Featured
Budda Venkanna : చంద్రబాబుగారూ.. బుద్దాకు అర్జంటుగా ఓ పదవిచ్చేయండి ప్లీజ్..
Published
1 month agoon
Budda Venkanna : పాపం బుద్ధా వెంకన్న.. మాజీ ఎమ్మెల్సీ.. ఆయన ఎప్పుడంటే అప్పుడు మీడియా ముందు వాలిపోయేవారు. టీడీపీపై ఏ చిన్న విమర్శ వచ్చినా కూడా ఖండించనిదే వదిలేవారు కాదు.. ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు వీరవిధేయుడు. ఎన్నికలకు ముందు కూటమి గెలవకుంటే నాలుక కోసుకుంటానని.. రక్తంతో గోడపై చంద్రబాబు జిందాబాద్ అంటూ రాసి హాట్ టాపిక్గా మారారు. చంద్రబాబు చిత్ర పటంలోని కాళ్లను తన రక్తంతో కడిగారు. అంతటి కరుడు గట్టిన చంద్రబాబు అభిమాని బుద్ధా వెంకన్న. ఒకప్పుడు కేశినేని నానిపై ఒంటికాలుపై లేచేవారు. నాని వర్సెస్ బుద్ధా వెంకన్న బీభత్సంగా నడిచింది. ఆ తరువాత చంద్రబాబు ఒక్క కనుసైగతో బుద్దా సైలెంట్ అయిపోయారు. అదీ చంద్రబాబుకు బుద్దా ఇచ్చే గౌరవం.. అభిమానం. అలాంటి బుద్దాకు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాలేదు. పొత్తుల కారణంగా నష్టపోయిన టీడీపీ సీనియర్ నేతల్లో ఆయన కూడా ఒకరు.
టీటీడీ లెటర్లు కూడా ఇప్పించుకోలేకపోతున్నా..
అప్పుడంటే ఎమ్మెల్సీ.. ఈసారి తప్పక ఎమ్మెల్యే టికెట్ వస్తుందని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. కానీ తానొకటి తలిస్తే.. కూటమి మరొకటి తలచింది. బుద్దా వెంకన్న ఇప్పుడు కేవలం మాజీ ఎమ్మెల్సీ అంతే.. తనకు ఏదో ఒక పదవి దక్కక పోతుందా అని కళ్లలో ఒత్తులేసుకుని మరీ ఎదురు చూశారు. పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా చంద్రబాబు ఎందుకో బుద్దా వైపు చూడలేదు. ఒకరకంగా చెప్పాలంటే ఇంకా చంద్రబాబుకు కూడా అవకాశం రాకపోయి ఉండొచ్చు. దీంతో ఆయన్ను నిరాశా నిస్పృహలు కమ్మేసినట్టున్నాయి. పాపం ఏదేదో మాట్లాడేశారు. ఎన్నడూ లేనిది తీవ్ర అసంతృప్తితో బుద్దా మాట్లాడారు. ఎంపీ కేశినేని చిన్ని పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న బుద్దా మాట్లాడిన మాటలు కేడర్ను కదిలించేశాయి. తనకు ఎలాంటి పదవీ లేకపోవడంతో తననెవరూ లెక్క చేయడం లేదని.. అసలు తన మాట చెల్లడమే లేదని.. తనను నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయలేకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కార్యకర్తలకు టీటీడీ లెటర్లు కూడా ఇప్పించుకోలేకపోతున్నానంటూ బుద్దా వెంకన్న తెగ ఫీలయ్యారు.
అసెంబ్లీలో అడుగు పెడతా..
