Advocate Udhay Kanth : కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మీద రెండేళ్ల జైలు శిక్ష వేయాలనే సూరత్ కోర్ట్ తీర్పుతో ఒక్కసారిగా దేశ రాజాకీయాలు వేడెక్కాయి. ప్రధాని మోడీ పేరును ఉపయోగిస్తూ అవమానకర వాఖ్యలు చేసారనే నేపథ్యంలో రాహుల్ గాంధీ మీద 2019 లో బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ పరువునష్టం దావా వేశారు కాగా నేడు కోర్ట్ తీర్పును ఇచ్చింది. అయితే రాహుల్ గాంధీ ఇటీవల పార్లమెంట్ లో మోడీ, అదాని బందం గురించి మాట్లాడిన తరువాత సూరత్ కోర్ట్ నుండి తీర్పు రావడం పట్ల కక్ష్య పూరిత చర్యగా దీన్ని అభివర్ణిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఒకరోజు సత్యాగ్రహం కూడా తల పెట్టారు. ఇక ఈ విషయం గురించి బీజేపీ నియంత్రత్వ నిర్ణయాలు తీసుకుంటోంది అంటూ అడ్వకేట్ ఉదయ్ కాంత్ గారు విశ్లేషించారు.
బీజేపీ కక్ష్య పూరితంగా వ్యవహారిస్తోంది….
2019లో కర్ణాటక ఎన్నికల సందర్భంగా కోలార్ సభలో రాహుల్ మోడీలకు దోచిపెడుతున్నారు అంటూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ పరువునష్టం దావా వేశారు. అయితే హైకోర్టులో ఆ కేసు విచారణ చాలారోజుల వరకు పెండింగ్లో ఉండగా, తాజాగా లోక్సభలో అదానీ అంశంపై విపక్ష నేత రాహుల్గాంధీ ఫిబ్రవరి 7న మోదీ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించారు. మోదీ,అదానీ బంధాన్ని ప్రశ్నించారు. దీంతో మోదీ ప్రభుత్వం కక్ష్య పూరితంగా వ్యవహారిస్తూ రాహుల్ గాంధీ మీద రెండేళ్ల శిక్ష పడేలా కేసును వాడుకుందని అలా రెండేళ్లు శిక్ష వల్ల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడవుతాడు అనేది బీజేపీ వ్యూహం అంటూ అడ్వకేట్ ఉదయ్ కాంత్ గారు అభిప్రాయపడ్డారు.
Advertisement
మొదట్లో కేసును ఉపసంహరించుకున్న పిటిషన్దారు మోడీ, అదాని బంధం గురించి రాహుల్ లోక్ సభలో మాట్లాడిన అనంతరం సూరత్కోర్టును తిరిగి ఆశ్రయించడం పట్ల అనుమానాలు ఉన్నాయంటూ తెలిపారు. ఫిబ్రవరి 27న ఈ కేసులో విచారణ ప్రారంభమైంది. మార్చి 17న విచారణ ముగించి, తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం, 23న రాహుల్కు శిక్షను ఖరారు చేసింది. కేవలం 24 రోజుల్లో విచారణ పూర్తిచేసి శిక్ష ఖరారు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఉదయ్ కాంత్ అభిప్రాయపడ్డారు. తమ పాలనను ప్రశ్నిస్తే ఇలా శిక్షిస్తాం అన్నట్లుగా మోదీ తీరు ఉందని అభిప్రాయపడ్డారు.
Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.
ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.
Advertisement
యుద్ధం గెలిచిన రాముడు… ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.
Advertisement
రంగమ్మత్త.. ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.
ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.
ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Advertisement
గోల్డ్.. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.