Connect with us

Featured

MS Raju: టికెట్ ధరలు పెంచి సినిమాని చంపకండి.. టికెట్టు రేట్లపై నిర్మాత ఎమ్మెస్ రాజు షాకింగ్ కామెంట్స్?

Published

on

MS Raju: సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించి నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. గతంలో ఈయన ఎన్నో అద్భుతమైన ప్రేమకథా చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ మధ్య కాలంలో ఈయన ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ తాజాగా ఈయన కుమారుడు సుమంత్ అశ్విన్ నటించిన 7 డేస్ 6 నైట్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

MS Raju: టికెట్ ధరలు పెంచి సినిమాని చంపకండి.. టికెట్టు రేట్లపై నిర్మాత ఎమ్మెస్ రాజు షాకింగ్ కామెంట్స్?

MS Raju: టికెట్ ధరలు పెంచి సినిమాని చంపకండి.. టికెట్టు రేట్లపై నిర్మాత ఎమ్మెస్ రాజు షాకింగ్ కామెంట్స్?

ఈ సినిమా ఈ నెల 24వ తేదీ విడుదలయ్యి మంచి ఆదరణ సంపాదించుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ క్రమంలోనే నిర్మాత ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ టికెట్ల విషయంపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో టికెట్ల రేట్లు గురించి ప్రస్తావిస్తూ సింగిల్ థియేటర్ కి కూడా దాదాపు 200 వరకు టిక్కెట్ల రేట్లు ఉన్నాయని తెలిపారు.

MS Raju: టికెట్ ధరలు పెంచి సినిమాని చంపకండి.. టికెట్టు రేట్లపై నిర్మాత ఎమ్మెస్ రాజు షాకింగ్ కామెంట్స్?

MS Raju: టికెట్ ధరలు పెంచి సినిమాని చంపకండి.. టికెట్టు రేట్లపై నిర్మాత ఎమ్మెస్ రాజు షాకింగ్ కామెంట్స్?

ఈ విధంగా సింగిల్ థియేటర్లో 200 రూపాయల టికెట్ ధరలు ఉంటే చాలా మంది సినిమాని థియేటర్ లో చూడటానికి ఇష్టపడటం లేదు. ఇలా టికెట్ల రేట్లు అధికంగా ఉండటం వల్ల చాలామంది సినిమాని ఓటీటీలో చూడాలని భావిస్తున్నారు. తద్వారా చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయి. టికెట్ల రేట్లు అధికంగా ఉంటేనే పెద్ద సినిమాలకు ప్రేక్షకులు రావడం కష్టమైంది. ఇక చిన్న సినిమాల పరిస్థితి చెప్పనవసరం లేదు.

చిన్న సినిమాలను బ్రతికించండి….

చిన్న సినిమా బ్రతకాలంటే టికెట్ల రేట్లు పూర్తిగా తగ్గించాలని ఈ విషయంపై సినీ పెద్దలు ప్రభుత్వాలతో మాట్లాడి సరైన నిర్ణయం తీసుకున్నప్పుడే చిన్న సినిమాలు బ్రతుకుతాయి. లేదంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిస్థితి దారుణంగా ఉంటుందని నిర్మాత ఎమ్మెస్ రాజు వెల్లడించారు. గతంలో టికెట్ల రేటు తక్కువగా ఉన్న నేపథ్యంలో కొందరు హీరోలు ప్రభుత్వాలతో మాట్లాడి సినిమా టికెట్ల రేట్లను పెంచాలని సూచించారు.ఇలా సినిమా టికెట్లు రేట్లు పెంచడంతో సామాన్యుడికి సినిమాలు చూడటం భారంగా మారింది. తద్వారా ప్రేక్షకులు థియేటర్ కి రావడానికి ఇష్టపడటం లేదని వీలైనంత త్వరగా టికెట్ల రేట్లు విషయంలో ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వాలతో చర్చలు జరిపి ఒక నిర్ణయానికి రావాలని ఆయన తెలిపారు.

Advertisement

Featured

Rajamouli: వరుస ఫ్లాపులు వచ్చిన ఐరన్ లెగ్ అని పిలిచినా.. ఆ హీరోయిన్లనే తీసుకుంటాం: రాజమౌళి

Published

on

Rajamouli: తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు డైరెక్టర్ రాజమౌళి. ఈయన దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇక తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన ఘనత రాజమౌళికి దక్కుతుందని చెప్పాలి. ఇలా దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

రాజమౌళి కెరియర్ లో వచ్చిన మగధీర సినిమా ఎంతో ప్రత్యేకమైనదని చెప్పాలి. మొదటిసారి ఇలాంటి సినిమా ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు అయితే ఈ సినిమా సమయంలో తాను ఎంతో కంగారు పడ్డానని అప్పటికే ఇది చాలా భారీ బడ్జెట్ కావడంతో ఒక రకమైన భయం ఉండేదని తెలిపారు.