ఒకప్పుడు చంద్రబాబు ఇంటి మీదకు జోగి రమేష్ దాడికి వెళ్తే తాను అడ్డుగా నిలబడ్డానని.. ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యేల్లో అప్పుడు ఎవరైనా వచ్చారా? అని ప్రశ్నించారు. ఇక వైసీపీ అధికారంలో ఉండగా తనపై పెట్టిన కేసుల దగ్గర నుంచి చాలా విషయాలను బుద్దా గుర్తు చేసుకుని తల్లడిల్లిపోయారు. తనకు న్యాయం జరగలేదన్న ఆవేదనతోనే ఇదంతా చెబుతున్నానని.. వ్యతిరేకతతో కాదన్నారు. 2029లో మాత్రం ఎలాగైనా టికెట్ దక్కించుకుని అసెంబ్లీలో అడుగు పెడతానంటూ మంగమ్మ శపథం ఒకటి చేసేశారు. చివరిగా తను చనిపోయే వరకూ టీడీపీలోనే కొనసాగుతానని బుద్దా వెంకన్న తెలిపారు. వాస్తవానికి బుద్దా వెంకన్న మాత్రం పార్టీని నిత్యం అంటిపెట్టుకుని.. అండగా ఉండే నేత. పార్టీపై అంకితభావం, నిబద్ధత కలిగిన నేత. ఇలాంటి నేతలను చంద్రబాబు ఏదో ఒక పదవి ఇచ్చి గౌరవించాల్సిందే. చంద్రబాబు సర్.. ఇప్పటికైనా బుద్దా ఆవేదన గుర్తించండి.. ఆయనకొక పదవి అర్జంటుగా ఇచ్చేయండి..
You may like
YSRCP vs TDP : టీడీపీయే టార్గెట్.. పవన్ వద్దు..
Pawan Kalyan – Renu Desai : పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ కలవబోతున్నారా? చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
Pawan Kalyan : రాజకీయాల్లోనూ ట్రెండ్ సెట్ చేస్తున్న పవన్..!
Lokesh: మరోసారి మంగళగిరిలో లోకేష్ కి ఓటమి తప్పదా?
AP politics: టీడీపీ మూడో జాబితా విడుదల… భగ్గుమన్న శ్రీకాకుళం.. మేనిఫెస్టో కాల్చివేత?
AP politics: జన్మభూమి కమిటీలతో చంద్రబాబు భారీ దోపిడీ: సజ్జల రామకృష్ణ
Featured
Chiranjeevi: చిరంజీవి ఒక రాక్షసుడు.. మరి అంత దుర్మార్గమా… జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు!
Published
4 hours agoon
16 September 2024By
lakshanaChiranjeevi: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నటుడు చిరంజీవి గురించి మరో నటుడు జేడీ చక్రవర్తి చేసిన వ్యాఖ్యల సంచలనగా మారాయి. జె.డి చక్రవర్తి గులాబీ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అనంతరం ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన ఈయన తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.
ఇటీవల దయ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి జే డీ చక్రవర్తి చిరంజీవి గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. చిరంజీవిని పట్టుకుని దుర్మార్గుడు రాక్షసుడు అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఈ విధంగా చిరంజీవి గురించి చక్రవర్తి మాట్లాడటానికి కారణం లేకపోలేదు ఓసారి చిరంజీవి హీరోగా నటిస్తున్న ఘరానా మొగుడు సినిమా షూటింగ్ జరుగుతుంది. అదే సమయంలోనే జె.డి చక్రవర్తి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న అంతం సినిమా కూడా అక్కడ షూటింగ్ జరుగుతుంది. అయితే అక్కడ షూటింగ్ జరిగే సమయంలో చిరంజీవి గారిని చక్రవర్తి గమనిస్తూనే ఉన్నారట. అందరూ కూడా షిఫ్ట్ మారుతున్న ఈయన మాత్రం అక్కడ అలాగే కూర్చుని తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు.
పని రాక్షసుడు..
