Connect with us

Featured

Bigg Boss6: తక్కువ మంది కంటెస్టెంట్లతో బిగ్ బాస్ 6.. వివాదాలకు చోటు లేకుండా జాగ్రత్తలు?

Published

on

Bigg Boss6: బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చిందని చెప్పాలి. బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బిగ్ బాస్ కార్యక్రమం ఎప్పుడు ప్రసారమవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల చేశారు.

ఇకపోతే ఈ కార్యక్రమం సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ప్రసారం కాబోతుందని వార్తలు వినపడుతున్నాయి త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలబడుతుంది. ఇకపోతే ఈసారి సీజన్ లో బిగ్ బాస్ నిర్వాహకులు తక్కువ మంది కంటెస్టెంట్లతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సీజన్లో కేవలం 12 లేదా 13 మంది కంటెస్టెంట్లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం.

Advertisement

ఇకపోతే గత కొన్ని సీజన్ల నుంచి ఈ కార్యక్రమం ఎన్నో విమర్శలను ఎదుర్కొంటూ ఉంటుంది. ఈ కార్యక్రమాల ద్వారా జీవితంలో ఒకటి కావాల్సిన వాళ్ళు కూడా విడిపోతున్నారని, ఈ కార్యక్రమం చూసి చిన్న పిల్లలు కూడా తప్పుదోవ పట్టే అవకాశాలు ఉన్నాయి అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే ఈసారి మాత్రం అలాంటి విమర్శలకు తావు లేకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది.

Bigg Boss6: హోస్ట్ గా నాగార్జున…

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం పై ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక ఈ సీజన్ కి కూడా నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారని తాజాగా విడుదలైన ప్రోమో ద్వారా తెలుస్తోంది. ఇకపోతే రెండవ సీజన్ మాదిరిగా ఈ సీజన్లో కూడా కామన్ మ్యాన్ ఎంట్రీ ఉండబోతోంది.ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కొందరు పేర్లు చక్కర్లు కొడుతున్నాయి.మరి ఈ కార్యక్రమంలో ఎవరు పాల్గొనబోతున్నారనే విషయం తెలియాలంటే ఈ ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.

Advertisement

Featured

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Published

on

తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద విషయం. ఆ ఘనత ఎన్టీవీకి దక్కింది. తొలిసారి ఎన్టీవీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. తన మనసులోని మాటను ప్రధాని మోడీ ఎన్టీవీతో పంచుకోనున్నారు. అది ఎప్పుడో కాదు.. నేటి రాత్రి 8 గంటలకు ప్రధాని ఎన్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. పదేళ్లుగా తిరుగులేని విజయాలను సాధిస్తూ ప్రజల గుండెలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న ప్రధాని మోడీ.. ఎన్టీవీతో ఈ సార్వత్రిక ఎన్నికల ముచ్చట్ల గురించి మాట్లాడనున్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ మీడియాకు అతి తక్కువ సమయం మాత్రమే ఇవ్వగలిగేంత బిజీ షెడ్యూల్‌లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఎన్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వడం గమనార్హం. గతంలో భక్తి టీవీ నిర్వహించిన కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా ప్రధాని మోడీ హాజరయ్యారు.

ఎన్నికలు దగ్గర పడుతున్న కీలక సమయంలో ఎన్టీవీకి ప్రధాని ఇంటర్వ్యూ ఇవ్వడమనేది చాలా పెద్ద విషయం. అలా చూసుకున్నా ఎన్టీవీ దేశ టెలివిజన్‌ చరిత్రలోనే అరుదైన ఘనతను సాధిస్తోందని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో జరుగుతున్న కీలక పరిణామాలపై ప్రధాని మోడీ సమాధానమివ్వనున్నారు. ప్రజల మెదళ్లలో నానుతున్న ఎన్నో ప్రశ్నలు, ప్రచారంలో ఉన్న మరెన్నో సందేహాలపై తెలుగు ప్రజల తరపున ఎన్టీవీ ప్రశ్నించనుంది. ఒకే ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని మోడీ దగ్గర కానున్నారు.

