Connect with us

Featured

Analyst Damu Balaji : భారత్ అంటే కొంతమంది బ్రిటిష్ వాళ్లకు ఎందుకంత కుళ్ళు… ఈ సమయంలో ప్రకాశం రాజ్ కి అలాంటి ట్వీట్ అవసరమా…: అనలిస్ట్ దాము బాలాజీ

Published

on

Analyst Damu Balaji : భారత్ ఎంత అభివృద్ధి చెందుతోందో నిదర్శనంగా ఇటీవల ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రపంచానికి చూపింది. ఇంతవరకు ఏ దేశం వెళ్లని చంధ్రుడి దక్షిణ ధ్రువం వైపున విక్రమ్ ల్యాండర్ ను పంపి రికార్డు సృష్టించింది. ఇక ప్రపంచం అంత దీనికి ప్రశంసలు కురిపిస్తుంటే కొంతమంది విధేశీయులు మాత్రం తమ అసూయా, ఈర్ష్యలను బయటపెట్టుకుంటున్నారు. ఖచ్చితంగా పాకిస్తాన్ ఆ పని చేసి ఉంటుందని అనుకుంటారు కానీ పాకిస్థానీలు చాలా మంది భారత్ విజయాన్ని ప్రశాంసిస్తున్నారు. అలా కుళ్ళు చూపెట్టుకున్నది మనల్ని బానిసలుగా పరిపాలించిన మనల్ని లూటి చేసి వెళ్లిన బ్రిటిష్ కి చెందిన కొంతమంది. ఇక ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ వివరించారు.

చంద్రయాన్ విషయంలో కుళ్ళుతున్న బ్రిటిష్ దేశస్థులు….

చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం అయ్యాక చాలా మంది తక్కువ ఖర్చుతో ఇండియా గొప్ప పని చెసిందంటు ప్రశాంసిస్తుంటే బ్రిటిష్ దేశానికి చెందిన ఒక న్యూస్ ఛానెల్ మాత్రం తన కుళ్ళు బయట పెట్టింది. ఇండియా మన దగ్గరి నుండి వేల కోట్ల రూపాయలను ఎయిడ్ రూపంలో తీసుకుంటోంది. ఈ ప్రయోగానికి అన్ని వందల కోట్లు పెట్టే స్థోమత ఉన్నపుడు మన దగ్గర తీసుకున్న అప్పు వెనక్కి కట్టవచ్చు కదా అంటూ కథనాలను ప్రసారం చేసింది. అయితే చాలా మంది నెటిజన్స్ ఈ కామెంట్స్ కు ధీటుగా స్పందించారాని బాలాజీ తెలిపారు. నిజానికి బ్రిటిష్ వాళ్ళను ఇండియా అప్పు అడగలేదు. కేవలం క్రిస్టియానిటీ వ్యాప్తి కోసం కొన్ని ఎన్జిఓ లకు వాళ్ళే ఎయిడ్ రూపంలో డబ్బు ఇస్తున్నారు. అధికాక మన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒకానొక సందర్బంలో మాకు మీ నుండి వచ్చే ఎయిడ్ అవసరం లేదు అని చెప్పడం కూడ జరిగింది అంటూ సోషల్ మీడియా ద్వారా ఆ న్యూస్ ఛానెల్ కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు మనవాళ్ళు. ఇక ప్రఖ్యాత బిబిసీ కి సంబంధించిన బ్రిటిష్ రిపోర్టర్ కూడ ఇండియా లో ముందు వ్యక్తిగత టాయిలెట్స్ కట్టించవచ్చు కదా చంద్రుడి మీదకు ప్రయోగం అవసరమా అంటూ కామెంట్స్ చేసాడు.

Advertisement

ఇదిలా ఉంటే బ్రిటిష్ర్స్ ఇలా వెటకారం చేయడం పక్కన పెడితే నటుడు ప్రకాష్ రాజ్ చంద్రయాన్ ప్రయోగం మీద ట్వీట్ చేసాడు. విక్రమ్ ల్యాండర్ వెళ్లేసరికి అప్పటికే అక్కడ ఒక మళయాళి టీ షాప్ ఉన్నట్లుగా ఉండే ఆ పోస్ట్ చాలా మందికి కోపం తెప్పించింది. నిజానికి నీల్ అంస్ట్రాంగ్ చంద్రుడిలో పై కాలుమోపినపుడు వచ్చిన జోక్ ను ప్రకాష్ రాజ్ తప్పు సందర్భంలో పోస్ట్ చేయడం వల్ల అందరికి కోపం వచ్చింది. అయితే యాంటి బీజేపీ అయిన ప్రకాష్ రాజ్ ఇండియా సాధించిన విజయాన్ని కూడా బీజేపీ పాలన ఖాతాలోకి వేసి చూడటం వల్ల మరింత ప్రజల నుండి ద్వేషాన్ని మూటగట్టుకుంటున్నాడు అంటూ బాలాజీ తెలిపారు.

Continue Reading
Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!