ఇక ఓ రోజు తన కారులోనే నిద్రపోతున్నారు ఇదేంటి ఇలా నిద్రపోతున్నారని ఆయనని అడిగాను. ఇక్కడ కాకపోతే రూమ్ కి వెళ్లి నిద్రపోవచ్చు కదా అంటూ చిరంజీవి గారిని అడగగా ఆయన ఒకటే మాట చెప్పారు. నేను రూమ్ కి వెళ్తే ఎవరు నన్ను లేపరు. ఇక్కడైతే నన్ను లేపుతారు తద్వారా షూటింగ్ డిస్టర్బ్ కాదు అంటూ చెప్పారు. ఆ మాట వినగానే ఈయన ఏంటి మరి ఇంత దుర్మార్గంగా ఉన్నారు, మరి ఇంత పని రాక్షసుడా అంటూ నేను నా మనసులోనే అనుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోయానని చక్రవర్తి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Featured
Kalyan Ram: బాలయ్య బాబాయ్ తో నన్ను అసలు పోల్చద్దు.. కళ్యాణ్ రామ్ షాకింగ్ కామెంట్స్!
Published
4 hours agoon
16 September 2024By
lakshanaKalyan Ram: సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఎంతో మంచి క్రేజ్ ఉంది. ఇక నందమూరి వారసులుగా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కొనసాగుతున్న సంగతి మనకు తెలిసినదే. త్వరలోనే ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నటుడు కళ్యాణ్ రామ్ సైతం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే నిర్మాతగా వ్యవహరిస్తున్న కళ్యాణ్ రామ్ కూడా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయనకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.
మీరు మీ నిర్మాణ సంస్థలో ఇలాంటి సినిమాలను నిర్మించడమే కాకుండా మీరే నటించవచ్చు కదా అనే ప్రశ్న ఈయనకు ఎదురయింది. ఈ ప్రశ్నకు కళ్యాణ్ రామ్ సమాధానం చెబుతూ.. దయచేసి మీరు ఎప్పుడూ కూడా మా బాబాయ్ బాలకృష్ణతో నన్ను పోల్చొద్దని ఈయన తెలిపారు. ఆయన ఈ వయసులో కూడా చాలా యాక్టివ్ గా ఎంతో ఎనర్జీటిక్ గా సినిమాలు చేస్తున్నారు. ఆయనని చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది అలాంటి ఒక గొప్ప నటుడితో నన్ను పోల్చవద్దని తెలిపారు.
వాళ్లకంటూ ఓ సిగ్నేచర్ ఉంది..
ఇక ఎన్టీఆర్ నటన గురించి మాట్లాడుతూ..RRR సినిమాలో ఎన్టీఆర్ తన నటనతో కంటతడి పెట్టించారు. అలాంటి సినిమాలను నేను చేయలేను. వాళ్లకంటూ ఓ సిగ్నేచర్ ఉంది. ఎలాంటి పాత్రలైనా వాళ్లు చేయగలరు. ఇక నందమూరి హీరోల మధ్య ఉన్నది పోటీ కాదు..కేవలం స్ఫూర్తి. ఒకరిని చూసి ఇంకొకరు స్ఫూర్తిని పొందుతామని కళ్యాణ్ రామ్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Featured
Jani Master: జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు… కేసు నమోదు చేసిన పోలీసులు?
Published
4 hours agoon
16 September 2024By
lakshanaJani Master: సినీ ఇండస్ట్రీలో ప్రముఖ కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జానీ మాస్టర్ ఇటీవల 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో భాగంగా ఉత్తమ కొరియోగ్రాఫర్ గా అవార్డుకు ఎంపిక అయ్యారు.అతి త్వరలోనే ఈయన ఈ అవార్డును అందుకోబోతున్నారు.
ఇలా ఈయన సౌత్ చిత్ర పరిశ్రమలో కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. అయితే తాజాగా జానీ మాస్టర్ పై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఈయన ఓ మహిళ కొరియోగ్రాఫర్ పట్ల లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపణలు రావడమే కాకుండా సదరు మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు.
గత కొద్దిరోజులుగా జానీ మాస్టర్ అవుట్ డోర్ షూటింగ్ వెళ్లిన సమయంలో తన పట్ల లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని తనపై అత్యాచారం కూడా చేశారని సదరు మహిళ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.. ఇలా షూటింగ్ వెళ్లిన సమయంలో మాత్రమే కాకుండా నార్సింగ్ లో తన నివాసంలో కూడా ఇలా తనపట్ల లైంగిక వేధింపులకు గురి చేశారని ఆమె పేర్కొన్నారు.