ఇక తన సినిమాలలో అందరిలాగే స్టార్ హీరోయిన్లనే పెట్టుకోవాలని నేను అనుకుంటాను. కానీ నేను రాసుకున్న కథకు అనుగుణంగా ఏ హీరోయిన్ అయితే సెట్ అవుతుందో వారినే తీసుకుంటాను. ఆ హీరోయిన్ కు వరుసగా ప్లాపులు వచ్చిన ఆమె ఐరన్ లెగ్ అంటూ ట్రోల్స్ ఎదుర్కొన్న తాను వాటిని లెక్క చేయను.
మగధీర..

Advertisement

ఇలా ఆ హీరోయిన్ హిస్టరీ గురించి నేను ఏమాత్రం ఆలోచించనని నా పాత్రకు సూట్ అయితే తప్పనిసరిగా వారికి అవకాశాలు ఇస్తాను అంటూ ఈ సందర్భంగా హీరోయిన్ల గురించి రాజమౌళి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈయన మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతోంది.

Advertisement
Continue Reading

Featured

Venu Swamy: బిగ్ బాస్ లోకి వేణు స్వామి… భారీ రెమ్యూనరేషన్ అందుకోబోతున్న జ్యోతిష్యులు!

Published

on

Venu Swamy: బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ 8 కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా వేణు స్వామి సందడి చేయబోతున్నారనే సంగతి మనకు తెలిసిందే. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కార్యక్రమం ఆగస్టులోనే ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది.

ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లకు సంబంధించిన లిస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో వేణు స్వామి కూడా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ప్రముఖ ఆస్ట్రాలజర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వేణు స్వామి బిగ్ బాస్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

ఇలా ఆస్ట్రాలజర్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలోకి రాబోతున్నారని తెలియగానే ఈ కార్యక్రమం పై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈయన కారణంగా రేటింగ్స్ కూడా భారీగా వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇకపోతే వేణు స్వామి బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొంటూ అందుకోబోయే రెమ్యూనరేషన్ గురించి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

లక్షల్లో రెమ్యునరేషన్..

Advertisement


దేశ చరిత్రలోనే ఇప్పటివరకు ఏ కంటెస్టెంట్ తీసుకొని రెమ్యూనరేషన్ ఈయన అందుకోబోతున్నారని తెలుస్తోంది. వేణు స్వామి వారానికి లక్షల్లోనే రెమ్యూనరేషన్ అందుకునే విధంగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు సమాచారం. మరి వేణు స్వామి ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని ఆయన రెమ్యూనరేషన్ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Advertisement
Continue Reading

Featured

Kumari Aunty: కుమారి ఆంటీని కలిసిన సోను సూద్… నేనున్నానంటూ ధైర్యం చెప్పిన హీరో!

Published

on

Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు. ఈమె హైదరాబాదులో రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ బిజినెస్ చేసుకుంటూ జీవనం గడిపేది అయితే ఈమె చాలా తక్కువ ధరకే కడుపునిండా భోజనం పెట్టడంతో ఈమె గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆమె దగ్గరికి వెళ్లి తనతో ఇంటర్వ్యూ తీసుకోవడంతో ఒక్కసారిగా ఈమె పాపులర్ అయ్యారు.

ఇలా సోషల్ మీడియా వేదికగా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె ప్రస్తుతం సెలబ్రిటీగా మారిపోయారని చెప్పాలి. ఎన్నో కార్యక్రమాలలో కూడా కుమారి ఆంటీ సందడి చేశారు. ఇక త్వరలోనే కుమారి ఆంటీ బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.

ఈ విధంగా కుమారి ఆంటీ రోజురోజుకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకోవడంతో ఎంతోమంది సెలబ్రిటీలు కూడా ఆమె వద్దకు వచ్చి ఆమె ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్దకు సినీ నటుడు సోను సూద్ వచ్చి ఒక్కసారిగా సర్ప్రైజ్ ఇచ్చారు. కుమారి ఆంటీని కలిసిన ఈయన ఆమెతో సరదాగా మాట్లాడి తన కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

మహిళా సాధికారత..
మహిళా సాధికారత కష్టపడే తత్వానికి కుమారి ఆంటీ నిదర్శనమని సోను సూద్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా తనకు ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నానని వెంటనే నాకు తెలియజేయాలి అంటూ ఆమెకు ధైర్యం చెప్పారు. ఇక సోను సూద్ గురించి కుమారి ఆంటీ మాట్లాడుతూ.. ఎంతోమందికి సహాయం చేసిన సోను సూద్ కి ఏమిచ్చినా తక్కువే అంటూ కుమారి ఆంటీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!