార్యకర్తలు ఇప్పటికి ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన వైసీపీ ఓటమికి గల కారణాలు ఏంటి అనే విషయాలను వెల్లడించారు.పార్టీ ఆలోచనా విధానం, ప్రజల్ని మెప్పించలేకపోవడం, ప్రజల్లో నమ్మకాన్ని కలిగించకపోవడం వల్లే ఇలాంటి ఫలితాలు వస్తుంటాయని ఆయన అన్నారు. బాబు మాటలను ఎవరు నమ్మరని మేము భావించము జగన్ చాలా నిజాయితీగా అన్ని పథకాలను అమలు చేశారు.

చంద్రబాబు పింఛన్ ను వేగంగా అమలు చేస్తామని చెప్పడం టీడీపీకిి ప్లస్ అయిందని కేతిరెడ్డి తెలిపారు. జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ వారి నాన్న రాజశేఖర్ రెడ్డిలా భావించారని తెలిపారు. ఇక గ్రౌండ్ లెవెల్ లో మేము ఓడిపోతామని ఎక్కడా కూడా మాకు సందేహాలు రాలేదని కేతిరెడ్డి తెలిపారు.

Advertisement

షర్మిలకు సపోర్ట్ చేయటం..
చంద్రబాబు అరెస్ట్ క్యాడర్ ను పోలరైజ్ చేసిందని ఆయన తెలిపారు. కమ్మ, కాపు కమ్యూనిటీలు పోలరైజ్ అయ్యాయని కేతిరెడ్డి వెల్లడించారు. వాలంటీర్ల వల్ల ప్రజలకు పార్టీకి గ్యాప్ పెరిగిందని ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు అంతేకాకుండా వైయస్ విజయమ్మ కూడా తన కుమార్తె షర్మిలకు సపోర్ట్ చేయడం పట్ల జగన్మోహన్ రెడ్డికి ఎఫెక్ట్ అయిందని ఈ సందర్భంగా కేతిరెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ఈయన జగన్ ఓటమి పాలు కావడానికి తన తల్లి విజయమ్మ కూడా ఒక కారణమని ఈ సందర్భంగా తెలియజేశారు.

Advertisement
Continue Reading

Featured

YSRCP: కాంగ్రెస్ పార్టీలోకి వైసీపీ విలీనం.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డీకే శివకుమార్!

Published

on

YSRCP: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం బెంగళూరులో ఉన్న సంగతి మనకు తెలిసిందే .ఈ ఎన్నికలలో ఈయన ఘోరమైన ఓటమిని చవి చూశారు. గత ఎన్నికలలో 151 స్థానాలలో విజయం సాధించిన జగన్ ఈ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఇలా ఘోరమైన ఓటమిని ఎదుర్కొన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వచ్చారు. అక్కడ రెండు రోజులపాటు అభిమానులను కార్యకర్తలను కలిసిన ఈయన తిరిగి బెంగళూరుకు వెళ్లిపోయారు.

ఇలా బెంగళూరు నుంచి ఈయన రాజకీయాలు చేస్తున్నారని తెలుస్తుంది. అక్కడ మీడియా వారి కంట కనపడకుండా ఎవరిని కలవకుండా రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారనీ వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా తిరిగి ఏపీలో అధికారంలోకి వచ్చే పరిస్థితిలో కనిపించని నేపథ్యంలో ఈయన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకుడు డికె శివకుమార్ తో భేటీ అయ్యారని సమాచారం.

ఆంధ్రప్రదేశ్లో తిరిగి తాను అధికారంలోకి రావాలి అంటే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడమే సరైన పద్ధతిని నిర్ణయించుకున్న జగన్మోహన్ రెడ్డి ఆయనతో కలిసి పార్టీని విలీనం చేయడంపై సంప్రదింపులు జరిపారని తెలుస్తుంది అంతేకాకుండా డీకే శివకుమార్ ని కలిసినట్టు ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

అన్నీ అవాస్తవాలే..

ఇలా జగన్మోహన్ రెడ్డి తనని కలిసారని పార్టీ విలీనం గురించి మాట్లాడారంటూ వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డిని కలిసినట్టు ఫోటోలు వైరల్ అవుతున్నాయి అయితే ఇదంతా కూడా అవాస్తవమేనని తెలిపారు. నేను జగన్మోహన్ రెడ్డిని కలిసిన సందర్భాలు లేవని ఆయనను ఇప్పటివరకు ఒకసారి కూడా కలవలేదని సోషల్ మీడియాలో మా గురించి వస్తున్న వార్తలన్నీ ఆ వాస్తవం అంటూ అధికారికంగా ఈ వార్తలను ఖండిస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!