ప్రధాని మోడీతో ఎన్టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి: https://www.youtube.com/watch?v=9sBOhC540e8

Advertisement

Continue Reading

Featured

Lakshmi Parvathi: ఎన్నికల వేళ పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన లక్ష్మీపార్వతి.. ఐక్యం కావాలంటూ?

Published

on

Lakshmi Parvathi: సీనియర్ ఎన్టీఆర్ సతీమణి వైసిపి నాయకురాలు లక్ష్మీపార్వతి బుధవారం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గురించి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కపటం లేని మంచి మనిషి అని తెలియజేశారు. అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడుని నమ్మి మోసపోతున్నారని తెలిపారు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబును మించిన వారు ఎవరూ లేరు.

తన సొంత మామయ్యని వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబు నాయుడుది. పిఠాపురంలో కాపులందరూ కూడా ఐక్యం కావాలని తెలిపారు. ఇలా కాపులందరూ కూడా వైసిపి అభ్యర్థి వంగా గీతకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు వంగా గీత స్థానిక నేత ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే ఆమె వెంటనే స్పందిస్తారు కానీ పవన్ కళ్యాణ్ అలా కాదని తెలిపారు.

Advertisement

పవన్ కళ్యాణ్ వలస వచ్చారు..
పవన్ కళ్యాణ్ పిఠాపురానికి వలస వచ్చారని ఈమె తెలిపారు. కానీ వంగా గీత స్థానికురాలు. అందుకే వంగా గీతకు ఓట్లు వేసి అసెంబ్లీకి పంపించాలని ఈమె కోరారు. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో భాగంగా గాజువాక భీమవరం నుంచి పోటీ చేసినటువంటి ఈయనకు రెండు చోట్ల చేదు అనుభవాలే ఎదురయ్యాయి ఇలా రెండు ప్రాంతాలలో ఓటమిపాలు అయినటువంటి పవన్ కళ్యాణ్ కాపు ఓట్లు అధికంగా ఉన్నటువంటి పిఠాపురం నుంచి పోటీకి దిగారు.

Advertisement
Continue Reading

Featured

Janasena: జనసేనకు ఎవరు ఓటు వేయద్దు.. నాగబాబు మాజీ అల్లుడు కామెంట్స్ వైరల్!

Published

on

Janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కూటమిలో భాగంగా 21 స్థానాలలో పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే .ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా జనసేన ప్రచార కార్యక్రమాలు కూడా భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు.

మరోవైపు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా సినీ సెలబ్రిటీలు మొత్తం తరలి వస్తున్నారు. ఇప్పటికే మెగా హీరోలు అందరూ కూడా పిఠాపురంలో పర్యటన చేయగా చిరంజీవి రామ్ చరణ్ వంటి వారు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ ని గెలిపించాలని కోరారు అయితే తాజాగా జనసేన నేతలకు నాగబాబు మాజీ అల్లుడు జొన్నలగడ్డ వెంకట చైతన్య భారీ షాక్ ఇచ్చారు.

సోషల్ మీడియా వేదికగా ఈయన జనసేన పార్టీకి ఓటు వేయొద్దని తెలియజేశారు. స్వార్థ రాజకీయాల కోసం మెగా ఫ్యామిలీ ఎంతకైనా తెగిస్తుందని తెలిపారు. ప్యాకేజీ కోసం మెగా ఫ్యామిలీ ఎంతకైనా దిగజారుతుంది. జనసేన సిద్ధంతాలను పవన్ కళ్యాణ్ కూడా పాటించరు. ఆయన మాటలకు చేష్టలకు ఏమాత్రం పొంతన ఉండదని తెలిపారు.

Advertisement

ఆర్టిస్టులను భయపెడుతున్నారు..
చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే మెగా ఫ్యామిలీ పని చేస్తుందని, ప్రచారాలకు రాకపోతే తమకు అవకాశాలు లేవని ఆర్టిస్టులను భయపెట్టి ప్రచార కార్యక్రమాలకు తీసుకువస్తున్నారని తెలిపారు. ఇలా ఎంతోమంది జనసేనను నమ్మి మోసపోయారు అంటూ ఈ సందర్భంగా వెంకట చైతన్య చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!