లైంగిక వేధింపులు..
ఇక ఈమె తోలుత రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఆమె నివాసం నార్సింగ్ లో ఉన్న నేపథ్యంలో రాయదుర్గం పోలీసులు ఈ కేసును నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి బదిలీ చేశారు. ఈ క్రమంలోనే పోలీసుల పలు సెక్షన్ల కింద ఈయనపై కేసు నమోదు చేశారు. మరి ఈయన ఇప్పటివరకు ఈ విషయం గురించి ఎక్కడ స్పందించలేదు. ఇక జానీ మాస్టర్ పై ఇలాంటి కేసు నమోదు కావడంతో సోషల్ మీడియాలో రాజకీయాల పరంగా ఈ విషయం పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది.
Chiranjeevi: చిరంజీవి ఒక రాక్షసుడు.. మరి అంత దుర్మార్గమా… జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు!
Kalyan Ram: బాలయ్య బాబాయ్ తో నన్ను అసలు పోల్చద్దు.. కళ్యాణ్ రామ్ షాకింగ్ కామెంట్స్!
Jani Master: జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు… కేసు నమోదు చేసిన పోలీసులు?
Siddharth -Aditi Rao Hydari: ఆ పురాతన ఆలయంలో పెళ్లి చేసుకుని ఒకటైన సిద్దార్థ్ అదితి.. ఫోటోలు వైరల్!
Sekhar Basha: హౌస్ నుంచి నేనే బయటకు వచ్చాను.. నన్ను క్షమించండి: శేఖర్ భాష
Lakshmipathi : కమెడియన్ లక్ష్మీపతి కుమారుడు టాలీవుడ్ హీరో అని తెలుసా… ఎవరంటే?
John Abraham : ఒకప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు.. కట్ చేస్తే 500 కోట్లకు అధిపతి.. ఈ హీరో గురించి తెలుసా?
Vijayawada Floods: విషాదం..నలుగురిని కాపాడాడు… వరదల్లో కొట్టుకుపోయాడు! భార్య 8 నెలల గర్భిణి!
Sri Devi: 37 ఏళ్ల వయసులో హీరోయిన్ గా రీఎంట్రీ ఇవ్వబోతున్న ప్రభాస్ హీరోయిన్.. సక్సెస్ అయ్యేనా?
Bollywood: తెరపై ప్రేక్షకులను భయపెట్టిన విలన్లు… వీరి భార్యలు గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Trending
- Featured4 weeks ago
Lakshmipathi : కమెడియన్ లక్ష్మీపతి కుమారుడు టాలీవుడ్ హీరో అని తెలుసా… ఎవరంటే?
- Featured3 weeks ago
John Abraham : ఒకప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు.. కట్ చేస్తే 500 కోట్లకు అధిపతి.. ఈ హీరో గురించి తెలుసా?
- Featured2 weeks ago
Vijayawada Floods: విషాదం..నలుగురిని కాపాడాడు… వరదల్లో కొట్టుకుపోయాడు! భార్య 8 నెలల గర్భిణి!
- Featured1 week ago
Bollywood: తెరపై ప్రేక్షకులను భయపెట్టిన విలన్లు… వీరి భార్యలు గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- Featured2 weeks ago
TDP MLA: చెల్లి అంటూనే మహిళతో టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలు.. వైరల్ అవుతున్న వీడియో?
- Featured3 weeks ago
Sri Devi: 37 ఏళ్ల వయసులో హీరోయిన్ గా రీఎంట్రీ ఇవ్వబోతున్న ప్రభాస్ హీరోయిన్.. సక్సెస్ అయ్యేనా?
- Featured4 weeks ago
Chiranjeevi: మూడుసార్లు చిరు సినిమాలను రిజెక్ట్ చేసి అవమానించిన స్టార్ హీరోయిన్…. మరీ అంత తల పొగరా?
- Featured4 weeks ago
Imanvi: యూట్యూబర్ గా ఇమాన్వి ఆదాయం 3 లక్షలే.. ప్రభాస్ సినిమాకు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?